Sunday, January 4, 2026

Gajula Gowri Nomu Katha - గాజుల గౌరీదేవి కథ

గాజుల గౌరీదేవి కథ

ఒక బ్రాహ్మణుని కోడలు గాజులగౌరీదేవి నోముపట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెనిచూచి అంతా చిటచిట లాడుచుండేవారు, ఇరుగు చిటచిట-పొరుగు చిటచిట-అత్త చిటచిట మామ చిటచిట మగడు చిటచిట. ఎదురుచూస్తే వారే యిలాగున్నారని ఆ చిన్నది విచారించుచు, అడవిలోనికిపోయి తిరుగుచుండెను. అంతట విహారానికి వచ్చిన పార్వతీ పరమేవ్వరులు ఆ చిన్నదానిని చూచి- “ఏమిఅలాగు విచారించుచు తిరుగుచున్నావ”ని యడిగిరి. అందుకామె "యిరుగు, పొరుగు, అత్తమామ, మగడు నన్నుచూస్తే కోపంగా వుంటారు. అందుచేత నందరికి 
కోపమైతే యెట్లు బ్రతకనని ఇలా తిరుగుచున్నానని చెప్పెను. "అలాగు కాదమ్మా! నీవు గాజుల గౌరీనోము పట్టి ఉల్లంఘనము చేసినావు. ఆ కారణమున నిన్ను జూచిన అందరు కోపంగా నున్నది. నీవు తిరిగి ఆ నోముపట్టి ఉద్యాపనము చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారం అమె యింటికివెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగ యుద్యాపనము చెసికొనగా, అప్పటినుండి ఆమె అందరికి యిష్టము కలదయ్యెను.

ఉద్యాపనము: ఒక ముత్తయిదువును తీసుకొనివచ్చి ఆమెకు యిష్టమైన గాజులు. తొడిగించి, తలంటి నీళ్లుపోసి, చీర రవికెలగుడ్డ యిచ్చి పిండివంటలతో భోజనము పెట్టవలెను. 

భక్తి తప్పినా ఫలముతప్పదు. కథలోపమైనను వ్రతలోపము కాకూడదు.

No comments:

Post a Comment