Thursday, January 1, 2026

Mogadhosilla Nomu Katha - మొగదోసిళ్ళ నోము కథ

మొగదోసిళ్ళ నోము కథ

ఒక బ్రాహ్మణుని కూతురు మొగదోసిళ్ళ నోముపట్టి యది యుల్లంఘనచేసి చనిపోయెను. ఆమె మరుజన్మమున మరియొక బ్రాహ్మణుని యింట పుట్టెను. అల్పకాలములోనే తల్లి చనిపోవుటచేత నామెకు సవతితల్లి వచ్చెను. ఆమె దరిద్రబాధ కలిగినదై యది సహింపజాలక యొకనాడు దేవాలయములోనికి వెళ్ళి ధ్వజస్థంభము వద్ద కూర్చుండి యెండనక వాననక విచారించుచు పరమేశ్వరుని ప్రార్థించుచుండెను. కొంతకాలమునకు ఆమెయందు దయగలవాడై ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఏమి యో చిన్నదానా! యిట్లు విచారించుచున్నా" విని యడిగెను. బ్రాహ్మణరూపముచే ప్రత్యక్షమైన యా ఈశ్వరుని నామె సామాన్య మనుజునిగనెంచి "నాయనా! మీకెందుకు వెళ్లండని"
ప్రత్యుత్తరమిచ్చెను. అది విని భగవంతుడు "ఓ కాంతా! నీవు తలంచు కార్యము నేను దీర్చువాడను చెప్పు" మని యడిగెను. అంత నామె- "నేనొక బ్రాహ్మణుని కుమార్తెను నాకు సవతితల్లి యున్నది. దరిద్రముచేత సవతితల్లిచేత బాధపడలేక యిట్లు విచారించుచున్నన" ని చెప్పెను. అంత నీశ్వరుండు- "ఓ యింతీ! నీవు పూర్వజన్మమున మొగదోసిళ్ళనోముపట్టి యుల్లంఘన జేసినావు కాబట్టి నీకీ దరిద్రబాధ, సవతితల్లిపోరు సంప్రాప్తమైనవి. నీవిప్పుడా నోముపట్టి ప్రతిదినము నొడలికి నీళ్లుపోసుకొని, పసుపు కలిపి యొక పళ్లెములో రోజూమూడు దోసిళ్ళనీళ్ళు లెక్కచూచి పోసికొని, అది అయిన తరువాత మూడు దోసిళ్లు ముత్యములు, మూడుదోసిళ్లు పగడములు, శివుని
యాలయములోనికి పట్టుకొనివెళ్ళి శివుని రుద్రపాదములమీద పూజచేసి యధాశక్తి దక్షిణ తాంబూలాదుల నియ్యవలెను" అని చెప్పి యీశ్వరుండంతర్జానము నొందెను.

ఆ బ్రాహ్మణ చిన్నదియు భగవంతుడు చెప్పినరీతి నాచరించి సకలైశ్వర్య సంపన్నురాలై
సుఖంబుగ నుండెను.

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 7 - శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీరస్తు - శీమహాభాగవతము - సప్తమస్కంధము శ్రీమద్విఖ్యాతి లతా, క్రామిత రోదో உ ౦తరాళ! కమనీయ మహా జీమూతతులితదేహ, శ్యామలరుచిజాల! రామచంద్రనృపాలా! ఓ...