Friday, January 2, 2026

Sokamuleni Somavaramu Katha - శోకములేని సోమవారము కథ

శోకములేని సోమవారము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు, నొక కుమార్తెయు కలరు. అతడా కుమార్తెకు వివాహము చేయగా ఆమె మగడు దేశాంతరము వెళ్ళెను. అందుకా చిన్నది మిక్కిలి దుఃఖించుచుండెను. అట్లేడువగా ఏడువగా ఆయుసురు తగిలి ఆ బ్రాహ్మణునకు దరిద్రము వచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడొక చెరువు తవ్వించినాడు. కాని అందులో గంగపడలేదు. అందుకా బ్రాహ్మణుడు మిక్కిలి విచారించుచు భార్యతోగూడి తపస్సు చేయగా పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై ఎందుకు తపస్సు చేయుచున్నారని యడిగిరి. అప్పుడా బ్రాహ్మణుడు నాకొక్క కుమార్తెయున్నది. అది అస్తమానము యెడ్చుచుండును. దాని యుసురుతగిలి మాకు దరిద్రము సంటప్రాప్తమైనది. అందుచే చెరువు త్రవ్వించినాము. అందులో నీళ్ళుపడినవికావు.  అందుచేత తపస్సు చేయు చున్నామని జెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ పెద్దకొడుకును తీసుకొనివచ్చి ఈ తూమున కడ్డముగా వేసినట్లయితే యిందులో నీళ్ళు పడునని జెప్పిరి. బ్రాహ్మణుడు అందుకు వప్పుకొని పెద్దకొడుకును తీసుకొనివచ్చి తూమున కడ్డము వేయగా, వెంటనే గంగపడెను. తరువాత పార్వతీ పరమేశ్వరులు నీకూతురు క్రిందటి జన్మమున శోకములేని సోమవారము నోముపట్టి ఉల్లంఘనము చేసినది. ఆకారణముచేత నీయేడుపు వచ్చినది. ఇప్పుడు తిరుగ నోము పట్టించి కధ చెప్పి అక్షితలు వేసి ఏడాది సోమవారము ఒంటిపూట భోజనము పెట్టి ఎడాది అయిన తరువాత ఉద్యాపన చేయించవలసినదని చెప్పి అదృశ్యమైనది. ఆ బ్రాహ్మణుడు కూతురు నా ప్రకారము నోపించి ఉద్యాపన చేయించగా ఆమె మానెను. సంపద గలిగెను.

ఉద్యాపనము :- మానెడు సోలడు(1-1/4 Kg) బీయ్యము పులగము వండి అడుగు అట్టు పై అట్టు తీసి రవికెలగుడ్డ వాసెనకట్టి దక్షిణ తాంబూలము బెట్టి ముత్తయిదువకు వాయన మియ్యవలయును.

No comments:

Post a Comment