Tuesday, February 28, 2023

Asta Ganpati Temples - అష్టగణపతి క్షేత్రాలు

అష్టగణపతి క్షేత్రాలు

1. మయూరేశ్వర గణపతి - పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న 'మోరగావ్'లో "మయూరేశ్వర గణపతి" ఆలయం ఉంది.

2. చింతామణి గణపతి - పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న 'థేపూర్లో "చింతామణి గణపతి" క్షేత్రం.

3.గిరిజాత్మజ గణపతి - పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న 'లేహ్యాద్రి' అనే స్థలంలో "గిరిజాత్మజ గణపతి" క్షేత్రం వెలిసింది.

4. శ్రీ విఘ్నేశ్వర గణపతి - లేహ్యాద్రి సమీపంలోనే 'ఓఝల్' స్థలంలో 'శ్రీవిఘ్నేశ్వర' క్షేత్రం వెలిసింది.

5. మహోత్కట గణపతి - పునానుండి 32 మైళ్ళ దూరంలో ''రాజన్గావ్''లో "మహోత్కట గణపతి" ఆలయం ఉంది.

6. భల్లాలేశ్వర గణపతి - మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో 'పాలీ' అనేచోట "భల్లాలేశ్వర గణపతి" క్షేత్రం ఉంది.

7. వరదవినాయకుడు - కులాబాజిల్లాలో ''మహర్'' అనే స్థలంలో ''వరదవినాయక'' ఆలయం ఉంది.

8. సిద్ధివినాయకుడు - అహ్మద్ నగర్ జిల్లాలో ''సిద్ధటేక్'' అనే స్థలంలో "సిద్ధివినాయక" క్షేత్రం వెలిసింది.

Monday, February 20, 2023

PALGUNA MASAM - ఫాల్గుణ మాసం ప్రత్యేకత

ఫాల్గుణ మాసం ప్రత్యేకత

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది. అయితే ఫాల్గుణ మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు.

ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.

వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.

ఉసిరి
దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత
చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

దేవునికి ప్రత్యేక పూజలు..
ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతుంటారో వారు ఫాల్గుణ మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదే విధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ లతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.

విష్ణువు ఆరాధన
మీ శక్తి, సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానమిస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి నాడు ఈశ్వరుడిని, శ్రీక్రిష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించి ‘లింగ పురాణా'న్ని దానంగా ఇవ్వాలి. ఫాల్గుణ మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణును ఆరాధిస్తే, కచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందట.

ఫాల్గుణ పూర్ణిమ
ఫాల్గుణ పూర్ణిమ రోజున శ్రీ క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

హోలీ పండుగ
ఫాల్గుణ మాసంలో ఓ రోజున రంగునీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది. మామిడి పువ్వులను కచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి, కలిసి వస్తే ఆరోజున మహాలక్ష్మీని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది.

మామిడి చెట్టు
పురాణాల ప్రకారం.. మామిడి చెట్టు కింద పార్వతీ దేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Sunday, February 19, 2023

Samasya parishkaralu - సమస్యలు-పరిష్కారములు

సమస్యలు-పరిష్కారములు

బాలారిష్ట దోషాలు

బాలారిష్ట దోషాలు తొలగటానికి ప్రతీ మంగళవారం పచ్చిపాలను పదకొండు సార్లు దిగ దుడుస్తూ ఆ పాలను నల్లని కుక్కకు పోయాలి. ఇలా పదకొండు లేక 21 రోజులు పోస్తుంటే బిడ్డకు బాలారిష్ట దోషాలు పోయి ఆరోగ్యం గా ఉంటారు.

ప్రేమ వివాహానికి

ప్రేమ వివాహానికి ప్రేమ వివాహం కావాలంటే జన్మ నక్షత్రం రోజు లక్ష్మీనారాయణ పోటో ఒకటి తీసుకుని ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఆ పోటో ఉంచి ఓం లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఆలా ప్రతీ రోజూ చేయాలి. ప్రతీ గురువారం దేవాలయం లో మాత్రం శనగపిండి తో చేసిన తీపి పదార్థాలు భక్తులకు పంచుతూ ఉండాలి.

మీ ఇంట్లో పక్షులు త్రాగడానికి వీలుగా ఒక తొట్టెలో గానీ ఒక పాత్రలో గానీ నీటిని నింపండి. ఇలా రోజూ చేస్తుంటే కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది.

ఇంట్లో పెంచరాని వృక్షాలను పెంచినా దేవతా వృక్షాలను చెడు తిథి, నక్షత్రాలలో కొట్టేసినా ఆ ఇంట్లో నివశించే వారు మనఃశ్శాంతి కోల్పోతారు.

నిత్యం భోజనం చేసే ముందు మీ పూర్వీకులను స్మరించడం వలన పితృదేవతల ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది.

ప్రతి రోజూ పక్షులకు పెసరు గుళ్ళను కొద్దిగా అన్నం వేయడం వలన విద్యార్థులకు విద్య అబ్బుతుంది. గృహస్తులు ఈ విధంగా చేయడం వలన సంతానంతో సఖ్యత కలుగుతుంది. సంతానం ఉన్నత స్థితి పొందుతారు.

గోధుమ రంగు గోవుకు గరికె లేక నవధాన్యాలు పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

వేయి ఎకరాల భూదానం చేస్తే లభించే ఫలం ఒక్క గోదానం తో సిద్ధిస్తుంది.

గర్భవతులు అయిన స్త్రీలు ప్రతీ రోజూ షష్టీ దేవిని స్మరించడం మంచిది.

ఉపదేశం పొందిన మంత్రాలను ఎప్పుడూ తూర్పు అభిముఖంగా కూర్చుని జపం చేయడం మంచిది.

ప్రతీ అమావాస్య రోజు కాళీ, దుర్గా,భైరవి, చంఢి వంటి ఉగ్రదేవతలను దర్శించుకోవడం వలన ఇతరులు మీకు చాలా సులభంగా వశం అవుతారు.

ప్రతీ రోజూ మీరు నివశించే గృహానికి దగ్గరలో ఏ దేవత దేవాలయం ఉన్నా ఆ దైవాన్ని దర్శించుకోవడం వలన మీకు స్థాన బలం ఏర్పడుతుంది.

108 రోజులు ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత శివునికి అభిషేకం చేయించుకోవడం వలన విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఎటువంటి ఒత్తిడి గానీ సమస్యలు కానీ కలుగవు. కుటుంబ పరమైన, భాగస్వామ్య వ్యాపార సమస్యలు, ఇతరుల వలన వచ్చే ఇబ్బందులు నాశనం అవుతాయి.

లక్ష్మి అనుగ్రహం కావాలంటే బుధవారం, గురువారం లలో అష్ట గణపతులను,అష్ట లక్ష్మీలను కలిపి పూజించడం వలన తొందరగా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

Saturday, February 18, 2023

Shiva kavacham- శివకవచం

శివకవచం

పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః|
పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ స్థధొత్తరే |

ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః |
నైరుత్యాం పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః|| 

ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః|
ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః||

నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే|
మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||

అర్ధము:-

తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…

ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులుఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది.

ఓం..సర్వ రుద్రాయ,

మహా రుద్రాయ, కాల రుద్రాయ,
కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ,

ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ
మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,

బ్రహ్మాండ రుద్రాయ, చంఢ రుద్రాయ,
ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ,

సూర రుద్రాయ, వీర రుద్రాయ,
భవ రుద్రాయ, భీమ రుద్రాయ,

అతల రుద్రాయ, వితల రుద్రాయ,
సుతల రుద్రాయ, మహాతల రుద్రాయ,

రసాతల రుద్రాయ, తలాతల రుద్రాయ,
పాతాళ రుద్రాయ.. నమో నమః

Thursday, February 16, 2023

DHARMA SANDEHALU-ధర్మ సందేహలు

ధర్మ సందేహలు

1. ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు పడుకోరాదు?


భగవంతుడు మన శరీరాన్ని, అందులో వివిధ అవయవాలు ఎలా నిర్మించారు? ఒక్కసారి గమనించండి. ఈ విషయం తెలుసుకోవడం అత్యంత ప్రధానం.

మీ గుండె, మీ శరీరం మధ్యలో ఉండదు. కిందినుండి శరీరానికి మూడు వంతులపైన అది ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, గురుత్వాకర్షణకు వ్యతిరేకదిశలో రక్తాన్ని పంపడం కష్టం, కిందికి పంపడం తేలిక. పైకి వెళ్లే రక్తనాళాలు కిందికి వెళ్లే రక్తనాళాల కంటే సన్నగా ఉంటాయి. అవి మెదడులోకి చేరుకునే సరికి , వెంట్రుక అంత సన్నగా అయిపోయి ఒక్క చుక్క రక్తాన్ని కూడా అధికంగా తీసికొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉండవు. ఒక చుక్క అధికంగా పంపు చేసినా ఏదో ఒకటి పగిలిపోయి మీకు రక్తస్రావం జరుగుతుంది.

చాలామందికి వారి మెదళ్లలో రక్తస్రావం కలుగు తుంటుంది. మిమ్మల్ని అది పెద్దగా దెబ్బతీయక పోయినా చిన్న చిన్న నష్టాలు మాత్రం కలిగిస్తుంది. మీరు కొంత మందబుద్దులుగా అవుతారు, చాలామంది అలానే అవుతున్నారు కూడా! 35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది. మీ వ్యవహారాలు మీరు నడుపు కోగలగడానికి కారణం మీ జ్ఞాపకశక్తే తప్ప, మీ మేధస్సు కాదు.

మీరు ఉత్తరదిశగా తలపెడితే ఏం జరుగుతుంది?

మీకేదయినా రక్త సంబంధమైన సమస్య, ఉదాహరణకు రక్తహీనత ఉంటే మీ డాక్టరు, మీకు ఏమిస్తాడు? ఇనుము. మీ రక్తంలో అదొక ముఖ్యమైన పదార్థం. భూగోళం మీద అయస్కాంత క్షేత్రాల గురించి మీరు వినే ఉంటారు. అనేక విధాలుగా భూమి నిర్మాణం దాని అయస్కాంత కారణంగానే జరిగింది. ఈ భూగోళం మీద అయస్కాంత శక్తుల శక్తి అది.35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది.

మీ శరీరం బల్లపరుపుగా ఉన్నప్పుడు మీ నాడి వేగం తగ్గిపోవడం మీరు గమనించ వచ్చు. మీ శరీరం వెంటనే సర్దుబాటు చేసుకుంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది. లేకపోతే అదే స్థాయిలో రక్తప్రసరణ జరిగినట్లయితే రక్తం మీ మెదడులోకి అధికంగా వెళ్లి హాని చేస్తుంది. మీరు ఉత్తరానికి తలపెట్టి, 5, 6 గంటలు పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు కొంత వయస్సు మళ్ళితే మీ రక్తనాళాలు బలహీనమై రక్తస్రావాలు కలుగుతాయి, పక్షవాతం వస్తుంది. మీ వ్యవస్థ దృఢంగా ఉండి ఇటువంటి సంఘటనలు మీకు జరగక పోవచ్చు కాని మీరు నిద్ర పోతున్నప్పుడు మీ మెదడులో ఉండ వలసిన దాని కంటే ఎక్కువ రక్తప్రసరణ జరిగితే మీరు ఆందోళనతో మేల్కోవలసి వస్తుంది. ఇలా జరిగితే ఒక్కరోజులో మీరు చచ్చిపోతారని కాదు. కాని మీరు రోజూ ఇదేవిధంగా చేస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మీ వ్యవస్థ ఎంత దృఢంగా ఉందన్న దాన్ని బట్టి మీకు వచ్చే సమస్యల స్వభావం ఉంటుంది.

అందువల్ల మీరు ఏవైపు తలపెట్టి నిద్రించడం అన్నిటి కంటే మంచిది?

తూర్పు అన్నిటికంటే మంచిది. ఈశాన్యం పరవాలేదు, పడమర కూడా మంచిదే. తప్పనిసరి అయితే దక్షిణం. ఉత్తరం మాత్రం ఉండకూడదు. మనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్నప్పుడు మీరు ఉత్తరానికి తప్ప మరేవైపైనా తలపెట్టుకొని నిద్రపోవచ్చు. దక్షిణార్ధ గోళంలో ఉన్నప్పుడు దక్షిణానికి మాత్రం తలపెట్ట కూడదు.

2. రావిచెట్టును ఇంట్లో పెంచకూడదా ?
శాస్త్రాల ప్రకారం రావిచెట్టు విష్ణుస్వరూపం. శనిదోషాలు పోగొడుతుంది. అందువల్లే ఆలయాల్లో రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

అయితే రావిని ఇంట్లో పెంచకూడదని పెద్దలు, శనివారం తప్పించి మిగతా రోజుల్లో రావిచెట్టును తాకకూడదని శాస్త్రాలు అనాదిగా చెబుతున్నా, రావిని ఇంట్లో పెంచకూడదనడానికి ఆధ్యాత్మిక కారణాలేవీ లేవు.

అయితే సామాజిక కారణాలు మాత్రం ఉన్నాయి. రావిచెట్టు చాలాకాలం ఉంటుంది. పైగా అది పెరిగేకొద్దీ దాని వేళ్లు భూమిలోపల చాలా దూరం బలంగా పాకుతాయి. దానివల్ల పునాదులు దెబ్బతిని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది.

అలాగే రావి చెట్టు భారీ వృక్షంగా పెరుగుతుంది కాబట్టి వాటిమీద పక్షులు గూళ్లు కట్టి, గుడ్లు పెడతాయి. వాటికోసం పాములు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

అందుకే రావిచెట్టును ఇంట్లో పెంచవద్దని చెబుతారు. నిజానికి రావిచెట్టే కాదు, ఏ పెద్ద చెట్టును పెంచినా ఈ సమస్య వస్తుంది. అది మనం గమనించుకోవాలి.

Wednesday, February 8, 2023

Shani Sancharam- శని సంచారం

శని సంచారం

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది

ఏలినాటి శని

జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అంటారు.

శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి

జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది.

శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.

జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని 'మంగుశని' అంటారు. రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని 'పొంగుశని' అని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది. కానీ మూడోసారి వచ్చిన శనిని 'మృత్యుశని' అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయం తప్పవు. ప్రాణం పోయేంతవరకూ పరిస్థితులు వెళతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇక 12,1,2 స్థానాల్లో శనిసంచారాన్ని ఏలినాటి శని అంటే... జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.

అర్ధాష్టమ శని

జన్మరాశి నుంచి నాలగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం ఉంటుంది.

అష్టమ శని

జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి.

దశమ శని

జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

అయితే మీ జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురుబలం ఉన్నప్పుడు శని అంతగా బాధించదు.ఇక శనిదోషం నుంచి ఉపశమనం పొందాలంటే శనివారం శనికి తైలాభిషేకం, జపాదులు చేయించుకోవచ్చు. మరో ముఖ్యవిషయం ఏంటంటే శని శ్రమకారకుడు. బద్ధకాన్ని అస్సలు సహించడు. శ్రమకారక జీవులైన చీమలకు పంచదారం వేయడం, పశు-పక్ష్యాదులకు ఆహారం-నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ దోషం తగ్గుతుందంటారు.

Pipaladudu-పిప్పలాదుడు

పిప్పలాదుడు

పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

ఏ వ్యక్తికి అయినా జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు, ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత, ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు, రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు.

నారదుడు- నువ్వు ఎవరు?

అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

నారదుడు- నీ తండ్రి ఎవరు?

అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి! నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్తిక తో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

నారదుడు- శనిదేవుని మహాదశ.

ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.

సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకు శని ని చూసి రక్షించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు.

1. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు. తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.

2. అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

దానికి బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శని

"శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే. తరువాత పిప్పలాదుడు ప్రశ్న - ఉపనిషత్తు ను రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...