Saturday, April 25, 2026

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి

నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల్పి తిరిగి తన వైకుంఠథామ మరిగెను. పిమ్మట 

బ్రహ్మ మనువుతో నిట్లనెను: స్వాయంభువ మనూ! మహాబాహూ! పుత్రా! తేజస్వులలో శ్రేష్ఠా! ఈ నేలపై నుండి నీకు దోచిన రీతిగ ప్రజా సృష్టి కొనసాగింపుము. దేశకాలములకు తగినచట్లు నుత్తమమైన యజ్ఞసాధనములు సమకూర్చుకొని యజ్ఞ పూరుషునిగూర్చి వేల్పుము. శాస్త్రక్తముగ వర్ణాశ్రమ ధర్మము పాటించుచు ఈ క్రమపద్దతి నే ప్రజావృద్ది జరుగగలదు. 

విద్యావినయసం పదలు-సదాచారము - గల్గి కీర్తిలో కాంతిలో నీకు ప్రతిరూపులగు కుమారవరులను పెక్కురను త్రిగుణాను గుణశీలవతులగు కన్యలను గని పిదప మనస్సును ప్రధాన పురుషునందు చక్కగ నిలుపుము. భక్తిసాధన యోగముతో భగవంతునకు కైంకర్యములు చేయుచు పరమయోగులు పొందునట్టి మాన్యపరమగతిని బొందుము. 

ఈ రీతిగ కమలనిలయుడగు ప్రజాపతి తన పుత్రుడగు మనువును ప్రజాసృష్ఠిలో నియమించి తన నివాసమున కరిగెను. 'సంతతి బడయు' మను తండ్రిమాట జవదాటక స్వాయంభువమను మహీపతి ప్రజాసృష్టికి గండగెను. అంతమునువునకు ప్రియవ్రతుడు - ఉత్తానపాదు డను నిర్వురు కొమరులు గల్గిరి. పిదప మువ్వురు కన్నియలు గల్గిరి. వారి పేర్లు వినుము: 

మొదటి కన్య 'అకృతి' రెండవ కన్నియ 'దేవహూతి' మూడవ కన్నె 'ప్రశూతి'. వీరులోకపావనలై వన్నె గాంచిరి. ఆకృతిని రుచికి - దేవహూతిని కర్దమునకు - ప్రసూతిని దక్షున - కిచ్చి మనువుపెండ్లిచేసెను. ఈ లోకమంతయును వీరి సతంతియే.

ఆకృతి రుచులకు యజ్ఞడను పేరుతో నాది పూరుషుడగు భగవానుడవతరించెను. దేవహూతి కర్దములకు కపిలుడుగ హరి యవతరించెను. ఈ కపిలుడే సాంఖ్యయోగ ప్రవర్తకుడని లోకమున విఖ్యాతి గాంచెను. ప్రసూతి దక్షులకు పెక్కురు ప్రజలు గలిగిరి. వారికి దేవ - తిర్యక్కులు - నరులు మున్నగు వారు లోకవిఖానితులైన వారు గల్గిరి. వీరెల్లరును సృష్టి కర్తలే. 

యజ్ఞభగవానుడు స్వాయంభువ మన్వంతరమందు యామదేవ గుణములతో గూడి రాక్షసుల బారినుండి మనువును గాపాడెను. మహీయోగియగు కపిల భగవానుడు తన యాశ్రమమందుండి దేవహూతికవిద్యనాశకమగు పరమ జ్ఞానము భోధించెను. ఆది సవిశేషమైన ధ్యానయోగము; ఆధ్యాత్మజ్ఞాన నిశ్చయము; అజ్ఞానమను పెంజీకట్లు బాపువెల్గుబాట; కాపిలశాస్త్రమని ప్రచారది మందినది. 

కపిల మహాయోగి తన తల్లికి సాంఖ్య ముపదేశించి పులహాశ్రమ మేగెను. అసాంఖ్యా చార్య మహాశయు డిప్పటికి నచ్చటనే కలడు. ఎవ్వాని దివ్యనామ సంస్మరణమున సాంఖ్యయోగము సిద్దించునో- యోగాచార్యడు-సర్వవరప్రదుడు నగునట్టి కపిలునకు నమస్కారములు. ఇట్లు మను కన్యల యుత్తమవంశము వర్ణించితిని. దీనిని చదివిన-వినన వారి సర్వపాపములు పటాపంచలగును. 

ఇకమీదుట మునుపుత్రుల శుభవంశ వర్ణనము వినిపింతును. దానిని విన్నంతమాత్రన పరమపదము చేకూరును. లోక్యవ్యహారము కొఱకు సకల భూతముల కల్యాణము కొఱకు మనుపుత్రులు ద్వీప- వర్ష- సముద్రములను నేర్పాటు లేర్పరచిరి.

నారాయణుడిట్లనెను: స్వాయంభువ మనువు పెద్దకొడుకు ప్రియవ్రతుడు; పితృసేవాపరుడు; నిత్య-సత్య-ధర్మపరాయణుడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కన్యను - బర్హిష్మతి యను సమాన-శీల- వయో- రూపములు గల యందాలరాశిని-చేపట్టెను. 

ప్రియవ్రతుడు మహాత్ముడామె యందు గుణవంతులగు పదిమంది పుత్రులను ఊర్జస్వతియను కన్నియను గనెను. మొదటివాడు అగ్నీధ్రుడు; రెండవవాడు ఇధ్మజిహ్వుడు; మూడవవాడు యజ్ఞబాహుడు; నాల్గవవాడు - మహావీరుడు; ఐదవ రుక్మశుక్రుడు; ఆరవవాడు ఘృతపృష్ఠుడు; ఎనిమిదవవాడు మేధాతిథి; తొమ్మిదవవాడు వీతిహోత్రుడు; పదవవాడు కవి; ఈపదిమందియు వహ్నినామము గలవారు. 

ఈ పదిమంది పుత్రులలో కవిసవనుడు మహావీరుడను మువ్వురును విరాగులైరి. వీరు ఆత్మ విద్యా నిష్ణాతులై-ఊర్ద్వ రేతస్కులై వీతరాగులై-పరమహంసాశ్రమంమందానందమున నుండిరి. 

ప్రియవ్రతునకు వేరొక భార్యయందు 'ఉత్తమ-తామస-రైవతు'లను మువ్వురు ప్రసిద్ద పుత్రు లుద్బవించిరి. వీరు మన్వంతరముల కధిపతులై ప్రసిద్ధి గాంచిరి. వీరు మహావిక్రమవంతులు. ఇట్లు ప్రియవ్రత మహారాజీ భూమి నేలెను. ప్రియవ్రతుడు మొక్కవోని యింద్రియ పటుత్వముతో పదునొకండరర్బుదముల యేండ్లు పరిపాలించెను. 

సూర్యుడీ భూమిపైనెప్పుడును అర్ధభాముననే వెల్గును. భూమి రెండవ భాగమున కాఱు చీకట్లలముకొనును. ఇట్టి వైపరీత్యము తన యేలుబడిలో నుండుట రాజు మదికి బాధ గలిగించెను. నేనీ సమస్త భూమండలమును నిరాటంకముగ నేలుచుండగ నీ చీకటి యలముటేమి? నీ యోగబలముతో భూమిపై చీకటి తొలగింపగలను. అని స్వాయంభువ పుత్త్రుడు నిశ్చయించుకొని సూర్యప్రభలు చిందించు రథము నిర్మింపజేసి యేడు మారులు భూమిని ప్రదక్షిణించెను. అతని రథము సాగుచుండగ నేమి రేఖలచే భూమిపై నేడు గుర్తలు పడి యవిలోకమున సప్తసముద్రములుగ ప్రసిద్ధిగాంచెను.

భూమిపై గుర్తులు పడని భాగములు ద్వీపములుగ పేర్కొనబడెను. ఆ రథపు చక్రపుంటచుల గుర్తులు గల భాషములు పెద్దయగడ్తలై యేడు సంద్రములుగమారెను. వాని మధ్యభూమి యేడు దీవులుగ నయ్యెను. అవి జంభూద్వీపము, ప్లక్ష ద్వీపము-శాల్మలీ ద్వీపము-కుశద్వీపము - క్రౌంచద్వీపము శాకద్వీపము పుష్కరద్వీపము; 

వాని పరిమాణము లుత్తరోత్తములుగ రెండింతులుగ నుండును. వీనికి నలు వైపుల బైట క్రమముగ క్షార-ఇక్షు-సురా-ఘృత క్షీర దధిజలసముద్రములు గలవు. ఈ నేలపై నీ యేడు సముద్రములును ప్రసిద్ధి గాంచినవి. మొదటిదగు జంబూద్వీపము క్షారసముద్రముచే చుట్టబడియున్నది. ప్రియవ్రతుడు దానికాగ్నీధ్రుని రాజుగతేసెను. ప్లక్షద్వీపముచుట్టును చెఱకు సంద్రము గలదు. ప్లక్ష ద్వీపమువన కిధ్మజిహ్వుడధిపతిగ చేయబడెను. యజ్ఞబాహుడు సురాసంద్రముచే చుట్టబడిన శాల్మలి దీవికి నాయకుడయ్యెను. రమ్యమగు కుశద్వీపము చుట్టు నేతి సంద్రము గలదు. ఈ దీవిని ప్రియవ్రతపుత్రుడుగు హిరణ్యరేతుడేలెను. ఐదవవాడగు ఘృతపృష్ఠుడు మహాబలశాలి. 

ఈ ప్రియవ్రత తనయుడు పాలసంద్రముచే చుట్టబడిన క్రౌంచ ద్వీపమునకు రాజుగ చేయబడెను. పెరుగు సంద్రముచేత చుట్టబడిన యందమైన శాకద్వీపమునకు ప్రియవ్రతసుతుడగు మేధాతిథి ధరానాధుడయ్యెను. వీతిహోత్రుడు మంచినీటి సంద్రముచే చుట్టబడిన పుష్కర ద్వీపమునకు తండ్రిసమ్మతితో రాజయ్యెను. ప్రియవ్రతుడు తనయూర్జస్వతి యను కన్యను శుక్రున కీయగ వారికి పేరు గాంచిన దేవయాని యను కన్య జనించెను. ఈ విధముగ ప్రియవ్రతుడు సప్త ద్వీపములను తన కొడుకులకు పంచిపెట్టి యాత్మ వివేకవంతుడై జ్ఞానము బడయుటకు యోగమార్గవలబించెను.

భువన వ్యవస్థ






Adivarahamurthy - ఆదివరాహమూర్తి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - ఆదివరాహమూర్తి

నారాయణుడిట్లనెను: పరంతాపా! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింపసాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. 

నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యముగనుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. 

దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘురరావమును వినిరి. అంత విప్రులు ఋక్‌-సామ-ఆధర్వణములందలి-ఛంధో మయములగు వచస్సులతో ఆద్యపురుషుని వరాహమును సుంస్తుతించిరి. 

వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు వరాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీట ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.

అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూతకోటుల కాశ్రయభూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తనకోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవునిగనిబ్రహ్మ-మనువు-స్వరాట్టుమున్నగువారతని నిట్లు సంస్తుతించిరిః 

బ్రహ్మయిట్లనెను: ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామఫలప్రదా! నీకు విజయమగుత! నీవుసత్యలోకమును సైతము ప్రతాపముచే కురుచపరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. 

దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింపబడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. 

దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాసరూపమున దేవ - అసుర-నరులను తృప్తిపఱచుచున్నాడు.

సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోకపాలకుడయ్యెను. 

గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోకవంద్యుడగునగు శివుడుసర్వదేవాధినాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లుచున్నాడు. 

ఇన్ని సర్వ శుభలక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవునగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణమునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహదేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. 

అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడుసర్వపాపముక్తుడై వైష్ణవ మార్గము బొందును.

స్వాయంభువమను సృష్టి






Bhuvana Kosamu - భువనకోశము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భువనకోశము

జనమేజయు డిట్లనెను: ఓ విప్రఋషీ! అమృతమునకు తావలమైన సూర్యచంద్రనవంశజులగు రాజుల సచ్చరిత్ర మును నీనోటచెవులారవింటిని. ఇపుడెల్ల మన్వంతరములందును శ్రీదేవి యేయే రూపములు దాల్చిపూజలందుకొనును? ఏయే స్థానములందేయే కర్మములచే నేయే శరీరములు దాల్చి యారాధింపబడి దేవిఫలము లొసగును. ఏ యే మంత్రబీజములచే జపింపబడును? 

ఆదేవి విరాట్స్యరూపవర్ణన యెట్టిది? ఎట్టిధ్యానమువలను బుద్ది సూత్రాత్మలో లీనమగును? అంతయును నాకు విపులముగ తేటతెల్ల మొనరింపుము. దానివలన నాకు శుభము గలుగుత. 

వ్యాసు డిట్లనెను: రాజా! అత్యుత్తమమైన శ్రీదేవ్యారానము గుఱించి చెప్పుచున్నాను. వినుము. అట్టియారాధనముచేసిన-విన్న-కన్నంత-మాత్రన నరుడు సకల శుభములుపడయగలడు. ఇదేవిషయమును గూర్చి మునుపు నారదుడు నారయణునడిగెను. అపుడు యోగవిద్యా ప్రవర్తకుడగు విష్ణు వతనికి చెప్పినవి నీకును చెప్పుదును వినుము. 

పూర్వ మొకప్పుడు నారదుడు యోగాత్మకుడగు పురుషోత్తమునితో నీ వడిగివన విషయము లడిగెను. 

ఓ దేవదేవా! మహాదేవా! పురాణపురుషోత్తమా!జగదాధారా! సర్వజ్ఞా! పోగడ దగిన సద్గుణముల రాశీ! ఈ ప్రపంచముయొక్క మూలతత్త్వ మెఱిగింపుము. ఈజగమంతయు నెచటినుండి పుట్టును? ఎచట ప్రతిష్ఠింబడి యున్నది? ఇది తుదకెచటలయ మొందును? ఎల్ల కర్మఫలము లెచటినుండి గల్గను? దీని నెఱింగినందువలన మోహకారమగు మాయ నశించగలదు? ఎవరి నర్చించిన నెవరిని జపించిన నెవరిని ధ్యానించిన చీకటి యండు సూర్యోదయమునలె స్వాత్మప్రకాశమగు జ్ఞానము గల్గను?

దేవా! నా యీ ప్రశ్నముల కన్నిటికి పూర్తిగ సమాధానము లిమ్ము. వానివలన వేగముగ లోకములన్నియు నజ్ఞాన తమస్సునుండి విడిపడును. అని దేవర్షి ప్రశ్నింపగా పురాణమునిసత్తముడు మహాయేగియగు నారయణుడానందభరితుడై యతని కిట్లు పలికెను: 

ఓయి దేవఋషీ! ఈ జగముయొక్క మూలతత్త్వము వినుము. దాని నెఱుంగుటవలన మానవుడు తిరిగి జగద్బ్రాంతిలో పడడు. ఈ జగత్తు మూలతత్త్వముగూర్చి నాతో దేవియే స్వయముగ మున్ను చెప్పినది. దేవ-ఋషి-గంధర్వ-మనీషులును నాతో చెప్పిరి. ఈజగమును దేవియే త్రిగుణము లాధారముగ చేసికొని పుట్టించును. పెంచును. తుద కామెయే సర్వము నశింపజేయును. 

దేవి దివ్వస్వరూపమును మహర్షులు-సిద్దులు వర్ణించి పూజించి చెప్పిరి. ఆస్వరూపమును స్మరించినంతనే పాపములు తొలగును. కామమోక్షములు గలుగును మొట్టమొదటి బ్రహ్మపుత్రుడు స్వాయంభువ మనువు. ఆతడు ప్రతాపవంతుడు. మన్వంతరాధిపతి-శతరూపాపతి-శ్రీమంతుడు. మనువు కల్మషరహితుడు ప్రజాపతియుగు తన పితృదేవుని భక్తితో సేవింపగ బ్రహ్మ తన కుమారున కిట్లనెను: 

ఓయి వత్సా! నీవు పవిత్రయు-సర్వోత్తమయునగు దేవి నారాధించుము. ఆమె దయవలన నీకు ప్రజాసృష్టి గల్గించు శక్తి గల్గును. అని బ్రహ్మపలుకగ స్వాయంభువ విభుడు జగత్కారణురాలగు జగదంబను గూర్చి తపముచేసి యామెను సంతోషపఱచెను. అతడు నిశ్చలమతితో సర్వ కారణకారణ-సర్వశక్తి-సమష్టిబ్రహ్మశక్తి-అద్య-దేవేశియగుదేవి నిట్లు నుతించెను. 

ఓ జగత్కారణకారణదేవీ! దేవేశ్వరీ! శంఖచక్రగదాహస్తా! నారాయణహృదయ కమలవాసినీ! నీకు శతకోటి నమస్సులు.

ఓ జగన్మాతా! కారణ స్దాన రూపిణి! శివా! సర్వ దేవ సన్నుతా! వేదత్రయ ప్రమాణజ్ఞా! వేదమూర్తీ! నీకు శతకోటినమస్సులు. మాహేశ్వరీ! మాహాభాగా! మహామాయా! మహోదయా! మహాదేవ ప్రియంకరీ! మహాదేవప్రేయసీ! నీకు శతకోటి నమస్సులు. గోపేంద్రప్రియా! జ్యేష్టాదేవీ! మహానందా! మహోత్సవా! మహామాయా! భయహరీ! దేవాదిపూజితా! నీకు శతకోటి నమస్సులు. సర్వమంగల మాంగల్యా శివా! సర్వార్థసాధికా! శరణ్యా! త్య్రంబకదేవీ! గౌరీ! నారాయణీ! నీకు శతకోటి నమస్సులు. 

ఈ విశ్వమంతయు నెవరి వలన నుత్పన్నమై ఎవరితో పడుగు పేకలతో వలె నిత్యము నిండియుండునో ఏది దివ్య చైతన్యపుంజమో యెద్ది తేజో విధానమో యెద్ది యాద్యంతరహితమో ఏ దేవీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగము లన్నిటిని పుట్టించునో హరి పాలించునో రుద్రడు సంహరించునో పద్మసంభవుడును మధుకైటభ భయపడితుడునగు బ్రహ్మ యే దేవిని సన్నుతించి ఘోర దానవ భయము పాసెనో అట్టి దేవిని హ్రీ-కీర్తి-స్మృతి-కాంతి-కమల-గిరిజ-సతి-దాక్షాయణి-వేదగర్బ-బుద్థిదాత్రి-అభయవు నీవే! ఓశ్రీమాతా! నీకు శతకోటి నమస్సులు. 

నేను నిన్నే పూజించి -జపించి-ధ్యానించి-భావించి వీక్షించి-విని-సుతింతును. దేవీ! నాయెడల ప్రసన్ను రాలవు గమ్ము బ్రహ్మవేదములకు నిధి; విష్ణువు లక్ష్మీ నిలయుడు; ఇంద్రుడు త్రిలోకపతి; వరుణుడు జలాధినేత; కుబేరుడు నిధులకునాధుడు; యముడు ప్రేతపతి; నైఋతుడు రక్షోదక్షుడు; సోముడు జలమయుడు; వీరెల్లరు నీ వలన నున్నత పదవులందిరి. జగన్మాతా! నీవు త్రిలోకవంద్యపు; లోకేశ్వరివి; మహా మాంగల్యస్వరూపిణివి; నీకు శతకోటి నమస్సులు తల్లీ!

నారాయణు డిట్లనెను: నారదా! అని యిట్లు దుర్గ-భగవతి-నారాయణి దేవిని సన్నుతింతగ దేవిని ప్రసన్నరాలై మనువున కిట్లు పలికెను. 

బ్రహ్మపుత్రా! రాజేంద్రా! నీ సంస్తవమునకు ప్రసన్నురాలనైతిని. ఏదేని వరమడుగుము. 

మను విట్లనెను: దయామయా! దేవీ! నా భక్తికి ప్రసన్నవైనచో నీ యానతి వలన నేయడ్డంకులు లేక ప్రజాసృష్టి కొనసాగవలయును. 

శ్రీదేవి యిట్లనెను: రాజేంద్రా! నాయనుగ్రహము వలన ప్రజాసృష్టి నిర్విఘ్నముగ నుత్తరోత్తరముగ నభివృద్ధి జెందుగాత! నా మీది భక్తితో నీవు స్తుతించిన యీ స్తోత్రము నెవడు పఠించునో యతనికి తప్పక విద్య సంతతి కీర్తి కాంతి గల్గను; 

రాజా! ఎవరు దేవి దయకు పాత్రులో వారికి ధన ధాన్యములు గల్గను; ఎల్లెడల వారికి విజయము సుఖము గల్గను; శత్రువులు నశింతురు. 

నారాయణు డిట్లనెను: ఈ విధముగ బ్రహ్మపుత్రుడగు మనువునకు వరము లొసంగి యాధీశాలి చూచుచుండగ దేవి యంతర్దాన మొందెను. రాజా! ఇట్లు బ్రహ్మపుత్రుడగు ప్రతాపి యగు మనువు వరములు బడసి తనకోక ప్రత్యేక సాధన మిమ్మని బ్రహ్మనడిగెను. నే నచ్చటి నుండి పుష్కలముగ ప్రజలను సృజింపగలను; యజ్ఞములతో దేవేశిని గూర్తి వెల్తును; త్వరగ నాకు చోటు చూపుము; ఆజ్ఞాపింపుము. ఆను కూమారుని పలుకులు విని ప్రజాపతియు విభుడునగు బ్రహ్మ యీ పని యెట్లు నెఱవేరునాయని దీరఘముగ నాలోచించెను. ఈ యనంతమైన సృష్టి చేసి నా కనంతకాలము గడచిపోయెను. భూమి నీట మునిగెను; అన్నిటికి జలము సదా ధారమయ్యెను, ఈ నా తలంచిన కార్యము నాది పూరుషుడగు భగవానుడే చేయగలడు. ఎవని యాదేశమున నే నిచట నుంటినో యతడే నాకీ పనిచో తోడుపగలడు.

ఆదివరాహమూర్తి






SRI DEVI BHAGAVATHAM PART 8 - శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన శౌనకాదిమ మహర్షులు హర్షపులకితగాత్రులు ఆయ్యారు.

శౌనకాది మహామునులారా! అప్పుడు జనమేజయుడు అడిగినదీ వ్యాసుడు చెప్పినదీ  వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి - అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు.

వ్యాసమహర్షీ! సూర్యచంద్రవంశాల చరిత్రనూ దేవీగీతనూ వినిపించావు. అమృత ప్రాయంగా ఆస్వాదించాను. మన్వంతరాలలో మహాదేవిని ఏయే స్థానాలలో ఎయే రూపాలలో ఏయే పూజలతో ఏయే బీజాక్షరాలతో ఎలాయెలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తెలియజెప్పవా - అని అభ్యర్థించాడు జనమేజయుడు. 

వ్యాసుడు డిట్లనెనుజనమేజయా ! విను. దేవీ ఆరాధనవిధానమంతా చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే. వెనకటికి నారదుడు అడిగితే యోగమార్గప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలివి.

భువనకోశము












Method of external worship - బాహ్యపూజా విధానం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - బాహ్యపూజా విధానం

శ్రీదేవి యిట్లనెను: సాధకుడు ప్రొద్దుప్రొద్దుననే మేల్కాంచి తన బ్రహ్మరంధ్రమున కర్పూరవర్ణముగల దివ్య సహస్రారకమలమందు స్వాత్మరూపుజగు గురుదేవుని సంస్మరించవలయును. గురుదేవుడు లసద్‌భూషలుదాల్చి సకల విచిత్ర శక్తులు గల్గియుండును. 

అతనికి మ్రొక్కి పిదప బుధుడు కండలినీదేవిని మది తలంపవలయును. కుండనీశక్తి బ్రహ్మరంధ్రము జేరునపుడు చైతన్య కాంతి పుంజములు విరజిమ్ముచు క్రిందికి దిగునపుడమృతస్వరూపిణి యగుచు సుషుమ్నా మార్గమున సంచరించునపుడు బ్రహ్మానంద రసస్వరూపమున చెన్నుదలిర్చును. 

అట్టి పరాశక్తిని శరణు వేడుచున్నాను. అని మూలాధారమందలి చైతన్యజ్యోతితో వెలగొందుచున్న సత్యజ్ఞానానంతరూపిణి నగు నన్నే ధ్యానింపవలయును. అటుపిమ్మట శౌచాది నిత్యకృత్యములు తీర్చుకొనవలయును. తర్వాత బ్రహ్మణుడు నన్నుద్దేశించి నా ప్రీతికై యగ్నికారయము జరిపి పిదప సఖాసనమున గూర్చిండి నా పుజకు సంకల్పించవలయును. 

తొలుత భూతశుద్ద జేసి తర్వాత మాయబీజమగు హ్రీంకారముతో మాతృకాన్యాస మొనర్పవలయును. మూలాధార మందు ''హ'' కారమును హృదయమున రేఫమును కన్బొమల నడుమ ''ఈ'' కారమును శిరమున హ్రీంకారమును న్యాస మొనర్పవలయును. పిదప నితర మంత్రములకు చెప్పబడిన న్యాసములను సైతము చేయవలయును. 

తన దేహమందే ధర్మాదులతో పీఠపూజ సలుపవలయును. పిదప ప్రాణయామమువలన హృదయ కమలము విప్పారును. ఆది నా నివాసస్థానము. అచట పంచ ప్రేతాసనముపై శోభిల్లు మహాదేవినగు నన్ను ధ్యానింపవలయును. బ్రహ్మ-విష్ణు-రుద్రుడు-ఈశ్వరుడు-సదాశివుడు అను వీరిని పంచప్రేతము లందురు. వీరు నా పాదమూలమున నిత్యము వినసింతురు. 

వీరు భూమి-నీరు-తేజము-వాయువు-గగనమను పంచభూతములతోను జాగ్రత్త-స్వప్నము-సుషుప్తి-తురీ యము-అతీతమను పంచావస్థలతోను గూడి యుందురు. అవ్యక్త చిద్రూపిణి నగు నేను వీరి కధిపతిని. సర్వాతిశాయినిని. వీరైదుగురును నాకాసనములై యుండుటగూర్చి శక్తితంత్రములందు వెల్లడింపబడెను. 

ఈ విధముగ నన్నే ధ్యానించి మానసోపచారములతో నన్నే పూజింపవలయును. జపింవలయును. జనఫలము దేవి కర్పించి యర్ఘ్య పాత్రాదుల నాసాదించుకోని పూజాద్రవ్యములు శుద్ది చేయవలయును. ''హ్రీం'' లేక ''ఫట్‌'' అను మంత్రమున మంత్రించిన జలముతో శుద్ది చేయవలయును. మొదట దిగ్బంధ మొనరించి పిదప గురువందనము చేసి గురు నానతి బడసిన పిదప మొదట హృదయమున భావించిన దివ్యమంగళ విగ్రహమువంటి విగ్రహము నా వాహనము చేయవలయును.

ఇట్లు ప్రాణప్రతిష్టా మంత్రముతో న వాహనము చేసిన పిదప శ్రద్ధాభక్తులతో శ్రీరాజరాజేశ్వరి కాసనము ఆర్ఘ్య పాద్యములు ఆచమనము నైవేద్య తాంబూలము దేవి కర్పించవలయును. తదుపరి శ్రీచ్రకమందున్న యావరణ దేవతలను చక్కగ పూజింపవలయును. ఇట్లు ప్రతిదినము చేయజాలనిచో ఒక శుక్రవారము నాడైన చేయవలయును. 

ఈ యంగ దేవతలను శ్రీ యాదిదేవి విరజిమ్ముచున్న కాంతిపుంజములుగ నెంచవలయును. పిమ్మట పువరానృత్తిగల మూలదేవిని సుగంధ కుంకుమాదులచే బూజింపవలయును. తావులు వెదజల్లు పూలర్పించవలయును. నన్ను తరువాత నైవేద్యతర్పణతాంబూల దక్షిణలతో తనుపవలయును. 

నగేశా! తర్వాత నీవు రచించిన దేవిసహస్ర నామములతో నన్ను సంతోషపెట్టవలయును. నన్ను తంత్రోక్తమగు కవచముతోను అహంరుద్రేభిః అను దేవిసుక్తముతోను హ్రీంకారోపనిషచ్చులోని థర్వశిమంత్రములోను శ్రీమహావిద్యలోని మహామంత్రములతోను మాటిమాటికి సంతోషపఱచవలయును. 

పిదప భక్తిరసమునపులకిత హృదయుడై జగదంబను తప్పిదములను క్షమింపుమని వేడుకొనవలయును. తర్వాత తన శరీరములోని యణువణువు ప్రేమరసమున గగుర్పాటొదవ నానందభాష్పములతో డగ్గుత్తికతో నృత్యగీతవాద్యములతో దేవిని ప్రసన్నురాలిని చేయవలయును. 

ఓ వేదపారాయణములందును సకల పురాణములందును నేనే ప్రతిపాద్యను. అందువలన వేదపారాణముచేసి నన్నానందపఱచవలయును. బ్రహ్మణులనుముత్తైదువలను పడుగులను కన్యకలనునితంపామర జనమును శ్రీదేవిగబావించి వారికితుష్టిగ భోజనము పెట్టవలయును. పిదప దేవిని యెడదలో నమస్కరించి సంహరముద్రతో దేవి కుద్వాసనము తెప్పవలయును. 

ఓ సువ్రతా! హ్రీంకార మెల్ల మంత్రములకు నాయకమణి వంటిది. కనుకనట్టి హ్రీంకారముతోనే పూజావిధాన మంతయును జరుపవలయును. నేను హ్రీంకార మనెడు నద్దమందు నిత్యము ప్రతిబించుచుందును. కనుక హ్రీంకారమున సమర్పించిన దంతయునుసర్వమంత్రములతో నర్పించిన దానితో సాటియుగును. 

పిదప తన గురుని వస్త్రాదులతో పూజించి తన్ను తాను. ధన్యునిగ తలంచుకొనవలయును. ఎవడీ విధముగ శ్రీభువనేశ్వరీ దేవిని సంపూజించునో- అతని కెప్పుడు నెచ్చట నేదియును సాధ్యము కానిది లేదు. అతడు శరీరము వదలిన పిమ్మట నా మణిద్వీపమును తప్పక చేరుకొనగలడు ఇట్టి నాపరమ భక్తుని దేవీ స్వరూపునిగా నెఱుంగవలయును. ఇతని కెల్ల దేవతలును నమస్కరింతురు. 

ఓరాజా! ఈ విధముగ నీకు శ్రీదేవీ పూజా విధానమంతయును వివరించితిని. ఇదంతయును తెలిసికొని నీ శక్తికి తగినట్లుగ నన్ను పూజింపుము. దానిచే నీవు ధన్య భాగ్యుడవగుదువు. ఈ దివ్య దేవీ గీతాశాస్త్రమును దేవీ భక్తుడు శిష్యుడు గాని వానికిని ధూర్తుడు దుష్టుడునైన వానికి నెప్పుడును చెప్పరాదు. ఈ దేవీ గీతలను ప్రకటించుట తన తల్లి స్తనములను బైటికి చూపుటవంటిది. 

కనుక దేవిగీతలను యత్నముతో సతము రహస్యముగ నుంచవలయుము. దీనిని దేవీభక్తుడు-వినీతశిష్యుడు-పెద్దకొడుకు-సుశీలుడు-సువ్రతుడు-నగు వానికే చెప్పవలయును. దీనిని ప్రత్యేకముగ దేవి పలికి యచ్చోట నంతర్దానమొందెను. 

శ్రీదేవీ దర్శన భాగ్యమున నెల్ల దేవతలు నానంద భరితులైరి. హైమనతీదేవి హిమాలయునకు పుత్రికగ జన్మించి గౌరి యనబరగెను. ఆమెను శంకరున కిచ్చి వివాబము జరిపిరి. పిదప వారికి షణ్ముఖుడు జన్మించి తారకాసురుని దునుమాడెను, 

జనమేజ రాజా!మున్ను సముద్ర మథనము వేళ పెక్కు రత్నములుద్బవించెను, అమరులు లక్ష్మీప్రాప్తికి స్తోత్రము చేయగ లక్ష్మీదేవి సంతుష్టయై సాగరమందుద్బవించెను. దేవతలు లక్ష్మీదేవిని విష్ణునకొసంగిరి. అంత నామె సంతుష్ఠి జెందెను. 

రాజా!ఈవిధముగ నత్యత్తమమైన దేవీ మాహాత్మ్యము వివరింపబడినది. ఈ శ్రీగౌరీలక్ష్ముల యవతార కథ సర్వకామము లీడేర్చను. ఇది మిక్కిలి రహస్యమైనది. దీని నితరులకు చెప్పరాదు. ఈ శ్రీ దేవీగీతను రహస్యముగ పాడుము. ఓ యనఘా! నీవడిగిన దంతయును పవిత్రము పావనము దివ్యమునైనది. దీనిని వినిన తర్వాత నీవేమి వినదలతువో తెలుపుము.

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

Tamasagamas and Antartantric worship - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

లోకమందింకను వివిధ శాస్త్రములు గంవు. అవన్నియు శ్రుతి స్మృతి విరుద్దము లగుటచేత తామసము లనబడును. వామము కాపాలము కౌలకము భైరవము మున్నగు తంత్రములు గలవు. 

ఈ యాగమతంత్రముల ఫలాశకు వేదాధికారము లేనివారు మోహితులు గావలయునని వీనిని శివుడు రచించెను. (వీరు పాపఫలమును భవించుచు శుద్దులై క్రమముగ పుణ్యులై వేద మార్గ మవలంబింతురు) అంతేకాని యితర కారణము లేదు. 

దక్ష భృగు దధీచి మహర్షుల శాపమునకు కొందఱుబలియైరి. వారు వేదబాహ్యులైన బ్రాహ్మణులు. 

అట్టివారిని సోపానక్రమమున నుద్ధరించుటకు శివుడాగమములను రచించెను. శైవము వైష్ణవము సౌరము సాక్తము గాణాపత్యమునను నాగమములను శంకరుడు రచించెను. వానియందు కొన్ని చోట్ల వేదాను కూలముగను కొన్ని యెడల వేదవిరుద్ధముగను వ్రాయబడెను. 

కనుక నందలి వేదానుకూలములగు నంశములను వైదికు లాచరించుటలో నెట్టి దోషమును లేదు. విప్రుడెన్నడును వేదార్దమునకు భిన్నార్దము గ్రహింపరాదు. వేదాధికారి కానివాడే భిన్నార్దములు గ్రహించును. 

కనుక వెదికుడైనవాడు సర్వప్రకారముల వేదమార్గ మనుష్ఠింపవలయును. వేదధర్మమువలని జ్ఞానమే బ్రహ్మ సాక్షత్కారము గల్గించును. ఈ షణత్రయమును విడనాడి నన్నేశరణు పొందినవారు సర్వభూతదయాళురు మానదంభాహంకారములు లేనివారు-ఇట్టి బ్రహ్మచారులును గహస్థులును వానప్రస్థలును సంన్యాసులును మచ్చిత్తులు-మద్గతప్రాణులునై నా తీర్థములు సేవించుటలో నిమగ్నులగుదురు. 

వారు పరభక్తితో నా యీ సంపత్కరమగు విరాట్స్వరూపమునుపాసింతురు. అట్టి నాయందు నిత్యయుక్తిగలవారి యందు నజ్ఞాతము ముండును. నేను జ్ఞానమను సూర్యప్రకాశముతో వారి యజ్ఞానతమము బాపుదును. నగాధిపా! ఇది నా వైదిక పూజయొక్క మొదటి పద్ధతి. దీనినిట్లు సంక్షేపముగ వెల్లండించితిని.

ఇక రెండవ పూజా విధానము తెల్పుచున్నాను. శ్రీ విగ్రహమందుగాని శుద్ధ ప్రదేశమునగాని సూర్యచంద్రమండలములందుగాని జలములందుగాని బాణలింగమందుగాని యంత్రమందుగాని మహావస్త్రమునగాని శ్రీహృదయ కమలమందుగాని పరాత్పరాదేవిని ధ్యానింపనలయును. 

దేవి సుగుణ-సౌందర్యలావణ్యరేణ్య-కరుణామృత తరంగిణి-సర్వావయవసుందరి-దివ్యా రుణారుణ-తరుణీమణీ-శృంగారరసాధినాయిక-భక్తార్తినివారిణీ-ప్రసన్నవదనాంబుజ-కిశోరచంద్రశేఖర-పాశ-అంకుశ-వర-అభయ ముద్రలుగలది-దివ్యానంద స్వరూపిణియగు దేవిని షోడశోపచారపూజల నర్చింపవలయును. 

అభ్యంతరపూజ యందధికారము గల్గనంతవరఱకు నీ బాహ్యపుజ నాచరింపవలయును. అధికారము గల్గిన పిదప దీనిని వదలవచ్చును. ఉపాధిరహితమైన బ్రహ్మజ్ఞానమే నా స్వరూపము. ఇట్టి నా యాత్మస్వరూపమున చిత్తముతాదాత్మ్యమందుటే యాభ్యంతర పూజ యగును. కనుక జ్ఞానస్వరూపిణినగు నాయందైకాంతిక బావమున చిత్తము నిలుపవలయును. 

ఈ యాత్మజ్ఞానముదక్క మిగిలిన జగమంతయును నట్టిదే. మాయామయయే. కనుక మాత్మస్వరూపిణి-సర్నసాక్షిణినగు నన్నే నిర్వకల్ప భక్తితో యోగయుక్తత్తముతో నిరంతరము ధ్యానింపవలయును. ఓ గిరిరాజా! దీనితర్వాత బాహ్యపూజా విధానము చెప్పబడుచున్నది సావధానముగ వినుము.

బాహ్యపూజా విధానం

Friday, April 24, 2026

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల్ల స్త్రీ పురుషులు తప్పక నిష్ఠతో నాచరింపవలయును. అనంతతృతీయావ్రతము-రవికల్యాణినీ వ్రతము-
అర్ద్రానందకరమను తృతీయా వ్రతము-శుక్రవార వ్రతము-కృష్ణ చతుర్దశీ వ్రతము-భౌమవారవ్రతము-ప్రదోష వ్రతము-మున్నగునవి దేవీముఖ్యవ్రతము.

మొదట పూజాస్థానము దేవదేవుడగు మహాదేవుని శ్రీ దేవీని పీఠముపై నుంచ వలయును. ప్రదోషసమయమున శ్రీదేవీ సన్నిధానమున నెల్ల దేవతల యెదుట నృత్యమొనరిణపవలయును. పగలంతయు నుపవసించి ప్రదోషమున మంగళమయియగు శివను పూజింపవలయును.

ఇట్లు ప్రతి పక్షమందును వ్రతము లాచరించిన దేవి మిక్కిలి సంతోషంచును నగేశా! సోమవారవ్రతము నాకత్యంత ప్రియమైన వ్రతము. ఇటుల శ్రీదేవిని చక్కగ నర్చించి రాత్రివేళ భుజింపవలయును. నాకురెండు నవరాత్ర మహోత్సవములను మిక్కిలి ప్రియకరములు.

ఇవికాక నా ప్రీత్యర్ధము మచ్చర ముడిగి నిత్య మైమిత్తికము లాచరింపవలయును. వ్రతము లాచరింపవలయును. అటు లొనర్చిన నా ప్రియభక్తుడు నా సాయుజ్య పదవి పొందును. ఇంక నా మహోత్సవములు పెక్కు గలవు. వానిలో డోలోత్సవముశయ నోత్సవము జాగరణోత్సవము రధోత్సవము దమనోత్సవము మున్నగు నుత్సవము లాచరింపవలయును.

ముఖ్యముగ శ్రావణమాసమందు పవిత్రోత్సవము నాకు మిక్కిలి యిష్టమైనది. ఇట్లు నా భక్తుడైనవాడు దేవీ మహోత్సవములు భక్తిశ్రద్ధలతో జరుపవలయును. పిమ్మట నా భక్తులను-ముతైదువలను-బాలికలను-వడుగులను-దేవిభావమున నర్చించి వారిలో నన్నే కనుచు వారికి భోజనము పెట్టవలయును. డబ్బునకు గింజువలాడుకొనక వీరి నెల్లరిని పుష్పతాంబూల వస్త్రములతో సమ్మానింపవలయును.

ఇట్లు ప్రతియేడు జాగరూకుడై దేవీభక్తు డాచరింపవలయును. అట్టివాడు కృతార్ధుడు-ధన్యభాగ్యుడు-పుణ్యాత్ముడు-నా ప్రేమకు పాత్రుడు. ఈ విధముగ నాకు ప్రియమైన విషయము లన్నియును సంక్షేపముగ దెలిపితిని. దీని నంతయును దేవీభక్తుడుగాని వానికిని ప్రియశిష్యుడుగాని వానికిని చెప్పరాదు.

హిమాలయు డిట్లనెను: ఓ దేవదేవీ! మహేశానీ! దయారసతరంగిణీ! జగదంబికా! ఇపుడు నీ దివ్య పూజా విధానము చక్కగ దెలుపుము. 

శ్రీ దేవి యిట్లనెను: గిరిసత్తమా! శ్రీదేవికి మిక్కిలి ప్రియమైన పూజావిధానము తెల్పుదును. శ్రద్దగ వినుము. నా పూజ రెండు విధములు. బాహ్యము-అభ్యంతరము. బాహ్యపూజ మరల వైదికము-తాంత్రికమని రెండు విధములు. 

ఓ భూధరా! వైదికపూజయు మూర్తిభేదముచే మరల రెండు విధములు. మొదటిది వేదదీక్ష నందినవాడు వేదమంత్ర పూర్వకముగా దేవి నా వాహనాదులతో నర్చించుట-తంత్రదీక్షతో తంత్రోక్త విధానముగ చేయు పూజ తాంత్రికపూజ. ఇట్టి పూజ్యారహ్యస మెఱుగక వైదిక దీక్షితుడు తంత్రోక్తముగా గాని తంత్రదీక్షితుడు వైదోక్తముగ గాని పుజింపరాదు. అట్లు పూజించిన మూఢమతి తప్పక పతితుడగును. 

తొలుత వైదిక పూజావిధానమువివరింతును. ఆలింపుము. ఓ గిరివరా! ఇంతకుమునుపు మా యే వేయితలలు వేయికన్నులు వేయి పాదములుగల మహాద్బుత రూపము సాక్షాత్తుగ దరిశంచితివో ఏది సర్వశక్తులకు మూలశక్తియో ఏవరేణ్యతేజము బుద్దిప్రేరకమో ఏది పరాత్పరతరమో యట్టి నా రూపమును నిత్యము పూజించి ధ్యానించి స్మరింపవలయును. 

నగా! ఇదివైదికమార్గమలోని మొదటిపూజా విధానము చెప్పబడెను. ఇట్లు పూజించువాడు నిశ్చలమతితో గంభాహంకృతులు వదల వలయును. నీవును దేవీతత్పరుడవై దేవీహోమమువల చేయుచు దేవీశర మొందుచు దేవీగత చిత్తముతో సర్వమును దేవీభావమునగనుచు దేవీజపధ్యానములు నిరంతరము సలుపుచుండుము. నిత్యము ప్రేమభక్తితో సర్వాత్మభావముతో నన్యప్రేమతో నా మహాయజ్ఞములు జరిపివేల్చుము. నన్నే ప్రసన్నురాలినిచేయుము. ఈరీతి చేసిన నాయను గ్రహమువలన భవబంధములనుండి విముక్తుడవు కాగలవు. ఎనరు మచ్చిత్తులై మద్గతప్రాణులై నా భక్తవరులై యుందురో-

వారిని తప్పకనే నీ ఘోరదురితసంసారిమునుండి వెంచనే సముద్దరింతును. నేను కర్మయుక్త ధాన్యముచేత భక్తిజ్ఞానము చేత వీనిలో దేనిచేనైన లభింతును. గిరిరాజా! అంతేకాని కేవలము కర్మముచే నేను చిక్కను. ధర్మమువలన భక్తి-భక్తివలన జ్ఞానము-గలుగును. శ్రుతి స్మృతిలందు చెప్పబడినది ధర్మమగును గాని యితర శాస్త్రములందు చెప్పబడినది ధర్మముగాదు. అది ధర్మాబాస మనబడును. 

నాయందజ్ఞానము లేదు. నేను సర్వజ్ఞురాలను. నానుండియే వేదములు పుట్టుటచేత వేదములు భ్రాంతిలేని సత్యవస్తువులు. సుప్రమాణములు. మన్వాది మహర్షలు వేదములలోని యాంతరార్థంమును గ్రబించి స్మృతులు రచించిరి. కనుక స్మృతులును వేదప్రమాణకములే. 

కాని కొన్నిచోట్ల తంత్రార్దమును దృష్టిలోనుంచుకొని తెలుపబడిన ధర్మాంశములను వైదికులు గ్రహింపరాదు. వేదము నంగీకరింపని యితర శాస్త్రకారుల వాక్కులజ్ఞానదూషితము లగుటచేతవారి మాటలు ప్రమాణములు గావు. కనుకమోక్షము గోరువాడు ధర్మమెఱుంగుటకు వేదమునే ప్రమాణముగ గ్రహింపవలయును. ఎట్లు లోకమునందురాజాజ్ఞ చెల్లుబడియగుచుండునో - అట్లే సర్వేశ్వరి నగు నాశాసనము లోకమున చెల్లుబడి యగుచండును. 

నా వేదానుశాసనము నెవడును తిరస్కరింపరాదు. నా వేదాజ్ఞను గాపాడుటకే బ్రాహ్మణ క్షత్రియ జాతులు గలిగించితిని. నా వేదవాక్కులందలి రహస్యము తప్పకనెఱంగవలయును. గిరీశా| ధర్మహాని గల్గినప్పుడు అధర్మముపెచ్చుపెరిగినపుడు నేను శాకంభరి మున్నగు పెక్కు దివ్యరూపములు దాల్తును. విబుధులు వేద రక్షకులు. దానవులు వేదవినాశకులు. నావేదధర్మ మనుసరించని వారికొఱకు నరకములు కల్పించితిని. వానిని గుఱించి విన్న మాత్రానగుండె లవిసిపోవును.

ఎవ్వడు వేదధర్మమును తూలనాడి యితర ధర్మము లనుసరించునో యట్టి ధర్మబాహ్యుని రాజు తన దేశమునుండి వెడలగొట్టవలయును. అట్ట వారిని బంతినుండి వెలివేయవలయును. వారితో విప్రులు మాటాడరాదు. 

తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

Most important Devi locations - అతి ముఖ్య దేవీ స్థానాలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అతిముఖ్య దేవీస్థానాలు

హిమాలయుడు శ్రీదేవితో నిట్లనెను: ఓ దేవేశీ ! ఈ భూతలమునందు శ్రీదేవీ ప్రియములు-ముఖ్యములు-పవిత్రములు-దర్శనీయములునైన పుణ్యతీర్థక్షేత్రము లెన్నిగలవో తెలుపుము. తల్లీ! ఏయే వ్రతములు దేవీమహోత్సవములు జరుపుటవలన నరుడు కృతకృత్యుడగునో యవన్నియును వివరింపుము. 

శ్రీదేవి యిట్లనెను: ఓ చలిమలదొరా ! నేను విశ్వమయిని-సర్వకాల స్వరూపిణి. కనుక కంటికి కనబడుచోట లన్నియును నాదివ్యస్థానములే ఇంక నెల్లకాలములును నా మహోత్సములే. ఓ వలిమలఱేడా ! ఐనను నీమీది వాత్సల్యముచే కొన్ని పుణ్యక్షేత్రముల గూర్చి తెల్పుదును. సావధానముగ వినుము. 

కోలా పురము నా మహాపుణ్యస్థానము. అందు శ్రీమహాలక్ష్మినిత్యము విలసిల్లచుండును. రెండవది సహ్యాద్రిమీది మాతృపురము గలదు. అందు రేణుకాదేవి యధిష్టించి యుండును. మూడవది తులజాపురము. అందు హింగులాదేవి విలసిల్లియున్నది. సప్తశృంగమున జ్యాలాముఖి గలదు. శాకంభరీ పరధామము-భ్రామరీస్థానము- శ్రీరక్తదంతికా నివాసము-శ్రీదుర్గాధామమును-గలవు. వింధ్యగిరిపై నున్న దేవీస్థానముత్తమోత్తమమైనది. 

శ్రీమంతమైన కాంచీపురము-అన్నపూర్ణా మహాస్థానము-శ్రీభీమాదేవి మహాస్థానము-విమలాదేవిస్థానము-శ్రీచంద్రలా మహాస్థానము-శ్రీకౌశికీస్థానమును-గలవు. నీలపర్వతశిఖరమున నీలాంబరీదేవి నిలయము గలదు. శ్రీనగరమందు జాంబూనదేశ్వరీదేవి వెలయుచున్నది. గుహ్యకాళికి నేపాళము ప్రతిష్ఠా స్థానము-చిదంబరము మీనాక్షిదేవికి నిలయము. శ్రీవేదారణ్య మహాస్థానమున సుందరీదేవి-ఏకాంబర మహాక్షేత్రమున శ్రీపరా శక్తిదేవి ప్రతిష్ఠితలై యున్నారు.

చీనదేశమున మదాలసయును యోగేశ్వరీయును-నీలసరస్వతీదేవియును ప్రసిద్ధి వహించియున్నారు. శ్రీబగళాదేవి వైద్యనాధమున గలదు. శ్రీ త్రిభువనేశ్వరినగు నా పుణ్యధామము శ్రీమంతమగు మణిద్వీపమని ప్రసిద్ధి. సతీదేవి యోని మండలము పూడిన తావు కామాఖ్యా క్షేత్రము. ఇది పుణ్యక్షేత్రరాజము. 
మహామాయాధివాసితమగు శ్రీమత్తిప్రుర భైరవీ స్థానము. ఇచట శ్రీదేవి ప్రతినెల రజస్వల యగుచుండును. దీనిని మించిన దేవీపుణ్యక్షేత్ర మీ భూతలముల లేనేలేదు. ఇచ్చట నుత్తమదేవత లెల్లరును పర్వతరూపములు దాల్చి పర్వతముల మీదనే వాస ముందురు. ఆ క్షేత్రమందలి ప్రతిరేణువందును అణువణువందునను శ్రీదేవి విలసిల్లునని పెద్దలందురు. ఈ కామాఖ్యా యోనిమండలమును మించిన పుణ్యతీర్థము మరిలేదు. 

శ్రీపుష్కరక్షేత్రమున శ్రీగాయత్రీదేవియు అమరేశ్వరమున చండికాదేవియు ప్రభాసమున పుష్కరేక్షిణియు వెలయు చుందురు. శ్రీలింగధారిణీదేవికి నైమిశమును పురుహూతాదేవికి పుష్కరాక్షమును-రతీదేవి కాషాఢమును-నివాసస్థానములు. చండముండా మహాస్థానమున దండినీ పరమేశ్వరియును-భారభూతియందు మహాభూతియును-నాకు లేశ్వరమున నాకులి యును పేరు గాంచిన దేవతలు. 

హరిశ్చంద్రపురి శ్రీ చంద్రికకు-శ్రీగిరి శాంకరికి-జప్యేశ్వరి త్రిశూలకు-ఆ మ్రాతకేశ్వరము సూక్ష్మాదేవికిని-నివాసములు. శ్రీశాంకరి యుజ్జయినిలోను-శర్వాణిమధ్య మేశ్వరములోను శ్రీమార్గదాయినీదేవి కేదారమహాక్షేత్రములోను వెలసి యొప్పుచున్నారు.భైరవ స్థానమున భైరవీదేవియును-శ్రీగయాక్షేత్రమున మంగళాదేవియును-కురుక్షేత్రమున స్థాణుప్రియయు-మాకులమున స్వాయంభువియు-శోభిల్లుచున్నారు. ఉగ్రాదేవి కనఖలమున-విశ్వేశి విమలేశ్వరమున - మహానంద ఆట్టహాసమున-మహాంతక మహేంద్రమున-వెలసిన దేవతలు.

భీమపురి భీమేశ్వరికి-వస్త్రాపథము భవానిశాంకరికి-అర్థకోటి రుద్రాణికి-వన్నెగాంచిన దేవీధామములున. శ్రీవిశాలాక్షీదేవి కాశియందు-మహాభాగ మహాలయమున-భద్రకర్ణి గోకర్ణమున భద్రాస్య భద్రకంటకమున ప్రసిద్ధ దేవతలు. సువర్ణాక్షమందుత్పలాక్షీదేవియు-స్థాణుక్షేత్రమున స్థాణీశ్వరీదేవియు-కమలాలయమందు కమలయు-ఛగలండమందు ప్రచండయును-విరాజిల్లు దేవీరత్నములు. 

త్రిసంధ్యాదేవి కురండలక్షేత్రమున-మకుటేశ్వరి మహాకోటమున-శాండకి మండలేశ్వరమున-కాళిక కాలంజరమున వెలసిన దేవతలు. శంకుకర్ణములో ధ్వని-స్థూలకేశ్వరములో స్థూల-జ్ఞానుల హృదయకమలమందు హృల్లేఖా ప్రాణశక్తి-దేవతలు విలసిల్లుచున్నారు. 

నగపతీఃఇటుల శ్రీదేవికి ప్రియతమములైన పుణ్యస్థానము లన్నియును నీకు చెప్పబడినవి. ఆయా క్షేత్ర మహాత్మ్యములు వినవలయును. నేను చెప్పిన విధానమున శ్రీదేవిని పూజింపవలయును. ఎల్ల పుణ్యక్షేత్రములు శ్రీకాశీక్షేత్రమం దుండును. శ్రీదేవివీ భక్తి పరాయణుడు నిత్యమాయాదేవి పుణ్యధామములు దర్శించుచు శ్రీదేవిని నిరంతరము జపింపవలయును. దేవీ దివ్యచరణ కమలములు ధ్యానించుచున్నవాడు సంసారఘోరబంధములనుండి విముక్తుడగును. 

ఈ దివ్యదేవి నామములును క్షేత్రములు నుదయమున మేల్కొంచి చదువవలయును. వీనిని చదివినవాని పాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్దకాలమున బ్రాహ్మణ సన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును. 

అట్లు చదివినవానిపాపరాసు లెల్లను భస్మీపటలము జెందును. వీనిని శ్రాద్ధకాలమున బ్రాహ్మణసన్నిధిలో నిర్మలాత్మతో చదువవలయును. అట్లు చదివినవాని పితరులు విముక్తులై పరమగతి జెందురు. 

దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

Continuous practice - నిరంతర సాధన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - నిరంతర సాధన

ఓ గిరీశా ! కంటికి కనంబడు వస్తువుల కంటెను కనబడని మాయ కంటెనూ నా స్వరూపము వేరైనది. అతీతమైనది. అద్ధమందున జలము నందున ప్రతిబింబము దోచు రీతిగ పితృలోక మందున సైతమాత్మ తేజము ప్రతిభాసించును. వెలుగు నీడల రూపము లెటుల కంటికి తేటగ కనింపిచునో యటులే ద్వైతములేని నా దివ్యలోకమున జ్ఞానజ్యోతి ప్రకాశించును. 

వైరాగ్యము గల్గినప్పటికిని జ్ఞానము లేనివాడు చచ్చిప్రళయము వఱకు బ్రహ్మలోక మందు వసించును. ఈ పిదప శ్రీ మంతులు పుణ్యవంతులునగు వారి యిండ్లలో పుట్టి సాధన చేసి చేసి బ్రహ్మజ్ఞానము బడయగలడు. 

ఓ గిరిరాజా! వేయేల ! ఎన్నో జన్మ కోటులకు గాని జ్ఞానము గలుగదు. జ్ఞానమొకే జన్మలో వచ్చి ఒడిలో పడునది గాదు. కనుక సాధకుడు తన కోపినంతవఱకు ప్రయత్నించి జ్ఞాన మొందువలయును. కానిచో గొప్ప యనర్థము చుట్టుకొనును. ఎందులకనగా నీ మానవ జన్మము వచ్చుట కడుంగడు దుర్లభము. 

అందును బ్రహ్మణత్వము మఱి వేద ప్రాప్తియును దర్లభతరములు. శమాది షట్క సంపద - యోగసంసిద్ధి-ఉత్తమ గురుప్రాప్తి ఇవన్నియును దుర్లభతమములు. ఇంద్రియ నిగ్రహము- చిత్తసంస్కారము మిక్కిలి దుర్లభములు. అటు పిమ్మట నెన్నో పూర్వ జన్మల పుణ్యఫలమున గాని మోక్షేచ్చ గలుగదు. 

ఈ శరీర మున్నపుడే సాధన చేసిన ఫలము లభించును. కానియింతటి శరీరము గల్గియును జ్ఞానమునకు ప్రయత్నించని వాని జన్మము వ్యర్థము.

కనుక ఓ శీతనగేశా ! యథాశక్తి జ్ఞాన సంపాదనమునకు ప్రయత్నింపవలయును. అట్టివానికి ప్రతియడుగున తప్పక అశ్వమేధఫలము చేకూరును. పాలయందు నేయి యున్నట్లు ప్రతి పాణి యందును విజ్ఞానపువెల్గుగలదు. దానిని మనస్సెనెడు కవ్వముతో నాత్మ విచారముతో మథించవలయును. 

కేవలమొక జ్ఞానము వలననే జన్మ తరించి ధన్యత గాంచునని వేదాంతభేరి మ్రోగు చున్నది. ఇటుల నీ కంతయును సంక్షేపముగ తెలిపితిని. ఇంకేమి వినవలతువో తెలుపుము.

Bhakti Yoga - భక్తి యోగం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - భక్తి యోగం

హిమాలయుడిట్లనెను: అమ్మా ! తీవ్రవైరాగ్యములేని మధ్యమపురుషునకు తేలికగ జ్ఞానము గల్గునట్టి భక్తియోగముగుఱిచి తెలుపుము. 

దేవి యిట్లనెను: నగరాజా! మోక్షప్రాప్తికి జ్ఞాన-భక్తి-కర్మ యోగములను మూడు మార్గములు ప్రసిద్ధిగాంచినవి.ఈమూటిలోకాయక్లేశము లేక సులభముగ లభించుటచే భక్తి యోగమే సుసాధమైనది. మనుజుల గుణభేదములను బట్టి భక్తి మూడు విధములుగనుండును.

దంభాచారముతోపరులకు బాధగల్గించునది తామసభక్తి. ఈ తామసభక్తి మచ్చరముకోపముగల్గి మండిపడుచుండును. ఇక పరపీడలేకున్నను స్వార్థము చూచుకొనట లక్ష్యముగకలది రాజసభక్తి. ఈ భక్తిగలవారు భోగభాగ్యములకు కీర్తికి నాయాఫలప్రాప్తికి నన్ను సకామముగ నుపాసింతురు. నగేశా! ఇట్లు నన్ను తన కన్యురాలిగ భావించు పామరుని భక్తి రాజసభక్తి యనబడును. 

కనుక నరుడు తనతొంటి జన్మకోటుల పాపరాసులు పటాపంచలగుటకు వేదసమ్మత ముగ కర్మములును తత్పలితములును కర్తవ్యాతామతితో పరమేశ్వరార్పణ మొసరించవలయును. 

ఓ నగసత్తమా! ఇంక నన్ను తనకు భిన్ననుగ దలించినను నిశ్చితమతితో నా ప్రీతికై చేయుభక్తి సాత్వికభక్తియగును. ఇందు బేధముండుటనతనది పరాభక్తి కాదు. కానియాసాత్వికభక్తివలన క్రమముగపరాభక్తిసాధ్యయమగును. తామసరాజభక్తులు మాత్రముపరాభక్తిని గల్గింపజాలవు. 

ఇపుడు పరా నిశ్చల భక్తిని గూర్చి తెల్పుదును. వినుము. నాదివ్య గుణమహిమలు వినుట నాదివ్యనామ సంకీర్తన సల్పుట గుణరత్నములకు నిధినగు నాయుందు చిత్తము నిలిపి తైలధారవలె నన్నే నిత్యము మననము చేయుట నా సామీప్య-సార్షి-సాలోక్య- సాయుజ్య ముక్తులందుగాని మఱి ఫలకారణమున గాని ఫలమందుగాని కాంక్షలేకుండట నాదివ్య సేవలుతక్క నితరము గోరుకుండుట సేవ్యసావకభావము వదలి మోక్షమునుసైతము గోరుకుండుట పరానురాగమున నప్రమత్తతతో జితేంద్రియుడై నన్నే చింతించుట నన్ను తన కభిన్నముగ సచ్చిదానంద స్వరూపముగనెఱుంగుట సార్షిటత-

ఎల్ల జీవులందును నా స్వరూపము చింతంతచుట- తన యాత్మ మీదనున్న ప్రేమ మితరుల యాత్మయందుంచుట ప్రాణులందఱిలో నొకే జీవచైతన్యముండుట వలన నన్నిరూపములను నా కభిన్నముగ చూచుట - ఎవనియందును భేదబుద్ధి ద్రోహబుద్ధి నుంచక చండాలుడు మొదలీశ్వరునివఱ కందఱిని నమస్కరించి గౌరవించుటం నా దివ్య - పుణ్య- తీర్థ క్షేత్రములను భక్తులను దర్శించి సేవించుట యందును నా మంత్రతంత్రములందును నా శాస్త్రశ్రవణము లందును భక్తి శ్రద్దలు- వినయము గల్గియుండుట నా ప్రేమ భక్తిలో వ్యాకులతజెందుట నా నిత్య ప్రేమవలన కన్నులానంద బాష్పములు కురియగ నన్ను తలంచినంతనే యానంద పులకిత చిత్తముతో డగ్గుత్తికతో మాటాడుట - అనన్యభావమున సర్వకారణ-జగత్కారణ- జగదీశ్వరినగునన్నే పూజించుట డబ్బునకు వెనుకముందు లాడక నిత్యమైకాంతిక భక్తితో నిత్యనైమిత్తికమలు నా వ్రతములు సేయుచుండుట నా దివ్య మహాత్సవములు సహజసిద్ధముగ జరుపుటయందు చూచుటయందును కోరిక గల్గియుండుట - అహంకారము మాని దేహాభిమానము పోద్రోలి యొలుగెత్తి నా దివ్య నామములు సంకీర్తించుట నా దేవీ కథా నృత్యములు సేయుట నా ప్రారబ్దమెట్లున్న నట్లే జరుగును. 

ఈ శరీర పోషణ కింతగ చింతింపగనేల యని తలంచుట ఆత్మ-దేవీ-విచారము దక్క నితర మాలోచింపకుండుట- అనున వన్నియును గల్గియున్న భక్తి పరాభక్తియని పేర్కోనబడును.ఇట్టి నిశ్చలపరాభక్తి యెపుడెవనియందు గలుగునో యపుడదతడు చిన్నాత్రనగునా రూపమందు లీనుడైపోవును. ఇట్టి భక్తికి వైరాగ్యమునకు పరాకాష్ఠ(చివరిదశ)ను జ్ఞానమందురు. ఇట్టి పరాభక్తి గల్గినప్పటికిని ప్రారబ్దవశమున నెవనికి జ్ఞానముగల్గదో యతడు నామణిద్వీపముచేరగలడు. ఓనగోత్తమా ! అతడచట తన కిష్టమున్నను లేకున్నను తేన ముక్తః సదైవ స్యాత్‌ జ్ఞానాన్ముక్తి ర్న చాన్యథా|

అపుడే యతడు ముక్తుడగును. జ్ఞానమువలననే కాని మరిదేనివలనను ముక్తిగల్గదు. హృదయమందలి ప్రత్యగాత్మ జ్ఞానము గలవాని ప్రాణములు లేచిపోవు. అటులే నా దివ్యజ్ఞాన స్వరూప మెఱిగినవాని ప్రాణములను లేచిపోవు. అవి వాని శరీరమందే లయమొందును. అతడు బ్రహ్మవిదుడు కనుక బ్రహ్మమే యగును. నరుడు భ్రమవలన తన మెడలోని హారమును తానే మఱిచిపోవును కాని జ్ఞానము గల్గిన పిమ్మట భ్రాంతి తొలగి యది తన మెడలోనే యున్నదని తెలిసికొనును. 

నిరంతర సాధన

Brahma vidya - బ్రహ్మ విద్య

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - బ్రహ్మ విద్య

బ్రహ్మము నిష్కలము-విరజము-శుభము-ఆనందకోశమున సుఖ రససందోహము-వెల్గులవెల్గు-అనియాత్మవంతులందురు. సూర్య-చంద్ర-అగ్నులు-మెఱుపుతీగలు-తారకలన్నియును బ్రహ్మమును వెలిగింపజాలవు. బ్రహ్మజ్యోతి వలననే సూర్యాదులు వెల్గుచున్నారు. జగము లన్నియును వెలుగుచున్నవి. బ్రహ్మముముందు -వెనుకల క్రిందుమీదుల రెండు వైపుల విశ్వమంతట నుండి వెల్గులు చిమ్ముచున్నది. 

ఇట్టి యాత్మానుభూతి -యే పుణ్యాత్ములకు గల్గునో యతడు ధన్యజీవుడు. బ్రహ్మభూతుడు - ప్రసన్నాత్ముడు. అతనిని శోక కామము లంటజాలవు. గిరివతంసా! ద్వైతభావము భయకారణము. ద్వైతము లేనిచో సంసార భయము లేదు. నే నద్వయమునకు గాని అద్వయము నాకు గాని బిన్నముగ లేదు సుమా! హిమవంతా! అట్టి యద్వయుడగు జ్ఞానియే నేను. నేనే యాజ్ఞానిని. నా దివ్యదర్శనము నాజ్ఞానియందు కలుగును. 

నేను జ్ఞానుల హృదయకమల మధ్యామునగాక కైలాసమునగాని వైకుంఠమునగాని యే తీర్థమందుగాని మరెచ్చటగాని నివసింపను. నాపరమభక్తుడగు జ్ఞాని నొక్కసారి యర్చించి గౌరవించిన నన్ను కోటిసారులు పూజించినంత ఫలితముగల్గును. అట్టి జ్ఞాని కులము పవిత్రము అతని తల్లి ధన్యురాలు. అట్టి జ్ఞానిమాతృభూమి స్వర్గసీమ; వాని చిత్తము చిన్మయము; గిరిరాజా! నీ వడిగిన బ్రహ్మజ్ఞానమంతయును విశద మొన రించితిని.

నీ కంతయు దెల్పితిని. ఇక మిగిలినది లేదు. దీనిని జ్యేష్ఠపుత్రునకు గాని భక్తియుక్తునకు గాని గుణశాలికిగాని చెప్పవలయును. తగిన శిష్యునకును దీనిని చెప్పవచ్చును. ఇతరుని కెవ్వనికిని చెప్పరాదు. ఎవనికి తన యిష్ఠదేవతయందు గురువునందు నిశ్చలభక్తియుండునో బ్రహ్మజ్ఞాన మతనికే చెప్పవలయును. అతనికి బోధించిన విద్యలు చక్కగ ప్రకాశించును. 

జ్ఞాన ముపదేశించువాడు కేవలము పరమాత్ముడే. ఇట్టి జ్ఞానోపదేశమందినవాడు తన గురునకు ఋణపడియుండును. బ్రహ్మజ్ఞాన ముపదేశించువాడు తండ్రికంటె శ్రేష్ఠతరుడు. తండ్రివలన గల్గిన జన్మము నశించును. కాని గురు వొసంగిన జ్ఞానజన్మ మెన్నటికిని చెడని పదార్థము. 

కనుక నట్టి గురునకు ద్రోహము తలపెట్టరాదని వేదమనును. బ్రహ్మజ్ఞాన మొసంగిన గురుడు శ్రేష్ఠు డని శాస్త్రములువచించును. శివుడు కోపించిన వానిని గురుడు కాపాడును. గురుడు కోపించినవానిని శివుడుగాపాడలేడు. 

కనుక నుత్తమశిష్యుడు మనోవాక్కాయ కర్మములతో గురుసేవాతత్పరుడై యెల్లభంగుల గురునే సంతోషపెట్టవలయును. అటుల చేయనిశిష్యుడు కృతఘ్నడగును. కృతఘ్ననకు ప్రాయశ్చిత్త మేదియును లేదు. తొల్లి యింద్రు డథర్వణునకు జ్ఞానమున దేశించెను. అపుడు దీనినితరులకు చెప్పిన నీ తల నఱకుదునని యింద్రుడు ప్రతిన బూనెను. 

అశ్వినులు బ్రహ్మవిద్య నెఱుగుట కథర్వణుని తల నఱికి గుఱ్ఱము తల నదికించి విద్య బడసిరి. ఇంద్రుడు తన మాట చొప్పున గుఱ్ఱము తల తెగినఱి కెను. అపుడశ్విను లతని మొండెమున కతని వెనుకటి తల నదికించి బ్రదికించిరి. ఓ నగపతీ! బ్రహ్మవిద్య యింత కష్ట సాధ్యమైనది. దీనిని బొందినవాడు థన్యుడు.కృతార్థుడు.

భక్తి యోగం

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ

ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధానముగ నవధరింపుము. 

శ్రీ దేవి దిక్కాలముల కతీతయైనది. ఆమెయందేచిత్తము నిలుకడ జెందవలయును. ఇట్లుచిత్తము నిల్పి దేవీ తన్మయుడైనవాడు జీవబ్రహ్మైక మొందును. ఒకవేళ మనస్సు రజోదోషమున మలినమైనచో యోగము వెంటనే సిద్ధింపదు. అపుడవయవయోగమున యోగి యోగమభ్యసింపవలయును. 

అనగ నామధుర మధురమైన పాదములు -చేతులుమున్నగువానియందు చిత్తము నిల్పవలయును. అటు లొక్కొక్కచోటు జయించుచు చిత్తశుద్దియైన వెంటనేచిత్తమును దేవీ రూపమందంతట నిలిపి ధ్యానింపవలయును. 

ఓయి పర్వతరాజా! జ్ఞానస్వరూపిణి నగు నా యందుచిత్తము లయమందువఱకు సాధకుడు తన కిష్టమైన మంత్రమో జపమో హోమమో చేయుచుండవలయును. ఇట్టి మంత్రాభ్యాసయోగమునను బ్రహ్మజ్ఞానముగల్గును. యోగము లేక మంత్రమును మంత్రము లేక యోగమును సిద్ధంపవు. ఈ రెంటి నభ్యసించిన మంత్రయోగి బ్రహ్మతాదాత్మ్య మందవచ్చును. 

ఇంటిలో పెంజీకటి తెరల మాటునగల కుండ దీపము వెల్గున కనబడును. అటులే మాయాంథతమములో జిక్కిన జీవాత్మ మంత్రయోగముల వెలుగు వెల్లువలలో కనిపించును. ఇటుల నీకు యోగవిధానమంతయును సాంగముగ వివపించితిని. ఇదంతయును సద్గురూపదేశమున తెలియవలసినదేకాని యెన్ని కోటుల శాస్త్రములను చూచిన నేమియు లాభములేదు.

శ్రీదేవి యిట్లనెను : ఓ గిరిరాజా! ఈ విధముగ బ్రహ్మస్వరూపిణి నగు నన్ను యోగయుక్తుడు సహజ భక్తితో నాసనమున గూర్చుండి సతతమను ధ్యానింపవలయును. బ్రహ్మము స్వయంప్రకాశము. సర్వవ్యాపకము. ఐనను హృదయ గుహ యందు వెలుగొందును. ఇది యోగ సాధ్యము. దీని యందాకాశాదులు ఎల్ల ప్రాణులు కాలములు నాధారపడియుండును. 

ఓ సురలారా ! బ్రహ్మమునిట్లెరుంగుడు. ఇది మాయా జగముల కంటె వరేణ్యమయినది. బుద్దులకందనిది. అణువు కంటె అణీయము. ఎల్ల లోకములు లోకులు దీనియందు ప్రతిష్టింపబడియున్నారు. ఓ సౌమ్యుడా! ఓంకారము అక్షరము- బ్రహ్మము. అది ప్రాణ-వాక్‌-మనో రూపములు దాల్చును. 

కనుక బ్రహ్మమందు మనస్సు లగ్న మొనర్చి యెఱుంగవలయును. ఉపనిషత్తను ధనువు నందు ధ్యాన మనెడు బాణమెక్కుపెట్టి నిశ్చల చిత్తముతో నక్షరమును లక్ష్యముచేసి ఏయవలయును. ప్రణవము - దనువు; హృదయము-బాణము; బ్రహ్మము లక్ష్యము; బాణము లక్ష్యమును భేదించునటుల నరుడు నప్రమత్తముగ భాగవత హృదయముతో బ్రహ్మమును గురిచూచి వేధించి బ్రహ్మ మయుడు గావలయును. బ్రహ్మమందు భూమి-అంతరిక్షము -ఆకాశము-ప్రాణములు - మనస్సు నిల్చియుండును. ఇదిసంసార సాగరమునకు సేతువు. 

కనుక వట్టి మాటలుకట్టిపెట్టి యాత్మనొక్క దని నెఱుంగుము. రథపు నాభి యందు చక్రమాకులు చేరియుండును. అటులే హృదయ మందు నాడులన్నియును చేరియుండును. పెక్కురూపులుగల బుద్ది వృత్తికి సాక్షియగు బ్రహ్మము హృదయమందే వెలుగొందుచుండును. 

అమరులారా ! మీకు మేలగుత ! సంసారపు గ్రుడ్డిపెంజీకటి తెరల కవ్వలి వెలుంగు వెల్లువ యగు నాత్మ నాత్మ విచారముతో ధ్యానింపుడు. ఆత్మ దివ్యమును -బ్రహ్మపురమునుగు హృదయాకాశమున వెల్గుచుండును. అత్మ మనోమయము: ప్రాణశరీరములకధినేత-అన్న మునప్రతిష్టితము- హృదయాంతరవర్తి-ఆనంద స్వరూపము- అమృత రసనిధి; ధీరులగు వారుఅనుభవ పూర్వక మగు ఆత్మ విచారముతో దీనిని దర్శింతురు.

ఇట్టి పరమాత్మ సాక్షాత్కారము గల్గిన వాని జన్మ జన్మముల హృదయ మందలి పెడముళ్లు తెగతెంపులగును. సంశయము లన్నియు పటాపంచలగును. కర్మబీజము లన్నియును నశించును. 

బ్రహ్మ విద్య

air retention - వాయు ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వాయు ధారణ

హిమగిరీంద్రా తొలుత పూరకముతో నాధరచక్రమున మనస్సు నిలుపవలయును. పిదప గుడి మేఢ్రముల నడుమగల కుండలినీ శక్తి నచటి వాయువుతో సంకోచించి మేలుకొలుపవలయును. అటుపిమ్మట క్రమముగమెల్లగ నెల్లచక్రములు భేదించి సహస్రారచక్రము జేరి యందు గల పరమశివునితోపరాశక్తి నేకమొనరించి వారిని ధ్యానింపవలయును. అచటనుండి లక్కరసమువలె నమృతము వెడలుచుండును. దానితోయోగసిద్ది గల్గించుమాయాశక్తిని తనుప వలయును.

స్థితప్రజ్ఞుడైనవా డమృతధారతో షట్చక్రములందున్న దేవతలను తనిపి పిదప నా యమృతధారను మూలాధారమునకు తేవలయును. ఈ విధముగ నిత్యము యోగాభ్యాసముచేయు యోగిదోషము లన్నియును తొలిగిపోవును. ఎల్లమంత్రము లతనికి కరతలామలకము లగును. వేరు విధముగ లభించవు. 

ఇట్టి యోగి జరామరణ దుఃఖముల కాటపట్టగు సంసారబంధములనుండి విడివడును. జగన్మాతనగు నాలోనెన్నియో సుగుణవిధులు గలవు. అట్టి సుగుణములన్నియును సాధకునిలో తప్పక వెలయుచుండును.

మంత్ర ధారణ

Mantra Yoga Teachings - మంత్రయోగ ప్రబోధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్రయోగ ప్రబోధం

ఓ గిరి నాయకా! ఈ పంచ భూతాత్మకమైన శరీరము విశ్వము. ఇది చంద్ర సూర్యాగ్నులతో గూడి జీవ బ్రహ్మల యైక్యమును దెలుపును. ఇట్టి శరీరమున మూడున్నర కోట్ల నాడులు గలవు. వీనిలో పదిముఖ్యమైనవి. ఆ పదింటిలోను మూడు ముఖ్యతరములు. ఈ మూటిలో ముఖ్యతమమైనది చంద్రసూర్యాగ్ని రూపమైన మేరు దండము. 

ఇడానాడి యెడమ వైపుండును. ఇది తెల్లని చంద్రరూపమున నుండును ఇది యమృత శక్తిరూపమైనది.కుడి వైపున పురుష రూపమున సూర్యరూపముగల పింగళా నాడి యుండును. ఇక సర్వ తేజో రాశియై వహ్ని రూపమున సుషుమ్నా నాడి వెలుగొందును. దాని మధ్యవిచిత్రమను నాడి గలదు. దాని యందిచ్చా జ్ఞాన క్రియాత్మకమైన లింగము గలదు. ఇదిస్వయంభూలింగము. కోటి సూర్య సమానమైన ప్రకాశముగలది. 

దానకిపైని హరాత్మకము బిందు నాదాత్మకము మాయా బీజమునైన హ్రీంకారము విలసిల్లుచుండును. దానకిపైకి దీపశిఖ వలె నెఱ్ఱగ దేవీ రూపిణి యగు కుండలినీ శక్తి విరాజిల్లుచుండును. 

గిరీశా ! ఆ శక్తియు నేను నొకటియే. దానికి బైట బంగారు వన్నెగలు నాల్గు దళముల పద్మము గలదు. దానిలోనున్న వ-శ-ష-స-యక్షరములను సాధకుడు ధ్యానించవలయును. దానకిపై నగ్ని వలె వెల్గుచు వజ్రకాంతలీను నారు దళముల పద్మమలరును. బ-భ-మ-య-ర ల అను అక్షరములం దొప్పును. 

అట్టి స్వాధిష్ఠానమును ధ్యానింపవలయును. ఈ షట్కోణమునకు మూలమైనది మూలాధారమనబడును. ఇక స్వయను శబ్దముతో నధిష్ఠానమైనది స్వాధిష్ఠాన మన బరగును. దానకిపైకి నాభీ స్థాన మందు మణిపూరము గలదు. అది మేఘ ముల మెఱగు తీగల కాంతుల పగిది తేజోమయమై ప్రభలు విరజిమ్ముచుండును.

మణుల కాంతులను బోలియుండుటచే దీనిని మణిపూరపద్మ మనియందురు. ఈ పద్మము నందు డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ యను పది యక్షరములుండును. ఇదు శ్రీ మహావిష్ణు వధిష్ఠించియుంట దీని ధ్యానమున శ్రీ విష్ణుసాక్షాత్కారము గల్గును. 

దీనికి పైకి బాలసూర్యప్రకాశమునకు సరివచ్చు ప్రభగల్గు '' ననాహత పద్మము'' తనర్చును. ఇది క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ యను పండ్రెండు వర్ణములు గలది. సూర్యకోటుల ప్రభలతో తుల తూగునది. దీనిమధ్య బాణలింగము గలదు. ఇందుతాకిడి లేనప్పటికిని చప్పు డుప్పతిల్లును. 

కనుక దీనిని''అనాహత'' మనియు ''శబ్దబ్రహ్మమయ''మనియు శబ్దబ్రహ్మనిష్ణాతులు పేర్కొందురు. ఇది పరమానందనిలయము. ఇందు రుద్రుడు విరాజిల్లును. దీనిమీద పదారుదళముల విశుద్దకమల మొప్పారుచుండును. ఇందు అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ఋ- - - ఏ-ఐ- ఓ-ఔ-అం- అః యను పదునారు వర్ణము లుండును. ఇందుగల ధూమ్రవర్ణము మహాప్రభలు వెలార్చును. ఇచట జీవుడాత్మదర్శనము చేయుటవలన శుధ్ది జెందును. కనుక దీనిని విశుద్దిపద్మమందురు. దీని నాకాశమనియు పల్కుదురు. 

దీనికి మీద నాజ్ఞాచక్ర మలరారును. ఇది ఆత్మ కధిష్ఠానమైనది. ఇచట పరమేశు నాజ్ఞ జీవునకు లభించును. కనుక దీని నాజ్ఞ చక్రమందురు. ఈ పద్మమందుహ-క్ష యను రెండక్షరములుగల దళములు శోభిల్లును. దానికిపైని కైలాసపద్మమును దానిపైని రోధినీపద్మమును చెన్నొందును. వీనిని చక్రములనియునందురు. 

సువ్రతా! ఇట్లు నీకాధారాది చక్రములు వివరించితిని. దీనికి పైగ సహస్రారమను చక్రరాజము దీపిల్లును. ఇదే బిందుస్థానము. శ్రీపరమాత్మ సన్నిధానము. ఇట్లు నీకు దివ్యయోగమార్గమంతయు వివరించితిని. 

Jaganmatha Yoga Teachings - జగన్మాత యోగబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాతయోగబోధ

ఈ విధముగ శ్రుతి మతి గలిగిన వాడాత్మ విచారముతో స్వాత్మను నిశ్చయించుకొని పరబ్రహ్మస్వరూపిణి నగు నన్ను ధ్యానమున భావింపవలయును. ధ్యానయోగము చక్కగ కుదురుటకు నా యక్షరత్రయమును మొదట చక్కగ భావించవలయును. 

అది దేవీ ప్రణవస్వరూపమైనది మాయామంత్రబీజము-మంత్రరాజము. అక్షరత్రయములో హాకారము స్థూలదేహము రేఫము సూక్ష్మదేహము; ఈ కారము కారణదేహము. హ్రీంకారము-తురీయాత్మ-నేనే. ఇదే విధముగ సమష్టి దేహమందు నీ బీజత్రయము క్రమముగ నున్నదని యెఱిగి పిదప సమష్టివ్యష్ట్యాత్మల యేకత్వమును సాధకుడు సాధింపవలయును. 

ఈ విధముగా సమాధికి ముందు చక్కగా నాత్మవిచార మొనరించి పిదప కన్నులు మూసికొని జగదీశ్వరి-ఆదిపరాశక్తి-నగు నన్నే ధ్యానింపవలయును. నాసికయందు తిరుగాడు ప్రాణపానములను సమముగ జేసి విషకామములు విడనాడి మచ్చ రము -దోషము-వదలవలయును. 

సాధకుడొంటిగ నైకాంతిక పరాభక్తితో హృదయకుహరమునందు చిత్తము నిల్పి స్థూలాత్మయగు హకారమును సూక్ష్మాత్మయగు రేఫమును లయమొనరింపవలయును. పిదప సూక్ష్మాత్మయగు రేఫమును కారణాత్మయగు ''ఈ'' కారమందున లయ మొనర్పవలయును. తర్వాత కారణాత్మయగు ''ఈ ''కారమును సర్వాత్మకమైన హ్రీంకారమున లయ మొనర్పవలయును. పిమ్మట చిదగ్నిశిఖలో వాచ్యవాచకత్వములును ద్వైతములును లేనట్టి పరబ్రహ్మ రసమయమగు నఖండ సచ్చిదానందమును ధ్యానింపవలయును. 

రాజా!ఇట్లు జీవుడు విమల ధ్యానమువలన నా సాక్షాత్కారమొంది నా సారూప్యము జెందవలయును. ఏలన నట్టి స్థితిలో నేను-జీవుడు నొకటియే. నరు డిట్టి ధ్యానయోగమువలన పరాత్పరతమగు నన్ను గాంచును. వెనువెంటనే వాని తొంటి యజ్ఞానకర్మములు రెండును నశించును.

హిమాలయు డిట్లనెను: ఓ మహేశానీ ! యోగముసును గుఱించి సాంగముగ నాకు వివరింపుము. ఏ యోగమున బ్రహ్మజ్ఞానము గల్గునో దాని నాచరించి తత్త్వదర్శనమునకు పాత్రుడ నగుదును. 

శ్రీదేవి యిట్లనెను : యోగ మనునది భూమ్యాకాశరసాతములం దెచటనైన నుండునది కాదు. జీవ-పరాత్మల యైక్యమే యోగమని యోగవిదులందులు. ఓ యనఘాత్మా! కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యములను నారును యోగమునకు విఘ్నముగల్గించుచుండును.యోగులు యోగాంగముల సాయమున కామాదిశత్రువులను గెలచియోగమాచరించవలయును.యమము-నియమము-ఆసనము-ప్రాణా యామము.ప్రత్యాహారము-ధ్యానము-సమాధియునునవి యష్టాంగములు. 

యోగసాధనముకు యోగులీ యెనిమిదిటి ననుష్ఠింపవలయును. అందుమొదటిదగు యమము సత్యము-అహింస-బ్రహ్మచర్యము-అస్తేయము-దానము-ఋజత-దయ-క్షమ-ధృతి-మితాహారము-శౌచమను పది తెఱంగుల నోప్పుచుండును. తపము-సంతోషము-దానము-ఆస్తికత-దేవపూజనము-వేదాంతశ్రవణము-లజ్జ-మతి-జపహోమములు అను పదియును గలసి నియమగునని నాచేత చెప్పబడెను.

ఓ గిరీంద్రా! రెండుతొడలపై నుంచుకొనవలయును. పిదప వీపు మీదుగ చేతులు త్రిప్పి పాదముల బొటనవ్రేళ్లు పట్టుకొనుటే పద్మాసనము. ఇది యోగుల కత్యంతము ప్రియమైనది. తొడల-పిక్కల-మధ్యపాదతలము లుంచి సరళముగ కూర్చుండుట స్వస్తి కాసనమనబడును. 

వృషణముల క్రింద రెండువైపుల రెండు కాలిమడమలనుచేతిలో గట్టిగ నదిమి పట్టియుంచవలయును. అదియే భద్రాసనమనబడును. దీనిని యోగులెక్కువగ నాదరింతురు. రెండు తొడలపై రెండు పాదములుంచి పిక్కల క్రింద చేతల వ్రేళు లుంచవలయును. ఇట్లు కూర్చోనుట వజ్రసన మగును. 

ఆయా తొడలక్రింద నాయాపాదములుంచవలయును. పిదప శరీరమును నిట్టనిలువుగనుంచి కూరుచుండుట వీరాసన మగును. ఇడా(ఎడమ ముక్కు) ద్వారమున బైటి వాయువును పదునారుసార్లు ప్రణవము జపించుచు పీల్చవలయును. 

దాని నురువదినాల్గు సారులు ప్రణవ ముచ్చరించు నంతవఱకు లోన పూరించి యుంచ వలయును.అపుడది సుషుమ్న మధ్యకు చేరును. దానిని ముప్పదిరెండు మార్లు ప్రణవ ముచ్చరింగదగినంత సమయమున పింగళ(కుడిముక్కు) నుండి రేచింపవలయును. 

ఇటు లొక్కసారి చేసిన దానిని ప్రాణాయమమని యోగవిదులందురు. ఈ ప్రకారముగ ప్రణవోచ్చారణము క్రమముగ పండ్రెండు లేకపదునారు సారులకు పెంచుచు బైటి వాయువును పెలుమార్లు - పూరక-కుంభక-రేచకము లోనరించుచుండవలయును. 

ఈప్రాణాయామము జప-ధ్యానములతో గూడిన సగర్బమనియు నవి లేనిచో విగర్బప్రాణాయామమనియుబుధు లెఱుంగుదురు. ఇట్లు క్రమముగ నభ్యసించువాని దేహమున చెమట పుట్టిన నధమ మనియు వణకు పుట్టిన మధ్యమ మనియు మేనుపైకి లేచిననుత్తమ మనియు ప్రాణాయామము మత్తెఱగుల నుండును. 

సాధకు డుత్తమ ప్రాణాయామము సిద్దించువఱకు దీని నభ్యసింపవలయును. ఇంద్రియములు విషయములందు నిరాటంకముగ స్వేచ్చగ తిరుగాడుచుండును. వానిని బల్మితో లాగి నిలుపుట ప్రత్యాహార మనబడును.

అంగుష్ఠము -గుల్పము-పిక్కలు-తొడలు మూలాధారములు -లింగము-నాభి హృదయము -మెడ- కంఠము -లంబిక- ముక్కు - భ్రూమధ్యము-తల మూర్థము ద్వాదశాంతమనునవి స్థానములు. వీనియందు ప్రాణవాయువును నిల్పుడే ధారణ మనబడును. నిశ్చల మనస్సును చైతన్యాత్మలో నిలువ వలయును. 
పిదప తనయిష్ఠదేవతను ధ్యానించుటే ధ్యానమనబడును. నిత్యము జీవ-పరమాత్మల సమైక్యము భావింపవలయును.

అదియే సమాధి యని మునులందరు. ఇట్లు నీ కష్టాంగ యోగమును గూర్చివివరించితిని. ఇపుడింక శ్రేష్ఠమైన మంత్ర యోగమును వక్కాణింతును. వినుము. 

మంత్రయోగ ప్రబోధం

Jaganmata - Philosophy - జగన్మాత - తత్వబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - తత్వబోధ

శ్రీదేవీ యిట్లనెను: మందభాగ్యులగు మీరెక్కడ! ఈ నో లోకాద్బుత దివ్యరూపమెక్కడ! ఐనను మీ మీది వాత్సల్యముతో మీకు నా దివ్యరూపము చూపితిని. ఈ నా దివ్యరూపమును కేవలము నాదయవలన గాక వేదాధ్యయనమున గాని యోగ దానముల వలన గాని యజ్ఞ తపముల వలన గాని చూడ సాధ్యము గాదు. 

ఓ రాజేంద్ర! ఇక ప్రస్తుతము వినుము. పరమాత్మ తాను పెక్కు విధముల యుపాధులతో గూడి జీవత్వమంది కర్తృత్వము వహించును. జీవుడు నానా యోనుల యందు బుట్టుచు ధర్మా ధర్మాత్మకములైన పెక్కు పనులు చేయుచు సుఖదుఃఖము లనుభవించుచు నుండును. 

అట్లు పూర్వ వాసనల వలన నానా కర్మరతుడై పెక్కు విధముల జన్మములు దాల్చచు సుఖదుఃఖము లనుభవించు చుండును. జీవుడు నీటి యంత్రము వలె (ఎద్దులు గాని ఒంటె గాని గుండ్రముగా తిరుగుటచే బావిలో చక్రాకారమున తిరుగు నీటి బొక్కెనల మాల నీటితో పైకి వచ్చును. ఇది ఘటీ యంత్రముగా పూరాణములలో చెప్పబడినది) విశ్రాంతి లేక తిరుగుచుండును. 

అతని కజ్ఞానము కోరికలు కొనలు సాగును. కోర్కులు దీర్చుకొనుట కతడెన్నో పనులు చేయును. ఈ జన్మపరంపరలు తుదముట్టుట కజ్ఞానము తప్పక నశింపవలయును. అజ్ఞానము జ్ఞానము (విద్య) వలన నశించును. పురుషార్థముల కోర్కెలు-తాపములు-తొలగిపోగా జీవన్ముక్తదశ గల్గును. 

అజ్ఞానమున పుట్టిన కర్మ మజ్ఞానమును నశింపజేయజాలదు. కనుక నజ్ఞాన నాశమునకు కర్మమును నమ్ముకొని యుండరాదు. ఈ కర్మములన్నియు ననర్థ దాయకములు. వీని వలన సంతలో రాగము నంతలో ద్వేషాగ్ని పుట్టును. ఇట్టి యనర్థ కర్మములు పల్మారు పుటుచుండెను. ''కుర్వన్నే వేహ కర్మాణి'' యను వేదాను వచనము ప్రకారముగ మంచి కర్మములు చేయుట మంచిధే. కాని మనుజుడెల్లభంగుల జ్ఞానమే పొందవలయును. దివ్యజ్ఞానము వలననే వైకల్యము ప్రాప్తించును. 

సత్కర్మము జ్ఞానమునకు తోడుపడును. మేలు చేకూర్చును. ఈ రెంటికిని విరోధము లేదని కొందఱందరు. అది సరికాదు. ఏలన జ్ఞాన ఖడ్గముననే కర్మములక తావగు హృదయ గ్రంథి ఛేదించబడును.

చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును. 

అటు పిమ్మట కర్మముతో నెట్టి యావశ్యకతయు గల్గదు. చివర కాత్మ వంతుడు సర్వ ధర్మములు పరిత్యజించి నిష్కపటమైన భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. అతడు నిశ్చల నిర్మల చిత్తముతో వేదాంత శ్రవణము నిరంతర మొనరింపవలయును. 

తత్త్వ మస్యది వాక్యముల సత్యార్థమును చింతింపవలయును. తత్త్వ మస్యాది వ్యాక్యార్థము జీవ బ్రహ్మల యేకత్వము దెల్పును. ఈ రెంటి యేకత్వము తెలిసిన నరుడు నిర్బయుడైనా సారూప్యమందగలడు. మొదట పదముల యర్థమెఱింగి పిదప వాక్యములలోని యర్ద మెఱుంగవలయును. 

''తత్‌'' అను పదమున కర్థము భగవతినగు నేనే యని చెప్పబడును. ''త్వం'' అను పదమునకు జీవుడని ముఖ్యార్థము. ఈ రెంటికి ''అసీ'' యను పదము జేర్చి యైక్యము గూర్తురు. వాచ్యార్థములకు విరోధమువలన నైక్యము గుదురనపుడు లక్ష్యార్థములతో వేద నిర్దిష్టములగు ''తత్‌-త్వం'' పదములకు కర్థము చెప్పవలయును. 

జీవ-ఈశ్వరుల ప్రత్యేక ధర్మములు తొలగిపోగరెంటి యైక్య మిట్లెఱుంగుట వలన సద్వయము సిద్దించును. ఆ దేవదత్తు డితడే యన్న వాక్యములో ''ఆ-ఈ'' యను రెంటి ధర్మములు తొలగగ మిగిలిన వాడొక్కడే కధా ! అదే లక్షణ యనబడను. అటులే ఈ స్థూల దేహాది భేదములు తొలగినపుడు నరుడు బ్రహ్మత్వమందును. ఈ స్థూలదేహము పంచీకృత మహాభూతముల నుండి యుత్పన్నయ్యెను. ఇదెల్ల భోగాల కాటపట్టు. జరా వ్యాధులకు కర్మములకు తావలము.

ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును. 

ఓ గిరీశ్వరా!నా యాత్మయొక్క మూడవ యుపాధి కారణాత్మ. అది అనిర్వాచ్యము. అనాది-అజ్ఞానము జరుగును. ఈ మూడుపాధులు తొలగిపోగా కేవలమగు ''ఆత్మ'' మిగిలివెలుగును. పంచకోశము లీ మూడు దేహము లందును సతతము విలసిల్లుచుండును. ఈ పంచకోశములు తొలగిపోగా తుదకు బ్రహ్మనిష్ఠ ప్రాపించును. ఇట్లు ''నేతి-నేతి'' యను వాక్యార్థము వలన నాత్మరూపము వెల్లడియగును. అట్టి ''ఆత్మ'' పుట్టునది -చచ్చునది-పూర్వముండి యిపుడు లేనిదిగాదు: అది నిత్యము-చచ్చునది కాదు. అజము-శాశ్వతము-పురాణము. 

ఈ శరీరాదులు చంపబడుచున్నను నది చంపబడదు. చంపువాడు తాను చంపెననియును చంపబడువాడు నేను చచ్చితి ననియు తలంతురు. కాని వారిర్వురును తెలియనివారే. ఏలన ''ఆత్మ'' చావదు. చంపబడదు. ఆత్మ అణువుకంటెనణువు; మహత్‌ కంటె మహీయము. అయ్యు నది యెల్ల ప్రాణుల హృదయగుహలందు వెలుగును. 

జీవుడు పరమాత్మదయ వలన నాత్మమహిమ మెఱిగివిగత శోకుడు గాగలడు. ఆత్మ-రథికుడు; శరీరము-రథము; బుద్ధి-సారథి; మనస్సు-ఇంద్రియములను మూడును గలిసి భోక్త యనబరగునని పెద్దలందురు. అవివేకి-అమనస్కుడు-అశుచియగు మూర్ఖుడు తత్పద మెఱుగలేక దురిత సంసార సాగరమున మునుకలు వేయుచుండును.

వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడునగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు. 

Thursday, April 23, 2026

Jaganmata - Viradrupa performance - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీదేవి యిట్లనెను: గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆది నాలోకల్పితమైనది. పరమార్దముననది నా కంటె భిన్నము గాదు. వ్యవహార దృష్ఠిలో చూడగమాయ విద్యయనంబరనగును. కాని తత్త్వదృష్టని చూడమాయలేదు. కేవలము తత్త్వ వస్తువే కలదు. 

గీరీశా! చిద్వస్తునగు నేనే పెక్కు మాయా కర్మలంగూడి ఈ జగములు సృజించి ప్రాణ పూర్వకముగ చిదా భాసుడనై యందు ప్రవేశింతును. నా వలననే లోకులకు లోకాంతర గమనములు జరుగును. పెక్కుమాయాభేదముల వలన జీవులుత్పన్నులగుదురు. 

ఒకే మహాకాశము వలన ఘటాకాశములు గల్గునటుల పెక్కుపాధి భేదముల వలన మాయవలన జీవులుత్పన్నులగుదురు. ఒకే రవి మంచి చెడు వస్తుల నెల్ల వెల్గింపజేయును. ఐనను రవికేట్టి దోషమును గలుగదు. అటులనే చిద్వస్తువనగు నాకెట్టి దోషము నంటదు: 

కొందఱు బుద్ద్యాదుల కర్తృత్వముక నా యందారోపింతురు. కొందఱు మూడు లాత్మయే కర్తయని పోరపడుదురు. కాని పండితులైనవారు పోరపడరు అజ్ఞానము వలన మాయ వలన జీవేశ్వరుల భేదము గల్పింపబడినది. ఎట్లనగ మహాకాశము వలన ఘాటాకాశాది భేదములు గల్పింబడును. 

ఇటులే జీవాత్మ- పరమాత్మలకును భేదము గల్పింపబడినది. జీవుల నానాత్వము సహజముగ లేదు. మాయ వలన నున్నట్లు గల్పింపబడెను. అటులే యీశ్వరుల నానాత్వమును మాయ వలన గల్పింబడెను. కాని యది యునుసహజము గాదు. దేహము -మనస్సు-ఇంద్రియాదులు వాసనలు మున్నగు పలు విధముల భేగములు మాయ వలన గల్గుచుండును. పెక్కు జీవేశ్వరుల భేదముల కన్నిటికిన విద్యయే మూల కారణము. మఱేదియును గాదు. 

ఈ త్రిగుణములలో వాసనలలో నెన్నో భేదములు గలవు. మఱి బ్రహ్మాదులలో నీశ్వరులలో నెన్నో భేధములు గలవు. వీనికన్నింటికి నామాయయే మూలకారణము. మఱేదియునుకాదు. వస్త్రమందు దారమువలె నాయందెల్ల జగములు వ్యాపించి యున్నవి. అందు వలననే కారణదేహాభిమాని అగు సూత్రాత్మ స్థూలదేహాభిమానియుగు విరాటు నేనే. మఱి బ్రహ్మ-విష్ణు-రుద్రుడు సూర్యచంద్రులు-తారలు-చండాలుడును-దొంగయు-నేనే. నేనే సకల పశు-పక్షి స్వరూపిణిని.

క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తువులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వ
స్తువులన్నియును నేనే. అవి నేను లేక లేవు. 

ఒక వేళ నేను ఏలకున్నవని యెవడైన ననిచో నావస్తువులు గొడ్రాలిసంతువంటివే. ఒకే త్రాడు పాము-దండ-యను పెక్కు భేధములు నెట్లు దోచునో కేవలము నేనును ఈశ్వరాది బహురూపములనట్లే భాసింతును. అధిష్ఠాన వస్తవులేనిచో కల్పితజగము నిలువజాలదు. 
కావున నాయునికి వలననే యివన్ని యును శక్తిగల వగుచున్నవి కాని మఱి దేనివలనను గాదు. 

హిమాలయు డిట్లనెను: ఓ దేవేశ్వరీ! నీ సమష్టీ దివ్యస్వరూపమును చూడ కుతూహల మగుచున్నది. నీకు నాయెడ దయగలదవిని చూపింపుము తల్లీ! అను హిమగిరీశుని వాక్కులువిన విష్ణ్వాది దేవతలెల్లరు నతవి మాటను గౌరవించి ముదితులై హర్షించిరి. ఆపుడు దేవతల యభిమత మెఱింగి కామములు గురియునట్టి భక్తకామప్రపూరణి శివాదేవి వారికి తన దివ్య విరాట్స్వరూపము చూపెను. 

ఇట్లువారు శ్రీ మహాదేవియొక్క పరాత్పర విరాడ్రూపమును సందర్శించిరి. అపుడు శ్రీదేవియును తల సత్యలోకముగ కన్నులు సూర్యచంద్రులుగ భాసిల్లెను. చెవులు దిక్కులుగపలుకులు వేదములుగ ప్రాణములు వాయువులు హృదయము మహావిశ్వముగ పిఱుదులు భూమిగ తనరెను. 

నాబి సరస్సు నీలాలనింగిగ ఱొమ్ముజ్యోతిశ్చక్రముగ మెడమహర్లోకముగ ముఖము జనలోకముగ నలరెను. నెన్నుదురు సత్యలోకమునకు క్రింది దగు తపోలోకముగ బాహువు లింద్రాదులుగ శ్రవణేంద్రియము శబ్దముగ వెలసెను. నాసికలశ్వి దేవతలుగ ఘ్రాణణేంద్రియము గంధముగ ముఖ మగ్నిగ కనుఱప్పలు రాత్రింబవళ్ళుగనె సంగెను. కన్బోమలు బ్రహ్మస్థానముగ దవుడలు-జలములుగ నాలుక రసముగ కోరలు యముడు వెలసెను.

దంతములు-స్నేహ విలాసములు నవ్వలాట-మాయగకడగంటి చూడ్కులు-సృష్టిగ సిగ్గు-పై పెదనిగ నల రారెను. క్రిందగి పెదవి-లోభమగ వీపు-ధర్మమముగ మేఢ్రము-జగమందలి సృష్టికర్తయగు ప్రజాపతిగ పొట్ట-సాగరములుగ ఎముకలు-గిరులుగనాడులు-నదులుగకేశపాశములు వృక్షములుగనై విలసిల్లెను. 

ఉత్తమగతులు-కౌమార¸యవన జరలుగ కేశములు-మేఘములుగ కట్టుపుట్టములు-సంఘధ్యలుగ విరాజిల్లెను. మనస్సు-చంద్రుడు విజ్ఞానశక్తి-శ్రీహరిగ హృదయము-రుద్రుడుగనై శోభిల్లెను. రాజా! దేవి పిఱుదం దశ్వజాతులన్నియు నడుమునకు క్రింది భాగమున నతలాదిలోకములుండెను. 

ఇట్టి శ్రీదేవి ఇశ్వరూపమును దేవత లెల్లరును కన్నుల కరవుతీర సందర్మించిరి. దేవినుండి వేనవేలు జ్వాలామాలికలు వెలువడుచుండెను. దేవి తన పొడవైన నాలుకతో లోకము లెల్లనాకు నట్లుండెను. దేవి పటపట పండ్లు కొఱకుచు కన్నుల నిప్పుల కణికలు గ్రక్కుచు నానాయుధములు దాల్చి బ్రాహ్మణ క్షత్రియుల నాహారము చేసికొనుచుండెను. 

దేవి సహస్రశిరములు సహస్రనయనములు సహస్రచరణమలు గల్గి సూర్యకోటి ప్రభాభాసమానయై విద్యుత్కోటి సమానప్రభలు చిమ్ముచుండెను. పరాశక్తియొక్క మహాభీషణ ఘోరదారణరూపము చూపఱుల హృదయముయములకు భయంకరముగ నుండెను. అట్టి రూపముగాంచి సురలు మిన్ను ముట్టి హహాకారములు చేసిరి. వారి హృదయనలల్లాడగ తీరని మూర్చ మునిగిరి. 

వారు దేవి జగదంబయను మాటయే మఱచిరి. అటుల స్పృహ కోల్పోయి పడియున్న దేవతలను దేవికి నలు వైపుల నున్న వేగములు మేలు కోల్పి ప్రభోధ మొనరించెను. దేవతలు దివ్యశ్రుతులాలకించి ధైర్య మవలంబించి ప్రేమాశ్రు పూర్ణ నేత్రములతో గళము తొట్రుపాటు జెందుచుండ కన్నీట మాటలు తడబడ దేవి నీ విధముగ సన్నుతింపసాగిరి. ఓ అమ్మా! మాతపుపలు క్షమింపుము. మేము నీ కన్న బిడ్డలము. మమ్ముకాపాడుమమ్మా!

ఓ దేవేశీ ! నీ కోప ముపసంహరించుము. నీ భీకరరూపము గాంచిన మా గుండె లవిసిపోవుచున్నవి. మేము పామరులము దీనులము. త్రిదశులము. నిన్నెంతని సన్నుతింపగలము ! నీ విక్రమ మహాశక్తు లెంతటివో నీకే తెలియదే ! ఇక నీ తర్వాత పుట్టిన మా కెట్లు తెలియును? 

ఓ త్రిభువనేశ్వరీ! నీకు మా ప్రణామములు. ప్రణవాత్మికాః నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధా!హ్రీంకారమూర్తీ! నీకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సకల దేవతలు - సాధ్యులు క్ష మనుజులు-పశువులు -పక్షులు జన్మించెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. 

ఏ జగదంబికనుండి ప్రాణాపానములు - వ్రీహియవలు-సత్యము -శ్రద్ధ-బ్రహ్మచర్యము మున్నగునవి కల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సప్తప్రాణములు -సప్తదీవులు-సప్తసమధలు-సప్తహోమమలు- సప్తలోకవ్లుు గల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణాముములు. ఏ జగదంబికనుండి యెల్ల సాగరములు-నదులు-గిరులు-రసములు-ఓషదులు సంభవించెనో యట్టి సర్వాత్మికకు సర్వాత్మికకు ప్రణామములు. 

ఓ మాతా! నీ పూర్వభాగము-వెనుక భాగము- ఇరుపక్కలు-పైభాగము-నాల్గు దిక్కులు వీనికి మాటిమాటికి ప్రణామములు. ఓ దేవేశీ! నీయీ లోకాతీతమైన విశ్వరూప ముపసంహరింపుము. అందాల కందమైన నీమొదటి రూపమును ప్రదర్శింపుము. 

తల్లీ!ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబిక దయాంతరంగయై తన ఘోరరూపమువదలి శాంతసుందరరూపము చూపెను. అపుడు దేవి పాశ-అంకుశ-వర-అభయ హస్త-సర్వాంగసుందరి-శిరీసఖోమలి-కరుణాపూర్ణనయన-మందస్మితముఖమల. అట్టి దేవిసుందర దివ్యరూపమును దర్శించి భయములు పాసి ప్రశాంతచిత్తలై సంతోషాతిశయమున మాటలాడరాక తుదకు పెక్కు గతుల దేవిని సన్నుతించిరి.

జగన్మాత - తత్వబోధ

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల...