Saturday, January 31, 2026

Magha Puranam 14 - మాఘ పురాణం 14 బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట

మాఘ పురాణం - 14 వ అధ్యాయం

బ్రాహ్మణ స్త్రీ భర్తతో  స్వర్గమునకు వెళ్ళుట

ఓ దిలీపుడా! మాఘమాసములో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివికదా! అటులనే విప్రకన్య తనభర్తతో ఎటుల విష్ణుసాయుజ్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపుము.

పూర్వకాలమందు కాశ్మీర దేశ మందుగల ఒక గ్రామములో సుబుద్ధి యను బ్రాహ్మణుడు కలడు. అతడు నాలుగువేదములు చదివి అర్థ తాత్పర్యసహితిముగా వర్ణించగల పండితుడు. చదువు నందెటుల పాండిత్యముగలదో బుద్దియందును పేరుకుతగినటులే పెద్దలను గౌరవించుట, భూతదయగలిగి, అందరి మన్ననలను పొందియుండెను. అతడు గొప్ప పండితుడగుటవల్ల ఆనేకమంది ఇతర వండితులు అతని వద్దకు జేరి శిష్యులైరి, అ బ్రాహ్మణుసకు పది సంవత్సరముల బాలికమణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూవవతి, సుగుణాల రాశి, అందాలబరిణి లేడి కన్నులవలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రునివంటి ముఖము గలది. తుమెద రెక్కలను పోలు నల్లని పొడ గాటి తలవెంట్రుకలు గలది, ఆమె నడచినయెడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది, కోకిల కంఠమువంటి మధురమైన కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు, పండ్ల వరున చూచినవారికి మరల మరల చూడ వలయునను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను.

ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి. ఇంటజరుగు దైవ కార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలు దేరి వెళ్ళుచుండగా, దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను, ఆ బంతి బైటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీలవచ్చి సుమిత్రుని చూచినది.

సుమిత్రుడుకూడ యుక్త వయస్సులో నున్నాడు.చక్కటి అవయవసౌష్టవం కలవాడు, విశాలమైన వక్షముకలిగి, బంగారు కాంతిగల రూపవంతుడు, అతని అందమును సుశీల చూడగానే నివ్యెర పోయినది. అతనిని తదేకదృష్టితో చూచి అతని వెంటబడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలదూరమేగెను. అలా కొంతదూరమేగుసరికి ఒక కోనేరు కనుపించెను, ఆ కోనేరునిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి, తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోను, పండ్ల తోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి, మగ నెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమతమ పింఛములను విప్పి నాట్యమాడు చున్నవి, నీటి జంతువులు తామరతూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పై కెగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరంనుంచి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు
గ్రోలి చెట్లనీడను విశ్రమించి యుండెను. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి సంపెంగ పువుల వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రీంద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని
సౌందర్యమును కనులార చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించింది. "ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు న మనస్సు న స్వాధీనములో లేదు. అందులకే నీ వెనుక ఇంతదూరం వచ్చితిని. ఈ ఏకాంతప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము.
చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు, నీవయసు, నావయసు సరిసమానము.
ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె నున్నాము చిలకా గోరింకలవలెను, రతీమన్మధులవలెను లీనమైపోవుదము. ఆ చెట్టుపైనున్న గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన అతుమెదల జంటల చూడు ఏలాగున్నవో! కాన రమ్ము నాయవ్యనబింకాన్ని ఆఘ్రాణించుము, సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీ కర్పింతును. నీవు మన్మధునివలె వచ్చి నన్ను కాగలించుకో” అని అనేక విధాల ఆ విప్రకుమూరుని తొందర పెట్టసాగెను.

అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాటరాక శిలావిగ్రహమువలె ఉండి తేరుకొని తరువాత బాలా! నీ మాటలు చూడ పిచ్చి దానివలెనున్నావు, నీకేదైనా గ్రహము అవరించినదా ? అని సందేహము కల్గుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు, నేను నీకు అన్ననగుదును నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలోనున్నావు నీ వెంతటి అందగత్తె
వయినను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు, అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి, గాన నీ ప్రయత్నమును మానుకోనుము. నీకు కష్టములెదురౌను. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మన మిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు వున్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను, ఏ యే జన్మలెత్తినను మనలను వెంటాడుచునే వుండును, ఆ నరక బాధలనుండి - మన మెన్నటికిని విముక్తి నొందజాలము కాన నీకోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాల ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటుల గరువర్యులకు తెలిసినచొ నిన్ను దండింతురు గాన రమ్ము. ఫలములు, కుశలు పుష్పము మొదలగు పూజాద్రవ్యములను దోడ్కొని పోవుదము" అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు.

అంత నా కన్యయు, బంగారము, రత్నము, విద్య, అమృతము, తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడుగని వివేకవంతుడుగాడు. నానిండు యవ్వనాన్ని, నా'శరీరాన్ని సమస్తమును నీ కర్పింతునన్న నిరాకరించుచున్నావుగదా! సరే నేనిక వంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగ మొనర్చుకొందును. నీవలన ఒక కన్య చనిపోయినదని నలువురూ నిన్ను ఆడిపోసుకొందురు. నన్నొంటరిగా యీ కారడవిలో వదలి ఇల్లుచేరినయెడల నా దండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదియని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయెనని చెప్పియే యుందురు, గాన నేను కామ బాధ భరించ లేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీదానను చేసికొనుము” అని పలికెను.

సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకటస్థితిలో పడెను. కొంత తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణకన్యతో రతీ క్రీడల దేలుటకే నిశ్చయించుకొనెను.

"శాంకరీ! ఈ విధముగా వారిరువురునూ ఆతటాక సమీప మందొక ప్రదేశమును శుభ్రముచేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు విదజల్లు పుష్పములు బరచి ప్రకృతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృస్న దీర్చుకొని, మరికొంత సేపు బంతులడి గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి. వారి కామ వికారములనుచూచి, పక్షులు సిగ్గుపడి అచ్చోటినుండి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములుముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులో కలువలు మెడవంచినట్లు నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలుగూడ సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవుండి సమిత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖముపట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి, తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించెను. అడవికిపోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెనుజూచి “సుశీలా! నీవు ఉద్యానవనములోని చెలులతో బంతులాటలాడి చాల అలసిపోయివున్నావు, పాపము! ఎందుకు నీ
సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయివున్నదోకదా! రమ్ము ఈ మధుర వదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుటవలన నీవు ధరించిన - ఉడుపులుకూడ నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమియు ఎరగనిదానివలె నటించెను. మరి కొంత కాలమునకు సుశీలను హీమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడు డోకడు పెండ్లియాడి అత్తవారింటనే నుండిపోయెను.

మరికొంత కాలమునకు సుశీలను "పెండ్లి యాడీన బ్రాహ్మాణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల యేడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెనుకదా! అని గొల్లుమని ఆడదానివలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసారసుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రిదీని కాలమెట్లుతీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకరమని భావింతురే? ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరుకదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!” అని పరి పరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్లి సుబుద్ధితో “ఆర్యా ! మిరు దుఃఖించుటకు కారణమేమి ? త్వరగా చెప్పుడు" అని పలికెను.

అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో స్వామి! మా దుఃఖముగురించి ఏమని చెప్పుకొందును, మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనామ్ కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవారు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు, మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమె కీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు" అని వేడుకొనెను.

సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టి చే అంతా గ్రహించి, "విప్రవర్యా! నీ కుమారై వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంవర్కము కలిగివుండి, తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను, ఆ రక్తపాతము భయానకదృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడ ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది, అటువంటి ఘోరాహత్య చేసి, ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషమువల్లనే నీ అల్లుకు చనిపోయాడు, ఆమెకు చుట్టుకున్న పాతకమువలననే విధవరాలై నది, అంతటి పాపాత్మురాలు అయినప్పటికి పుణ్యాత్ములగు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తంతాము గూడా వివరించెదను వినుము.

చాల సంవత్సరాల క్రిందట అనగా నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసములో
సూర్యభగవానుడు మకరరాశియందుండగా, కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ
తీరమునకు బోయి, స్నానముచేసి ఇసుకతో గౌరీ దేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ దేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమెకూడా పాల్గొనుటవలన ఆ వచ్చిన పుణ్యఫలం చేత నే నీ వంశములో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహాస్యంగా అడవికిపోయి తన కామవాంచ కొఱకు, అతనితో రమించినది. అందువలననే యా వైధవ్యం కలిగినది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో పాపకర్మవలననే కుమార్తెకు అకాల వైధవ్యము కలిగినది.ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది! కానున్నది కాక మానదు, మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా ! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు
సుబుద్ధి “హారివారీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసివచ్చినది. పూర్వజన్మలో యి నా కుమార్తె తన భర్తను హత్యచేసి తానూ అత్మహత్య చేసుకొన్నది? సరే ఈ జన్మలో కూడా కన్యగావుండి నాకు
కుమారునితో సమానుడు, తనకు సోదరుడులాంటివాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటిఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామి ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరొకవైపు ప్రేమ కలుగుచున్నవి, గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.

సుబుద్దీ! నీ కుమార్తె గురించి నీ వడగకపోయిననూ తన్నివారణోపాయము వివరించవలయుననియే నేను యిలా వచ్చినను. ఈ మాఘమాసంలో నీ కుమార్తేచేత నదిలోగాని, చెరువులోగాని సూర్యోదయం కాగానే స్నానముచేయించి, అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యము లిచ్చి పూజలు చేయించుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తెచేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలిగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.

మాఘశుద్ధ విదియనాడు ముత్తైదువుల పాదములకు పసుపురాసి నుదుటబొట్టుపెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్తచేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికలగుడ్డ పసుపు కుంకుమ, పండ్లు, తమల పాకులు, వక్కలు దక్షిణ పెట్టి దాన్నిపై రెండవ చేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగాభోజనము పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధముగా చేసినయెడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ యగును.

కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానము చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయిననువారిని ప్రోత్సాహవరచి, వారుకూడా నిష్టతో మాఘమాసస్నానములు చేయవలయును. వంశాభివృద్ధికిగాని. కుటుంబ గౌరవానికిగాని, స్త్రీయే ప్రథాన కారకురాలు కనుక ఈ మాఘమాసస్నానము తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాస మంతయు పురాణములు చదివి హరికధలుగాని హరినామ కీర్తనలుగాని ఆలకించుచు, దాన ధర్మములు చేసినయెడల దానికన్న ఫలితముమరొక ఏవ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాసస్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేనివారలచే మాఘస్నానములు విడువక చేయించినియెడల వారిపిచ్చి కుదురును. కుష్టువ్యాధితో భాధపడువారు మాఘస్నానములుచేసిన వారికి రోగనివృత్రియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు.స్త్రీగాని , పురుషుడుగాని మాఘమాస స్నానములు డాంబికములతో నాలుగురుచూచి పొగుడుతున్నట్టుగా గాక చిత్తశుద్ధితో స్నానములుచేసి విష్ణు దర్శనము. సూర్య నమస్కారములు, పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు అటుల చేసిన "చిత్తశుద్ధిలేని శివపూజలేలయా” అనురీతిగా నిష్ప్రయోజనము లగును. అని సుబుద్ధికి బిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.

ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ది తనకుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కాంచినవానివలె లేచి జరిగిన వృతాంత్తమును విని తానుకూడ తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.

No comments:

Post a Comment