Thursday, January 23, 2025

KUMBHA MELLA - కుంభమేళా

కుంభమేళా

మహా కుంభమేళ 144 సంవత్సరములు ఒకసారి.

పూర్ణ కుంభమేళా 12 సంవత్సరములకు ఒకసారి.

అర్థ కుంభమేళా 6 సంవత్సరములకు ఒకసారి.

కుంభమేళ 3 సంవత్సరం లో ఒకసారి వస్తాయి.

మహా కుంభ మేళ అంటే ఏంటి? అసలు దాని చరిత్ర

ప్రతి 12 యేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహా మేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి (కుంభ రాశి). మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెపుతున్నాయి. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు, రాక్షసుల మధ్య దేవ - దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతూ ప్రయాగ(అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు చుక్కలు జారి పడినట్టు పురాణాలు చెపుతున్నాయి.

అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్థ కుంభమేళా అని.. 12 యేళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహా కుంభ మేళా అని పిలుస్తారు.

సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు.

మహాక్రతువు

దేశం నలుమూలలనుంచే కాక, ప్రపంచం అంతట్నుంచీ తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళా. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళా.

ప్రయాగ

ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో వున్న 7 ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ.

త్రివేణీ సంగమం

ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్ధం. గంగ, యమునా, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది.

గంగానదీ

కనుక దీన్నిబట్టి నదినీటినీ,అందులోను గంగా నదినే మనం ప్రథమంగా నమస్కరిస్తము. సమస్త దేవతలూ నివశించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి యొక్క ప్రత్యేకత.

సరస్వతీ నది

విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని దీనిలో స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూవుంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూవుంది

త్రివేణీ సంగమ తీరం

అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తూంటాం. పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని మన పూర్వీకుల విశ్వాసం.  

No comments:

Post a Comment