ఒక బ్రాహ్మణుని కొక ఆడపిల్ల కలదు. ఆమెకు చిన్ననాటనే వైధవ్యము సంభవించెను. ఇందులకు ఆ తల్లితండ్రులు మిక్కిలి విచారించుచుండెడివారు. ఆ జననీ జనకులు కొంతకాలము వరకుండి దుఃఖశాంతి గానక పిల్లలతో కానలకు బోయి విచారించుచు తిరుగుచుండగా విహారానికి వచ్చిన పార్వతీపరమెశ్వరులు ఏమి మీరు యిలాగు విచారించుచు తిరుగుచున్నారని యడిగిరి. అప్పుడా తల్లిదండ్రులు లేక లేక మాకీపిల్ల యొకర్తియే పుట్టినది. దీనికి పెళ్ళిచేసినాము. పెండ్లికాగానే భర్తపరలోకగతుడాయెను. ఆ దుఃఖము భరించలేక ఈలాగున పిల్లలతో తిరుగుచున్నాము అని చెప్పినారు.
అప్పుడా పార్వతీపరమేశ్వరులు "అయ్యో! ఆ పిల్ల క్రిందటి జన్మమున సౌభాగ్యతదియ నోముపట్టి ఉల్లంఘనచేసినది. అందుచేత నిట్టియాపద చిన్నదానికి సంభవించినది. ఆ వ్యధ పోవుటకుగాను తిరిగి యపుడా నోముపట్టించి సంవత్సరము పొడుగున పౌర్ణమి వెళ్ళిన తదియనాడు ఉపవాసముండి ఎడచేర పెడచేద బ్యియంబోసి యెదుట మనిషితో మాట్లాడకుండ ఉప్పువేయని చప్పిడితిని యేడాది అయిన తరువాత ఉద్యాపన చేసుకోమనెను.
ఉద్యాపన: వీసెఏబులం పసుపు మనిషితో మాట్లాడకుండా కలియగొట్టి,13 వెదురు పెట్టెలలోపోసి పదమూడు కాసులు దక్షణ తాంబూలము, 13 లక్కజోళ్లు, 13 రవికెలగుడ్డలు, 13 నల్లపూసలుకోళ్లు పెట్టి పదముగ్గురు ముత్తైదువులకు వాయన మియ్యవలయును.
కధలోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినను ఫలము తప్పదు.
No comments:
Post a Comment