Friday, February 7, 2025

భీష్మ ఏకాదశి

భీష్మ ఏకాదశి 

మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2025) ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి. దీనిని జయ ఏకాదశి పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు. గంగామాత స్త్రీరూపంలో ధరించినపుడు అష్టవసువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు. ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలన్ని తొలిగిపోతాయని నమ్ముతుంటారు.

పురాణాల ప్రకారం శ్రీమహా విష్ణువుకి ఇష్టమైన తిథి.. ఏకాదశి.. ఇక మాఘమాసం... ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి ఆరోజుకు(2025 ఫిబ్రవరి 8) తేదీన ఉండే విశిష్టత అంతా ఇంతా కాదు. ఉత్తరాయణ కాలం వరకు వేచి యుండి ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు. మాఘ మాసంలో ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అని అంటారు.

భారతీయ జనజీవనంతో పెనవేసుకుపోయిన భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వం.. మహాభారత గ్రంథానికే మకుటాయమానమైంది. భీష్మపర్వంలో భౌతిక, ఆధ్యాత్మిక రహస్యాలను శ్రీకృష్ణుడు వివరించాడని పండితులు చెబుతున్నారు. భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మా అయిన కృష్ణుణ్ణి తన ధర్మవర్తనంతోను, తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని, ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానంచేసి, మోక్షంపొందాడు భీష్ముడు.

వాస్తవానికి దక్షిణాయణంలోనే అనగా మాఘశుద్ధ ఏకాదశికి ముందు 58 రోజులపాటు అంపశయ్యపై పడినా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో అధర్మం వైపు నిలిచినందుకు శిక్షను తనకుతానే విధించుకుని పరమాత్మా దర్శనంతో తన తప్పులను మన్నించాడని గమనించిన భీష్ముడు సంతృప్తితో జీవించి వుండగానే మోక్షం పొందిన మహనీయుడు.
అంపశయ్యపై ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితిలో ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరరకు వచ్చినారని గ్రహించిన ఆ మహాను భావుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని పాండవులను మూసుకుపోయిన కను రెప్పలను భారంగా తెరచి చూశాడు. అప్పుడు చిట్ట చివరి దశలో ఉన్న కురు వృద్దుడైన భీష్మునికి ఎంతో ఆనందం కలిగి భక్తితో శ్రీకృష్ణునకు నమస్కరించాడు. ఆ సమయంలో పాండవులు. భీష్మపితామహునకు పాదాభివందనం చేశారు.

ధర్మరాజు భీష్ముడను పితామహ అని సంభోదిస్తూ యుద్ధంలో శ్రీకృష్ణుడి సాయంతో భౌతికంగా విజయం సాధించాను కాని.. మానసికంగా గెలవలేకపోయాననని విన్నవించాడు... మానసిక శాంతి కలగాలంటే ఏం చేయాలి. ఏ దేవుడిని శరణు కోరాలి. అని అడగ్గా.. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజును చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి ధర్మరాజా లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి... విష్ణసహస్రనామాన్ని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణ కాంక్షతో మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. అలా భీష్ముని ప్రస్థానం ముగిసింది.

భీష్మ ఏకాదశి రోజున చేయాల్సిన పనులు
భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి.. విష్ణుమూర్తి.. లక్ష్మీ దేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.

సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి, విష్ణువును పూజించండి.

షోడశపచార పూజలు చేసి పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించండి. పూలలో పసుపురంగు పూలు ఉండే విధంగా చూసుకోండి.

విష్ణు సహస్రనామం చదవండి. లేకపోతే శ్రద్ధగా.. భక్తితో వినండి. అలాగే లక్ష్మీ దేవిని పూజించండి.

తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి.. ధూప .. దీప.. నైవేద్యం సమర్పించండి. పాలు.. కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.

Tuesday, February 4, 2025

BHISHMASTAMI - భీష్మాష్టమి

భీష్మాష్టమి
పురాణాల ప్రకారం, భీష్మ పితామహుని వర్ధంతి రోజున మాఘ శుక్ల పక్షంలోని అష్టమి తిథి నాడు భీష్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడు బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చేశాడని నమ్ముతారు.

భీష్మ అష్టమి ఉపవాసం చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు పూజలు మరియు ప్రార్థనలు చేస్తారు.

మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఎనిమిదవ రోజుని మోక్షం యొక్క రోజు లేదా నిర్వాణ తిథి అంటారు. ఈ పుణ్యదినాన భీష్ముని స్మరణార్థం కుశ గడ్డి, నువ్వులు, నీరు సమర్పించడం చాలా శ్రేయస్కరం.ఈ రోజున తమ పూర్వీకులకు తర్పణాన్ని పవిత్రంగా, నిజమైన భావాలతో, సకల కర్మలతో, తమ పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. పిత్ర దోషం నుండి బయటపడండి.

భీష్మ పంచకం అంటే ఏమిటి?
భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు ! తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.

భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున , తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు.

తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.

భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ! ఆచార్యునిగా, భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు.

రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు.

మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ, విష్ణుసహస్రనామాలను జపిస్తూ, భగవద్గీతను పఠిస్తూ, భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...