బ్రాహ్మణ కన్యల విమోచనము
కొంత కాలం క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తె లుండిరి వారు నిండుయవ్వనవతులై ఉండిరి.
కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానంచేయట కొక గురుకులవిద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందంచూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయగా. ఆ బ్రాహ్మణవిద్యార్దికి విద్యపూర్తి కానందున వారికోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు "నీవు పిశాచివి కమ్మని" శపించగా ఆ విద్యార్థియూ "మీరుకూడ పిశాచులగుదురుగాక" యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలువద్దనే వుంది అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి.
కొంతకాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకురాగా నాపిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచరూపం లెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు "వీరందరిచేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగిపోవును" అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నాలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.
No comments:
Post a Comment