Tuesday, June 3, 2025

Gayatri Devi - గాయత్రీ దేవి

గాయత్రీ దేవి

పురాణాల ప్రకారం గాయత్రీ దేవి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉద్భవించింది అని కథనం.

గాయత్రి మాతకి మూడు సంధ్యలలో మూడు పేర్లు ఉన్నాయి.

ప్రాతఃకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఒకే గాయత్రి మూడు నామములతో ఉన్నది.

సరస్వతి, సావిత్రి, గాయత్రి – ఈ మూడూ కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞాన రూపిణి అన్న అర్థాన్ని చెప్తున్నాయి.

అదేవిధంగా ఈ మూడు రూపాలకి బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ, అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి.

అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అంటే త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి.

ఈ విశ్వమంతా "త్రి" అన్న తత్త్వంతోనే ఉన్నది. భూతభవిష్యత్వర్తమాన కాలములు, ముల్లోకాలు, సత్వ - రజో - తమోగుణములు, సృష్టి స్థితి లయలు, అన్నీ మూడింటితోనే చెప్పబడుతున్నాయి.

ఈ మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి గనుక ఆ తల్లి "త్రిపదా గాయత్రి" అనిచెప్పబడుతున్నది.

అలాంటి గాయత్రీ ఆరాధనలో 24 అక్షరములూ కూడా 24 తత్త్వములకు సంకేంతంగా కూడా భావన చేశారు.

అయితే ఈ 24 తత్వాలతోనే విశ్వమంతా ఉన్నది. అందుకే పంచముఖాలలో కూడా విశ్వ తత్త్వమే చెప్పబడుతున్నది.

అక్షరములుగా 24 సంఖ్యలలో ఉందని ప్రత్యేకత కూడా అదే. అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్న పూసల సంఖ్య కూడా 24 యే.

అంటే ప్రాణశక్తి సంచరించేటటువంటి వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ విభజన కూడా 24 తోనే ఉన్నది.

"ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ" అని వర్ణించిన ప్రకారం. ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రీదేవిని ఆరాధించడం ఉంది.

సమస్త వేద సాహిత్యానికి, జ్ఞానానికి తల్లి అయిన గాయత్రీ దేవి ఆవిర్భవించిన రోజుకు గుర్తుగా, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.

గాయత్రి మంత్రం
ఓం భూర్భువస్సువః | తథ్సవితుర్వరేణ్యం ।
భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయా''త్ ॥

ప్రతి పదార్థం
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.

ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.

చతుర్వింశతి గాయత్రీ
గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.

యిరువది నాలుగు దేవతా మూర్తులు

క్రమ సంఖ్య

అక్షరము

దేవతా మూర్తి

క్రమ సంఖ్య

అక్షరము

దేవతా మూర్తి

1

తత్

విఘ్నేశ్వరుడు

13

ధీ

భూదేవి

2

నరసింహస్వామి

14

సూర్య భగవానుడు

3

వి

మహావిష్ణువు

15

హి

శ్రీరాముడు

4

తుః

శివుడు

16

ధి

సీతాదేవి

5

శ్రీకృష్ణుడు

17

యో

చంద్రుడు

6

రే

రాధాదేవి

18

యో

యముడు

7

ణ్యం

శ్రీ మహాలక్ష్మి

19

నః

బ్రహ్మ

8

అగ్ని దేవుడు

20

ప్ర

వరుణుదు

9

ర్గోః

ఇంద్రుడు

21

చో

శ్రీమన్నారాయణుడు

10

దే

సరస్వతీ దేవి

22

హయగ్రీవుడు

11

దుర్గాదేవి

23

హంసదేవత

12

స్య

ఆంజనేయస్వామి

24

త్

తులసీమాత

No comments:

Post a Comment