Sunday, August 16, 2026

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం

గాయత్రీ సహస్ర నామావళి
నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్రాజ్ఞుడివి. సందేహంలేదు. కనకనే చెబుతున్నాను, ఆలకించు. నీ సందేహాలు మూడింటికీ ఒక్కటే సమాధానం. ఒక్కటే సాధనం. అదే శ్రీగాయత్రీ అష్టోత్తర సహస్రనామమాల. సృష్టికి ఆదిలో భగవంతు డుపదేశించిన సహస్రనామాలను నీకు ఉపదేశిస్తున్నాను.

వీటిని జపించడం విద్యాప్రదం. బ్రహ్మజ్ఞానదాయకం. భుక్తిముక్తి ప్రదం. దీనికి ఋషి సాక్షాత్తూ చతుర్ముఖుడు. గాయత్రియే అధిదేవత. ఛందస్సు అనుష్టుప్పు. హల్లులన్నీ బీజాక్షరాలు. స్వరాలన్నీ(అచ్చులు) శక్తులు. మాతృకాక్షరాలతో అంగన్యాసకరన్యాసాలు. సాధకుల హితం కోరి ముందుగా ధ్యానశ్లోకం చెప్పి, తరవాత సహన్రనామమాల చెబుతాను. 

రక్తశ్వేతహిరణ్య నీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలామ్‌
రక్తాం రక్తనవప్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమామ్‌ ।
గాయత్రీం కమలాసనాం కరతలన్యావద్ధకుండాంబుజామ్‌
పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాధిరూఢాం భజే ॥

ఆచింత్యలక్షణా 
అవ్యక్తా అర్థమాతృమహేశ్వరీ అమృతార్ణవమధ్యస్థా అజితా ఆపరాజితా 
అణిమాదిగుణాధారా అర్కమండలసంస్థితా అజరాజా అపరాధర్మా అక్షసూత్రధరా అధరా 
అకారాది క్షకారాంతా అరిషడ్వర్గభేదినీ అంజనాద్రిప్రతీకాశా అంజనాద్రి నివాసినీ అదితిః అజపా 
అవిద్యా ఆరవిందనిభేక్షణా అంతర్బహిస్థితా అవిద్యాధ్వంసినీ అంతరాత్మికా అజా ఆజముఖావాసా 
అరవిందనిభాననా అర్ధమాత్రా అర్థదా అనజ్ఞా అరిమండలమర్దినీ ఆసురఘ్నీ ఆమావాస్యా అలక్ష్మీఘ్నీ ఆత్యజార్చితా 

ఆదిలక్ష్మీః ఆదిశక్తిః ఆకృతిః ఆయతాననా(అయుతాననా) ఆదిత్యపదవీచారా ఆదిత్యపరిసేవితా ఆచార్యావర్తనా ఆచారా ఆదిమూర్తివాసినీ ఆగ్నేయా ఆమరీ ఆద్యా ఆరాధ్యా ఆసనస్థితా ఆధారనిలయా 50) ఆధారా ఆకాశాంతనివాసినీ ఆద్యాక్షరసమాయుక్తా ఆంతరాకాశరూపిణీ ఆదిత్యమండలగతా అంతరధ్వాంతనాశినీ 

ఇందిరా ఇష్టదా ఇష్టా ఇందీవరనిభేక్షణా ఇరావతీ ఇంద్రపదా ఇంద్రాణీ ఇంద్రరూపిణీ ఇక్షుకోదండసంయుక్తా ఇషుసంధానకారిణీ ఇంద్రనీలసమాకారా ఇడాపింగళరూపిణీ ఇంద్రాక్షీ ఈశ్వరీ ఈహాత్రయవివర్జితా

ఉమా ఉషా ఉడునిభా ఉర్వారుకఫలాననా ఉడుప్రభా ఉడుమతీ ఉడుపా ఉడుమధ్యగా ఊర్ధ్వా ఊర్ధ్వకేశీ ఊర్థ్వాధోగతిభేదినీ ఊర్థ్వబాహు (క్రి) ప్రియా ఊర్మిమాలావాగ్రంథదాయినీ 

ఋతం ఋషిః ఋతుమతీ ఋషిదేవనమస్కృతా ఋగ్వేదా ఋణహర్త్రీ ఋషిమండలచారిణీ ఋద్ధిదా ఋజుమార్గస్థా ఋజుధర్మా ఋతుప్రదా ఋగ్వేదనిలయా ఋజ్వీ ఌప్తధర్మప్రవర్తినీ ఌతారివరసంభూతా ఌతాదివిషహారిణీ (100) 

ఏకాక్షరా ఏకమాత్రా ఏకా ఏకైకనిష్ఠితా ఐంద్రీ ఐరావతారూఢా ఐహికాముష్మికప్రదా 

ఓంకారా ఓతా ఓతప్రోతనివాసినీ ఔర్వా ఔషధసంపన్నా ఔపాసనఫలప్రదా, అండమధ్య స్థితా అఃకారమనురూపిణీ

కాత్యాయనీ కాళరాత్రిః కామాక్షీ కామసుందరీ కమలా కామినీ కాంతా కామదా కలకంఠినీ కరికుంభస్తనభరా కరవీరసువాసినీ కల్యాణీ కుండలవతీ కురుక్షేత్రనివాసినీ కురువిందదళాకారా కుండలీ కుముదాలయా కాలజిహ్వా కరాళాస్యా కాళికా కాలరూపిణీ కమనీయగుణా కాంతిః కాలధారా కుముద్వతీ కౌశికీ కమలాకారా కామచారప్రభంజినీ కౌమారీ కరుణాపాంగీ కకుబంతా కరిప్రియా కేసరీ కేశవనుతా కదంబ కుసుమప్రియా (150) కాళిందీ కాళికా కాంచీ కలశోద్భవసంస్తుతా కామమాతా క్రతుమతీ కామరూపా కృపావతీ కుమారీ కుండనిలయా కిరాతీ కీరవాహనా కైకేయీ కోకిలాలాపా కేతకీకుసుమప్రియా కమండలుధరా కాళీ కర్మనిర్మూలకారిణీ కలహంసగతిః కక్షా కృతకౌతుకమంగళా కస్తూరీతిలకా కమ్రా కరీంద్రగమనా కుహూః కర్పూరలేపనా కృష్ణా కపిలా కుహరాశ్రయా కూటస్థా కుధరా (కమ్రా) కుక్షిస్థాఖిలవిష్టరా 

ఖడ్గఖేటకరా ఖర్వా ఖేచరీ ఖగవాహనా ఖట్వాంగధారిణీ ఖ్యాతా ఖగరాజోపరిస్థితా ఖలఘ్నీ ఖండితజరా ఖండాఖ్యానప్రదాయినీ ఖండేందుతిలకా

గంగా గణేశగుహపూజితా గాయత్రీ గోమతీ గీతా గాంధారీ గానలోలుపా (200) గౌతమీ గామినీ గాథా గంధర్వాప్సరసేవితా గోవిందచరణాక్రాంతా గుణత్రయవిభావితా గంధర్వీ గహ్వారీ గోత్రా గిరీశా గహనా గమీ గుహావాసా గుణవతీ గురుపాపప్రణాశినీ గుర్వీ గుణవతీ గుహ్యా గోప్తవ్యా గుణదాయినీ గిరిజా గుహ్యమాతంగీ గరుడధ్వజవల్లభా గర్వాపహారిణీ గోదా గోకులస్థా గదాధరా గోకర్ణనిలయాసక్తా గుహ్యమండలవర్తినీ ఘర్మదా ఘనదా ఘంటా ఘోరదానవమర్దినీ ఘృణిమంత్రమయీ ఘోషా ఘనసంపాతదాయినీ ఘంటారవప్రియా ఘ్రాణా ఘృణిసంతుష్టకారిణీ ఘనారిమండలా ఘూర్ణా ఘృతాచీ ఘనవేగినీ జ్ఞనధాతుమయీ

చర్చా చర్చితా చారుహాసినీ చటులా చండికా చిత్రా (250) చిత్రమాల్యవిభూషితా చతుర్భుజా చారుదంతా చాతురీ చరితప్రదా చూళికా చిత్రవస్త్రాంతా చంద్రమఃకర్ణకుండలా చంద్రహాసా చారుదాత్రీ చకోరీ చంద్రహాసినీ చంద్రికా చంద్రధాత్రీ చౌరీ చౌరా చండికా చంచద్వాగ్వాదినీ చంద్ర చూడా చోరవినాశినీ చారుచందనలిప్తాంగీ చంచచ్చామరవీజితా చారుమధ్యా చారుగతిః చండిలా చంద్రరూపిణీ చారుహోమప్రియా చార్వాచరితా చక్రబాహుకా చంద్రమండలమధ్యస్థా చంద్రమండలదర్పణా చక్రవాకస్తనీ చేష్టా చిత్రా చారువిలాసినీ చిత్స్వరూపా చంద్రవతీ చంద్రమాః చందనప్రియా చోదయిత్రీ చిరప్రజ్ఞా చాతకా చారు హేతుకీ ఛత్రయాతా ఛత్రధరా ఛాయా ఛందఃపరిచ్చదా ఛాయాదేవీ ఛిద్రనఖా ఛన్నేంద్రియవిసర్పిణీ (300) ఛందో
నుష్టుప్ప్రతిష్ఠాంతా ఛిద్రోపద్రవభేదినీ ఛేదా ఛత్రేశ్వరీ ఛిన్నా ఛురికా ఛేదనప్రియా

జననీ జన్మరహితా జాతవేదా జగన్మయీ జాహ్నవీ జటిలా జేత్రీ జరామరణవర్జితా జంబూద్వీపవతీ జ్వాలా జయంతీ జలశాలినీ జితేంద్రియా జితక్రోధా జితామిత్రా జగత్ప్రియా జాతరూపమయీ జిహ్వా జానకీ జగతీ జరా జనిత్రీ జహ్నుతనయా జగత్త్రయహితైషిణీ జ్వాలాముఖీ జపవతీ జ్వరఘ్నీ జితవిష్టపా జితాక్రాంతమయీ జ్వాలా జాగ్రతీ జ్వరదేవతా జ్వలంతీ జలదా జ్యేష్ఠా జ్యాఘోషాస్ఫోటదిఙ్ముఖీ జంభిని జృంభణా జృంభా జ్వలన్మాణిక్యకుండలా ఝిం
ఝికా ఝణనిర్ఘోషా ఝంఝామారుతవేగినీ (350) ఝల్లరీవాద్యకుశలా ఞరూపా ఞభుజా

టంకబాణసమాయుక్తా టంకినీ టంకభేదినీ టంకీగుణకృతాఘోషా టంకనీయమహోరసా టంకారకారిణీ ఠఠశబ్దనినాదినీ డామరీ డాకినీ డింభా డుండుమారైకనిర్జితా డామరీతంత్రమార్గస్థా డమడ్డమరునాదినీ డిండీఖసహా డింభలసత్క్రీడాపరాయణా డుంఠివిఘ్నేశజననీ ఢక్కహస్తా ఢిలివ్రజా నిత్యజ్ఞానా నిరుపమా నిర్గుణా నర్మదా నదీ

త్రిగుణా త్రిపదా తంత్రీ తులసీ తరుణా తరుః త్రివిక్రమపదాక్రాంతా తురీయపదగామినీ తరుణాదిత్యసంకాశా తామసీ తుహినాతురా త్రికాలజ్ఞానసంపన్నా త్రివళీ త్రిలోచనా త్రిశక్తిః త్రిపురా తుంగా తురంగవదనా తిమింగిలగిలా తీవ్రా త్రిప్రోతా తామసాదనీ తంత్రమంత్రవిశేషజ్ఞా (400) తనుమధ్యా త్రివిష్టపా త్రిసంధ్యా త్రిస్తనీ తోషాసంస్థా తాళప్రతాపినీ తాటంకినీ తుషారాభా తుహినాచలవాసినీ తంతుజాలసమాయుక్తా తారహారావళిప్రియా తిలహోమప్రియా తీర్థా తమాలకుసుమాకృతిః తారకా త్రియుతా తన్వీ త్రిశంకుపరివారితా తలోదరీ తిరోభూ(భా)షా తాటంకప్రియవాదినీ త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః తప్తకాంచనసంకాశా తప్తకాంచనభూషణా త్రైయంబకా త్రివర్ణా త్రికాలజ్ఞానదాయినీ తర్పణా తృప్తిదా తృప్తా తామశీ తుంబురుస్తుతా తార్‌క్ష్యస్థా త్రిగుణాకారా త్రిభంగీ తనువల్లరిః థాత్కారీ థారవా థాంతా

దోహినీ దీనవత్సలా దానవాంతకరీ దుర్గా దుర్గాసురనిబర్హిణీ దేవరీతిః దివారాత్రిః ద్రౌపదీ (450)
దుందుభిస్వనా దేవయానీ దురావాసా దారిద్య్రోద్భేధిని దివా దామోదరప్రియా దీప్తా దిగ్వాసా దిగ్విమోహినీ దండకారణ్యనిలయా దండినీ దేవపూజితా దేవవంద్యా దివిషదా ద్వేషిణీ దానవాకృతిః దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణీ ధాత్రీ ధనుర్ధరా ధేనుః ధారిణీ ధర్మచారిణీ ధరంధరా ధరాధారా ధనదా ధాన్యదోహినీ ధర్మశీలా ధనాధ్యక్షా ధర్మవేదవిశారదా ధృతిః ధన్యా ధృతపదా ధర్మరాజప్రియా ధ్రువా ధూమావతీ ధూమకేశీ ధర్మశాస్త్రప్రకాశినీ

నందా నందప్రియా నిద్రా నృనుతా నందనాత్మికా నర్మదా నళినీ నీలా నీలకంఠసమాశ్రయా నారాయణప్రియా నిత్యా (500) నిర్మలా నిర్గుణా నిధిః నిరాధారా నిరుపమా నిత్యశుద్ధా నిరంజనా నాదబిందుకళాతీతా నాదబిందుకళాత్మికా నృసింహినీ నగధరా నృపనాగవిభూషితా నరకక్లేశశమనీ నారాయణపదోద్భవా నిరవద్యా నిరాకారా నారదప్రియకారిణీ నానాజ్యోతిస్సమాఖ్యాతా నిధిదా నిర్మలాత్మికా నవసత్రధరా నీతిః నిరుపద్రవకారిణీ నందజా నవరత్నాఢ్యా నైమిశారణ్యవాసినీ నవనీతప్రియా నారీ, నీలజీమూతనిస్వనా, నిమేషినీ నదీరూపా నీలగ్రీవా నిశీశ్వరీ నామావళిః నిశుంభఘ్నీ నాగలోకనివాసినీ తప్తజాంబూనదప్రఖ్యా నాగలోకాధిదేవతా నూపురాక్రాంతచరణా నరచిత్తప్రమోదినీ నిమగ్నారక్తనయనా నిర్ఘాతసమనిస్వనా నందనోద్యాననిలయా నిర్వ్యూహోపరిచారిణీ

పార్వతి పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా పంచకోశవినిర్ముక్తా (550) పంచపాతకనాశినీ పరచిత్తవిధానజ్ఞా పంచికా పంచరూపిణీ పూర్ణిమా పరమా ప్రీతిః పరతేజఃప్రకాశినీ పురాణీ పౌరుషీ పుణ్యా పుండరీకనిభేక్షణా పాతాళతలనిర్మగ్నా ప్రీతా, ప్రీతివివర్ధిన, పావనీ పాదసహితా పేశలా పవనాశినీ ప్రజాపతిః పరిశ్రాంతా పర్వతస్తనమండలా పద్మప్రియా పద్మసంస్థా పద్మాక్షీ పద్మసంభవా పద్మపత్రా పద్మపదా పద్మినీ ప్రియభాషిణీ, పశుపాశ వినిర్ముక్తా, పురంధ్రీ పురవాసినీ పుష్కలా పురుషా పర్వా, పారిజాత సుమప్రియా, పతివ్రతా పవిత్రాంగీ పుష్పహాసపరాయణా, ప్రజ్ఞావతీ - సుతా, పౌత్రీ పుత్రపూజ్యా పయస్వినీ పట్టిపాశధరా పంక్తిః పితృలోకప్రదాయినీ పురాణీ పుణ్యశీలా ప్రణతార్తివినాశినీ (600) ప్రద్యుమ్నజననీ పుష్టా పితామహపరిగ్రహా పుండరీకపురావాసా పుండరీకసమాననా పృథుజంఘా పృథుభుజా పృథుపాదా పృథూదరీ ప్రవాళశోభా పింగాక్షీ పీతావాసాః ప్రచాపలా ప్రసవా పుష్టిదా పుణ్యా ప్రతిష్ఠా ప్రణవాగతిః పంచవర్ణా పంచవాణీ పంచికా పంజరస్థితా పరమాయా పరజ్యోతిః పరప్రీతిః పరాగతిః పరాకాష్ఠా పరేశానీ పావినీ పావకద్యుతిః పుణ్యభద్రా పరిచ్చేదా పుష్పహాసా (పృథూదరీ) పీతాంగీ పీతవసనా పీతశయ్యా పిశాచినీ పీతక్రియా పిశాచఘ్సీ పాటలాక్షీ పటుక్రియా పంచభక్షప్రియాచారా పూతనాప్రాణఘాతినీ పున్నాగవనమధ్యస్థా పుణ్యతీర్దనిషేవితా పంచాంగీ పరాశక్తిః పరమాహ్లాదకారిణీ పుష్పకాండ స్థితా పూషా (650) పోషితాఖిలవిష్టపా పానప్రియా పంచశిఖా పన్నగోపరిశాయినీ పంచమాత్రాత్మికా పృథ్వీ పథికా పృథుదోహనీ పురాణన్యాయమీమాంసా పాటలీపుష్పగంధినీ పుణ్యప్రజా పారదాత్రీ పరమార్గైకగోచరా ప్రవాళశోభా పూర్ణాశా ప్రణవా పల్లవోదరీ ఫలినీ ఫలదా ఫల్గుః పూత్కారీ ఫలకాకృతిః ఫణీంద్రభోగశయనా ఫణిమండలమండితా

బాలబాలా బహుమతా బాలాతపనిభాంశుకా బలభద్రప్రియా వంద్యా బడబా బుద్దిసంస్తుతా బందీ బిలవతీ బడిశఘ్నీ బలిప్రియా బాంధవీ బోధితా బుద్ధిః బంధూక కుసుమప్రియా బాలభానుప్రభాకారా బ్రాహ్మీ బాహ్మణదేవతా బృహస్పతిస్తుతా బృందా బృందావనవిహారిణీ బలాకినీ బిలాహారా బిలవాసా బహూదకా బహునేత్రా (700) బహుపదా బహుకర్ణావతంసికా బహుబాహుయుతా బీజరూపిణీ బహురూపిణీ బిందునాదకళాతీతా బిందునాదస్వరూపిణీ బద్ధగోధాంగుళిత్రాణా బదర్యాశ్రమవాసినీ బృందారకా బృహత్‌స్కంధా బృహతీ బాణపాతినీ బృందాధ్యక్షా బహునుతా బనితా బహువిక్రమా బద్ధపద్మాసనాసీనా బిల్వపత్రతలస్థితా బోధిద్రుమనిజావాసా బడిస్థా బిందుదర్పణా బాలా బాణాసనవతీ బడబానలవెగినీ బ్రహ్మాండబహిరంతఃస్థా బ్రహ్మకంకణ సూత్రిణీ

భవానీ భీషణవతీ భావినీ భయహారిణీ భద్రకాళి భుజంగాక్షీ భారతీ భారతాశయా భైరవి భీషణాకారా భూతిదా భూతిమాలినీ భామినీ భోగనిరతా భద్రదా భూరివిక్రమా భూతవాసా భృగులతా భార్గవీ భూసురార్చితా భాగీరథీ భోగవతీ భవనస్థా (750) భిషగ్వరా (భామినీ) భోగినీ భాషా భవానీ భూరిదక్షిణా భర్గాత్మికా భీమవతీ భవబంధనమోచనీ భయనీయా భూతధాత్రీ (రంజితా) భువనేశ్వరీ భుజంగవలయా భీమా భేరుండా భాగధేయినీ

మాతా మాయా మధుమతీ మధుజిహ్వా మధుప్రియా మహాదేవీ మహాభాగా మాలినీ మీనలోచనా మాయాతీతా మధుమతీ మధుమాంసా మధుధ్రువా మానవీ మధుసంభూతా మిథిలాపురవాసినీ మధుకైటభసంహర్త్రీ మేదినీ మేఘమాలినీ మందోదరీ మహామాయా మైథిలీ మసృణప్రియా మహాలక్ష్మీః మహాకాళీ మహాకన్యా మహేశ్వరీ మాహేంద్రీ మేరుతనయా మందారకుసుమార్చితా మంజుమంజీరచరణా మోక్షదా మంజుభాషిణీ మధురద్రావిణీ ముద్రా (800) మలయా మలయాన్వితా మేధా మరకతశ్యామా మాగధీ మేనకాత్మజా మహామారీ మహావీరా మహాశ్యామా మనుస్తుతా మాతృకా మిహిరాభాసా ముకుందపదవిక్రమా మూలాధారస్థితా ముగ్ధా మణిపూరకవాసినీ మృగాక్షీ మహిషారూఢా మహిషాసురమర్దినీ

యోగాసనా యోగగమ్యా యోగా యౌవనకాశ్రయా యౌవనీ యుద్దమధ్యస్థా యమునా యుగధారిణీ యక్షిణీ యోగయుక్తా యక్షరాజప్రసూతినీ యాత్రా యానవిధానజ్ఞా యదువంశసముద్భవా యకారాదిహకారాంతా యాజుషీ యజ్ఞరూపిణీ యామినీ యోగనిరతా యాతుధానభయంకరీ

రుక్మిణీ రమణీ రామా రేవతీ రేణుకా రతిః రౌద్రీ రౌద్రప్రియాకారా రామమాతా రతిప్రియా రోహిణీ [850) రాజ్యదా రేవా రమా రాజీవలోచనా రాకేశీ రూపసంపన్నా రత్నసింహాసనస్థితా రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా రాజహంససమారూఢా రంభా రక్తబలిప్రియా రమణీయయుగాధారా రాజితాఖిలభూతలా రురుచర్మపరీధానా రథినీ రత్నమాలికా రోగేశీ రోగశమని రావిణీ రోమహర్షిణీ రామచంద్రపదాక్రాంతా రావణచ్చేదకారిణీ రక్తవస్త్రపరిచ్చిన్నా రథస్థా రుక్మభూషణా

లజ్జాధిదేవతా లోలా లలితా లింగధారిణీ లక్ష్మీః (లోలా) లుప్తవిషా లోకినీ లోకవిశ్రుతా లజ్జా లంబోదరీ (దేవీ) లలనా లోకధారిణీ

వరదా వందితా విద్యా వైష్ణవీ విమలాకృతిః వారాహీ విరజా వర్షా వరలక్ష్మీః విలాసినీ వినతా వ్యోమమధ్యస్టా (900) వారిజాసనసంస్థితా వారుణీ వేణుసంభూతా వీతిహోత్రా విరూపిణీ వాయుమండలమధ్యస్థా విష్ణురూపా విధిప్రియా విష్ణుపత్నీ విష్ణుమతీ విశాలాక్షీ వసుంధరా వామదేవప్రియా వేలా వజ్రిణీ వసుదోహినీ వేదాక్షరపరీతాంగీ వాజపేయఫలప్రదా వాసవీ వామజననీ వైకుంఠనిలయా వరా వ్యాసప్రియా వర్మధరా వాల్మీకిపరిసేవితా

శాకంభరీ శివా శాంతా శారదా శరణాగతిః శాతోదరీ శుభాచారా శుంభాసురవిమర్దినీ శోభావతీ శివాకారా శంకరార్ధశరీరిణీ శోణా శుభాశయా శుభ్రా శిరస్సంధానకారిణీ శరావతీ శరానందా శరత్‌ జ్యోత్స్నా శుభాననా శరభా శూలినీ శుద్ధశబరీ శుకవాహనా శ్రీమతీ శ్రీధరానందా (950) శ్రవణానందదాయినీ శర్వాణీ శర్వరీవంద్యా షడ్భాషా షడృతుప్రియా షడాధారస్థితా షణ్ముఖప్రియకారిణీ షడంగరూపా 

సుమతిః సురాసురనమస్కృతా సరస్వతీ సదాధారా సర్వమంగళకారిణీ సామగానప్రియా సూక్ష్మా సావిత్రీ సామసంభవా సర్వవాసా సదానందా సుస్తనీ సాగరాంబరా సర్వైశ్వర్యప్రియా సిద్ధిః సాధుబంధుపరాక్రమా సప్తర్షిమండలగతా సోమమండలవాసినీ సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా సరఘా సూర్యతనయా సుకేశీ సోమసంహతిః

హిరణ్యవర్ణా హరిణీ హ్రీంకారీ హంసవాహినీ క్షౌమవస్త్రపరీతాంగీ క్షీరాబ్ధితనయా క్షమా

గాయత్రీ సావిత్రీ పార్వతీ సరస్వతీ వేదగర్భా వరారోహా (1000) శ్రీగాయత్రీ పరాంబికా

ఇతి సాహస్రకం నామ్నాం గాయత్య్రాశ్చైవ నారద ।
పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకమ్‌ ॥ 

నారదా! ఇది గాయత్రీదేవి నామసహస్రం. అత్యంత పుణ్యప్రదం. సర్వపాప నివారకం. మహాసంపత్ప్రదాయకం. వీటిని జపిస్తే గాయత్రీదేవి ఎంతగానో ఆనందిస్తుంది. అనుగ్రహించి అభీష్ట వరాలు కురిపిస్తుంది. 

అష్టమి తిథినాడు పఠిస్తే విశేషంగా ఫలిస్తుంది. జపం చేసుకుని పూజలూ హోమాలూ ధ్యానాలూ ముగించి ఈ వెయ్యి నామాలనూ పఠిస్తే చాలు భుక్తీ ముక్తీ లభిస్తాయి. ఇది అత్యంత గుహ్యమైన నామసహస్రం. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదు. మంచి భక్తుడవునా కాదా, మంచి శిష్యుడవునా కాదా పరిశీలించి పరీక్షించి అప్పుడు ఉపదేశించాలి. 

భ్రష్టులైన సాధకులకూ బంధువులకూ అస్సలు చెప్పకూడదు. ఈ లిఖితప్రతి ఎవరి ఇంటిలో ఉంటే వారికింక భయమనేదే లేదు. అతిచంచల అనిపించుకునే లక్ష్మీదేవి వారి ఇంటిలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. దరిద్రులకు ఇది నిధి వంటిది. 

ముముక్షువులకు ముక్తిరూపం. రోగార్తులకు దివ్యౌషధం. బంధితులకు బంధవిమోచకం. బ్రహ్మహత్యాది మహాపాపాలను సైతం నశింపజేస్తుంది. అంతేకాదు బ్రహ్మసాయుజ్యాన్ని అందిస్తుంది. ఇది సత్యం. సత్యం. తిరుగులేని నత్యం.

దీక్షా ప్రదానం





Saturday, August 15, 2026

Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం

అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు.

మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు. వారందరూ సాగి సాగి నందన వనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. వివిధ తరు లతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వమనోహరంగా వుంది. ఆ వనంలో ఎవరూ అడుగు పెట్టడానికి వీలులేదు.

సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వనపాలకుడు. ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని ఛేరి మధుపాన కాంక్ష వెలిబుచ్చగా, ఆ యువరాజు జాంబవంతాది వృద్దులతో సంప్రదించి వానరులకు అనుమతి యిచ్చాడు.

అంతతో పట్టరాని సంతోషం కలిగిన ఆ వానరులు.

గాయన్తి కేచిత్‌ ప్రణమంతి కేచిత్‌
నృత్యన్తి కేచిత్‌ ప్రహసన్తి కేచిత్‌ ।
పతన్తి కేచిత్‌ విచర
న్తి కేచిత్‌
ప్లవంతి కేచిత్‌ ప్రలపంతి కేచిత్‌ః ॥

కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, నవ్వులు, తిరుగుళ్ళు, దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు.

ఒక చెట్టుమీది నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మనుండి నేలకు దుముకుతూ, నేలనుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు పాడుతూంటే ఒకడు నవ్వుతున్నాడు, నవ్వే వానిని చూచి ఏడిచే వాడొకడు, అరిచే వాడొకడు, వాడికి ప్రోత్సాహం ఒకడు:

మధుపానమత్తులై వారు మతులుపోయి చరిస్తున్నారు.

పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. చూశాడు దధిముఖుడు, వనపాలుడు.

క్రోధంతో వచ్చి వారించబోయోడు. కొందరిని మందలించాడు, దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ ఆ మ
త్తులో దధిముఖుని దండించడం ఆరంభించారు.

గోళ్ళతో రక్కి, పళ్ళతో పీకి, కాళ్ళతో తన్ని నానా హింసలూ పెట్టారు.

అది చూసి హనుమంతుడు మీరందరూ మధుపానం సాగించండి. వీరి విషయం నేను చూస్తాను, అనవిని అంగదుడు కార్యసాధకుడైన హనుమంతుడు చెపితే అకార్యం అయినా చెయ్యవలసిందే, అనగా వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాలవైపు సాగి ఫలాలు భక్షిస్తూ, మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు.

దోసెళ్ళతో కొందరు త్రాగుతూంటే మధుభాండాలు చంకలలో పట్టుకుపోతున్నారు కొందరు, త్రాగి కొట్టుకోవడం మొదలు పెట్టారు, కొందరు చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలే వారు కొందరు, త్రోసుకునేవారు కొందరు.

కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు.

వారి చేత దెబ్బలు తిన్న వన పాలకులు పిక్కబలం చూపారు.

తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని 
హావృక్షాలు పెరికి వానరయోధులను వారించరాగా హనుదాదులు ఎదురు వచ్చారు,

పానమత్తుడై వున్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో దధిముఖుని నేలమీద పడగొట్టి చితకబొడిచాడు.

ఆ యువకుడి దెబ్బలకు మూర్చపోయాడు దధిముఖుడు. కొంత సేపటికి తేరుకొని తన అనుచరులను వెంటబెట్టుకుని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తలవంచి దోసిలి ఒగ్గి, యింత అకార్యానికీ కారకుడు అంగదుడు, అంటూ పాదాలమీద పడ్డాడు.

సుగ్రీవుడు వానిని లేవనెత్తి:

నీకు అభయమిస్తున్నాను. విషయం వివరంగా చెప్పు, అన్నాడు.

వానరేశ్వరా! నీ తండ్రి ఋక్షరజసుడుగానీ, మీ అన్న వాలిగానీ మధువనంలో అడుగుపెట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. మేమందరం వారించబోగా బాగా మాకు పాదతాడనాలు లభించాయి. చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు, అని దుఃఖిస్తూంటే, చూచి లక్ష్మణస్వామి:

వానరేశ్వరా! ఎందు కీయన దుఃఖిస్తున్నాడు, అని ప్రశ్నించాడు.

లక్ష్మణా! అంగదాదులు 
ధువనంలో ప్రవేశించి యధేచ్భగా త్రాగుతూ తిరుగుతున్నారని చెపుతున్నాడు.

వారందరూ దక్షిణదిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు స్వేచ్చగా చరిస్తున్నారంటే కార్యసాధకులై వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం వారికి రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు.

హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు యోగ్యమయిన ఆలోచనా శక్తి అతనికే ఉంది. వివేకవంతుడయిన పరాక్రమ సంపన్నుడు మా హను
. అదీకాక-

జాంబవా న్యత్ర నేతాస్యాత్‌
అంగదశ్చ బలేశ్వరః
హనుమాం శ్చాప్యధిష్ఠాతా
న తస్య గతి రన్యధా

నాయకుడు జాంబవంతుడు.
బలాధిపతి అంగదుడు.
అధిష్ఠాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అడ్డేమిటి!

వీరందరూ 
ధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే.

కాకపోతే బ్రహ్మదత్త
యిన ధువనంలో కాలు పెట్టడానికి అంగదాధులకు ఎన్ని గుండెలు కావాలి. వారు సీతను చూశారు, అనడంతో రామ లక్ష్మణులు పరమానందం పొందారు:

అప్పుడు సుగ్రీవుడు:

కార్యసాధకులయి వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. సింహసదృశులయిన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. సీతాన్వేషణ విశేషాలు వినగోరుతున్నాం, అన్నాడు.

ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు.

అప్పటికి మత్తు వదులుతూన్న వానరవీరులను సమీపించి, చేతులు జోడించి, అంగదుని సమీపించి:

యువరాజా! మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకూ అధికారముంది. ఒకనాడు వాలి వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ తరువాయి నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను.

ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా, 

అంగదుడు: వానర వీరులారా! రామచంద్రుని కీ విషయం తెలిసివుంటుంది. అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపానముత్తులై హాయిగా నిద్రించే వానరవీరులను తీసుకుని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెపితే అలా నడుచుకుంటాను, నేను యువరాజునయినా కార్యసాధకులను అజ్ఞాపించడం ఉచితం కాదు, అన్నాడు.

ప్రభువయినవాడెవ్వడూ యింత వినయంగా మాట్లాడడం మేమెరగం. ప్రభుత్వమదం వినయాన్ని దరిజేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది నీ భావిశ్రేయస్సుకు మంచిది.

నీ మాట మీద మే మందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నారు వారు.

అయితే నడవండి, అని అంగదుడు ఎగిరాడు.

ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తమయిన పర్వతాలవలె వానరయోథులు ఎగిరారు.

వాయు విచలితములయిన మేఘసముదాయంలా గర్జిస్తూ వస్తూంటే సుగ్రీవుడు:

రామభద్రా! నువ్వు నిశ్చింతగా వుండు. 
నవారు సీతను చూసే వస్తున్నారు. ఎలా అంటావా! నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుటపడగల వానరుడు లేడు. గడువుదాటి వస్తున్నారంటే పనిచేసుకు వచ్చారన్నమాట, ఆలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. పయిగా వారు మహోత్సాహంలో వున్నారని విన్నాంకదా! దాని అర్థం కార్యం సాధించారనే. అదీకాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో వున్నారో యోచించు.

నిస్సందేహంగా సీత కనిపించి వుంటుంది, హనుమంతుడే చూచి వుంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు.

హనూమతిహి సిద్ధిశ్చ
తిశ్చ తి సత్తమ-

జాంబవంతుడు నాయకుడు, అంగదుడు బలేశ్వరుడు, హనుమంతుడు సాధకుడు. అటువంటప్పుడు 
రోలా జరగడానికి వీలులేదు. నువ్వు నిశ్చింతగా వుండు, అంటూండగా కిలకిల ధ్వానం చేరింది.

ఆ ఉత్సాహధ్వానం వినే సుగ్రీవుని వాలం పెరిగింది; 
నసు సంతోషంతో పొంగింది.

వానరు లందరూ రామదర్శన లాలసులై అంగదునీ, హనుమంతునీ ముందుంచుకుని క్రిందికి దిగారు.

హనుమంతుడు చేతులు జోడించి, రాముని ముందు నిలిచి:

స్వామీ! సీతాదేవి క్షేమంగా వుంది, అన్నాడు.

సుగ్రీవునికి తన ఊహ నిజ
యినందుకు ఆనందం కలిగింది. లక్ష్మణుడు ఆదరనయనాలతో హనుమంతుని చూశాడు. రామభద్రుడు సంతోష వదనంతో చూశాడు.

చూడామణి

Chudamani - చూడామణి

రామాయణం సుందరకాండ 69వ సర్గ వరకు - చూడామణి

రామభద్రుడు:

ఓ వానర వీరులారా! సీతాదేవి ఏ స్థితిలో వుంది. నా యందు ఆవిడ ఏ దృష్టితో వుంది. అంతా వివరంగా చెప్పండి, అన్నాడు.

అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకు నడిపించారు.

హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూచి:

రామభద్రా! అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూరు యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించాను.

ఆ పతివ్రతా శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నంచేసి నీకోసమే జీవిస్తున్నది. రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింస పడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా వున్నారు.

దీనురాలై, ఏకవేణితో, భూమిమీదనే శయనిస్తూ, మంచుదెబ్బతిన్న పద్మంలా వుంది.

క్రూర రావణుని హీంసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతూండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకువంశ కీర్తనం ఆరంభించాను.

అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది. నేను విషయమంతా వివరించాను.

మీ మైత్రిమాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మణిశిలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తుచేసింది.

ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా యిచ్చింది. ఆ రాక్షసా వాసంలో మరొక్క మాసంకంటె జీవించనని చెప్పింది, అని విషయాలు విస్తరంగా చెప్పాడు.

రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకుని కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి:

లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో నేను సీతకోసం అంత బాధ పడుతున్నాను. కల్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు, ఈ మణి పవిత్ర జల సంభూత, దీనిని దేవేంద్రుడు కానుకగా యిచ్చాడు. దీన్ని చూస్తూంటే మా తండ్రిగారినీ, మా మామగారినీ చూసినట్లనిపిస్తున్నది. ఇది ఆమెకే అలంకారం, అని హనుమంతునివైపు తిరిగి:

మారుతీ! దాహపీడితుడికి స్వాదుజలంవలె నీ మాటలు నా బాధకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి యింకా ఏం చెప్పిందో వివరించు; జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో, మేఘాచ్చాదిత శరచ్చంద్రునివలె వుండి వుంటుంది. రోగికి ఔషధంలా నాకు నీ మాటలే, జీవనాధారం, ఆ ప్రియభాషిణి చెప్పిన మాటలన్నీ వినిపించు, అన్నాడు.

రామభద్రా! చిత్రకూటం మీద మీరుభయులూ విశ్రాంతి తీసుకునే వేళ నువ్వు నిద్రపోయేవేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా నువ్వు మేలుకాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచావట, ఆ కాకికి ముల్లోకాలలోనూ అభయం దొరకక నిన్నే శరణువేడితే అప్పుడు అమోఘ
యిన ఆ అస్త్రానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట.

అలనాడు వాయసంమీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు. లక్ష్మణుడయినా ఎందుకు రావడంలేదు.

బహుశ నేను చేసిన పాపకర్మలు పూర్తికాలేదేమో! లేకుంటే యింత కాలం ఆ 
హావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు, అని కన్నీరు విడిస్తుంటే నేను:

తల్లీ! రాముడు నీ విరహవ్యధతో నిశ్చేష్టుడై వున్నాడు. లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు.

ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. వారుభయులూ హుటాహుటిని వచ్చి లంక దహించి, ఈ రావణుని బంధుకోటితో సహా కడతేర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా ఏదయినా ఇయ్యి, అని అడిగాను.

అప్పుడావిడ అటూ యిటూ చూసి, జుట్టు ముడిలోని ఈ మణి యిచ్చింది.

నేను తీరుగు ప్రయాణానికి బయలుదేరుతూంటే,

హనుమా! సింహసదృశ పరాక్రమ సంపన్నులయిన రామ లక్ష్మణులనూ వానరేశ్వరునీ అడిగానని చెపుతూ, రా
లక్ష్మణులను దర్శించగలగడం నీ అదృష్టం, అని నన్ను అభినందించింది.

అప్పుడు నేను:

తల్లీ! నా వీపుమీద కూర్చో. ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను, అన్నాను.

అప్పుడావిడ!

హనుమా! ఈ 
నస్సు నా స్వాధీనంలో వుండగా పరపురుష స్పర్శ సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడంవల్ల, ఆ రాక్షసుడు నన్ను ముట్టగలిగాడు, ఇక రాముడు నన్నీ దుఃఖసాగరం నుండి ఎలా ఉద్దరించాలో అదంతా అయనతో నువ్వు ఆలోచించు. ఈ రాక్షసపీడ చూశావుగదా! అంతా ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక! అని క్షణం ఆగి:

పోనీ ఈ రోజు యిక్కడెక్కడయినా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా! నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నేను వుంటానో వుండనో! నా దుఃఖాలకు అంతు కనబడడంలేదు, మీ వానర, భల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలవయ్యా!

దాశరథులకు మాత్రం యిది సాధ్యమా!

వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వూ తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా.

మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే స
మర్థుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను తీసికెళ్ళడం ఆయనకు యశస్కరం.

ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను హరించాడు. రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి. అదంతా నువ్వు చెప్పాలి, అని అన్నది,

అప్పుడు నేను:

అమ్మా! వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడై వున్నాడీ విషయుంలో

వానర భల్లూక పతులందరూ ఆయన కను సన్నలలో నడుస్తారు. వారు సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయుమార్గాన భూ ప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ.

అక్కడ నా కంటె మహామహులూ, నాతో సమానులూ వున్నారే తప్ప తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు. అంటే వారికంటె తక్కువ వాడీనే కదా, పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా!

ఈ వానరయూధనాధులు ఒక్క ఊపులో లంకలో వ్రాలుతారు. ఇక ఆ రాజ సింహులు నా వీపుమీద వచ్చి యిక్కడ సూర్య చంద్రునివలె దిగుతారు.

సర్వశత్రు సంహార సమర్దుడు, సింహసమ పరాక్రమోపేతుడు, రామ భద్రుడు ధనుర్ధారియై లంకానగర ద్వారంలో నిలబడడం త్వరలోనే నువ్వు చూడగలవు,

వాడి గోళ్ళూ, నిశిత దంతాలూ, ఆయుధాలుగా మా వానర గణాధిపతులు సింహ శార్దూల బలసంపన్నులు. వారు మత్తగజ సన్నిభులై నీ ముందుంటారు.

వార్షుకాభ్రాలవలె, మహాపర్వతాలవలె వారు ఈ లంకానగర సమీప గిరి సానువులమీద సింహనాదాలు చేస్తూంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు.

రామభద్రుడు శత్రుసంహారం చేసి వనవాసం ముగించి నిన్ను వెంట బెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరతాడు, అని జానకీదేవిని ఓదార్చాను;

అని హనుమంతుడు పలకడంతో రా
భద్రుడు సంతుష్ట చిత్తుడయాడు.

అరిఘ్నం సింహ సంకాశం
క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం
లక్ష్మణంచ ధను ష్పాణిం
లంకాద్వార ముపస్థితం


సుందరకాండ సమాప్తం

(అదికవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీ మద్రామాయణంలో సుందరకాండకు ఇది ఉషశ్రీ స్వేచ్చానువాదం.)

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం సమత రాక్షసాంతకం.


(రామనామం వినిపించే ప్రతిప్రాంతంలో ఆనంద బాష్పాలతో తలవంచి నిలబడే మూరుతికి నమస్కారం. ఇది భక్తుల దృష్టిలో హనుమంతుని రూపం)

అంజనా నందనం - వీరం
జానకీ శోకనాశనం
కపీశం అక్ష హంతారం
వందే లంకా భయంకరం
.

అదీ ఆయన రూపం.

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు

మారుతి మాటలు విని అంగదుడు:

సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్నులకు ఉచితంకాదేమో! మన హనుమ రాక్షస సంహారంచేసే వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రా
లక్ష్మణుల ముందుంచి న పరాక్రమం చాటుకుందాం, అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు.

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా 
నం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్దూలుడు మనలను ఏ దృష్టితో చూస్తాడో! అది తన వంశ ప్రతిష్ఠకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు.

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో అయన మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది.

అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే 
న కర్తవ్యం. అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు.

మధువనం

Aalochanalu - ఆలోచనలు

రామాయణం సుందరకాండ 59వ సర్గ - ఆలోచనలు

హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు:

రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తి భావంతో వుంది. ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ గలడు, దహింపజెయ్యనూ గలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపో
గ్ని ఎంత!

సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి.

లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు.

ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్త్రాలు నన్నేమీ చెయ్యలేవు. మరి మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని.

మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది.

అందాకా ఎందుకు! 
న యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస, నీలులు కదిలితే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మ వర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి, నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు.

అంగదుడు

Anveshana Gaadha - అన్వేషణ గాథ

రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ

మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు.

అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ:

నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు.

ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది.

సీతాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు.

మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం వేయి ముక్కలయింది.

అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూత కోటిని నాశనం చే
స్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలో చేర్చాడు.

ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు.

నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి:

ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి:

అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృతాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను.

ఆ కామరూపిణి సురస: ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం కాదు, అంది.

నేను పది ఆమడలు పెరిగాను.

సురస అంతకంటె పెద్ద నోరు తెరిచింది.

ఉత్తర క్షణంలో నేను అంగుష్ఠ దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత:

వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ సంకల్పం ఫలిస్తుంది. సీతా రాములకు సమాగమం కలిగించు, అంది.

గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను.

దక్షిణముఖంగా సాగుతున్నాను,

అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఎదో శక్తి,

క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను. 

ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది.

ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది.

ఆ రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు:

భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు సరిహద్దులో ప్రవేశించాను.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

లంకలో దిగాను.

దిగుతూన్న సమయంలో-

ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పాడిచాను.

నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్ఠానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది.

చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా వున్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు పెట్టాను.

ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్తృ చింతాపరాయణయై వున్న సీతను చూశాను.

ఆమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం.

రక్త మాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది.

ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలి పెట్టె దశలో వుండగా చూశాను.

అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా వస్తున్నట్లు వినిపించింది.

నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను.

రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు.

సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది.

గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు.

ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు.

సీత: రాక్షసాధమా! అమిత తేజశ్శాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే!

నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి వున్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు. అని క్రోధంతో మాట్లాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హా హా రవాలు చేశారు.

వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి:

నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ అంతఃపురంలో.

వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు.

ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ చేర బిలిచి:

ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత.

ఇప్పుడే నాకు కల వచ్చింది.

ఈమె భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే అందరూ ఆమె పాదాలమీద పడ్డారు.

మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, అంది సీత.

అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు.

అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను.

నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ:

ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమయింది? అని అడిగింది.

అప్పుడు నేను:

అమ్మా! బలశాలియైన వానరేశ్వరుడు సుగ్రీవుడు. నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. 

జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! అయనకు ఆనవాలుగా ఏమయినా యిస్తావా, అని అడిగాను.

ఆవిడ ఈ మణి యిచ్చింది.

అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను.

అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. నేను ఓదార్చాను.

ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను.

ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులయిన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం అందుకుని వారిని యమపురికి పంపాను, హతశేషులు వార్తాహరులయ్యారు.

నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను,

రావణుడు జంబుమాలిని పంపించాడు.

వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు.

వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను.

అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు.

వారిని కూడా అంతకు ముందు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు.

వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు, ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి కొనిపోయారు.

ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను.

మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకు రమ్మని, ఇంకా ఏమన్నాడంటే;

రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి అయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు.

రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు, సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దశ దిశలకూ పంపాడు, నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను.

వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం.

ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు,

ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు.

రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు, నన్ను కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులుత్రిప్పుతూంటే నగరం అంతా చూసాను. చూడడం అయింది.

శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి, అంతలో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను.

అప్పుడు ఆకాశచారులమాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా వుందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ.

ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు.

ఆలోచనలు

Mitrasamaagamam - మిత్రసమాగమం

రామాయణం సుందరకాండ 56, 57 సర్గలు - మిత్రసమాగమం

ఆకాశ సముద్రంలో-
చంద్రుడే కలువ
సూర్యుడు నీటి కోడి.
పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు.
పునర్వసు మహా మీనం.
అంగారకుడు మొసలి.
స్వాతి నక్షత్రం హంసపథం.
ఐరావతం ద్వీపం.
మేఘాలే శైవలిని.
చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు.
పద్మాలు, నాగ, యక్ష, గంధర్వులు.

అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు, హనుమంతుడు.

సూర్య, చంద్ర, తారామండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు.

ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. 
బ్బుల మాటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె వున్నాడు.

గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు.

దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో అనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్ధలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని. 

ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేర బిలిచి:

నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.

పర
 సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.

హనుమంతుడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు.

అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలూ, పళ్ళూ కానుక లర్పించారు.

వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే:

ఆలోచించాడు; హనుమంతుడు. 

"దృష్టాసీతా" చూశాను సీతను, అని- 

రాక్షసస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, రా విరహ శోకంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు.

చూశాను అనేమాట అమృత ప్రాయంగా విని వారందరూ సింహ నాదాలతో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ పైకెత్తుతూ. నేలమీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికి ఎగురుతున్నారు. 

అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు మనం రామ దర్శనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనియాలు, నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు, అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు.

ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.

అన్వేషణ గాథ

Aascharyam - ఆశ్చర్యం

రామాయణం సుందరకాండ 55వ సర్గ - ఆశ్చర్యం

క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
క్రుద్ధో హన్యా ద్గురూ నపి

క్రుద్ధః పరుషయా వాచా
నరః సాధూ నధిక్షిపేత్‌


లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు.

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని యింత అఘాయిత్యం చెయ్యడమా! కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు.

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి పనులు కోపిష్ఠి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి.

దుర్బుద్దుడనై, లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి ద్రోహం జరిగిపోయింది.

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను.

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను.

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను.

సీత మరణించిందని వినగానే రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా!

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుణ్ని, అని చింతించే, హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా:

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని దరిజేరలేదు.

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా!

అవసర
యితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన చారణులు:

ఓహో! హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో వున్నా, జానకీదేవి అచంచలంగా ఆశోకవనంలో యథాపూర్వం వున్నది.

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. అయినా ఒక్కమారు తన కంటితో అమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి:

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు.

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం, సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు 
నం చెప్పనవసరంలేదు, అని జానకీదేవి అనగా హనుమంతుడు:

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు సెలవమ్మా, అని బయలుదేరి సముద్రతీరాన వున్న అరిష్ట పర్వతం అధిరోహించాడు.

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె వున్నాయి. రాళ్ళమీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. అకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములయి వెదురువనాలు నిర్విరామంగా కూజిస్తున్నాయి. మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్పులా, మంచునిండిన గండశిలలు ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి.

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు.

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర, గంధర్వులు.

సింహాలతో గుహలు.

శార్దూలాల విహారాలు.

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, గగనవీధికి లేచాడు.

అ పాదతాడనానికి పర్వతం, ముక్కముక్క అయింది. పిడుగుపడి మోడువారి నట్లయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల జేశాయి.

ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు.

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు.

మిత్రసమాగమం

Lanka Dahanam - లంకా దహనం

రామాయణం సుందరకాండ 53, 54 సర్గలు - లంకా దహనం

ఆలోచించాడు హనుమంతుడు.

ఈ వనం విధ్వంసం చేశాను.

రాక్షసయోధులు కొందరు నేలకూలారు.

ఇంక ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది.

అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను, అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించి, మహాపార్శ్వ, వజ్రదంష్ట్ర, శుక, సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు, రశ్మికేతు, మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు.

విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు.

రావణభవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్లు గర్జించాడు.

ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేల కూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధసౌధాలవలె వున్నాయవి.

పసిపిల్లలకు పాలిస్తూన్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధులవెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాలమీది స్త్రీలు తమ బట్టల మంటలవేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు ప్రవహిస్తున్నాయి.

క్వచి త్కింశుక సంకాశాః
క్వచిత్‌ శాల్మలీ సన్నిభాః ।
క్వచిత్‌ కుంకుమ సంకాశాః
శిఖా వహ్నేశ్చ కాసిరే ॥

ఆ మంటలు

ఒకచోట నిండుగా విరిసిన మోదుగుపూలవలె, మరొకచోట బూరుగు పుష్పాలవలె, ఇంకొకచోట కుంకుమ కాంతితో వున్నాయి.

త్రిపుర దాహదృశ్యం గోచరించింది లంకాదహనవేళ, వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే అజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా వున్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది.

వీడు వానరుడు కాడు.

వజ్రపాణియో, త్రిన్రేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి వుండాలి. కాకుంటే సాక్షాత్తూ చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్టవతేజం అవతరించి వుండాలి అనుకున్నారు రాక్షసులు.

లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరంమీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు.

హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి.

ఆశ్చర్యం

Vibhishana - విభీషణుడు

రామాయణం సుందరకాండ 52వ సర్గ - విభీషణుడు

హనుమంతుని మాటలు విని రావణుని క్రోధం అంచులు దాటింది.

ఈ వానరునికి శిరశ్ఛేదం చేయండి, అన్నాడు.

అది విని విభీషణుడు:

రాక్షసేశ్వరా! ఆవేశాన్ని విడిచి క్షమా హృదయంతో ఈ విషయం పరిశీలించాలి. విచక్షణకల ప్రభువులు దూతకు శిర
శ్ఛేదం చెయ్యరు. అది రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది.

నువ్వు ధర్మవిదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరము లేదు. నీ అంతటి వాడే రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార సమర్ధుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలే కాని ఇలా శిక్షించరాదు;
అని చెపుతూంటే రావణుడు:

విభీషణా! పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం శిర
శ్ఛేదమే అన్నాడు.

లంకేశ్వరా! ధర్మార్థ యుక్తంగా చెపుతూన్న నా మాటను ప్రశాంత చిత్తంతో ఆలకించు. యుద్దాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువని నేనూ అంగీకరిస్తాను. వీడు మనకు చాలా నష్టం కలిగించి, ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు దూత.

కొరడాతో కొట్టడం.
బుర్ర గొరిగించడం.

కాలో, చెయ్యో విరిచేయడం - ఇవీ దూతకు విధించే శిక్షలు, అంతే తప్ప దూతను వధించినట్టు మనం వినలేదు, ఎప్పుడూ.

యుక్తా యుక్తా లెరిగి, వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే ఆవేశానికి లొంగితే ఏం కావాలి. నిగ్రహం వివేక లక్షణం. ధర్మనిర్ణయంలో నిన్ను మించినవారులేరు. శాస్త్ర జ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడవు.

నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది.

ఇంకొక్కమాట-

ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు.

విడు తిరిగి వెడితే తప్ప ఆ మానవ వానర ప్రభువులు లంకకు యుద్దానికి రాలేరు.

పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతులయిన అనుచరులు కోట్ల సంఖ్యలో వున్నారు. వారిలో కొందరుపోయి ఆ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి, అన్నాడు.

విన్నాడు రావణుడు.

దేశ కాల యుక్తంగా కనపడింది, విభీషణుని మాట.

నువ్వు చెప్పినట్లు దూతవధ నింద్యమే. వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా యిష్టమయినది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి, అని ఆజ్ఞాపించాడు.

అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాతగుడ్డలు తెచ్చి హనుమంతుని వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు అంటించారు.

లంకలోని ఆబాల గోపాలం హనుమంతుని చూడడానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు.

ఈ లంకలో రాత్రి తిరగడంవల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలుచేస్తారు, అని సంతోషించాడు.

శంఖ, భేరీ ధ్వానాలతో నగరమంతా హనుమంతుని త్రిప్పుతున్నారు.

"వీడు గూఢచారి" అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి.

ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు, మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసా అగ్నిహోత్రుని ప్రార్థించింది.

యద్యస్తి సతి శుశ్రూషా
యద్యస్తి చరితం తపః

యదివా స్త్యేక పత్నీత్వం
శీతో భవ హనూమతః


పతిశుశ్రూషలో, తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్నీ వ్రతఫలం, హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నామీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమయినా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమకాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే అగ్నిజ్వాలలు హనుమంతునికి మలయ పవనాలు కావాలి, అని అనుకుంటున్నది.

ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదలి సీతాదేవికి సంతోషం కలిగించాడు.

కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది.

వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది.

నిన్న సముద్రం దాటుతూంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు, వాడే అలా వచ్చినపుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా!

రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం - ఈ కారణాలచేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి, అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు.

దేహాన్ని సంకుచితం చేశాడు.

అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత మంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను నేలకూల్చాడు.

ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు.

అగ్ని శిఖలతో నిండిన లాంగూలంతో హనుమంతుడు ఆదిత్య మండలంలా కనిపిస్తున్నాడు.

లంకా దహనం

Sandesham Message - సందేశం

రామాయణం సుందరకాండ 51వ సర్గ - సందేశం

మా ప్రభువు ఏమన్నాడో వినిపిస్తాను.

రథ, గజ తురగ పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు.

ఆయన లోక ప్రజలందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమమయిన తేజస్సు కల ఆ మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్దకొడుకు దండకారణ్యానికి వచ్చాడు.

ధర్మవర్తనుడూ, తీవ్ర బలపరాక్రమ సంపన్నుడూ, అయిన ఆ రా
చంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడూ, భార్య సీత వచ్చారు.

జనకరాజపుత్రి, పతివ్రత అయిన ఆ సీత ఒకనాడు దండకారణ్యంలో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింధచేరి ఋశ్యమూక పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా ప్రభువు.

వానర రాజ్యం సుగ్రీవునకు ధారవోశాడు రాముడు.

మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి.

నువ్వెరుగని వాడుకాదు వాలి,

అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేల కూల్చాడు రాముడు.

ఆడిన మాట ప్రకారం వానరసేనలను నాలుగు దిక్కులకూ పంపించాడు సుగ్రీవుడు.

మా వానర యోధులలో కొందరు వైనతేయులు, 
రికొందరు వాయుదేవసములు, అందరూ తీవ్రగమనం కలవారే.

వారిలో నేను వాయువునకు ఔరసుడనయిన హనుమంతుడను. నూరుయోజనాల సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను. 

నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడవు తపస్వివి. ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితంకాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు.

రామ లక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా ఊపిరి తీసుకోలేడు.

ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితమూ, ధర్మార్థ సంయుతమూ అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయనెవరనుకుంటున్నావో! మానవరూపం ధరించిన దైవం.

ఇక-

నేను సీత జాడ తెలుసుకున్నాను.

మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన.

నువ్వు సీతను అపహరించడం అంటే అయిదు పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికే వాడుండడు కదా! అలానే సీతను అపహరించడమూ.

తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడవు, ధర్మపరుడవు. 

కనక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు.

దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యంకాదు కాని, మానవుడైన రాముడు, వానరుడయిన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది.

నిన్నటివరకూ నువ్వు ధర్మకర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడీ సీతాపహరణమనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమయింది.

జనస్థాన వధం బుద్ధ్వా
బు
ద్ధ్వా వాలి వధం తథ
రామ సుగ్రీవ సఖ్యం చ
బుద్ధ్యస్య హిత మాత్మనః॥

జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేల కూలిన విషయం విన్నావు.

మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు.

రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడింక నీ శ్రేయెమార్గం తెలుసుకోవాలి.

ఇంత చెప్పడం దేనికంటావేమో!

నేనే నీ లంకా నగరాన్ని సర్వనాశనం చెయ్యగలను, కాని రాముడి కది అభి
తం కాదు.

సీతాపహరణం చేసిన వానిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.

పయిగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు.

సర్వ లంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి అవిడ.

కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు.

రామ క్రోధాగ్ని
సీతా తేజోగ్ని

ఈ రెండూ నీ లంకను సర్వనాశనం చేస్తూంటే చూడక తప్పదు నీకు.

నా మాట వను.

నీ సచివ, సామంత, బంధు మిత్రక్రోటిని రామ బాణాగ్నికి ఇంధనం చెయ్యకు.

ఈ సర్వభూతాలనూ ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వం సృష్టించగలవాడు రాముడు.

విష్ణు సమ పరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు.

చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలవరు. ఆయన తలచుకుంటే వీరెవ్వరూ అభయంకూడా యివ్వలేరు, అన్నాడు.

విభీషణుడు

Mimamsa - మీమాంస

రామాయణం సుందరకాండ 50వ సర్గ - మీమాంస

లోక కంటకుడైన రావణుడు హనుమంతుని చూసి:

ఈ మహాతేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు, నాడు నేను కైలాసాన్ని చలింపజేసిననాడు నన్ను శపించిన నందీశ్వరుడా!

కాకుంటే-

బాణాసురుడా! అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి: 

వీడెవడో! ఎక్కడనుంచి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో! మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు, అన్నాడు. 

ప్రహస్తుడు: ఓ వానరా! నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. 

దేవేంద్రుని దూతగా వచ్చావా! యమ, వరుణ, కుబేరులలో ఎవరయినా చారకృత్యానికి పంపారా! విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వం వున్నా నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. 

ఈ లంకా నగరంలో ఎందుకు అడుగుపెట్టావో, నిజం చెపితే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు, అన్నాడు. 

హనుమ: ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధమూ లేదు. విష్ణు ప్రేరణతో నేను రాలేదు. నేను వానరుడను. ఆ వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవ, దానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బాధించవు. అది నాకు పితాహుడిచ్చిన వరం. మీ హారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడనైనట్లు నటించి ఇలా వచ్చాను, అని రావణుని వెపు తిరిగి:

లంకేశ్వరా! సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన సోదరప్రే
తో నీ కుశలం అడగన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది.

సందేశం

Purvabhadra Nakshatra - పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభాద్ర నక్షత్రము

నక్షత్రం - పూర్వాభాద్ర
అధిపతి - గురువు
గణము - మానవ
జాతి - పురుష
వృక్షం - మామిడి
జంతువు - సింహము
నాడి - ఆది
పక్షి - మయూరము
అధిదేవత - అజైక పాదుడు
రాశి - 1,2,3 పాదాలు కుంభం, 4వ పాదం మీనం
సే, /సో,/ దా./ ఈ,/దీ,

పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో పూర్వాభాద్ర నక్షత్రము 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు.

ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి.

వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పే వరకు వీరికి తెలియదు.

సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది.


ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. సామాజిక సేవలో పేరు వస్తుంది. వైవాహిక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు తెలివైనవారు. సరళమైన జీవితాన్ని గడుపుతారు. దేవుడిపైనా పూర్తి విశ్వాసం ఉంటుంది. హృదయం స్వచ్ఛంగా ఉంటుంది కనుక, వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

నిజమైన సంపద కంటే, మంచి పేరు ప్రఖ్యాతులు మరియు విశ్వసనీయతలు వీరికి సంపదలుగా ఉంటాయి. వీరు నిజం మాట్లాడటంతో పాటుగా నిజాయితీగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు.

నిజాయితీగా ఉండటం వల్ల, అక్రమాలకు మరియు చౌకబారు ఎత్తుగడలకు వీరు దూరంగా ఉంటారు. వీరిలో ఆశావహన దృక్పథం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఆశను వదులుకోరు. వీరు దయాళువు కనుక ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు.

ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నట్లయితే, వారికి వీరు సహాయం చేస్తారు. వీరు అధునాతనంగాను మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్లనే వీరిని కలిసే ప్రజలు ప్రేమగాను మరియు అభిమానంగా ఉంటారు.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు స్నేహం విషయంలో నిజాయితిగా తీసుకుంటారు. చక్కటి ప్రవర్తనతో వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరిని బాధించడానికి వీరు ప్రయత్నించరు. వీరి వ్యక్తిత్వంలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల ప్రజలు వీరిని విశ్వసిస్తారు.

విద్య మరియు జ్ఞానం కోణంలో చూసినట్లయితే, వీరు చాలా తెలివైనవారు. వీరికి సాహిత్యంలో కూడా ఆసక్తి ఉంటుంది. దీనితో పాటుగా సైన్సు, ఖగోళశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఆసక్తులుంటాయి. అదేవిధంగా వీరు ఈ విషయాల్లో నిపుణులుగా ఉండవచ్చు. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగా ఉంటాయి.

ఆధ్యాత్మికతకు అదనంగా, వివిధ విషయాల్లో వీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా, జ్యోతిష్యశాస్త్రంలోనూ వీరికి ప్రావీణ్యం ఉంటుంది. వీరు ఒక ఆదర్శవాది, డబ్బు కంటే జ్ఞానానికి వీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. జీవించడానికి అవసరమైన డబ్బు కొరకు ఉద్యోగం లేదా వ్యాపారం రెండు వీరికి సానుకూలంగా ఉంటాయి.

ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు మరియు ఉద్యోగంలో ఉన్నతస్థానంలో ఉంటారు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే, ఎదుగుదల కొరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. వీరు భాగస్వామ్యంలో వ్యాపార చేయడానికి ఇష్టపడతారు. బాధ్యతల విషయానికి వస్తే, వాటిని బాగా అర్థం చేసుకుంటారు మరియు వీరి విధిని వీరు నిజాయితీగా నెరవేరుస్తారు.


పూర్వాభాద్ర నక్షత్రం మొదటి పాదము
పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.

ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించ గలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది.

ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యాభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది.

50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధ యాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదము
వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 10 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యా భ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదము
పూర్వాభాద్ర నక్షత్ర మూడవ పాద జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 6 సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదము
పూర్వాభాద్ర నక్షత్ర నాల్గవ పాద జాతకులకు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 2 సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

21 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పెంచవల్సిన చెట్టు
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం చాలా మంచిది మరియు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది. గురువుకు అధిపతి దక్షిణామూర్తి, దత్తుడు. గురువుకు శనగలు దానం, పసుపు రంగు వస్త్రం దానం మంచిది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ధన లాభం

విపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యహాని

సంపత్తార - అశ్విని, మఖ, మూల - క్షేమం

ప్రత్యక్ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - రోహిణి, హస్త, శ్రవణం - బంధనం

మిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం

అతిమిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం, లాభం

అంశ గుణాలు :
1. సేవాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, పూజ చేయువారు.

2. భోగాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహసవంతులు, మంత్రోపాసన చేయువారు.

3. విచక్షణాంశ : పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, జ్ఞానవంతులు.

4. ధనాంశ : పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు అందరిచేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు.

నక్షత్ర శాంతి: 
కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇవ్వవలెను.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అజ ఏక పాదుద'గాత్పురస్తా”త్ ।
విశ్వా' భూతాని' ప్రతి మోద'మానః ।
తస్య' దేవాః ప్రసవం యంతి సర్వే" ।
ప్రోష్ఠపదాసో' అమృత'స్య గోపాః ।
విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః ।
ఆంతరి'క్షమరుహదగంద్యామ్ ।
తగ్మ్ సూర్యం' దేవమజమేక' పాదమ్ ।
ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే" ॥

నక్షత్ర గాయత్రి
ఓం తేజస్కరాయ విద్మహే 
అజరక పాదాయ ధీమహి 
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – ముక్తేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి.
రెండవ పాదం – శాసనపల్లి లంకలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి.
మూడవ పాదం – తానెలంకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి.
నాలుగవ పాదం ఎర్రపోతవరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.

Friday, August 14, 2026

Brahmastra - బ్రహ్మాస్త్రం

రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం

హనూమతో వేద న రాక్షసోన్తరం
న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్‌ 

పరస్పరం నిర్విషహౌ బభూవతుః
సమేత్య తౌ దేవ సమాన నిశ్రమౌ ॥

అక్షకు
రుని రణవార్త విన్న అనంతరం దేవేంద్ర స పరాక్రముడయిన ఇంద్రజిత్తును చూస్తూ రావణుడు:

నాయనా! నువ్వు శస్త్రవేత్తలలో, అస్త్ర విద్యావిదులలో శ్రేష్ఠుడవు. నీ వీరత్వాన్ని దేవతలూ, దేవనాయకులూ చవిచూశారు. చతుర్ముఖ ప్రజాపతిని ఆరాధించి బ్రహ్మాస్త్రం సాధించావు.

రణరంగంలో దేవ దానవకోటులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. భుజబలం, తపోబలం కల నీ ధీశక్తి దేశకాలాలను పరిశీలించి సాగుతుంది.

నీ ఆలోచనకు ముల్లోకాలూ తలవంచాలి.

తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడవు. నువ్వు రణభూమికి వెడితే నేను నిశ్చింతగా వుంటాను.

ఆ వానరుని చేతులలో కింకరగణం నేల కూలింది. మన జంబుమాలి పడిపోయాడు. చతురంగబలాలతో సేనాపతులు తిరిగి రాలేదు. అంతకు ముందే మన సచివతనయులు కన్నుమూశారు.

ఇంతకుముందే నీ సోదరుడు అక్షకుమారుడు అంతి
 శ్వాసవిడిచాడు. వీరందరూ నీ అంత బలపరాక్రమ సంపన్నులుకారు. నువ్వు బాగా యోచించి ఆ వానరుని పరాక్రమం పరిశీలించి కార్యరంగంలో ప్రవేశించాలి. నిన్ను చూస్తుండగానే ఆ వానరుడు నిర్విణ్ణుడు కావాలి. వాడికి సేనాబలం లేదు, వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాడు. వాయుసుతుడు మాత్రమే. ఇవన్నీ తెలిశాక ఏం చెయ్యాలో నువ్వెరుగుదువు.

నిజానికి నిన్ను పంపడం ఉచితంకాదు, కాని రాజధర్మానుసారం ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధభూమిలో ఆయుధబలం మాత్రమేచాలదు, అవసరానుకూల
మయిన వివేచన కావాలి, అది విజయసాధనకు సహకరించాలి, అన్నాడు.

విన్నాడు ఇంద్రజిత్తు.

తండ్రికి ప్రదక్షిణం చేశాడు.

పొంగుతూన్న సముద్రంలా బయలుదేరాడు.

రథాన్ని అధిరోహించాడు.

ఆ సమయంలో మృగరోదనాలు బయలుదేరాయి.

వస్తున్న రథధ్వని, ధనుష్టంకారం విన్న హనుమంతునికి సంతోషం కలిగింది.

ఆ యుద్ధం చూడడానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. వారుభయులూ సురాసుర ప్రభు తేజంతో వెలుగుతున్నారు. ఇంద్రజిత్తు వాడి మొనలుగల బంగారు రెక్కల బాణాలు వదులుతున్నాడు. హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు.

లక్ష్యశుద్ధిగల ఇంద్రజిత్తు విడిచే నిశితశరాలను అనాయాసంగా దూరం చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది.

హనుమంతుని శక్తి ఎంతటిదో అంతుచిక్కలేదు, ఇంద్రజిత్తుకు.

రాక్షసపుత్రుని సామర్థ్యం ఈయనకూ అందలేదు.

ఒకరికొకరు దుస్సహంగా వున్నారు.

ఏనాడూ గురి తప్పని తన విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి ఆలోచించి, వీడు శస్త్రాస్త్రాలతో కడతేరడు అని నిశ్చయించి బ్రహ్మాస్త్రం సంధించి విడిచాడు.

హనుమంతుడు చైతన్య హీనుడై నేలమీదపడి క్షణంలో తెలివిరాగా;

ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితా
హుని వరప్రభావంవల్ల ఏ అస్త్రమూ నన్ను వధించదు: ఈ అస్త్రబంధాన్ని విడిపించుకునే శక్తీలేదు. ఇంద్ర, వాయు, బ్రహ్మలు రక్షిస్తున్నారు, కనక భీతిలేదు, అనుకున్నాడు.

నేను రావణుని దగ్గరకుపోయి మాట్లాడే అవకాశం ఈ విధంగా కలిగింది. అని కదలకుండా వున్న ఆ వానరవీరుని చేరిన రాక్షసులు నారచీరలతో, చెట్లనారలతో గట్టిగా బంధించారు. అయినా కదలలేదు.

చూశాడు రావణి.

ఎంత మూర్ఖంగా చరించారు మా వీరులు.

ఒక అస్త్రం బంధించి వున్నప్పుడు మరో బంధనంచేస్తే ఆ అస్త్రబంధం విడిపోతుందని ఎరుగని వారయారు వీరు, అనుకుంటూ నడుస్తున్నాడు.

రాక్షసులు హనుమంతుని లాక్కుని వెడుతున్నారు.

బ్రహ్మాస్త్ర బంధం వదిలినట్టు తెలియ లేదాయనకు. ఉభయులూ లంకేశ్వరుని కొలువులో ప్రవేశించారు. బంధిత మత్తేభంలా ఉన్నాడు హనుమ.

అసలు వీడెవడు?
ఇక్కడ ఏం పని వీడికి?
ఎవరి బలం చూసుకుని వచ్చా డిక్కడికి?

అని రాక్షస ప్రముఖులు ఒకరితో ఒకరు గుసగుస లాడుకుంటున్నారు. నరకండి, నిప్పులో మండించండి, హాయిగా విరుచుకు తినేయండి, అంటున్నారు మరికొందరు.

రత్న సింహాసనం మీది రావణుడు హనుమంతుని చూశాడు. తేజః పరాక్రమాలతో సూర్యకాంతితో ఉన్న రావణుని హనుమంతుడు తిలకించాడు.

రావణుని కన్నులు ఎర్రబడ్డాయి.

హనుమంతుని నేత్రాలలో చింతనిప్పులు పుడుతున్నాయి.

స్వర్ణ నిర్మితమూ ముక్తా జాలావృతమూ అయిన కిరీట శోభిత శీర్షంతో వజ్ర, మాణిక్య భూషణాలతో చీని చీనాంబరాలంకృతుడై, రక్త చందన లేపంతో అరుణారుణనయనుడై వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభదేహంతో తారహారాలంకృత వక్షంతో, బలాక పక్షులతో నిండిన మేఘంలా ఉన్నాడు. ఆ బాహువులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి.

రత్న, స్ఫటిక ఖచితమయిన ఆస్తరణం పరచిన సింహాసనం మీద వున్న చక్రవర్తికి ఇరుపార్శ్వాల వింజామరలతో అందగత్తెలున్నారు.

మంత్రాంగ కుశలులయిన మహాపార్శ్వ, దుర్ధర, ప్రహస్త నికుంభులు ఆయన కిరువంకలా ఆసీనులయారు. మిగిలిన సచివమండలి అటూ యిటూ వున్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృతుడైన ఇంద్రుని వలె ఉన్నాడు.

స్వర్ణ సింహాసనం మీది రావణుడు మేరుగిరిపై నీలమేఘంలా వున్నాడు.

ఆ రాక్షసేశ్వరుని తిలకించే హనుమంతునికి ఆశ్చర్యం కలిగి:

అహో రూప మహో ధైర్యం
అహో సత్వ మహో ధృతిః।
అహో రాక్షస రాజస్య
సర్వలక్షణ యుక్తతా॥

య ద్యధర్మో న బలవాన్‌
స్యాదయం రాక్షసేశ్వరః

స్యాదయం సురలోకస్య
స శక్రస్యాఫై రక్షితా ॥

ఈ రాక్షసేశ్వరుని సొందర్యం, ధైర్యం, శక్తి, బలం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్వలక్షణ లక్షితుడైన ఈ ప్రభువు అధర్మానికి ఒడిగట్టకపోతే దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకు పాదాక్రాంతుడు కావాలి.

ఈయన చేసే క్రూర, ఘాతుకాలు కారణంగా దేవ దానవ గణాలు వీనికి భయపడుతున్నాయి.

ఈ రావణుడు తలచుకుంటే లోకాన్ని జలప్రళయంలో ముంచెత్తగలడు, అని ఊహిస్తున్నాడు, హనుమంతుడు.

మీమాంస

Ravana Nandhanudu - రావణ నందనుడు

రామాయణం సుందరకాండ 47వ సర్గ - రావణ నందనుడు

హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న రావణుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా ఉన్న అక్ష కుమారునివైపు తిరిగాడు.

ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించి ధనుస్సు చేబూనిలేచాడు. మంత్రహుతమయిన ఆజ్యాహుతులతో ప్రజ్వలిత
యిన అగ్నివలె వెలుగుతూ రధారూఢుడై బయలుదేరాడు. తపశ్శక్తితో సంపాదించిన ఆ స్యందనం బంగారు జాలరులతో రత్నఖచిత పతాకాలతో, మనోవేగంతో ఆకాశమార్గాన పోగలగిన, దానికి ఎనిమిది గుర్రాలు పూన్ని వుంచారు.

రథం బయలుదేరింది.

దాని వెంట చతురంగబలాలూ అనుసరించాయి. అంతవరకూ జరిగిన త
 సేనాసంహారంతో ఉద్రిక్తుడయిన అక్షకుమారుడు సింహ నేత్రాలతో వున్నాడు.

ఆ స
యంలో అటు హనుమంతునీ యిటు అక్షకుమూరునీ తిలకించే సర్వప్రాణికోటీ గజగజలాడింది.

సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది.
ఆకాశం దద్దరిల్లింది.
సముద్రం కల్లోలమయింది.

ధనుర్విద్యా విదుడయిన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన మూడు బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలవలె అవి హనుమంతుని శిరస్సున నాటుకున్నాయి,

ఆ బాణకిరణాలతో ఉదయసూర్యు డయాడు హనుమంతుడు.

అక్షకుమారుని వీర పరాక్రమాలకు సంతోషించి, మారుతి కన్నులేర్రజేశాడు. ఆ వేడికి రాక్షససేన భస్మమయేలా ఉంది.

వానరపర్వతంమీద బాణవర్షం కురిపించాడు, రావణనందనుడు. 

సింహగర్జన చేశాడు హనుమంతుడు.

ఒక్కసారి కాళ్ళూ చేతులూ ముడిచి దూకాడు.

దూకుతున్న వానిమీదికి శరపరంపర నడిపాడు. ఆ బాణాల
ధ్య నుండి గాలివలె తప్పించుకుంటూన్న సమయంలో భుజసంధులలో తగిలిన బాణఘాత తీవ్రతకు గట్టిగా అరచి:

వీడు వయసులో బాలుడైపోయాడు. వీణ్ణి చంపడానికి నాకు మనసు రావడంలేదు. అయితే వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు, వీణ్ణి ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు, అని ఆలోచించి ఒక్కదూకులో గుర్రాలను తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమయింది. అంతతో ఆ యువకుడు గగనవీధికి లేచాడు.

మహాసర్పాన్ని గరుత్మంతుడు కాలిగోళ్ళతో పట్టి ముక్కుతో చీల్చినట్లు అక్షకుమూరుని కాళ్ళు రెండూ బిగబట్టి గిర్రున త్రిప్పి వదిలాడు హనుమంతుడు.

వాని అవయవాలు పట్టు తప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటీ ఆశ్చర్యచకితం అయింది.

మానవ మారణహోమంతో ఆనందించే యమునివలె హనుమంతుడు సంతోషంగా ద్వారతోరణంచేరి కూర్చున్నాడు.

బ్రహ్మాస్త్రం

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...