Monday, February 2, 2026

Magha Puranam 19 - మాఘ పురాణం 19 ఏకాదశీ మహాత్మ్యము

మాఘ పురాణం - 19 వ అధ్యాయం

ఏకాదశీ మహాత్మ్యము

సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నది లేనిచొట తటాకమందుగాని, తటాకంకూడ అందుబాటులో  లేనియెడల నూతిదగ్గర కాని, స్నానం చేసినంతమాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.

పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. ఆతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్శములు చేసి కీర్తి పొందియున్నారు.

అతడు చిన్నతనమునుండీ గడసరి, పెంకివాడు,అతను తల్లిదండ్రుల భయభక్తులవలన  కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహావాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను.

అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంత కాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను  తినడు ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము శరీరబలము ఉన్నదను మనోగర్వముతో. జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేకపోయినాను గదా యని పశ్చాత్తాపము నొందుతూ నిద్ర పోయెను. అన్నిరోజులు ఒకే విధముగానుండవుగదా! అనాటి రాత్రి కొందరు, చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం యెత్తుకొనిపోయిరి. 

అనంతుడు నిద్రనుండి లేచిచూడగా, సంపదంతా అపహారింపబడినది, అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ణప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునానదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నానఫలము దక్కేను. నదిలోమునిగి తడిబట్టలతో ఒడ్డుకువచ్చెను. చలికి గడగడ వణకి, బిఱ్ఱబిగిసీపోయినాడు, "నారాయణా" అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుటవలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యేను" అని వశిష్ఠుడు తెలియజేసెను.

Magha Puranam 18 - మాఘ పురాణం 18 పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట

మాఘ పురాణం - 18 వ అధ్యాయం

పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట

వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో వరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.

“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంత మందలి వసంతవాడయను నామముగల పెద్దపల్లె యుండెను. అందోక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్య పేరు తాయారమ్మ.

బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశకలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్ను డయ్యెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెఱుంగఁడు. అంతేగాక బీదప్రజలకు వారిఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్షాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీన పరుచుకొనేవాడు.

ఒకనాడు బంగారు శెట్లి గ్రామాంతరము వెళ్ళెను, ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు  బంగారు శెట్టి భార్యను చూచి "తల్లీ నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఖాలు  ఉరుము తున్నాయి, చల్ల గాలికి వణికిపోతున్నాను. మియింటివద్ద ఈ రాత్రిగడువనియ్యి. నీకెంతైనా 
పుణ్యముంటుంది. నేను  సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను, ప్రాతఃకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును” అని బ్రతిమలాడెను.

తయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రముచేసి అందొక తుంగచాపవేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్రహృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మాణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్యా! మాఘస్నానము చేసివెళ్ళెదను, అని అన్నారుగదా ఆ మాఘస్నానమనగానేమి? దాని వలన కలుగుఫలితమేమి? సెలవిండు వినుటకు కుతూహలంగా నున్నది. 

అని యనగా నావృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని "అమ్మా! మాఘమాసము గురించి చెప్పుటకు నశక్యముగాదు. ఈ మాఘమాసములో నదియందుగాని, తటాకమందు
గాని, లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ళుస్నానముచేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళములతోను, పూలతోను, పండ్లతోను పూజచేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలయును. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు యివ్యవలెను. ఇట్లు చేసినయెడల మానవునికున్న రౌరవాది మహా పాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ యీ నెలరోజులూ చేయ లేనివారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజయిననూ అనగా ఏకాదశి రోజునగాని, ద్వాదశినాడుగాని లేక పౌర్ణమి దినమునగాని పై ప్రకారముగా చేసినచో సకలపాపములు వైదొలగి సిరిసంపదలు పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలిసంతసించి తాను ప్రాతః కాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను.

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికివచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానము గుఱించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియ జేసెను,

భార్య చెప్పినమాటలకు బంగారు శెట్టికి కోపమువచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు 
పటపట కొరికి ఓసీ వెఱ్ఱిదానా! ఎవరు చెప్పినారే నీకీసంగతి? మాఘమాసమననేమి? స్నాన 
మేమిటి ? వ్రతము దానము. లేమిటి? నీకేమైనా పిచ్చిపట్టినదా? చాలు, చాలు అధిక ప్రసంగము  చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణాలు పోవుతున్నవి. ఎవరికిని ఒక్కపైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడ బెట్టిన ధనము దానము చేయమనెదవా? చన్నీళ్లు స్నానము చేసి పూజచేసి దానములు 
చేస్తే వళ్ళూ, ఇల్లూ, గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకొని "భిక్షాం దేహి" యని అనవలసినదే, జాగ్రత్త వెళ్ళిపడుకో అని భర్త కోపగించినాడు.

ఆ రాత్రి తాయారమ్మకు నిద్రవట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా ఎప్వుడు నదికి వెళ్ళి స్నానము చేతునా? యని ఆత్రుతగా వున్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధబ్రహ్మణునితో మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకఱ్ఱ తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుగుటచే యిద్దరికీ మాఘమాస ఫలము దక్కినది భార్యను. కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు.

కొని సంవత్సరములు జరిగిన తరువాత  ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికోన్ని రోజులకు యిద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకు పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి 
తీసుకొనిపోవుచుండిరి. తాయారమ్మను తీసుకొనిపోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై  ఎక్కించుకొని తీసుకొనిపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

"ఓ యమభటులారా? ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమిటి? నా భర్తను యమలొకమునకు తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారినుద్దేశించి అడుగగా, "ఓయమ్మా నీవు మాఘమాసములో, నొక దినమున స్నానము చేసితివి అదియు నావృద్ధ బ్రాహ్మణునివలన విని స్నానము చేయగా నీకీ ఫలం దక్కినది. కాని నీభర్త అనేకులను హింసించి,
అన్యాయముగా ధనార్జన చేసి, అనేకులవద్ద అసత్యములాడి నరకమన్న భయంలేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుననే యమలోకమునకు తీసుకొనిపోవుచుము" అని యమభటులుపలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు. నన్ను కొట్టుచు నాతో నాభర్త కూడ నీటమునిగినాడుకచా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా, ఆ యమభటులు సంశయము కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నయు తెలియజేసిరి.

చిత్రగుప్తుడును వారి పాపపుణ్యముల పట్టికచూడగా సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పౌరపాటునకు 
చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టినికూడా వైకుంఠమునకు తీసుకొని
పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను.

విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ తన భర్తగతి ఏమయ్యేనో యని ఆత్రుతతో వుండగా బంగారుశె
ట్టిని పుష్పకవిమానముమీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి.

రాజా వింటివా! భార్యవలన భర్తకుకూడ యెటుల మోక్షం కలిగెనో? భర్త దుర్మార్గుడ్తె పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యధాలాపంగా ఒక్క రోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదికదా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకం మగుననుటలో సందేహంలేదు.

Chandiswarudu - చండీశ్వరుడు

చండీశ్వరుడు కూడా మనలాగే పుట్టాడు పాంచ భౌతిక శరీరంతో అయన పూర్వ నామధేయం విచార శర్మ. అయన వేదం చదువుకొనేవాడు. 

చిదంబర క్షేత్రంలో యచ్చదత్తుడు అనే బ్రాహ్మణుడికి విచారశర్మ అనే కుమారుడు ఉండేవాడు. విచారశర్మ చిన్నతనం నుండి శివభక్తిలో మునిగిపోయి, ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించేవాడు.

ఆవుల్ని కాసే గోపాలకుడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెళుతున్నాడు. తీసుకువెళ్తూ ఒక ఈనిన ఆవు దగ్గరకు వెళ్ళాడు. ఈనిన ఆవు దగ్గరకి వెళ్ళకూడదు. ఆలా వెళితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామేమో అని రక్షించడానికి మనల్ని పొడుస్తుంది. తప్పు వాడిది, వెళితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు.

వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడటం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం. నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి.

నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. 

బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.

అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువును ఎలా చూడాలో తెలిసున్నవాడేమో అయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం  కింద పాలు పట్టేసివట లోపల పట్టి వెళ్లిలా పొదుగు ముట్టుకుంటే చాలట చెంబుడు పాలిచ్చే ఆవులు నాలుగు బిందెల పాలు ఇచ్చేయడం మొదలెట్టాయి.

వాటికీ ఆలా ఇంటికి వెళ్లి యజమానులకు పాలిస్తే తృప్తి పోయిందట. కొన్నాళ్ళకి 'ఛీ' మనం యజమానులకి ఇవ్వడం ఏంటి మహానుభావుడు మన్నని పోషిస్తున్నవాడు విచారశర్మ. అయన ఏం చెసేవాడు. ఆవులన్నిటిని వదిలి వేదం పన్నాలన్నీ అన్వయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు అందుకని ఈయనకి పాలిద్దామనుకున్నాయట. ఈయన అడిగిన అడగకపోయినా ఆవులు పక్కకి వచ్చి పాలు వదిలేస్తుండేవి. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని అయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి క్రింద పెట్టేవాడు. ఆలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు.అందులో ఇసుకలింగం తయారుచేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకొని "నమస్తే యస్తు భగవాన్ విశ్వేశ్వరరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః" అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసురసంధ్య వెల అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకొని ఇంటికి వెళ్లిపోయేవాడు.

ఒకరోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూసాడు.చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. అయన వెళ్లి వూళ్ళో చెప్పాడు. మీ ఆవులు ఇంకా పాలు ఇస్తాయి.ఆ విచారశర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచారశర్మ తండ్రిని పిలిచారు. ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుపాలు ఇసుకలో పోసేస్తున్నాడు.అందుకనీ నీ కుమారుణ్ణి మందలించమన్నారు. 

ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో పాలు తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టు కెక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయేటప్పటికీ ఆవులు పాలు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడికట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూసాడు తండ్రి మహాగ్రహం వచ్చింది.నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు క్రింద అభిషేకం అనుకోలేదు ఈయన అంతర్ముఖుడు అయి వున్నాడు కొడుకు. ఆ పిల్లవాడిని కర్ర తీసుకొని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయున్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన వున్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది.

అరేయ్ ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూసాడు తండ్రి నిలబడివున్నాడు.అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు. అని అక్కడ వున్నా గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నీవు తండ్రివైనా శివపరధమ్ చేసావు కనుక నీవు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకు విసిరాడు. తండ్రి రెండు కళ్ళు తెగిపోయి ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. 



ఆ పిల్లవాడి భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై విచారశర్మ నీకు దివ్య దేహం ఇస్తున్నాను నాకోసం ఇంత గొప్ప పని చేసావు కాబట్టి ఇవ్వాళ నుంచి మా కుటుంబంలో నిన్ను అయిదో వాడిగా తీసుకుంటున్నాను. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.అయిదవ స్థానం చండీశ్వరుడిదే.

నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.నాకోసం ఆవుపాలతో ఇంత తదాత్మ్యంతో అభిషేకం చేసావు కనుక ఇవ్వాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోడానికి వీలులేదు. నీకు చూపించి నీవు తినేసిన తరువాత నువ్వు తీసుకెళ్లమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరమిస్తున్నాను అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. 
భావసమాధిలో ఉంటాడు.ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.

మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ప్రసాదాన్ని (శివనిర్మాల్యం) ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.

శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.

ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.మీకు ఇచ్చినది ప్రసాద రూపము. 
చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది.

Sunday, February 1, 2026

Magha Puranam 17 - మాఘ పురాణం 17 కప్పరూపము వదలిన స్త్రీ

మాఘ పురాణం - 17 వ అధ్యాయం

కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట

"మునిశ్రేష్ఠా నా వృత్రాంమును తెలియజేయుదును గాన ఆలకింపుము.

"నా జన్మస్థానము గోదావరినది సమీపమందున్న ఒక కుగ్రామము.న తండ్రి పేరు హరిశర్మ. నాపేరు మంజుల. నన్ను నాతండ్రి కావేరీతీర్థవాసియగు జ్ఞానానందుడనువానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి, మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది.

ఒకనాడు నాభర్త "సఖీ"మాఘమాసము ప్రవేశించినది, మాఘమాసము చాల పవిత్రమైనది, దీని మహత్తు చాల పవిత్రమైనది. నేను నాచిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయచున్నాను, నీవు నాభార్యవు గావున నీవును ఈమాఘమాసమంతయు యీకావేరీనదిలో స్నానమాచరించును. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుండి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానంచేయుము ప్రభాతసూర్యునికి నమస్కరించిన తరువాత నదిఒడ్డున విష్ణువుయుక్క చిత్రపటము పెట్టి పువ్యులతోను మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింప్తుము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము, దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా నుండును” అని హితబోధ చేసెను.

నేను అతనిమాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నాభర్త చాలా శాంతస్వరూపుడు, అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపమువచ్చి శపించినాడు.

"ఓసీ మూర్ఖురాల! నాయింటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండతగవు మాఘమాసవ్రతము నీకింత నీచంగా కనిపించినదా?
సరియే నీపాపము నిన్నేశిక్షించును, గాన నీవు కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొఱ్ఱలో మండూకరూపంలో  నుందువుగాక" అని నన్ను శపించెను.

వారి సింహగర్జనకు వణకిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై  బడి రెండుపాదాలు పట్టుకొని "నాకీశాపము ఎట్లు పోవును మరల నిన్నెటుల కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తములేదా అని 
రిపరివిధాల ప్రార్ధించగా నాభర్త కొంతతడవలొచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధదశమినాటికి కృష్ణానదీస్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన యెడల ఆ మహర్షి ప్రభావమువలన్న నీకు నిజరూపముకలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపముదాల్చితిని. నా భర్త కూడా నామూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్నిదినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావిచెట్టు తొఱ్ఱలో నివాస మేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు" అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.

"అమ్మాయీ! భయపడకుము నీకీశాపము కలిగి వెయ్యేడ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేకకష్టములు పది జీవించినావు. నీభర్తయును ఏకాంతముగా చాలాకాలముజీవించి హరినామసంకీర్తనలు చేయుచు మృతుడయెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నడు. నీవు తనమాటలు విననందున ఎంతకష్టపడినావో తెలిసినదిగదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకలసౌభాగ్యాలు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధన మైనట్టిది కూడా. దీనికి మించిన మరియొకవ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దురదృష్టి గలజ్ఞాని. అతని గుణగణాలు సంతసించెడివారు. నిన్ను పెండ్లియాడినతరువాత తన వంశాభివృద్ధి చూసినవలయుననెడి ఆశతో నుండేవాడు. నీవలన. అతని ఆశలన్ని నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వమువలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసివచ్చెను? నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొఱ్ఱలో జీవించమని శపించినాడు.

ఈ దినము నా సమక్షములో ధైవసన్నిధిని పడినందున నీభర్త శాపము ప్రకారము, మరల నీ నిజ రూపము పొందగలిగినావు. అందునా యిది మాఘమాసము. కృష్ణానదీతీరము కాగా మాఘమాస వ్రత సమయము నీ కన్నివిధాలా అనుకూలమైన రోజు.అందుచే నీవు వెంటనేశుచివై రమ్ము. స్త్రీలుగాని, పురుషులుగాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణుసాన్నిధ్యము పొందుదురు. ఎవరయినా తెలిసిగాని, తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమిరోజుననూ నదీస్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పొడ్యమినాడు స్నానముననూ అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానముచేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్దించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణము వినిన మోక్షప్రాప్తి కలుగును.

అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినటుల మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.

Magha Puranam 16 - మాఘ పురాణం 16 ఆడకుక్కకు విముక్తి కలుగుట

మాఘ పురాణం - 16 వ అధ్యాయం

ఆడకుక్కకు విముక్తి కలుగుట

దిలీప మహా రాజా! సుమిత్రుని కథ ఈశ్యరుడు పార్వతీదేవికి చెప్పినరీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను.ఆదెట్లనా-

మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచునప్పటికీ మాఘస్నానము మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రామైననూ సంశయము లేదు. అని పార్వతీ దేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మరల ఇట్లు పలికెను,

"నాధా! శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరిగదా! ఆ వ్రత విధాన మెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరముగా తెలియపరచు" డని పార్వతీ దేవి పరమేశ్యరుని కోరినది.

అంతమహేహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను "మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానముచేసి నది ఒడ్డున గాని, ఇంటివద్దగాని, మంటపమువుంచి,
ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మ్రుగ్గులు పెట్టి మంటవము మధ్య ఎనిమిది  రేకుల పద్మము వేసి అన్నిరకాల పుష్పములు. ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపుమధ్యమున వుంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు 
రాసి పూజించవలెను.

రాగి చెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్ళును ఉంచి దానిపై కొబ్బరికాయపెట్టి, క్రొత్తవస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్టించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో,
సాలగ్రామమును వుంచి యొక్క సద్బ్రాహ్మణుని ఆహ్వానించి, వారిచేత పంచామృతస్నానం చేయించి, తులసి దళముతోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను,

తరునాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రధాన మివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.

మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, పప్పు వుప్పు, కాయగూరలు
పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు వుంచిగాని, క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని, దానమియ్య వలయును మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని లేక వినునపుడుగాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతున్నిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపైవేసుకోవలయును. గాన శాంభవీ! మాఘస్నానము చేసి మాఘశుద్ధదశమినాడు. లక్ష్మీనారాయణులను నిష్టతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపము లైనను నశించిపోవును, ఇందులకొక ఉదాహరణకూడ తెలియజేసెదను సావధానురాలవై వినుము.

గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధక్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్ఠా గోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుటనలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిదిచేసిరి.

గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయములో స్నానముచేసి తీరముననున్న ఒక రావి చేట్టువద్దకువచ్చి

శ్లో
॥ మూలతో బ్రహ్మారూపాయ మధ్యతో విష్ణురూపిణే
        అగ్రాతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమః॥

అని రావి చెట్టునకు నమస్కరించి ఆ చెట్టుమొదట అసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట, మండప మేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలుకట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము వుంచి పూజంచినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడు కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు, ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొనివుండెను. శిష్యులు వారివద్దనున్న దండముతో దానిని బెదరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తరదిశవైపు మళ్ళి మరల తూర్పు వైపునకు తిరిగి, ఆవైపునుండి దక్షిణ దిశకు కదలి మరల యధాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి.ముందు చేసినటులే రెండవసారికూడా. ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండములతో బెదరగొట్టగా మరల ఆకుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి మండపము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము ఆయివున్నందున వెంటనే అ కుక్క రూవము వదలి ఒక రాజుగా మారిపోయాడు, ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి మునులందరికి నమస్కరించెను. అక్కడ నున్న కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.

"ఓయి! నీ వెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించాడు.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు, నా దేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూవున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసి యున్నాను, ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను. అనేక చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించినాను. ధర్మశాలలను కట్టించినాను, పశువులు త్రాగుటకు నీటిగుంటలు త్రవ్వించినాను. నిత్యము బీదప్రజల నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవవిగ్రహాలను ప్రతిష్టించినను. సద్బ్రాహ్మణులచేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియిన్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశద రచెదను వినుడు.

ఒకానొక దినమున ఒక మునిఫుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయాలన్న సామాన్య విషయము కాదు కదా! దానికి కావలసిన, ధనము వస్తుసముదాయము చాల కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకువచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఏదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశలప్రశ్నలడిగితిని. మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియ బేయుదును. ఈ మాసములో మఖర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానముచేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యములు చదువుటకాని లేక. వినుటగావి చేయుము. దానివలన వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాక అశ్వమేధయాగము చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలముగాని, తీర్ధస్నానాలు చేయగా వచ్చిన ఫలముగాని లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్గ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చినగాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు, 

ఒక వేళ ఇతరజాతులవారైననూ మాఘమాసమంతట నిష్ఠతో నదీస్నాన మాచరించి దానధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును, అని ఆ ముని
వర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని.

"ఆయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరింపను, ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటికాదు. గాన మాఘస్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు జేయుటగాని, పూజానమస్కారములు ఆచరించుటగాని చేయును. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంతకష్టము.! ఇక నాకు ఈనీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలముచాలు" అని ఆ మునితో అంటిని.

నా మాటలకు మునికి కోవంవచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, చేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.

అంతట నేను ఆ మునిచేతులువట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసికొనిపోయెను.

ఆ విధముగా. నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది. ఏడుజన్మలూ నాకు కుక్కజన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసితినిగాని నా పూర్వ జన్మ నాకుకలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించ లేరుగదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను" అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని అశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తు గటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యదార్ధములే, నీవుకుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

"నేను నా శిష్యునితో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణితీరమందుండిన కృష్ణానదిలో మూఘమాస మంతయు స్నానములు-జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమనివచ్చి యుంటివి మేమందరము ఈ వృక్షరాజము క్రీంద విష్ణువిగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్కరూపంలోనున్న నీవు దారినిపోతు ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజాసమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీ శరీరము బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యంగా నున్నావు. పరిశుద్ధులమైభగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువుగాని, పక్షిగాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా వున్నందున శిష్యులు నిన్ను తపోదండముతో తరిమిరి. , నైవేద్యము తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టుతిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు, అట్లు మూడు పర్యాయనులు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూమును ప్రసాదించినాడు. అనగా మాఘమాసఫలము భగవంతుని మండపము చుట్టు తిరుగుటనలన పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నాసముచేసి భగవంతుని ఛ్యానించి పురాణపఠనము జేసినచో ఎంతటిఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని వరివారమంతటికీ నమన్కరించుచుండగా అంతలో ఆ రావి చేట్టులోనున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడీ బెకబెకమని అరచి, అటుఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపమువద్దకు వచ్చి కొంచెము చూచుచుండగా హఠాత్తుగా కప్పరూపమును వదలి మునివనితగా మారిపోయెను.

ఆమె నవ యౌవ్వనవతి, అతి సుందరాంగి, ఆమె 
గౌతమఋషినిచూడగానే తనకుజ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది.

అంత గౌతమముని-అమ్మాాయీ! నీ వెవ్వరివెవ్వరిదానవు? నీనామదేయమేమి? నీ వృత్రాంతము తెలియజేయుము అని ప్రశ్నించిరి.

గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటచే యిట్లు చెప్పదొడంగెను.

Magha Puranam 15 - మాఘ పురాణం 15 సుమిత్రుడు పశ్చాత్తాపము పొందుట

మాఘ పురాణం - 15 వ అధ్యాయం

సుమిత్రుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమెభర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగినఫలితముచే సమస్తదోషమును పోగొట్టుకొని సుఖంచిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగాతిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను.

“నాధా! సుబుద్ధికుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి మరి 
సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు వినకుతుహలముగానున్నది” అని
సాంబ
శివుని కోరినది, అందుల కా పార్వతీపతి యిట్లు వివరించెను.

సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తానువేసిన పాపమునకు ఫలిత మనుభవించుచుంటినిగదా యని పశ్చాత్తాపమనస్కుడై గురువు గారి వ్రద్దకు పోయి గురువుపాదములపై బడి "గురువరా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అదినాదోషము కాదు. నేను పూజ్యా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని, దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుటచూచి నెమ్మదిగా నావెంటవచ్చినది నేను అటు అడవిమధ్యకు పోయి ఒక కోనేటివద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలలో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు, నన్ను బలవంతము పెట్టినది, నన్నుక్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభంలేదని “నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణ త్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయముకలిగి నిజంగా అమె ప్రాణ త్యాగమే చేసుకున్న చో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీలేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేనుకూడ పాపరహితుడ నెటులకాగలనో సెలవిండని బ్రతిమాలెను.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన 
కుమార్తెవలె తన శిష్యునిగూడ పాపరహితుని జేయ నెంచి సుమిత్రా! నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పావరహితుడవు
కాగలవు, అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సుచేసుకొనుము, ఆ తపస్సుచే కలుగు ఫలితమువలన పా
ము మబ్బు విడిపోయినటుల నశించుపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.

“ధన్యోస్మిధ
న్యోస్మి" మీయజ్ఞప్రకారము నేనిప్పుడే ప్రయాణసన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకుదండ ప్రమాణములాచరించి గంగానదితీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమన గుట్టలు, కొండలు, సెలయేళ్లుదాటి ఒక  అరణ్యమధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమొనరించు దృశ్యములు కనుపించినవి. కౄరమృగములు సాధు జంతువులు కలసి మెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి, పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము
కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సున కానంద మొన్నరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఓక వటవృక్షము క్రింద విశ్రమించి, నలుదిశల పరికించిచూడగా ఒక ఆశ్రమము కనిపించినది.

వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకువచ్చితొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప  నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి "హరిహరీ" యని బిగ్గరగా కేకలువేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. అదృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజపూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న  సుబుద్ధికి కూడ  ప్రసాదమివ్వగా “స్వామి! మీరాచరించిన వ్రత మెట్టిది? దీనివలన ఫలిత మేమి కలుగును! మనుజుడు పాపరహితుడగునా? ఈ నాసందియములను దీర్పవేడుచున్నాను” అని వినయముగా ఆమునిసత్తముల నడిగెను.

పాపములచే పీడింవబడు చున్న సుమిత్రుని ప్రార్థనవిని అచటనున్న మనుజులందరూ మాఘమాస మందాచరించవలసిన ధర్మమును అతనికి వివరించుటకుగాను వారిలో నొకరిని నియమించిరి అంత నా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు
వివరించెను.

“విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాసవ్రతము ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటి నన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంతమాత్రమున అవి యన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపములన్నియు నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానముచేయునో అట్టిమనుజుడు శ్రీహరికి ప్రియుడగును, ఎట్టిదోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘవురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠవాసులగుదురు. ఆలాగున చేయనివాడు, అసత్యములాడు వాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పర స్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్యము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్షములు చెప్పుట, జనసమర్థముండుచోట మలమూత్రములను విడచుట, గుఱ్ఱములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి, చేయువారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమనము. మరియు ధైవ సంబంధమగు ధనమును అపహారించువాడు, ఏ పుణ్య దినములలోనై న శుచిగా స్నానముచేసి దేవుని ప్రార్థించనివాడు, దాన మిచ్చెదనని వాగ్దానముచేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి రత్నములు సాల గ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టుడై జార చోరత్యములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహా పాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహీంసలు చేయువాడును బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయవాడును మహాపాతకులు. అట్టివారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహసంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసినవానిని జూచి ఎగతాళిచేయువాడును బ్రహ్మహత్య చేసినవానితో సమానుడగును.

గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం, ఈ వ్రతం చేయుటనలన మాకు ఏమాాత్రమూ పైన  చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును, ఇది ముమ్మాటికీ నిజం.
అందుచేతనే మేమందరను మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము.

మాఘమాసం ప్రారంభముకాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానంచేసి సూర్యునికి నమస్కరించి? నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకుపోయి శ్రీహరికి పూజచేసి, తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును, మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత గాన యా మాసమందు ఆచరించిన స్నానమువలన కల్గు ఫలము నిచ్చువాడు అతడేగనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒక వేళ నదీతీరమందుగాని, చెఱువు దగ్గరగాని విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమునుగాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణశ్రవణము గావించవలయును.

ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మాణునకు వస్త్రములు,  బంగారము ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టాలి, ధనమున్న నారు బ్రాహ్మణా సమారాధన చేసిన యెడల ముకోటిదేవతలు సంతసించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నావచనములు అనత్యములు కావు. ఇప్పటి వరకూ మాఘస్నాన ఫలిత మంతయు విన్నావుగదా! ఇక మాఘమాసం మూడుదినాలు మాత్రమే వున్నది, గాన ఈమూడు దినములలోను ఈనదిలో స్నానముచేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవుకమ్ము" అని మునీశ్వరులు తెలియజేసెను.

అంత సుమిత్రుడు తనగురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు బోయి తపస్సు చేసుకో మనిచెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.

"నీగురువు చెప్పిన విషయం యదార్ధము. నీగురుపుత్రికతో గూడి రతిసల్పినావు. అందు నీదోష మేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడ నరక బాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి మూడుదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము, తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురుపు చేప్పినవిధముగా భక్తితో తపస్సు చేసిన యెడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు స్వార్ధము, చంచలభావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము" అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడుదినములుండి మాఘస్నానములు చేసి, నదీతీర మందు విష్ణువును పూజించి, పురాణపఠనము గావించెను. తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీతీరమునకు తపస్సు జేయుటకై వెళ్లిపోయెను.

Kadaliphala Phalam - కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందళి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. కానీ ఆమెకు దైవభక్తి ఎక్కువ.ఎప్పుడూ ధ్యానం లో నిమజ్ఞురాలై ఉండేది. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కానీ ఆమెకు దైవ భక్తి ఎక్కువ. ఆమె ఎప్పడూ దైవభక్తిలో లీనమై ధ్యానం చేస్తూ ఉండేది. పతి భక్తి కన్నా దైవభక్తి ఎక్కువ. దుర్వాస మహాముని యొక్క నిత్యనైమిత్తిక పూజలకు సహాయంచేయక ఎప్పుడూ ధ్యానానిమజ్ఞురాలై ఉండెడిది. కొంతకాలానికి తన తప్పు తెలుసుకొని శని దేవుని ప్రార్ధించి ఎప్పుడూ తన భర్త యొక్క దేవుని సేవలో అర్హమయే ఒక పూజా వస్తువుగా మార్చమని కోరింది. శని దేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె కోరికని విన్నాడు.

ఒకనాడు దుర్వాసమహర్షి కందళీ దేవితో నేను కొంత సమయం విశ్రాంతి తీసుకొందును సంధ్యాసమయంనకు పూర్వం మేల్కొలుపు అని కోరి విశ్రమించినాడు. ఆమెనూ ధ్యాన నిమజ్ఞురాలై కాలాతీతమును గమనించలేదు. ధ్యానం నుండి బయటకు వచ్చి చూచుసరికి కాలాతీతమైనది. అంత కందళీ దేవి మహర్షిని నిద్ర లేపగా, లేచిన మహర్షి కాలాతీతమును గమనించి కోపోద్రేకుడై ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు. 

కొంతతడవకు శాంతించి జ్ఞాననేత్రం ద్వారా ఇదిఅంతయు శనిదేవుని వల్ల జరిగినదని తెలుసుకొని కోపించి శనిదేవుని శపించ బోవ అంత శనిదేవుడు ప్రత్యక్షమై కందళి దేవి యొక్క కోరికను వివరించి ఆమె భస్మమును పూజకు పనికివచ్చే విధముగా మార్చమని కోరెను. అంత ఆమె యొక్క భస్మరాశిపై పవిత్ర మంత్రజలం ప్రోక్షించి ఆమెను ఒక కదళీ వృక్షంగా మార్చి ఈ వృక్షం యొక్క ఆకులూ,పళ్ళు సమస్తము దేవుని పూజకు అర్హమవుతాయని పలికి తన తపోదీక్షలో లీనమైనాడు.

శ్రీవత్స

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...