Friday, April 24, 2026

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ

ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధానముగ నవధరింపుము. 

శ్రీ దేవి దిక్కాలముల కతీతయైనది. ఆమెయందేచిత్తము నిలుకడ జెందవలయును. ఇట్లుచిత్తము నిల్పి దేవీ తన్మయుడైనవాడు జీవబ్రహ్మైక మొందును. ఒకవేళ మనస్సు రజోదోషమున మలినమైనచో యోగము వెంటనే సిద్ధింపదు. అపుడవయవయోగమున యోగి యోగమభ్యసింపవలయును. 

అనగ నామధుర మధురమైన పాదములు -చేతులుమున్నగువానియందు చిత్తము నిల్పవలయును. అటు లొక్కొక్కచోటు జయించుచు చిత్తశుద్దియైన వెంటనేచిత్తమును దేవీ రూపమందంతట నిలిపి ధ్యానింపవలయును. 

ఓయి పర్వతరాజా! జ్ఞానస్వరూపిణి నగు నా యందుచిత్తము లయమందువఱకు సాధకుడు తన కిష్టమైన మంత్రమో జపమో హోమమో చేయుచుండవలయును. ఇట్టి మంత్రాభ్యాసయోగమునను బ్రహ్మజ్ఞానముగల్గును. యోగము లేక మంత్రమును మంత్రము లేక యోగమును సిద్ధంపవు. ఈ రెంటి నభ్యసించిన మంత్రయోగి బ్రహ్మతాదాత్మ్య మందవచ్చును. 

ఇంటిలో పెంజీకటి తెరల మాటునగల కుండ దీపము వెల్గున కనబడును. అటులే మాయాంథతమములో జిక్కిన జీవాత్మ మంత్రయోగముల వెలుగు వెల్లువలలో కనిపించును. ఇటుల నీకు యోగవిధానమంతయును సాంగముగ వివపించితిని. ఇదంతయును సద్గురూపదేశమున తెలియవలసినదేకాని యెన్ని కోటుల శాస్త్రములను చూచిన నేమియు లాభములేదు.

శ్రీదేవి యిట్లనెను : ఓ గిరిరాజా! ఈ విధముగ బ్రహ్మస్వరూపిణి నగు నన్ను యోగయుక్తుడు సహజ భక్తితో నాసనమున గూర్చుండి సతతమను ధ్యానింపవలయును. బ్రహ్మము స్వయంప్రకాశము. సర్వవ్యాపకము. ఐనను హృదయ గుహ యందు వెలుగొందును. ఇది యోగ సాధ్యము. దీని యందాకాశాదులు ఎల్ల ప్రాణులు కాలములు నాధారపడియుండును. 

ఓ సురలారా ! బ్రహ్మమునిట్లెరుంగుడు. ఇది మాయా జగముల కంటె వరేణ్యమయినది. బుద్దులకందనిది. అణువు కంటె అణీయము. ఎల్ల లోకములు లోకులు దీనియందు ప్రతిష్టింపబడియున్నారు. ఓ సౌమ్యుడా! ఓంకారము అక్షరము- బ్రహ్మము. అది ప్రాణ-వాక్‌-మనో రూపములు దాల్చును. 

కనుక బ్రహ్మమందు మనస్సు లగ్న మొనర్చి యెఱుంగవలయును. ఉపనిషత్తను ధనువు నందు ధ్యాన మనెడు బాణమెక్కుపెట్టి నిశ్చల చిత్తముతో నక్షరమును లక్ష్యముచేసి ఏయవలయును. ప్రణవము - దనువు; హృదయము-బాణము; బ్రహ్మము లక్ష్యము; బాణము లక్ష్యమును భేదించునటుల నరుడు నప్రమత్తముగ భాగవత హృదయముతో బ్రహ్మమును గురిచూచి వేధించి బ్రహ్మ మయుడు గావలయును. బ్రహ్మమందు భూమి-అంతరిక్షము -ఆకాశము-ప్రాణములు - మనస్సు నిల్చియుండును. ఇదిసంసార సాగరమునకు సేతువు. 

కనుక వట్టి మాటలుకట్టిపెట్టి యాత్మనొక్క దని నెఱుంగుము. రథపు నాభి యందు చక్రమాకులు చేరియుండును. అటులే హృదయ మందు నాడులన్నియును చేరియుండును. పెక్కురూపులుగల బుద్ది వృత్తికి సాక్షియగు బ్రహ్మము హృదయమందే వెలుగొందుచుండును. 

అమరులారా ! మీకు మేలగుత ! సంసారపు గ్రుడ్డిపెంజీకటి తెరల కవ్వలి వెలుంగు వెల్లువ యగు నాత్మ నాత్మ విచారముతో ధ్యానింపుడు. ఆత్మ దివ్యమును -బ్రహ్మపురమునుగు హృదయాకాశమున వెల్గుచుండును. అత్మ మనోమయము: ప్రాణశరీరములకధినేత-అన్న మునప్రతిష్టితము- హృదయాంతరవర్తి-ఆనంద స్వరూపము- అమృత రసనిధి; ధీరులగు వారుఅనుభవ పూర్వక మగు ఆత్మ విచారముతో దీనిని దర్శింతురు.

ఇట్టి పరమాత్మ సాక్షాత్కారము గల్గిన వాని జన్మ జన్మముల హృదయ మందలి పెడముళ్లు తెగతెంపులగును. సంశయము లన్నియు పటాపంచలగును. కర్మబీజము లన్నియును నశించును. 

బ్రహ్మ విద్య

air retention - వాయు ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వాయు ధారణ

హిమగిరీంద్రా తొలుత పూరకముతో నాధరచక్రమున మనస్సు నిలుపవలయును. పిదప గుడి మేఢ్రముల నడుమగల కుండలినీ శక్తి నచటి వాయువుతో సంకోచించి మేలుకొలుపవలయును. అటుపిమ్మట క్రమముగమెల్లగ నెల్లచక్రములు భేదించి సహస్రారచక్రము జేరి యందు గల పరమశివునితోపరాశక్తి నేకమొనరించి వారిని ధ్యానింపవలయును. అచటనుండి లక్కరసమువలె నమృతము వెడలుచుండును. దానితోయోగసిద్ది గల్గించుమాయాశక్తిని తనుప వలయును.

స్థితప్రజ్ఞుడైనవా డమృతధారతో షట్చక్రములందున్న దేవతలను తనిపి పిదప నా యమృతధారను మూలాధారమునకు తేవలయును. ఈ విధముగ నిత్యము యోగాభ్యాసముచేయు యోగిదోషము లన్నియును తొలిగిపోవును. ఎల్లమంత్రము లతనికి కరతలామలకము లగును. వేరు విధముగ లభించవు. 

ఇట్టి యోగి జరామరణ దుఃఖముల కాటపట్టగు సంసారబంధములనుండి విడివడును. జగన్మాతనగు నాలోనెన్నియో సుగుణవిధులు గలవు. అట్టి సుగుణములన్నియును సాధకునిలో తప్పక వెలయుచుండును.

మంత్ర ధారణ

Mantra Yoga Teachings - మంత్రయోగ ప్రబోధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్రయోగ ప్రబోధం

ఓ గిరి నాయకా! ఈ పంచ భూతాత్మకమైన శరీరము విశ్వము. ఇది చంద్ర సూర్యాగ్నులతో గూడి జీవ బ్రహ్మల యైక్యమును దెలుపును. ఇట్టి శరీరమున మూడున్నర కోట్ల నాడులు గలవు. వీనిలో పదిముఖ్యమైనవి. ఆ పదింటిలోను మూడు ముఖ్యతరములు. ఈ మూటిలో ముఖ్యతమమైనది చంద్రసూర్యాగ్ని రూపమైన మేరు దండము. 

ఇడానాడి యెడమ వైపుండును. ఇది తెల్లని చంద్రరూపమున నుండును ఇది యమృత శక్తిరూపమైనది.కుడి వైపున పురుష రూపమున సూర్యరూపముగల పింగళా నాడి యుండును. ఇక సర్వ తేజో రాశియై వహ్ని రూపమున సుషుమ్నా నాడి వెలుగొందును. దాని మధ్యవిచిత్రమను నాడి గలదు. దాని యందిచ్చా జ్ఞాన క్రియాత్మకమైన లింగము గలదు. ఇదిస్వయంభూలింగము. కోటి సూర్య సమానమైన ప్రకాశముగలది. 

దానకిపైని హరాత్మకము బిందు నాదాత్మకము మాయా బీజమునైన హ్రీంకారము విలసిల్లుచుండును. దానకిపైకి దీపశిఖ వలె నెఱ్ఱగ దేవీ రూపిణి యగు కుండలినీ శక్తి విరాజిల్లుచుండును. 

గిరీశా ! ఆ శక్తియు నేను నొకటియే. దానికి బైట బంగారు వన్నెగలు నాల్గు దళముల పద్మము గలదు. దానిలోనున్న వ-శ-ష-స-యక్షరములను సాధకుడు ధ్యానించవలయును. దానకిపై నగ్ని వలె వెల్గుచు వజ్రకాంతలీను నారు దళముల పద్మమలరును. బ-భ-మ-య-ర ల అను అక్షరములం దొప్పును. 

అట్టి స్వాధిష్ఠానమును ధ్యానింపవలయును. ఈ షట్కోణమునకు మూలమైనది మూలాధారమనబడును. ఇక స్వయను శబ్దముతో నధిష్ఠానమైనది స్వాధిష్ఠాన మన బరగును. దానకిపైకి నాభీ స్థాన మందు మణిపూరము గలదు. అది మేఘ ముల మెఱగు తీగల కాంతుల పగిది తేజోమయమై ప్రభలు విరజిమ్ముచుండును.

మణుల కాంతులను బోలియుండుటచే దీనిని మణిపూరపద్మ మనియందురు. ఈ పద్మము నందు డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ యను పది యక్షరములుండును. ఇదు శ్రీ మహావిష్ణు వధిష్ఠించియుంట దీని ధ్యానమున శ్రీ విష్ణుసాక్షాత్కారము గల్గును. 

దీనికి పైకి బాలసూర్యప్రకాశమునకు సరివచ్చు ప్రభగల్గు '' ననాహత పద్మము'' తనర్చును. ఇది క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ యను పండ్రెండు వర్ణములు గలది. సూర్యకోటుల ప్రభలతో తుల తూగునది. దీనిమధ్య బాణలింగము గలదు. ఇందుతాకిడి లేనప్పటికిని చప్పు డుప్పతిల్లును. 

కనుక దీనిని''అనాహత'' మనియు ''శబ్దబ్రహ్మమయ''మనియు శబ్దబ్రహ్మనిష్ణాతులు పేర్కొందురు. ఇది పరమానందనిలయము. ఇందు రుద్రుడు విరాజిల్లును. దీనిమీద పదారుదళముల విశుద్దకమల మొప్పారుచుండును. ఇందు అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ఋ- - - ఏ-ఐ- ఓ-ఔ-అం- అః యను పదునారు వర్ణము లుండును. ఇందుగల ధూమ్రవర్ణము మహాప్రభలు వెలార్చును. ఇచట జీవుడాత్మదర్శనము చేయుటవలన శుధ్ది జెందును. కనుక దీనిని విశుద్దిపద్మమందురు. దీని నాకాశమనియు పల్కుదురు. 

దీనికి మీద నాజ్ఞాచక్ర మలరారును. ఇది ఆత్మ కధిష్ఠానమైనది. ఇచట పరమేశు నాజ్ఞ జీవునకు లభించును. కనుక దీని నాజ్ఞ చక్రమందురు. ఈ పద్మమందుహ-క్ష యను రెండక్షరములుగల దళములు శోభిల్లును. దానికిపైని కైలాసపద్మమును దానిపైని రోధినీపద్మమును చెన్నొందును. వీనిని చక్రములనియునందురు. 

సువ్రతా! ఇట్లు నీకాధారాది చక్రములు వివరించితిని. దీనికి పైగ సహస్రారమను చక్రరాజము దీపిల్లును. ఇదే బిందుస్థానము. శ్రీపరమాత్మ సన్నిధానము. ఇట్లు నీకు దివ్యయోగమార్గమంతయు వివరించితిని. 

Jaganmatha Yoga Teachings - జగన్మాత యోగబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాతయోగబోధ

ఈ విధముగ శ్రుతి మతి గలిగిన వాడాత్మ విచారముతో స్వాత్మను నిశ్చయించుకొని పరబ్రహ్మస్వరూపిణి నగు నన్ను ధ్యానమున భావింపవలయును. ధ్యానయోగము చక్కగ కుదురుటకు నా యక్షరత్రయమును మొదట చక్కగ భావించవలయును. 

అది దేవీ ప్రణవస్వరూపమైనది మాయామంత్రబీజము-మంత్రరాజము. అక్షరత్రయములో హాకారము స్థూలదేహము రేఫము సూక్ష్మదేహము; ఈ కారము కారణదేహము. హ్రీంకారము-తురీయాత్మ-నేనే. ఇదే విధముగ సమష్టి దేహమందు నీ బీజత్రయము క్రమముగ నున్నదని యెఱిగి పిదప సమష్టివ్యష్ట్యాత్మల యేకత్వమును సాధకుడు సాధింపవలయును. 

ఈ విధముగా సమాధికి ముందు చక్కగా నాత్మవిచార మొనరించి పిదప కన్నులు మూసికొని జగదీశ్వరి-ఆదిపరాశక్తి-నగు నన్నే ధ్యానింపవలయును. నాసికయందు తిరుగాడు ప్రాణపానములను సమముగ జేసి విషకామములు విడనాడి మచ్చ రము -దోషము-వదలవలయును. 

సాధకుడొంటిగ నైకాంతిక పరాభక్తితో హృదయకుహరమునందు చిత్తము నిల్పి స్థూలాత్మయగు హకారమును సూక్ష్మాత్మయగు రేఫమును లయమొనరింపవలయును. పిదప సూక్ష్మాత్మయగు రేఫమును కారణాత్మయగు ''ఈ'' కారమందున లయ మొనర్పవలయును. తర్వాత కారణాత్మయగు ''ఈ ''కారమును సర్వాత్మకమైన హ్రీంకారమున లయ మొనర్పవలయును. పిమ్మట చిదగ్నిశిఖలో వాచ్యవాచకత్వములును ద్వైతములును లేనట్టి పరబ్రహ్మ రసమయమగు నఖండ సచ్చిదానందమును ధ్యానింపవలయును. 

రాజా!ఇట్లు జీవుడు విమల ధ్యానమువలన నా సాక్షాత్కారమొంది నా సారూప్యము జెందవలయును. ఏలన నట్టి స్థితిలో నేను-జీవుడు నొకటియే. నరు డిట్టి ధ్యానయోగమువలన పరాత్పరతమగు నన్ను గాంచును. వెనువెంటనే వాని తొంటి యజ్ఞానకర్మములు రెండును నశించును.

హిమాలయు డిట్లనెను: ఓ మహేశానీ ! యోగముసును గుఱించి సాంగముగ నాకు వివరింపుము. ఏ యోగమున బ్రహ్మజ్ఞానము గల్గునో దాని నాచరించి తత్త్వదర్శనమునకు పాత్రుడ నగుదును. 

శ్రీదేవి యిట్లనెను : యోగ మనునది భూమ్యాకాశరసాతములం దెచటనైన నుండునది కాదు. జీవ-పరాత్మల యైక్యమే యోగమని యోగవిదులందులు. ఓ యనఘాత్మా! కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యములను నారును యోగమునకు విఘ్నముగల్గించుచుండును.యోగులు యోగాంగముల సాయమున కామాదిశత్రువులను గెలచియోగమాచరించవలయును.యమము-నియమము-ఆసనము-ప్రాణా యామము.ప్రత్యాహారము-ధ్యానము-సమాధియునునవి యష్టాంగములు. 

యోగసాధనముకు యోగులీ యెనిమిదిటి ననుష్ఠింపవలయును. అందుమొదటిదగు యమము సత్యము-అహింస-బ్రహ్మచర్యము-అస్తేయము-దానము-ఋజత-దయ-క్షమ-ధృతి-మితాహారము-శౌచమను పది తెఱంగుల నోప్పుచుండును. తపము-సంతోషము-దానము-ఆస్తికత-దేవపూజనము-వేదాంతశ్రవణము-లజ్జ-మతి-జపహోమములు అను పదియును గలసి నియమగునని నాచేత చెప్పబడెను.

ఓ గిరీంద్రా! రెండుతొడలపై నుంచుకొనవలయును. పిదప వీపు మీదుగ చేతులు త్రిప్పి పాదముల బొటనవ్రేళ్లు పట్టుకొనుటే పద్మాసనము. ఇది యోగుల కత్యంతము ప్రియమైనది. తొడల-పిక్కల-మధ్యపాదతలము లుంచి సరళముగ కూర్చుండుట స్వస్తి కాసనమనబడును. 

వృషణముల క్రింద రెండువైపుల రెండు కాలిమడమలనుచేతిలో గట్టిగ నదిమి పట్టియుంచవలయును. అదియే భద్రాసనమనబడును. దీనిని యోగులెక్కువగ నాదరింతురు. రెండు తొడలపై రెండు పాదములుంచి పిక్కల క్రింద చేతల వ్రేళు లుంచవలయును. ఇట్లు కూర్చోనుట వజ్రసన మగును. 

ఆయా తొడలక్రింద నాయాపాదములుంచవలయును. పిదప శరీరమును నిట్టనిలువుగనుంచి కూరుచుండుట వీరాసన మగును. ఇడా(ఎడమ ముక్కు) ద్వారమున బైటి వాయువును పదునారుసార్లు ప్రణవము జపించుచు పీల్చవలయును. 

దాని నురువదినాల్గు సారులు ప్రణవ ముచ్చరించు నంతవఱకు లోన పూరించి యుంచ వలయును.అపుడది సుషుమ్న మధ్యకు చేరును. దానిని ముప్పదిరెండు మార్లు ప్రణవ ముచ్చరింగదగినంత సమయమున పింగళ(కుడిముక్కు) నుండి రేచింపవలయును. 

ఇటు లొక్కసారి చేసిన దానిని ప్రాణాయమమని యోగవిదులందురు. ఈ ప్రకారముగ ప్రణవోచ్చారణము క్రమముగ పండ్రెండు లేకపదునారు సారులకు పెంచుచు బైటి వాయువును పెలుమార్లు - పూరక-కుంభక-రేచకము లోనరించుచుండవలయును. 

ఈప్రాణాయామము జప-ధ్యానములతో గూడిన సగర్బమనియు నవి లేనిచో విగర్బప్రాణాయామమనియుబుధు లెఱుంగుదురు. ఇట్లు క్రమముగ నభ్యసించువాని దేహమున చెమట పుట్టిన నధమ మనియు వణకు పుట్టిన మధ్యమ మనియు మేనుపైకి లేచిననుత్తమ మనియు ప్రాణాయామము మత్తెఱగుల నుండును. 

సాధకు డుత్తమ ప్రాణాయామము సిద్దించువఱకు దీని నభ్యసింపవలయును. ఇంద్రియములు విషయములందు నిరాటంకముగ స్వేచ్చగ తిరుగాడుచుండును. వానిని బల్మితో లాగి నిలుపుట ప్రత్యాహార మనబడును.

అంగుష్ఠము -గుల్పము-పిక్కలు-తొడలు మూలాధారములు -లింగము-నాభి హృదయము -మెడ- కంఠము -లంబిక- ముక్కు - భ్రూమధ్యము-తల మూర్థము ద్వాదశాంతమనునవి స్థానములు. వీనియందు ప్రాణవాయువును నిల్పుడే ధారణ మనబడును. నిశ్చల మనస్సును చైతన్యాత్మలో నిలువ వలయును. 
పిదప తనయిష్ఠదేవతను ధ్యానించుటే ధ్యానమనబడును. నిత్యము జీవ-పరమాత్మల సమైక్యము భావింపవలయును.

అదియే సమాధి యని మునులందరు. ఇట్లు నీ కష్టాంగ యోగమును గూర్చివివరించితిని. ఇపుడింక శ్రేష్ఠమైన మంత్ర యోగమును వక్కాణింతును. వినుము. 

మంత్రయోగ ప్రబోధం

Jaganmata - Philosophy - జగన్మాత - తత్వబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - తత్వబోధ

శ్రీదేవీ యిట్లనెను: మందభాగ్యులగు మీరెక్కడ! ఈ నో లోకాద్బుత దివ్యరూపమెక్కడ! ఐనను మీ మీది వాత్సల్యముతో మీకు నా దివ్యరూపము చూపితిని. ఈ నా దివ్యరూపమును కేవలము నాదయవలన గాక వేదాధ్యయనమున గాని యోగ దానముల వలన గాని యజ్ఞ తపముల వలన గాని చూడ సాధ్యము గాదు. 

ఓ రాజేంద్ర! ఇక ప్రస్తుతము వినుము. పరమాత్మ తాను పెక్కు విధముల యుపాధులతో గూడి జీవత్వమంది కర్తృత్వము వహించును. జీవుడు నానా యోనుల యందు బుట్టుచు ధర్మా ధర్మాత్మకములైన పెక్కు పనులు చేయుచు సుఖదుఃఖము లనుభవించుచు నుండును. 

అట్లు పూర్వ వాసనల వలన నానా కర్మరతుడై పెక్కు విధముల జన్మములు దాల్చచు సుఖదుఃఖము లనుభవించు చుండును. జీవుడు నీటి యంత్రము వలె (ఎద్దులు గాని ఒంటె గాని గుండ్రముగా తిరుగుటచే బావిలో చక్రాకారమున తిరుగు నీటి బొక్కెనల మాల నీటితో పైకి వచ్చును. ఇది ఘటీ యంత్రముగా పూరాణములలో చెప్పబడినది) విశ్రాంతి లేక తిరుగుచుండును. 

అతని కజ్ఞానము కోరికలు కొనలు సాగును. కోర్కులు దీర్చుకొనుట కతడెన్నో పనులు చేయును. ఈ జన్మపరంపరలు తుదముట్టుట కజ్ఞానము తప్పక నశింపవలయును. అజ్ఞానము జ్ఞానము (విద్య) వలన నశించును. పురుషార్థముల కోర్కెలు-తాపములు-తొలగిపోగా జీవన్ముక్తదశ గల్గును. 

అజ్ఞానమున పుట్టిన కర్మ మజ్ఞానమును నశింపజేయజాలదు. కనుక నజ్ఞాన నాశమునకు కర్మమును నమ్ముకొని యుండరాదు. ఈ కర్మములన్నియు ననర్థ దాయకములు. వీని వలన సంతలో రాగము నంతలో ద్వేషాగ్ని పుట్టును. ఇట్టి యనర్థ కర్మములు పల్మారు పుటుచుండెను. ''కుర్వన్నే వేహ కర్మాణి'' యను వేదాను వచనము ప్రకారముగ మంచి కర్మములు చేయుట మంచిధే. కాని మనుజుడెల్లభంగుల జ్ఞానమే పొందవలయును. దివ్యజ్ఞానము వలననే వైకల్యము ప్రాప్తించును. 

సత్కర్మము జ్ఞానమునకు తోడుపడును. మేలు చేకూర్చును. ఈ రెంటికిని విరోధము లేదని కొందఱందరు. అది సరికాదు. ఏలన జ్ఞాన ఖడ్గముననే కర్మములక తావగు హృదయ గ్రంథి ఛేదించబడును.

చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును. 

అటు పిమ్మట కర్మముతో నెట్టి యావశ్యకతయు గల్గదు. చివర కాత్మ వంతుడు సర్వ ధర్మములు పరిత్యజించి నిష్కపటమైన భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. అతడు నిశ్చల నిర్మల చిత్తముతో వేదాంత శ్రవణము నిరంతర మొనరింపవలయును. 

తత్త్వ మస్యది వాక్యముల సత్యార్థమును చింతింపవలయును. తత్త్వ మస్యాది వ్యాక్యార్థము జీవ బ్రహ్మల యేకత్వము దెల్పును. ఈ రెంటి యేకత్వము తెలిసిన నరుడు నిర్బయుడైనా సారూప్యమందగలడు. మొదట పదముల యర్థమెఱింగి పిదప వాక్యములలోని యర్ద మెఱుంగవలయును. 

''తత్‌'' అను పదమున కర్థము భగవతినగు నేనే యని చెప్పబడును. ''త్వం'' అను పదమునకు జీవుడని ముఖ్యార్థము. ఈ రెంటికి ''అసీ'' యను పదము జేర్చి యైక్యము గూర్తురు. వాచ్యార్థములకు విరోధమువలన నైక్యము గుదురనపుడు లక్ష్యార్థములతో వేద నిర్దిష్టములగు ''తత్‌-త్వం'' పదములకు కర్థము చెప్పవలయును. 

జీవ-ఈశ్వరుల ప్రత్యేక ధర్మములు తొలగిపోగరెంటి యైక్య మిట్లెఱుంగుట వలన సద్వయము సిద్దించును. ఆ దేవదత్తు డితడే యన్న వాక్యములో ''ఆ-ఈ'' యను రెంటి ధర్మములు తొలగగ మిగిలిన వాడొక్కడే కధా ! అదే లక్షణ యనబడను. అటులే ఈ స్థూల దేహాది భేదములు తొలగినపుడు నరుడు బ్రహ్మత్వమందును. ఈ స్థూలదేహము పంచీకృత మహాభూతముల నుండి యుత్పన్నయ్యెను. ఇదెల్ల భోగాల కాటపట్టు. జరా వ్యాధులకు కర్మములకు తావలము.

ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును. 

ఓ గిరీశ్వరా!నా యాత్మయొక్క మూడవ యుపాధి కారణాత్మ. అది అనిర్వాచ్యము. అనాది-అజ్ఞానము జరుగును. ఈ మూడుపాధులు తొలగిపోగా కేవలమగు ''ఆత్మ'' మిగిలివెలుగును. పంచకోశము లీ మూడు దేహము లందును సతతము విలసిల్లుచుండును. ఈ పంచకోశములు తొలగిపోగా తుదకు బ్రహ్మనిష్ఠ ప్రాపించును. ఇట్లు ''నేతి-నేతి'' యను వాక్యార్థము వలన నాత్మరూపము వెల్లడియగును. అట్టి ''ఆత్మ'' పుట్టునది -చచ్చునది-పూర్వముండి యిపుడు లేనిదిగాదు: అది నిత్యము-చచ్చునది కాదు. అజము-శాశ్వతము-పురాణము. 

ఈ శరీరాదులు చంపబడుచున్నను నది చంపబడదు. చంపువాడు తాను చంపెననియును చంపబడువాడు నేను చచ్చితి ననియు తలంతురు. కాని వారిర్వురును తెలియనివారే. ఏలన ''ఆత్మ'' చావదు. చంపబడదు. ఆత్మ అణువుకంటెనణువు; మహత్‌ కంటె మహీయము. అయ్యు నది యెల్ల ప్రాణుల హృదయగుహలందు వెలుగును. 

జీవుడు పరమాత్మదయ వలన నాత్మమహిమ మెఱిగివిగత శోకుడు గాగలడు. ఆత్మ-రథికుడు; శరీరము-రథము; బుద్ధి-సారథి; మనస్సు-ఇంద్రియములను మూడును గలిసి భోక్త యనబరగునని పెద్దలందురు. అవివేకి-అమనస్కుడు-అశుచియగు మూర్ఖుడు తత్పద మెఱుగలేక దురిత సంసార సాగరమున మునుకలు వేయుచుండును.

వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడునగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు. 

Thursday, April 23, 2026

Jaganmata - Viradrupa performance - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీదేవి యిట్లనెను: గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆది నాలోకల్పితమైనది. పరమార్దముననది నా కంటె భిన్నము గాదు. వ్యవహార దృష్ఠిలో చూడగమాయ విద్యయనంబరనగును. కాని తత్త్వదృష్టని చూడమాయలేదు. కేవలము తత్త్వ వస్తువే కలదు. 

గీరీశా! చిద్వస్తునగు నేనే పెక్కు మాయా కర్మలంగూడి ఈ జగములు సృజించి ప్రాణ పూర్వకముగ చిదా భాసుడనై యందు ప్రవేశింతును. నా వలననే లోకులకు లోకాంతర గమనములు జరుగును. పెక్కుమాయాభేదముల వలన జీవులుత్పన్నులగుదురు. 

ఒకే మహాకాశము వలన ఘటాకాశములు గల్గునటుల పెక్కుపాధి భేదముల వలన మాయవలన జీవులుత్పన్నులగుదురు. ఒకే రవి మంచి చెడు వస్తుల నెల్ల వెల్గింపజేయును. ఐనను రవికేట్టి దోషమును గలుగదు. అటులనే చిద్వస్తువనగు నాకెట్టి దోషము నంటదు: 

కొందఱు బుద్ద్యాదుల కర్తృత్వముక నా యందారోపింతురు. కొందఱు మూడు లాత్మయే కర్తయని పోరపడుదురు. కాని పండితులైనవారు పోరపడరు అజ్ఞానము వలన మాయ వలన జీవేశ్వరుల భేదము గల్పింపబడినది. ఎట్లనగ మహాకాశము వలన ఘాటాకాశాది భేదములు గల్పింబడును. 

ఇటులే జీవాత్మ- పరమాత్మలకును భేదము గల్పింపబడినది. జీవుల నానాత్వము సహజముగ లేదు. మాయ వలన నున్నట్లు గల్పింపబడెను. అటులే యీశ్వరుల నానాత్వమును మాయ వలన గల్పింబడెను. కాని యది యునుసహజము గాదు. దేహము -మనస్సు-ఇంద్రియాదులు వాసనలు మున్నగు పలు విధముల భేగములు మాయ వలన గల్గుచుండును. పెక్కు జీవేశ్వరుల భేదముల కన్నిటికిన విద్యయే మూల కారణము. మఱేదియును గాదు. 

ఈ త్రిగుణములలో వాసనలలో నెన్నో భేదములు గలవు. మఱి బ్రహ్మాదులలో నీశ్వరులలో నెన్నో భేధములు గలవు. వీనికన్నింటికి నామాయయే మూలకారణము. మఱేదియునుకాదు. వస్త్రమందు దారమువలె నాయందెల్ల జగములు వ్యాపించి యున్నవి. అందు వలననే కారణదేహాభిమాని అగు సూత్రాత్మ స్థూలదేహాభిమానియుగు విరాటు నేనే. మఱి బ్రహ్మ-విష్ణు-రుద్రుడు సూర్యచంద్రులు-తారలు-చండాలుడును-దొంగయు-నేనే. నేనే సకల పశు-పక్షి స్వరూపిణిని.

క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తువులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వ
స్తువులన్నియును నేనే. అవి నేను లేక లేవు. 

ఒక వేళ నేను ఏలకున్నవని యెవడైన ననిచో నావస్తువులు గొడ్రాలిసంతువంటివే. ఒకే త్రాడు పాము-దండ-యను పెక్కు భేధములు నెట్లు దోచునో కేవలము నేనును ఈశ్వరాది బహురూపములనట్లే భాసింతును. అధిష్ఠాన వస్తవులేనిచో కల్పితజగము నిలువజాలదు. 
కావున నాయునికి వలననే యివన్ని యును శక్తిగల వగుచున్నవి కాని మఱి దేనివలనను గాదు. 

హిమాలయు డిట్లనెను: ఓ దేవేశ్వరీ! నీ సమష్టీ దివ్యస్వరూపమును చూడ కుతూహల మగుచున్నది. నీకు నాయెడ దయగలదవిని చూపింపుము తల్లీ! అను హిమగిరీశుని వాక్కులువిన విష్ణ్వాది దేవతలెల్లరు నతవి మాటను గౌరవించి ముదితులై హర్షించిరి. ఆపుడు దేవతల యభిమత మెఱింగి కామములు గురియునట్టి భక్తకామప్రపూరణి శివాదేవి వారికి తన దివ్య విరాట్స్వరూపము చూపెను. 

ఇట్లువారు శ్రీ మహాదేవియొక్క పరాత్పర విరాడ్రూపమును సందర్శించిరి. అపుడు శ్రీదేవియును తల సత్యలోకముగ కన్నులు సూర్యచంద్రులుగ భాసిల్లెను. చెవులు దిక్కులుగపలుకులు వేదములుగ ప్రాణములు వాయువులు హృదయము మహావిశ్వముగ పిఱుదులు భూమిగ తనరెను. 

నాబి సరస్సు నీలాలనింగిగ ఱొమ్ముజ్యోతిశ్చక్రముగ మెడమహర్లోకముగ ముఖము జనలోకముగ నలరెను. నెన్నుదురు సత్యలోకమునకు క్రింది దగు తపోలోకముగ బాహువు లింద్రాదులుగ శ్రవణేంద్రియము శబ్దముగ వెలసెను. నాసికలశ్వి దేవతలుగ ఘ్రాణణేంద్రియము గంధముగ ముఖ మగ్నిగ కనుఱప్పలు రాత్రింబవళ్ళుగనె సంగెను. కన్బోమలు బ్రహ్మస్థానముగ దవుడలు-జలములుగ నాలుక రసముగ కోరలు యముడు వెలసెను.

దంతములు-స్నేహ విలాసములు నవ్వలాట-మాయగకడగంటి చూడ్కులు-సృష్టిగ సిగ్గు-పై పెదనిగ నల రారెను. క్రిందగి పెదవి-లోభమగ వీపు-ధర్మమముగ మేఢ్రము-జగమందలి సృష్టికర్తయగు ప్రజాపతిగ పొట్ట-సాగరములుగ ఎముకలు-గిరులుగనాడులు-నదులుగకేశపాశములు వృక్షములుగనై విలసిల్లెను. 

ఉత్తమగతులు-కౌమార¸యవన జరలుగ కేశములు-మేఘములుగ కట్టుపుట్టములు-సంఘధ్యలుగ విరాజిల్లెను. మనస్సు-చంద్రుడు విజ్ఞానశక్తి-శ్రీహరిగ హృదయము-రుద్రుడుగనై శోభిల్లెను. రాజా! దేవి పిఱుదం దశ్వజాతులన్నియు నడుమునకు క్రింది భాగమున నతలాదిలోకములుండెను. 

ఇట్టి శ్రీదేవి ఇశ్వరూపమును దేవత లెల్లరును కన్నుల కరవుతీర సందర్మించిరి. దేవినుండి వేనవేలు జ్వాలామాలికలు వెలువడుచుండెను. దేవి తన పొడవైన నాలుకతో లోకము లెల్లనాకు నట్లుండెను. దేవి పటపట పండ్లు కొఱకుచు కన్నుల నిప్పుల కణికలు గ్రక్కుచు నానాయుధములు దాల్చి బ్రాహ్మణ క్షత్రియుల నాహారము చేసికొనుచుండెను. 

దేవి సహస్రశిరములు సహస్రనయనములు సహస్రచరణమలు గల్గి సూర్యకోటి ప్రభాభాసమానయై విద్యుత్కోటి సమానప్రభలు చిమ్ముచుండెను. పరాశక్తియొక్క మహాభీషణ ఘోరదారణరూపము చూపఱుల హృదయముయములకు భయంకరముగ నుండెను. అట్టి రూపముగాంచి సురలు మిన్ను ముట్టి హహాకారములు చేసిరి. వారి హృదయనలల్లాడగ తీరని మూర్చ మునిగిరి. 

వారు దేవి జగదంబయను మాటయే మఱచిరి. అటుల స్పృహ కోల్పోయి పడియున్న దేవతలను దేవికి నలు వైపుల నున్న వేగములు మేలు కోల్పి ప్రభోధ మొనరించెను. దేవతలు దివ్యశ్రుతులాలకించి ధైర్య మవలంబించి ప్రేమాశ్రు పూర్ణ నేత్రములతో గళము తొట్రుపాటు జెందుచుండ కన్నీట మాటలు తడబడ దేవి నీ విధముగ సన్నుతింపసాగిరి. ఓ అమ్మా! మాతపుపలు క్షమింపుము. మేము నీ కన్న బిడ్డలము. మమ్ముకాపాడుమమ్మా!

ఓ దేవేశీ ! నీ కోప ముపసంహరించుము. నీ భీకరరూపము గాంచిన మా గుండె లవిసిపోవుచున్నవి. మేము పామరులము దీనులము. త్రిదశులము. నిన్నెంతని సన్నుతింపగలము ! నీ విక్రమ మహాశక్తు లెంతటివో నీకే తెలియదే ! ఇక నీ తర్వాత పుట్టిన మా కెట్లు తెలియును? 

ఓ త్రిభువనేశ్వరీ! నీకు మా ప్రణామములు. ప్రణవాత్మికాః నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధా!హ్రీంకారమూర్తీ! నీకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సకల దేవతలు - సాధ్యులు క్ష మనుజులు-పశువులు -పక్షులు జన్మించెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. 

ఏ జగదంబికనుండి ప్రాణాపానములు - వ్రీహియవలు-సత్యము -శ్రద్ధ-బ్రహ్మచర్యము మున్నగునవి కల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సప్తప్రాణములు -సప్తదీవులు-సప్తసమధలు-సప్తహోమమలు- సప్తలోకవ్లుు గల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణాముములు. ఏ జగదంబికనుండి యెల్ల సాగరములు-నదులు-గిరులు-రసములు-ఓషదులు సంభవించెనో యట్టి సర్వాత్మికకు సర్వాత్మికకు ప్రణామములు. 

ఓ మాతా! నీ పూర్వభాగము-వెనుక భాగము- ఇరుపక్కలు-పైభాగము-నాల్గు దిక్కులు వీనికి మాటిమాటికి ప్రణామములు. ఓ దేవేశీ! నీయీ లోకాతీతమైన విశ్వరూప ముపసంహరింపుము. అందాల కందమైన నీమొదటి రూపమును ప్రదర్శింపుము. 

తల్లీ!ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబిక దయాంతరంగయై తన ఘోరరూపమువదలి శాంతసుందరరూపము చూపెను. అపుడు దేవి పాశ-అంకుశ-వర-అభయ హస్త-సర్వాంగసుందరి-శిరీసఖోమలి-కరుణాపూర్ణనయన-మందస్మితముఖమల. అట్టి దేవిసుందర దివ్యరూపమును దర్శించి భయములు పాసి ప్రశాంతచిత్తలై సంతోషాతిశయమున మాటలాడరాక తుదకు పెక్కు గతుల దేవిని సన్నుతించిరి.

జగన్మాత - తత్వబోధ

The teachings of Goddess Jaganmata - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవి యిట్లనెను: దేవతలారా! సావధానముగ నా పలుకులు వినుడు: వానిని విన్నంత మాత్రాన నా సారూప్యము సిద్దింపగలదు. ఓ పర్వతరాజా! ఈ సృష్టికి పూర్వము నే నొక్కతే నుంటిని. ఇతరము లేదు. అట్టి నన్నే అత్మరూపమని- చిత్తని- బ్రహ్మమని యుందరు. అత్మ యనుమానమునకు సర్వ లక్ష్యములకు ఉపమానములకు జన్మమరణాది వికాములకు నతీతము. 

నా యాత్మ యొక్క సహజ సిద్దశక్తిని మాయ యందురు. ఈ మాయ సత్తుగాదు (ఉన్నది అనుటకు తగదు.) అసత్తుగాదు(ఇది లేకవ్యవహరముసాగదు.) ఈ యుభయముగాదు. ఈ మాయకంటె విలక్షణమైన యొక వస్తువు నిత్యమై వెల్గును. అగ్ని నుండి వేడిమి రవి నుండి కిరణములు జాబిల్లి నుండి వెన్నెలలు వెల్వడు నటులహయ నా యాత్మ స్వరూపమునుండి సహజముగ తప్పక కల్గును: 

గఢసుషుప్తిలో వ్యవహరము లన్నియునడంగును. అటులే మాయలో నెల్లజీవులు- జీవకర్మలు-కాలము సర్వము నొక్కటియై విలయ మొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్ల జీవులు - జీవర్మలు - కాలము సర్వము నొక్కటియై విలయమొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్లలోకములకు కారణరూపిణినైతిని. 

ఇది నన్నే యావరించియుండుటవలన దానిలో నావరణదోషము గలదు. ఈ మాయ చైతన్యముతో గలిసినపు డది జగములకు నిమిత్తకారణ మగును. ఈ ప్రపంచ పరిణామములు మాయసమవాయి ను కారణమగుటచే జరుగును. ఇటి మాయనుతపమని - తమమని జడమని - జ్ఞానమనని-మాయయని- ప్రకృతియని -ప్రధానమని-శక్తియని- అజయని పల్వురు పలువిధమువ పలుకుదురు. 

శైవాగమ వీశారదులు దీనిని విమర్శ మందురు. వేదతత్త్వార్ద చింతకులు దీనిని ఆ విద్య యందురు. ఇట్లు మాయకు నిగమాగమములందు పెక్కు పేర్లు గలవు. మాయ దృశ్యమగుటవలన జడమని జ్ఞానమును నశింపచేయుటవలన అసత్తు. మిధ్య అని యందురు. ఈ కనిపించున దంతయును జడమే శుద్ధచైతన్యము దృశ్యముగదు కనుక జడముగాదు. చైతన్యము స్వయంప్రకాశము. ఇతరముచే ప్రకాశింపచేయబడదు.

చైతన్యమును ప్రకాశిత మనుకొన్న మఱి దానినెవరు ప్రకాశింపజేతురను అనవస్దదోష మేర్పడును. ఒకేకాలముననొకే వస్తువునకు కర్తృత్వము - కర్మత్వము నుండవు. కనుక చైతన్య వస్తువు దీపమువలె స్వయంప్రకాశ వస్తువని తెలియవయును. 

గిరిరాజా ! చైతన్యము స్వయంప్రకాశమై పరులను ప్రకాశింపజేయును. కనుక అజ్ఞాన స్వరూపము నిత్యము సత్యము. జాగ్రత్‌-స్వప్న-సుషువ్తులందు దృశ్యమునుకు వ్యభిచారము (అన్ని కాలములందును లేకపోవుట) గల్గును. కాని దివ్య జ్ఞానమున కెన్నడును వ్యభిచార మనునది (అనగా అన్ని కాలములందు నుండుకుండుట) లేదు. 

ఒకవేళ ఉన్నద్వనుకొన్నను దాని నెఱుగు సాక్షియునువా డొకడు గలడు. జ్ఞానము నిత్యమనియు సాక్షి యెఱుంగుననియు నెల్లరికి విదితమే కదా ! కనుక సచ్ఛాస్త్రవిదులగు కోవిదులు జ్ఞానము నిత్యము. పరమప్రేమ కాలవాల మగుట నది సచ్చిదానందరూపము. అనియు వక్కాణింతురు. 

ఈ యానందము ప్రేమలోనే యుండును. కనుక నేనున్నాననుట కంటె నేను బాగుగ నున్నానని ప్రతివాడుననును. ఇందువలనను మఱియు జగము మిధ్య యగుట వలనను నాకు సంగదోషము లేదు. లోకమందలి యే ధర్మమందై నను జడత్వము- పరిచ్చిన్నత్వము నుండును. జ్ఞాన మాత్మ ధర్మముగాదు. జ్ఞానమాత్మయే. అది యపరిచ్చిన్నము. జ్ఞానము చిత్స్వరూపము. 

అందుచే దానికి జడత్వముండుటగాని యున్నట్లు చూడబడుటగాని జరుగదు. చిత్పదార్దము-చిత్తు-నొకటే కనుక ఆత్మ-జ్ఞానము-ఆనందము-నిత్యము-సత్యము-పరిపూర్ణము-నిస్సంగము-ద్వైతజాలరహితము. అట్టియాత్మతన మాయ వలన తొల్లిటి సంస్కారములవలన కాల-కామ్యకర్మ పిరిపాకమువలన సృష్టికాముడగును. తత్త్వము నెఱుంగనం దున ఆత్మ సృష్టికి పూనుకొనును. 

ఓ నగరాజా! ఇట్టి సృష్టికార్యము కాలకర్మగుణ పరిపాకముననే సంభవించును గాని బుద్దిపూర్వకముగ జరుగు సృష్టిగాదు. నేను నీకు ప్రభోధించిన యీతత్త్వము నా సత్వరూపమే - ఇది లోకోత్తరము. లోకాతీతము. అవ్యాకృతము-అవ్యగ్రము- మాయాశబలము. సర్వకారణ కారణమని సకల శాస్త్రములందును చెప్పబడెను. నా యీ పరతత్త్వము తత్త్వములన్నిటికి మూలకారణము-సచ్చిదానంద విగ్రము.

సర్వ కర్మల ఘనీభావము. ఇచ్చాజ్ఞాన క్రియాశ్రమము. నాతత్త్వము హ్రీంకార మంత్ర వాచ్యము ఆదితత్త్వమని పేర్కొనంబడుము. అట్టి నా మహత్తత్త్వము నుండి శబ్గ తన్మాత్రా రూపమగు ఆకాశ ముత్పన్నమయ్యెను. దాని నుండి స్పర్శతన్మాత్రగల వాయువు దాని నుండి తేజో రూపము గల్గేను. తేజమునుండి రసాత్మకమైన జలమును దాని నుండి గంధ గుణము గల భూమియు గల్గెను. 

ఆకాశమున కోశబ్ద గుణమే కలదు. వాయువునకు శబ్ద స్పర్శములు గలవు. తేజముశబ్దస్పర్శ-రూపములను గుణత్రయము గలదని బుధులందురు. జలమునందు శబ్ద-స్పర్శ-రూప-రసమాత్రలు గలవనీ పండితులందురు. శబ్దము - స్పర్శము- రూపము-రసము- గంధమను గుణ పంచికము గలది భూమి. 

వీనిఅటన్నిటికలయిక వలన మహత్సూత్రము గల్గెను. ఆది సర్వవ్యాపకము. దానినే లింగ దేహమనియు నందురు. ఈ లింగదేహము సర్వప ప్రాణాత్మకము. దీనినాత్మయొక్క సూక్ష్కమదేహమనియు వచింతురు. అవ్యక్తము కారణదేహము దానిని ముందే వచించితిని పరమాత్మ యొక్క రెండవ కారణ దేహము నందు జగద్బీజములుండును. ఆది లింగ దేహములకు కారణభూతము. పిమ్మట పంచీకృతము గాని పంచ భూతముల వలన స్థూల పంచభూతములు గల్గెను. 

ఇట్లు పంచీకరణము వలన పంచభూత సృష్ఠి గల్గిన ప్రకారము చెప్పబడుచున్నది. వెనుక చెప్పిన ప్రతి భూతమును రెండుగ విభజింపవలయును. పిదప ప్రతిభూతము యోక్క రెండవ భాగముతో తక్కిన భూతముల నాల్గవ భాగములు గల్పిన ఒకస్థూల మహిభూతమగును. ఇట్లు పంచీకృతమైన పంచమహాభూతముల కార్యమే విరాడ్దేహము. 

ఇది పరమాత్మ యొక్క మూడవ స్థూల దేహము. ఈ పంచ మహాభూతముల సతాలీంశము వలన శ్రోత్రాది జ్ఞానేంద్రియముల లోని ప్రతి దాని సత్త్వాంశము వలన నాల్గు భేదములు గల యంతఃకరణ మేర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మక వృత్తి గలది మనస్సు ఏ సంశయము లేక నశ్చయ జ్ఞాన వత్తి గలది బుద్ది యనబడును.

చిత్తమను సంధాన పూపమైన వృత్తిగలది. నేనే చేయుచున్నానను నాత్మ వృత్తి - యహంకారమనబడును. తర్వాత పంచ మహ భూతముల రజోంశమున వాగాది కర్మేంద్రియంబు లుత్పన్నమగును. ప్రతికర్మేంద్రియము రజోంశమున ప్రాణాది పంచ వాయువులు గలుగును. ఆ వాయువులతో ప్రాణము హృదయమందును. ఈ పానము గుహ్య మందును వ్యానము నాభి యందును ఉదానము కంఠమందుము సమానము

శరీరమంతటను నుండును. పంచజ్ఞానేంద్రియములు-పంచ కర్మేంద్రియములు-పంచప్రాణములు-మనో బుద్దులు మొత్తము పదనేడగును. ఈ మొత్తమును నా సూక్ష్మ శరీర మనియు లింగ శరీరమనియు నందురు. అందలి ప్రకృతి రెండు విధములుగ నుండును. అందు సత్త్వాత్మకమైన ప్రకృతి మాయగ గుణమయమగు ప్రకృతియవిద్యగపేర్కొనబడును. 

తన్నాశ్రయించిన దానిని రక్షించునది మాయ యమబడును మాయమందలి పరమాత్మప్రతిబింబమనే యీశ్వరుడందురు. ఈ యీశ్వరుడు వ్యాపక బ్రహ్మము నెఱుగగలడు. ఈశ్వ రుడు సర్వజ్ఞుడు- సర్వకర్త- సర్వానుగ్రహకారకుడు. ఓ నగపతీ! ఇక ఆనిద్య యందును పరమాత్మ ప్రతిబింబించును. 

అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమని యందురు. ఈశ్వర జీవులను వీరిర్వురును విద్యవలన మూడేసి దేహములుండును. వీరిర్వురికిని తమతమ మూడు దేహము లందు నభీమానముండుట వలన వీరికి మూడేసి పేర్లు గలవు. జీవుడు కారణ దేహీభి మానియైనపుడు ప్రాజ్ఞుడనియు సూక్ష్మదేహాభిమానియైనపుడు తైజసుడనియు స్థూలదేహభిమానియైనపుడు విశ్వుడనియు నందురు. 

ఇదే విధముగ నీశ్వరుడను పై యాభిమానముల వరుసగ ఈశుడు-సూత్రాత్మ-విరాట్టు ననబరగును. నీరిర్వురిలో జీవుడు వ్యష్టి దేహాభిమాని. ఈశ్వరుడు సమష్ఠి దేహీభమీని. ఈ సర్వేశ్వరుడు కేవలము జీవులనను గ్రహించు కోర్కె గల్గి యుండును. అట్టి తన కోర్కె సాధించుట కీశ్వరుడు జీవుల కొఱకు పెక్కుభోగభాగ్యముల కాటపట్టగు విశ్వమును చిత్ర విచిత్రముగ తల ప్రభావముతో విరచించును. అతడీ సృష్టినంత యును నా శక్తి ప్రేరణచేత నాయుందన్న వాడై రచించుచుండును.

జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధ...