Tuesday, February 3, 2026

Magha Puranam 23 - మాఘ పురాణం 23 బ్రాహ్మణ కన్యల విమోచనము

మాఘ పురాణం - 23 వ అధ్యాయం

బ్రాహ్మణ కన్యల విమోచనము


కొంత కాలం క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తె లుండిరి వారు నిండుయవ్వనవతులై ఉండిరి.

కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానంచేయట కొక గురుకులవిద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందంచూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయగా. ఆ బ్రాహ్మణవిద్యార్దికి విద్యపూర్తి కానందున వారికోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు "నీవు పిశాచివి కమ్మని" శపించగా ఆ విద్యార్థియూ "మీరుకూడ పిశాచులగుదురుగాక" యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలువద్దనే వుంది అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకురాగా నాపిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచరూపం లెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు "వీరందరిచేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగిపోవును" అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నాలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...