శౌనకాది మహమునులారా ! నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం ఆందంగా ఉంటుంది. కనక అలాగీ చెబుతాను వినండి - అంటూ సూతుడు కొనసాగించాడు.
నారాయణమహర్షీ | సదాచారం గురించి సవివరంగా తెలియజేశావు. చాంద్రాయణజాది వ్రతాలగురించీ చెప్పావు. కానీ అవన్నీ ఆచరణకు కష్టసాధ్యాలు. మాలాంటివారికి దేవి అనుగ్రహం లభించేట్టూ, సుఖంగా తేలికగా అనుష్టించడానికి తగినట్టూ ఏమైనా వ్రత విధానాలుంటే తెలియజెయ్యి. గాయత్రీవిధి చెప్పావు. అనుష్టానం చాలా ఉంది. వాటిల్లో ముఖ్యాతిముఖ్యం అత్యధిక పుణ్యప్రదం ఏమిటి? గాయత్రీమంత్రానికి ఇరవైనాలుగక్షరాలన్నావు. వాటికి బుషులు ఎవరు ? ఛందస్సు లేమిటి ? దేవతలెవరు ? ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నావంటి అలనుల్ని తరింపజెయ్యి - అని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆరంభించాడు.
No comments:
Post a Comment