Sunday, January 4, 2026

Apadaleni Adivaram Katha - ఆపదలేని ఆదివారము కథ

ఆపదలేని ఆదివారము కథ

ఒక బ్రాహ్మణున కొక కుమారుడు కలడు. ఆ చిన్నవాని కాతడు వివాహముచేసి కోడలిని తన యింటికి తీసికొనివచ్చెను. ఆమె ఆపద అనిన  తెలియక ప్రతిదినము మామగారింటికి రాగానే-మామా! ఆపదంటే యేమిటి? యని యడుగు చుండేది. ప్రతిదినమిట్లు అడుగుచుండగా విసుగువచ్చి ఆ బ్రాహ్మణుడు దర్భాసనపు త్రాడు పుచ్చుకొని పెద్దమనుమడి ని కొట్టెను. ఆ పిల్లవాడాదెబ్బకు మూర్చపడిపోయెను. ఆ యాపద చూడలేక యాచిన్నవాని తల్లి అడవిలోకి వెళ్ళి విచారించుచుండగా భూమి పై విహారానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి యేమి ఇట్లున్నావని యడిగిరి. 

అప్పుడా చిన్నది నాకు ఆపదమనసు అయి ప్రతిదినము మా మామగారిని ఆపదయంటే యేమిటి? యని అడుగగా ఆయనకు కోపమువచ్చి దర్భాసన త్రాటితో నాపెద్దకొడుకును కొట్టినారు. అతడు మూర్చపడినారు. ఆయాపద భరింపజాలక యీలాగువచ్చినానని బ్రాహ్మణ స్త్రీ చెప్ప పార్వతీ పరమేశ్వరులు "నీవు క్రిందటి జన్మమున ఆపదలేని ఆదివారము నోముపట్టి ఉల్లంఘన చేసినావు.
అందుచేత నీకు ఆపద మనస్సైనది. ఇప్పుడు నోముపట్టి క్రమముగా ఉద్యాపన చేసికొన్న యెడల నీకీ యాపద పోవునని చెప్ప పార్వతీ పరమేశ్వరులు అంతర్జానము నొందిరి. ఆ బ్రాహ్మణ స్త్రీ యింటికి వెళ్ళి యానోముపట్టి క్రమముగా నుద్యాపన చేసికొని ఏవిధమైన ఆపదలులేక సుఖముగా నుండెను. 

ఉద్యాపనము: అయిదు మానికెల పాలలో మానెడు సోలడు బియ్యముపోసి పరమాన్నమువండి అడుగు అట్టు పై అట్టు తీసుకొని సూర్యునకు నైవేద్యము పెట్టి ఆ మథ్య పరమాన్నము అయిదుమూళ్ళ పంచ, దక్షిణ తాంబూలములతో 
 అయిదు మంది బ్రాహ్మణులకు వాయన మియ్యవలయును. 

No comments:

Post a Comment