Sunday, January 4, 2026

Nandikeswara Vrata Nomu Katha- నందికేశ్వర వ్రత కథ

నందికేశ్వర వ్రత కథ

ఒకనాడు కైలాసపర్వతమున వినోద మందిరమున పార్వతి పరమేశ్వరునకు పాదము లొత్తుచుండగా పరమేశ్వరుడు పార్వతి తో - “ఓపార్వతీ! నీచేతులు మృదువుగా నుండక నాపాదములు నొచ్చుచున్నవి. కావున నీవు నా పాదము లొత్తవద్దనియె. అందుకు పార్వతి చింతాకులస్వాంతయై-"దేవా! ఎందుచేత నిట్లంటిరో చెప్పవలయునని ప్రార్ధించగా పరమేశ్వరుడు "నీవు పరోపకారము చేసినావుకావు. అందుచేత నిట్లుండె"ననియెను. "ఇందుకేమి చేసినచో నీకర్కశత పోవు"నని యడుగ నీశ్వరుడు- “నీవు నీళ్ళరేవునకు నీ
ళ్ళపొయ్యి వేసుకొని నీళ్ళుకాచుచు పోవువారికి తలంటి నీళ్ళుపోసిన నీచేతులకు మృదుత్వము వచ్చు"నని చెప్పెను. 

పార్వతి ఆ ప్రకారము నీళ్ళుకాచి వచ్చీపోయేవారికి నీళ్ళుబోయుచుండగా నొక పేదరాలు తలంటి నీళ్ళు పోసుకుందామని పిల్లలు తాను అచ్చటికి రాగా వారికిగూడా తలంటి నీళ్లు పోసెను. పిమ్మట వారు పార్వతియొద్ద సెలవు తీసుకొని పోవుచుండగా వారిని జూచి పార్వతి- "వీరికి భాగ్యమిచ్చెద"నని మనస్సులో సంకల్పించుకొనెను. 

ఆ పేదరాలు యింటికి వెడలుసరికి పెనిమిటి యెడ నొకమూట, పెడ నొకమూట వేసికొనివచ్చెను. ఆ రోజు నుండి వారికి క్రమముగా భాగ్యమువచ్చెను. అంత నా బ్రాహ్మణునిభార్య బంగారు తూగుటుయ్యలలో కూర్చుండి వచ్చుపోవువారికి కందరికి పని చెప్పుచుండెను. అది పెద్దవాడుకగా సూళ్ళవెంట చెప్పుకొనుచుండిరి. అప్పుడు పార్వతి-"నేను భాగ్యమిచ్చిన బ్రాహ్మణస్త్రీ కాబోలు, ఇంతకు వచ్చినదనుకొని ఒక పేద ముత్తయిదువయై ఆ బ్రాహ్మణ స్త్రీ యింటికివచ్చి వాకిటిలో నిలువబడెను. ఆ బ్రాహ్మణస్త్రీ బంగారపుతూగుటుయ్యలలో నూగుచుండి 

యా ముదుసలి యవ్వనుగాంచి "అమ్మా! పాలు పొంగువచ్చినవి. పాలమీద నొక నీళ్ళచుక్క చల్లి వెళ్ళమ" నెను. అప్పుడామె పాలమీద నీళ్లుచల్లి యింటికివెళ్ళి తలగట్టుకొని పడుకొనెను. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి- ఎందుచేత నీలాగుంటినని యడుగగా బ్రాహ్మణునిభార్యకు తాను భాగ్య మిచ్చినది మొదలుకొని జరిగిన చర్య చెప్పి నన్ను అవమానించిన యామె భాగ్యము తీసివేయవలసినదని పరమేశ్వరుని ప్రార్థించెను. పరమేశ్వరుడు వినాయకుని పంపగా నాతనిచూచి యా బ్రాహ్మణస్త్రీ ఐదుమానికెల బియ్యము ఉండ్రాళ్ళు వండి, సోలెడు
గిద్దెడు నెయ్యివోసి చల్లిదయంచక పుల్దియుంచక చాకికిపెట్టక వేకికి పెట్టక వినాయకునికి నైవెద్యము పెట్టెను. అతనవితిని భాగ్యము తీసివేయుట నాతరముకాదని ఇంకను భాగ్యమునిచ్చి చక్కబోయెను. 

అప్పుడు తిరిగి నందిని పంపగా, అతడు వెళ్లేసరికి " యా బ్రాహ్మణ స్త్రీ అయిదుమానికెల శెనగలు నీళ్లలోబోసి నైవేద్యము పెట్టెను. ఆ శెనగలుతిని యాతడు భాగ్యము తీయుట నాతరము కాదని యింకను భాగ్యమునిచ్చి వెళ్లెను. 

అప్పుడు పార్వతి హరుని పంపగా యాతని నా బ్రాహ్మణ స్త్రీచూచి అయిదు మానికల బియ్యము అట్లువండి సోలెడు గిద్దెడు నెయ్యిబోసి బెల్లముపెట్టి యాతనికి నైవేద్యము పెట్టెను. అతండవి తిని-"భాగ్యము తీసివేయుట నాతరముకాద" ని యింకను భాగ్యమునిచ్చి చక్కావచ్చెను. తిరిగి అర్జునుని పంపగా నాతని చూచి యా బ్రాహ్మణస్త్రీ అయిదుమానికల బియ్యము అప్పాలువండి నైవేద్యము బెట్టగా నాతడవితిని మరింత భాగ్యమిచ్చి వెళ్లెను. 

అప్పుడు శివునిపంపగా నాతనిచూచి ఆ బ్రాహ్మణస్త్రీ అయిదు  మానికెల నువ్వుపప్పు చిమ్మిలి త్రొక్కిన నైవేద్యము బెట్టెను. అతడవితిని మరింత భాగ్యమునిచ్చి చక్కాబోయెను. తరువాత కాలభైరవుని పంపగా నాతని చూచి యా బ్రాహ్మణస్త్రీ అయిదుమానికెల మినపప్పు గారెలవండి నైవేద్యము పెట్టెను. అతడవితిని యామె భాగ్యము తీయుటనావల్ల కాదదని వెళ్ళిపోయెను. పిమ్మట చంద్రుని పంపగా నాతనిచూచి యాబ్రాహ్మణస్త్రీ అయిదుమానికెల బియ్యము చలిమిడిచేసి నైవేద్యము పెట్టెను. అతడవితిని "ఆమె భాగ్యము చెరుప నాతరము కాద" ని మరింత భాగ్యమిచ్చి వెళ్లెను. తరువాత సూర్యుని పంపగా నాతనిచూచి యాస్త్రీ అయిదుమానికెల బియ్యము పరమాన్నమువండి నైవేద్యము పెట్టెను. అతడది యారగించి ఆమెకింకను భాగ్యమిచ్చి
చక్కాబోయెను. 

తరువాత నెవరిని వెళ్లమన్న- మావల్లకాదు, నీవే వెళ్లమనిరి. అప్పుడు పార్వతీదేవి స్వయముగా బయలుదేరివెళ్లగా నామెనుచూచి ఆ బ్రాహ్మణగస్త్రీ మిక్కిలి భక్తిశ్రద్దలతో అయిదుమానికల బియ్యము పులగమువండి, నేయి బెల్లముతో నైవేద్యము పెట్టెను. ఆమె అది తిని కోపము పోయినదై “అమ్మా! మొదట నీమీద నాకు కోపమువచ్చి నీ భాగ్యము తీసివేయుటకు కందరిని పంపినాను. వారందిరికి అన్నీ చేసి పెట్టినావు. అందుచేత నీభాగ్యము మరింత వృద్ధిఅయినది. అందుచేత నాకు కూడా సంతోషము వచ్చినది. 

ఈనోము పట్టి కథచెప్పి అక్షతలువెసి కొని తొమ్మిది దినుసులు మిగలకుండా ఉద్యాపన చేసికొన్న యెడల సకల భాగ్యములు కలుగునని పార్వతీదేవి యదృశ్యమయ్యెను.

ఉద్యాపన: అయిదుమానికల పెసరపప్పు బిందెతో అత్తెసరుపెట్టి అయిదు మూళ్ల అంగవస్త్రము చుట్టపెట్టి బంగారపు నందిని చేయించి అయిదు డబ్బులు దక్షిణతాంబూలములతో పడకవేసి నందిమోహపు పెండ్లికొడుకునకు అందియ వలయును. 

No comments:

Post a Comment