లక్ష్మీదేవి మూల మంత్రాలు
లక్ష్మీ బీజమంత్రం 1
'శ్రీం’
లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు. స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయినుండి మరొక స్థాయికి మార్చగలదు. క్లీం, హ్రీం, క్రీం ఇవన్నీ స్విచ్ పదాలకి ఉదాహరణలు. ఇవేవీ శ్రీం అంత శక్తివంతం కాదు.
లక్ష్మీ బీజమంత్రం 2
॥ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ॥
ఇది శ్రీం ని వాడే పూర్తి బీజమంత్రం.
లక్ష్మీ బీజమంత్రం 3
॥ ఓం శ్రింగ్ శ్రియే నమః ॥
ఇది మరొక బీజమంత్రం. తేడా ఏంటంటే ఇందులో శ్రీం శబ్దం లేదు.
లక్ష్మీ మంత్రం ఓం హ్రింగ్ శ్రింగ్ క్రీంగ్ శ్రింగ్ క్రీంగ్ క్లింగ్ శ్రింగ్ మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహా ॥
ఈ మంత్రాన్ని ఆఫీసుకి లేదా పనిచేసే చోటకి వెళ్ళేముందు జపించాలి. ఇది అన్ని చింతలను దూరం చేసి మీ ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది.
లక్ష్మీ గాయత్రి మంత్రం
॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥
1. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.
3. ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.
4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.
5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః
6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ:
అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.
7. ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం..
ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.
8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః
ఏకాదశాక్షర సిద్ధి మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.
మహాలక్ష్మీ ముల్లోకాలలో పూజించబడుతుంది. శ్రీమహావిష్ణువు పట్టమహిషి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్య. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని గావించాలి.
No comments:
Post a Comment