లింగదానము నోము కథ
"కార్తీకమాసాన కలిగినదిగాన, కరుణలింగమూర్తిని ఘనభక్తి గొలిచి, పండిత బ్రాహ్మణుని భక్తితో బిలిచి, తమశక్తి కొలది దక్షణలుంచి, పచ్చి పోకలతోను పండుటాకులతోను, పచ్చి కర్పూరముతోను, బహుదినుసులతోను, తగిన రీతిని భక్తి తాంబూలము సమర్పించి, బంగారు ప్రమిదలోన పదివత్తులుంచి, వెండి ప్రమిదలోన పదివత్తులువేసి దీపాలు దీపాలు వెలుగుచూ తేజరిల్లగను, అవియన్ని బ్రాహ్మణుడు కందీయవలెను. బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రమణాముచేసి, భూదేవు దీవనల్ పొందుగావలెను, లింగదానము నోచిన యంగసకెల్ల, భవబంధములెల్ల బాసిపోవంగ,
పార్వతీపరమేశ్వర్లు బహూకరుణతోను, శివలోక సాయుజ్య సిద్ధినిచ్చెదరు"
No comments:
Post a Comment