తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు
తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు. స్వామికి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లు ఉంటాయి. ఆయన కళ్లు విశ్వశక్తికి మించినవని, అందుకే భక్తులు స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరట. ఈ కారణం చేతనే, తిరుమల స్వామి కళ్లు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు.
ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి వేంకటేశ్వరుని కళ్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, ఆయన కళ్లు చాలా తీక్షణంగా ఉంటాయని, నేరుగా చూడలేమని చెబుతున్నారు. అందుకే భగవంతుని కన్నులు ఎప్పుడూ కర్పూరంతో మూసి ఉంచుతారట. కేవలం గురువారం మాత్రమే వేంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు.
గురువారం జరిగే నిజపాద దర్శనం లేదా నేత్ర దర్శన సమయంలో మాత్రమే ఆ నామన్ని మారుస్తారు, ఆ సమయంలో భక్తులు స్వామివారి కళ్లను ఒక్క క్షణం చూడగలుగుతారు.
గురువారం వేంకటేశ్వరునికి చందన స్నానం చేస్తారు. విగ్రహానికి చందనం పూస్తారు. శ్రీ వేంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పూయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుందని చెబుతారు.
వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.
తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేశుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారుతూ ఉంటది. ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.
ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలి పోతుంది. కానీ, నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు. అయినా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం.
తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం.. గర్భగుడిలోని వేంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు. నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.
గురువారం వేంకటేశ్వరునికి చందన స్నానం చేస్తారు. విగ్రహానికి చందనం పూస్తారు. శ్రీ వేంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పూయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుందని చెబుతారు.
వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.
తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేశుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారుతూ ఉంటది. ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.
ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలి పోతుంది. కానీ, నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు. అయినా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం.
తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం.. గర్భగుడిలోని వేంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు. నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment