Sunday, January 25, 2026

Magha Puranam 8 - మాఘ పురాణం 8 యమలోక విశేషములు

మాఘ పురాణం - 8 వ అధ్యాయం

యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమ లోకమందు చూచిన వింతలు, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.

యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములనుబట్టి శిక్ష లనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మల కెంతటి కోఠిన శిక్షల ననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి, ప్రతి పంపిణీ ఎఱ్ఱగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్ననూతిలో త్రోసి వేయుదురు, తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు, మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి, చిత్రహింస పెట్టుదురు, అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణకిపోయిరి.

అప్పుడా కన్యలు వారిని ఓదార్చి "మీరు బయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయ మొక్కటేయున్న ది, ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానముచేయుట తనకు తోచిన దానములు ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయేగాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమయినది.

మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానము చేసిన, కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాస 
మంతయు పురాణపఠనము చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట, కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

No comments:

Post a Comment