కామదా ఏకాదశి
మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి. దీనినే దమన ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది.
ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.
వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించాడు. వశిష్ట మహాముని దిలీప మహారాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని హండరీరుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు, నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు, తన భార్యతో చాల అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు.
రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన గంధర్వుడిని ఆగ్రహించిన రాజు అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమై పోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది.అలా వింధ్యాచల అడవిలో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన గంధర్వుడి భార్య శ్రింగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి..
తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు. ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి. మనసులో తలచుకోని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.
కామద ఏకాదశి ని హిందువులు చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది.స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.
ఈ రోజునే శ్రీకృష్ణుని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊపితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.
No comments:
Post a Comment