Saturday, January 31, 2026

Magha Purnima - మాఘ పూర్ణిమ Poornima

మాఘ పూర్ణిమ

మాఘ పూర్ణిమ సందర్భంగా నదిలో స్నానం చేయడం ఎంతో పుణ్యం. స్నానం చేసిన తర్వాత అన్నదానం దానధర్మాల వల్ల మీ జీవితంలోని పాపాలు, గత జన్మ పాపాలు తొలగిపోతాయని  భావిస్తారు.

పూర్ణిమ రోజున, శ్రీమహావిష్ణువు కు ఎంతో ప్రీతికరమైన రోజు. కావున ఆరోజు విష్ణు అవతారలకు  మరియు హనుమంతుని పూజిస్తారు. ఈ రోజున విష్ణువు, హనుమంతుని పూజించిన కోరికలు  నెరవేరుతాయని విశ్వాసం.

మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగడానికి మాఘ పౌర్ణమి రోజు సూర్యుడిని, అమ్మవారిని పూజించాలి.

మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం యంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. దశమహావిద్యలు త్వరగా సిద్ధిస్తాయి.

మాఘ మాసంలో దేవతలు స్వర్గం నుండి దిగి గంగా నది ఒడ్డున ఉంటారని చెప్తారు. ఈ మాఘ పూర్ణిమ రోజున నదీస్నానం లేదా సముద్రస్నానం ఎంతో శ్రేయోదాయకం. ముఖ్యంగా గంగానది సముద్రంలో కలిసేచోటు అనగా గంగాసాగర్ లో పుణ్యస్నాన మాచరించిన ఎంతో పుణ్యప్రదం.

ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో ఉంటాడు, చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, మాఘ పూర్ణిమ నాడు నదీ లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సూర్యచంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతారు. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది.

మాఘ పూర్ణిమ కథ

పురాణాల ప్రకారం, ధనేశ్వర్ అనే బ్రాహ్మాణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఓరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళిక దేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటినుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా, కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

చంద్ర దోషం నుంచి విముక్తి కోసం
ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ‘ఓం శ్రామ్ శ్రీమ్ శ్రౌమ్ సః చంద్రాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.


Magha Puranam 14 - మాఘ పురాణం 14 బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట

మాఘ పురాణం - 14 వ అధ్యాయం

బ్రాహ్మణ స్త్రీ భర్తతో  స్వర్గమునకు వెళ్ళుట

ఓ దిలీపుడా! మాఘమాసములో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివికదా! అటులనే విప్రకన్య తనభర్తతో ఎటుల విష్ణుసాయుజ్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపుము.

పూర్వకాలమందు కాశ్మీర దేశ మందుగల ఒక గ్రామములో సుబుద్ధి యను బ్రాహ్మణుడు కలడు. అతడు నాలుగువేదములు చదివి అర్థ తాత్పర్యసహితిముగా వర్ణించగల పండితుడు. చదువు నందెటుల పాండిత్యముగలదో బుద్దియందును పేరుకుతగినటులే పెద్దలను గౌరవించుట, భూతదయగలిగి, అందరి మన్ననలను పొందియుండెను. అతడు గొప్ప పండితుడగుటవల్ల ఆనేకమంది ఇతర వండితులు అతని వద్దకు జేరి శిష్యులైరి, అ బ్రాహ్మణుసకు పది సంవత్సరముల బాలికమణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూవవతి, సుగుణాల రాశి, అందాలబరిణి లేడి కన్నులవలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రునివంటి ముఖము గలది. తుమెద రెక్కలను పోలు నల్లని పొడ గాటి తలవెంట్రుకలు గలది, ఆమె నడచినయెడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది, కోకిల కంఠమువంటి మధురమైన కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు, పండ్ల వరున చూచినవారికి మరల మరల చూడ వలయునను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను.

ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి. ఇంటజరుగు దైవ కార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలు దేరి వెళ్ళుచుండగా, దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను, ఆ బంతి బైటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీలవచ్చి సుమిత్రుని చూచినది.

సుమిత్రుడుకూడ యుక్త వయస్సులో నున్నాడు.చక్కటి అవయవసౌష్టవం కలవాడు, విశాలమైన వక్షముకలిగి, బంగారు కాంతిగల రూపవంతుడు, అతని అందమును సుశీల చూడగానే నివ్యెర పోయినది. అతనిని తదేకదృష్టితో చూచి అతని వెంటబడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలదూరమేగెను. అలా కొంతదూరమేగుసరికి ఒక కోనేరు కనుపించెను, ఆ కోనేరునిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి, తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోను, పండ్ల తోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి, మగ నెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమతమ పింఛములను విప్పి నాట్యమాడు చున్నవి, నీటి జంతువులు తామరతూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పై కెగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరంనుంచి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు
గ్రోలి చెట్లనీడను విశ్రమించి యుండెను. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి సంపెంగ పువుల వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రీంద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని
సౌందర్యమును కనులార చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించింది. "ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు న మనస్సు న స్వాధీనములో లేదు. అందులకే నీ వెనుక ఇంతదూరం వచ్చితిని. ఈ ఏకాంతప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము.
చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు, నీవయసు, నావయసు సరిసమానము.
ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె నున్నాము చిలకా గోరింకలవలెను, రతీమన్మధులవలెను లీనమైపోవుదము. ఆ చెట్టుపైనున్న గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన అతుమెదల జంటల చూడు ఏలాగున్నవో! కాన రమ్ము నాయవ్యనబింకాన్ని ఆఘ్రాణించుము, సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీ కర్పింతును. నీవు మన్మధునివలె వచ్చి నన్ను కాగలించుకో” అని అనేక విధాల ఆ విప్రకుమూరుని తొందర పెట్టసాగెను.

అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాటరాక శిలావిగ్రహమువలె ఉండి తేరుకొని తరువాత బాలా! నీ మాటలు చూడ పిచ్చి దానివలెనున్నావు, నీకేదైనా గ్రహము అవరించినదా ? అని సందేహము కల్గుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు, నేను నీకు అన్ననగుదును నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలోనున్నావు నీ వెంతటి అందగత్తె
వయినను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు, అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి, గాన నీ ప్రయత్నమును మానుకోనుము. నీకు కష్టములెదురౌను. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మన మిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు వున్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను, ఏ యే జన్మలెత్తినను మనలను వెంటాడుచునే వుండును, ఆ నరక బాధలనుండి - మన మెన్నటికిని విముక్తి నొందజాలము కాన నీకోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాల ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటుల గరువర్యులకు తెలిసినచొ నిన్ను దండింతురు గాన రమ్ము. ఫలములు, కుశలు పుష్పము మొదలగు పూజాద్రవ్యములను దోడ్కొని పోవుదము" అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు.

అంత నా కన్యయు, బంగారము, రత్నము, విద్య, అమృతము, తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడుగని వివేకవంతుడుగాడు. నానిండు యవ్వనాన్ని, నా'శరీరాన్ని సమస్తమును నీ కర్పింతునన్న నిరాకరించుచున్నావుగదా! సరే నేనిక వంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగ మొనర్చుకొందును. నీవలన ఒక కన్య చనిపోయినదని నలువురూ నిన్ను ఆడిపోసుకొందురు. నన్నొంటరిగా యీ కారడవిలో వదలి ఇల్లుచేరినయెడల నా దండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదియని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయెనని చెప్పియే యుందురు, గాన నేను కామ బాధ భరించ లేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీదానను చేసికొనుము” అని పలికెను.

సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకటస్థితిలో పడెను. కొంత తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణకన్యతో రతీ క్రీడల దేలుటకే నిశ్చయించుకొనెను.

"శాంకరీ! ఈ విధముగా వారిరువురునూ ఆతటాక సమీప మందొక ప్రదేశమును శుభ్రముచేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు విదజల్లు పుష్పములు బరచి ప్రకృతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృస్న దీర్చుకొని, మరికొంత సేపు బంతులడి గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి. వారి కామ వికారములనుచూచి, పక్షులు సిగ్గుపడి అచ్చోటినుండి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములుముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులో కలువలు మెడవంచినట్లు నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలుగూడ సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవుండి సమిత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖముపట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి, తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించెను. అడవికిపోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెనుజూచి “సుశీలా! నీవు ఉద్యానవనములోని చెలులతో బంతులాటలాడి చాల అలసిపోయివున్నావు, పాపము! ఎందుకు నీ
సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయివున్నదోకదా! రమ్ము ఈ మధుర వదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుటవలన నీవు ధరించిన - ఉడుపులుకూడ నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమియు ఎరగనిదానివలె నటించెను. మరి కొంత కాలమునకు సుశీలను హీమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడు డోకడు పెండ్లియాడి అత్తవారింటనే నుండిపోయెను.

మరికొంత కాలమునకు సుశీలను "పెండ్లి యాడీన బ్రాహ్మాణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల యేడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెనుకదా! అని గొల్లుమని ఆడదానివలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసారసుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రిదీని కాలమెట్లుతీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకరమని భావింతురే? ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరుకదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!” అని పరి పరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్లి సుబుద్ధితో “ఆర్యా ! మిరు దుఃఖించుటకు కారణమేమి ? త్వరగా చెప్పుడు" అని పలికెను.

అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో స్వామి! మా దుఃఖముగురించి ఏమని చెప్పుకొందును, మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనామ్ కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవారు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు, మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమె కీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు" అని వేడుకొనెను.

సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టి చే అంతా గ్రహించి, "విప్రవర్యా! నీ కుమారై వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంవర్కము కలిగివుండి, తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను, ఆ రక్తపాతము భయానకదృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడ ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది, అటువంటి ఘోరాహత్య చేసి, ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషమువల్లనే నీ అల్లుకు చనిపోయాడు, ఆమెకు చుట్టుకున్న పాతకమువలననే విధవరాలై నది, అంతటి పాపాత్మురాలు అయినప్పటికి పుణ్యాత్ములగు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తంతాము గూడా వివరించెదను వినుము.

చాల సంవత్సరాల క్రిందట అనగా నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసములో
సూర్యభగవానుడు మకరరాశియందుండగా, కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ
తీరమునకు బోయి, స్నానముచేసి ఇసుకతో గౌరీ దేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ దేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమెకూడా పాల్గొనుటవలన ఆ వచ్చిన పుణ్యఫలం చేత నే నీ వంశములో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహాస్యంగా అడవికిపోయి తన కామవాంచ కొఱకు, అతనితో రమించినది. అందువలననే యా వైధవ్యం కలిగినది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో పాపకర్మవలననే కుమార్తెకు అకాల వైధవ్యము కలిగినది.ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది! కానున్నది కాక మానదు, మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా ! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు
సుబుద్ధి “హారివారీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసివచ్చినది. పూర్వజన్మలో యి నా కుమార్తె తన భర్తను హత్యచేసి తానూ అత్మహత్య చేసుకొన్నది? సరే ఈ జన్మలో కూడా కన్యగావుండి నాకు
కుమారునితో సమానుడు, తనకు సోదరుడులాంటివాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటిఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామి ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరొకవైపు ప్రేమ కలుగుచున్నవి, గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.

సుబుద్దీ! నీ కుమార్తె గురించి నీ వడగకపోయిననూ తన్నివారణోపాయము వివరించవలయుననియే నేను యిలా వచ్చినను. ఈ మాఘమాసంలో నీ కుమార్తేచేత నదిలోగాని, చెరువులోగాని సూర్యోదయం కాగానే స్నానముచేయించి, అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యము లిచ్చి పూజలు చేయించుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తెచేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలిగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.

మాఘశుద్ధ విదియనాడు ముత్తైదువుల పాదములకు పసుపురాసి నుదుటబొట్టుపెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్తచేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికలగుడ్డ పసుపు కుంకుమ, పండ్లు, తమల పాకులు, వక్కలు దక్షిణ పెట్టి దాన్నిపై రెండవ చేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగాభోజనము పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధముగా చేసినయెడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ యగును.

కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానము చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయిననువారిని ప్రోత్సాహవరచి, వారుకూడా నిష్టతో మాఘమాసస్నానములు చేయవలయును. వంశాభివృద్ధికిగాని. కుటుంబ గౌరవానికిగాని, స్త్రీయే ప్రథాన కారకురాలు కనుక ఈ మాఘమాసస్నానము తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాస మంతయు పురాణములు చదివి హరికధలుగాని హరినామ కీర్తనలుగాని ఆలకించుచు, దాన ధర్మములు చేసినయెడల దానికన్న ఫలితముమరొక ఏవ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాసస్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేనివారలచే మాఘస్నానములు విడువక చేయించినియెడల వారిపిచ్చి కుదురును. కుష్టువ్యాధితో భాధపడువారు మాఘస్నానములుచేసిన వారికి రోగనివృత్రియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు.స్త్రీగాని , పురుషుడుగాని మాఘమాస స్నానములు డాంబికములతో నాలుగురుచూచి పొగుడుతున్నట్టుగా గాక చిత్తశుద్ధితో స్నానములుచేసి విష్ణు దర్శనము. సూర్య నమస్కారములు, పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు అటుల చేసిన "చిత్తశుద్ధిలేని శివపూజలేలయా” అనురీతిగా నిష్ప్రయోజనము లగును. అని సుబుద్ధికి బిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.

ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ది తనకుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కాంచినవానివలె లేచి జరిగిన వృతాంత్తమును విని తానుకూడ తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.

Friday, January 30, 2026

Magha Puranam 13 - మాఘ పురాణం 13 శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట

మాఘ పురాణం - 13 వ అధ్యాయం

శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట

వశిష్ఠులవారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించాను.

"మహామునీ! ఈమాఘమాస మాహాత్మ్యమును ఇంకను వినవలయుననెడికోరిక ఉదయించుచున్నది. గానసెలవిండ"ని ప్రార్ధించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగాను.

మున్ను పార్వతీ దేవికి శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యము గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము.

ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వత మందలి మందారవృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చునివున్న సమయమున జగజ్జనని యగు పార్వతీ దేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి, - "స్వామి! మీ వలన ననేక పుణ్యసంగతులు తెలిసికొంటిని. కానిప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలె ననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమం దాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన! నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను.

దేవీ!నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము.

సూర్యుడు మకర రాశియందు నుండగా మాఘమాసమందు ప్రాతః కాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో, అతడు సకల పాపములనుండి విముక్తు డగుటయేగాక, జన్మాంతమందు మోక్షమును పొందును. ఆటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా, ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాదు, జీవనది వున్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్న చోటగాని తటాక మందుగాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయీగాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానము జేసిన విష్ణులోకమునకు పోవును, మూడవనాటి స్నానము
వలన విష్ణుదర్శనం కలుగును, మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందుగల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు.

దేవీ మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందు వుండగా ఏది అందుబాటులోనవున్న అనగా- నదిగాని, చెరువుగాని, నుయ్యిగాని, కాలువ
గాని లేదా పాదము మునుగునంత నీరున్న చోటగాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి, శివాలయమునగాని, వైష్ణవాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆర్చనచేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.

ఏ మానవునకైననూ తన శరీరంలో శ క్తి లేక, నడువ లేనటువంటివాడు. గోవు పాదం మునుగునంత నీరున్న సెలయేటి యందైనను కడకు బావియంధైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము
చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ, వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశి యందుండగా నదిస్నాన మాచరించిన యెడల అతినికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానంచేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి, విష్ణుమందిరమునగాని, శివాలయమునగాని దీపం వెలిగించి ప్రసాదం సేవించినయెడల అతనికి తప్పక విష్ణు లోక ప్రాప్తి గలుగుటయేగాక, పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించ వచ్చును.

మానవుడు నారా జన్మ మెత్తిన తరువాత మరల ఘోర పాపములుచేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుటకంటె తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి, వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరంగదా!. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గరమార్గం. గాన ఓ పార్వతీ ఇంకనూ వినుము ఏమానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు ఎటువంటి భాధలనుభవించునో వివరించెదను సావధానురాలవై ఆలకింపుము.

నేను తెలియ జేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతః కాలమున. జపంగాని, విష్ణుపూజగాని యధాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించును.కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, రంపముల చేత, ఖడ్గముల చేత, నరుకబడును, సలసల క్రాగు తైలములో పడవేయబడును. భయంకరయమకింకరులచే పీడింపబడును.

ఏ స్త్రీ వేకవజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానముచేసి సూర్య నమస్కారము విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి, ఆత్తమామల సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీ కి ఐదవతనము వర్ధిల్లి, ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు
అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.

మాఘమాస స్నానమునకు వయోవరిమితి లేదు, బాలుడైనను, యువకుడైనన్ను, వృద్ధుడైనను, స్త్రీ యైనను, బాలికైనను జవ్వని యైనను మాఘమాస స్నానమాచరించవచ్చును, ఈ మాసమంతయు కడు నిష్టతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది.

పార్వతీ! దుష్టులలో స్నానంచేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము . దొంగిలించినవారు, గురు భార్యతో సంభోగించువారు, మధ్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీస్నానంచేసి విష్ణువును పూజించిన యెడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును, మరియు కులభ్రష్టులైనవాడును, కించిత్‌ మాత్రమైననూ దానధర్మములు చేయని వాడునూ, ఇతరులను వంచించి, వారివద్ద ధన మపహారించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్ర ద్రోహియు హత్యలు చేయువాడును,బ్రాహ్మణులను హింసించువాడును,సదా వ్యభిచార గృహములో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువాడును, రాజద్రోహీ, గురుద్రోహీయు, దైవ భక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తాను గొప్పవాడనను
అహంభావముతో దైవకార్యములను, ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి, సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగుల బెట్టువాడును, చేడుపనులకు ప్రేరేపించువాడును, ఈవిధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానముచేసిన యొడలవారందరు పవిత్రులగుదురు.

దేవీ! ఇంకను దాని మహాత్మ్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూరకర్మములు ఆచరించువాడును, సిగ్గువిడిచి తిరుగువాడును, బ్రహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన
యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును, మాఘమాస స్నానములు ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్పలితము కలుగును, ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండీ ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో
ఆటువంటి మానవులకున్న పాపములు తొలిగిపోయి, ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జెర అర్హుడగును.

శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది, అన్ని జాతులలో
బ్రాహ్మణు డధికుడు, అన్ని పర్వతాలలో మేరుపర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచే ఆ మాసమందాచరించే ఏ స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగ జేయును, చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా నున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టేలు తెచ్చి, అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత
స్నానము చేయించినయెడల ఆ స్నానఫలము పొందగలరు, అదియును గాక చలికాగినవారు స్నానముచేసి శ్రీవారిని దర్శించిన పిదవ అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచియై ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల మంచి ఫలితం కలుగును.

ఈ విధంగా ఆచరించినవానిని జూచి ఏ మనుజుడైననూ అపహాస్యముగా జూచినను, లేక అడ్డుతగిలిననూ, మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, తన భార్యను, లేక కుటుంబసభ్యులందరినీ మాఘస్నాన మాచరించునటుల ఏ మానవుడు చేయునో, అతనికి మాఘమాస ఫలితము తప్పకకల్గును. ఆ విధముగానే బ్రాహ్మణునిగాని, వైశ్యునిగాని, క్షత్రియునిగాని, శూద్రునిగాని, మాఘమాసస్నానం చేయమని చెప్పినయెడల, వాడు పుణ్యలోకము బోవుటకు ఏ అడ్డంకులు వుండవు, మాఘమాస స్నానములు చేసినవారికిగాని లేక వారిని ప్రోత్సహించువారలను జూచిగాని ఆక్షేపించి,పరిహాసం లాడువారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశాక్షీణము కలిగి దరిద్రుడగును.

నడచుటకు ఓపిక లేనివారలు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని, తలపై నీళ్లు జల్లుకొని సూర్యనమస్కారమును జేసి మాఘపురాణమును చదివిగాని, వినుటగాని, చేసిన యెడల జన్మాంతమున విష్ణుసానిద్యము పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానముగన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘస్నానము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా నూరు అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చిన నెంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాసస్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మాణహాత్య, పితృహత్యా మహా పాతకములు చేసిన మనుజుడైనను, మాఘమాసము అంతయు కడు నిష్టతో వున్న యెడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.

గనుక ఓ పార్వతీ! మాఘమాసస్నానమువలన యెట్టి ఫలితము కలుగునో వివరించీతినిగాన నే చెప్పిన రీతి ఆచరింపుము.

Shani Trayodashi - శని త్రయోదశి

శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులు శని దేవుని పూజించడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. సూర్య పుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో 2.5 ఏళ్లు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు. అయితే ఈయనకు కష్టాలను ఇచ్చే వాడు అనే పేరే ఉంది. కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలు జరుగుతాయని భావిస్తారు.

శనిదేవుడికి కర్మ ఫలదాత అంటారు. ఈ శనిదేవుడు 12 రాశులపై 7.5 ఏళ్లు ఏలినాటి శని, అష్టమ లేదా అర్ధాష్టమి (2.5 సంవత్సరాలు) రూపంలో ప్రభావం చూపుతూ ఉంటాడు. ఈ సమయంలో ఆయా రాశుల వారికి కష్టాలు ప్రారంభం కావడం, అనుకున్న పనులు ఆలస్యం కావడం, మానసిక ఒత్తిడి కలగడం లేదా అదృష్టం కలిసి రావడం, అద్భుతమైన కెరీర్‌ వృద్ధి కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ప్రస్తుత సమయం లో కుంభ రాశి వారు చివరి దశ. మీన రాశి వారు రెండో దశ, మేష రాశి వారు మొదటి దశ లో వున్నారు. వీరే కాక సింహ రాశి వారు అష్టమ శని మరియు ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దశలో వున్నారు. కావున వీరు శని త్రయోదశి రోజు పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇది కొంత పరిహారము మాత్రమే పూర్తిగా కాదు.

శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని చెప్తారు. మరియు శనిదేవుని అధీనంలో ఉండే తిథి, నక్షత్రం, వారం, మాసం శనివారం నాడు వస్తుంది కాబట్టి దానిని శని త్రయోదశి అంటారు.

శనిదేవుని శనీశ్వరుడు అని పలకరాదు, శనైశ్చరుడు అని పలకాలి.

ఈ శని మంత్రాన్ని జపించాలి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

శని ధ్యానం
నీలద్యుతిః నీలవపుః  కిరీటీ
గృధస్ధితాశ్చాపకారో ధనుష్మాన్|
చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః
సదాస్తు మహ్యం వరమందగామీ||

బీజమంత్రం:
ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః

శని గాయత్రి:
1.ఓం రవిసుతాయ విద్మహే
మందగ్రహాయ ధీమహి
తన్నః శనిః ప్రచోదయాత్

2.ఓం కాకధ్వజాయ విద్మహే
ఖడ్గ హస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, 100 గ్రాముల నువ్వుల నూనె ప్యాకెట్, 1 కిలో బొగ్గు, ఒక చిన్న నల్ల గుడ్డ, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు కట్టి, ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నదిలో వేయండి.

కాకికి ఆహార పదార్థాలను అందించి, ఎంతో పుణ్యఫలం కాకి శని దేవుని వాహనం.కాకికి ఆహారం అందించడం వల్ల శనిదేవుడు ప్రీతీ చెందుతాడు మరియు పితృదేవతలు కూడా ప్రీతీ చెందుతారు.

శని త్రయోదశి నాడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా సంప్రదాయాలలో ఉన్నాయి. శని ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్లీ మొదలవుతుందనే నమ్మకం పురాణ కథల ద్వారా ప్రచారంలో ఉంది. ఈ నమ్మకాలు భక్తులలో ఒక క్రమశిక్షణను కలిగించడంలో సహాయపడతాయి.

శనివారం నూనె, గొడుగు, నవధాన్యాలు.. మొదలైన వాటిని కొనుగోలు చేయవద్దు.

ఈ రోజున మీరు నల్ల చీమకు పంచదార ఇవ్వాలి. నల్ల చీమలు కనిపించకుంటే చీమలు ఎక్కువగా ఉన్నచోట పంచదార వేయండి. అలాగే చెట్టు మూలాన దీపం వెలిగించి పూజిస్తే శని కోపం తగ్గుతుంది.

నల్ల నువ్వులు, నువ్వుల నూనె శనికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కాబట్టి వాటితో దానం చేసి పూజిస్తే శని తృప్తి చెందుతుందని చెబుతారు. అలాగే ప్రతి శనివారం ఇలా చేస్తే విజయం చేకూరుతుంది.

నేడు ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో శని దేవుడి ఎదుట దీపం వెలిగిస్తే ఎంతో మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది.


శని


నవ గ్రహ స్తోత్రం

నవగ్రహ బీజ మంత్రములు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Thursday, January 29, 2026

Matsya Puranam - మత్స్య పురాణము

మత్స్య పురాణము

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
 ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌ ॥

అష్టాదశపురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధః ప్రకీర్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహస్రాణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు.

మత్స్యపురాణంలోని 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల లక్షణాలు, ఆపురాణాలలో చెప్పబడ్డ అంశాలు, శ్లోకాల సంఖ్య తదితర విషయాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు.

మత్స్యపురాణంలో చెప్పబడ్డ ప్రధాన అంశాలు :
మత్స్యావతారవర్ణన, బ్రహ్మాండసృష్టి, గర్భిణీధర్మాలు, సూర్యచంద్ర వంశాల వర్ణన, గయాక్షేత్ర విశేషాలు, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, శ్యమంతకోపాఖ్యానం, కలిధర్మాలు, ద్వాపరధర్మాలు, కృష్ణాష్టమీవ్రతం, అక్షయతృతీయ వ్రతం, మహాదానవర్ణన, పుష్యవాహనుడికథ, ప్రయాగక్షేత్రమాహాత్మ్యం, యమునానదీ స్నాన ప్రాశస్త్యం,
సప్తద్వీపాల వర్ణన, ఋషిలక్షణాలు, పార్వతీకళ్యాణం, వినాయకజననం, కుమారసంభవం, తారకాసురవధ, నృసింహావతారవర్ణన, సావిత్రీ సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, వామనావతారం, వరాహావతారం, క్షీరసాగరమధనం, 
వాస్తు శాస్త్రవిశేషాలు, క్రియాయోగ వర్ణన, వివిధరకాల ప్రతిమా నిర్మాణ విశేషాలు, కల్పనామ సంకీర్తన వంటి ప్రధానాంశాలతో పాటు మరెన్నో
విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.

మత్స్యపురాణ ప్రాశస్త్యం
పాతాళాదుత్పతిష్టోర్మకర వసతయోయస్య పుచ్చాభిఘాతా ।
దూర్ధ్వం బ్రహ్మాండఖండ వ్యతికర విహితవ్యత్యయే నాపతంతి ॥

విష్ణోర్మత్స్యావతారే సకల వసుమతీ మండల వ్యశ్రువానా ।
స్తస్యాస్యోదరితానాం ధ్వని రపహరతాదశ్రితుం వః శ్రుతీనాం ॥
(మత్స్యపురాణం -శ్లో 1 -2)

మత్స్యావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు, పాతాళలోకంనుంచి పైకి ఎగిసిపడే తన మత్స్యంతోకతో కొట్టబడుతూ, సముద్రంపై భాగం నుంచి పడుతూ ఈ బ్రహ్మాండఖండాల సంపర్కంతో పుట్టిన కల్లోలం వల్ల సమస్త భూమండలంలో వ్యాపిస్తూ, పైకెగిరి తిరిగి క్రిందపడుతున్నాడు. ఆ మత్స్యపరమాత్మ నోటినుంచి వెలువడే వేదాలనాదం మనందరి పాపాలనూ పోగొట్టుగాక.

శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సృష్టి ప్రారంభంలో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగిలించి పాతాళంలో దాచగా, మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, హయ
గ్రీవుడి చెరలోవున్న వేదాల్ని ఉద్దరించాడు. ఈ విధంగా వేదాల్ని ఉద్ధరించి సమస్త భూమండలాన్ని రక్షించిన మత్స్యావతార విశేషాల్ని చెప్పినందువల్ల ఇది మత్స్యపురాణం అనబడుతోంది. మహాప్రళయ కాలంలో శ్రీమహావిష్ణువు సప్తర్షులకూ,
వైవస్వతమనువుకూ ఉపదేశించిన ఎన్నో మహిమాన్వితమైన కథలు, గాథలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.

ఈ మత్స్యపురాణాన్ని శైవులు, స్మార్తులు, శాక్తేయులు, వైష్ణవులూ ప్రామాణికంగా గ్రహిస్తారు. పురాణానికి చెప్పబడ్డ ఐదులక్షణాలూ ఈ పురాణంలో సమగ్రంగా వున్నాయి. ఇందులో కథలు, గాథలే కాక అనేకమైన శ్రౌత, స్మార్త, నిత్యనైమిత్తిక కామ్య కర్మలకూ సంబంధించిన వివిధ రకాల అంశాల వివరణ కూడా కనిపిస్తుంది. ప్రాచీనతదృష్ట్యా కూడా మత్స్య పురాణానికి ఒక ప్రత్యేకత
వుంది. అందుకే వామన పురాణం 'పురాణేషు దైవం మాత్స్యమ్‌' - పురాణాలలో దైవంలాంటిది మత్స్యపురాణం అని చెబుతుంది.

ఈ పురాణంలో ఎన్నోరకాల వైదిక అనుష్టాన ప్రక్రియలు వివరించబడ్డాయి. ముఖ్యంగా తొంభైరెండు, రెండువందల అరవై నాలుగు అధ్యాయాల్లో గ్రహశాంతుల గురించి సవివరంగా చెప్పారు. ఇవేకాక రుద్ర, ఉమా, విష్ణు, స్వయంభూ, ఇంద్ర, యమ, అగ్ని జల, సర్ప, వినాయక వంటి దేవీ దేవతలకు నైవేద్యం అనగా బలిని ఎలా సమర్పించాలి? అనే విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి.

మత్స్యపురాణంలో వైదికమంత్రాలే కాకుండా పౌరాణిక మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇవి శ్లోకాల రూపంలో అందరికీ సులభగ్రాహ్యంగా వుంటాయి . ఇందులో పాంచరాత్ర మత సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు చాలావరకూ కనిపిస్తాయి. 264వ అధ్యాయంలో వివిధ దేవతల్ని ప్రతిష్టించే విధివిధానాలు పామ్రాణికంగా చెప్పబడటంతో ఇది విశిష్ట పురాణంగా ప్రసిద్ధిచెందింది. అందుకే వామనపురాణం మత్స్యపురాణం గొప్పతనాన్ని గురించి ఇలా వర్ణిస్తుంది.

ముఖ్యం పురాణేషు యథైవ మత్స్యం స్వాయంభువోక్తి స్వధసంహితాసు ।
మనుస్మృతీనాం ప్రవరోయథైవ తిథైషు ధర్మో విబుధేషు వాస వః ॥
(వామన అధ్యా -12-శ్లో
48)

పురాణాలలో మత్స్యపురాణం, సంహితలలో స్వాయంభుడు చెప్పిన స్వథసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులన్నిటిలో అమావాస్య గొప్పవి. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు.

మత్స్యావతార కథనం












త్రిపురాసురోపాఖ్యానం


Magha Puranam 12 - మాఘ పురాణం 12 పుణ్యక్షేత్రములలో మాఘస్నానము

మాఘ పురాణం - 12 వ అధ్యాయం

పుణ్యక్షేత్రములలో మాఘస్నానము

ఈ విధంగా ననేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠులవారు వివరించగా-"మహర్షీ! మీ కృపవలన ఆనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని, కాని మరొక సంశయము నాకుగలదు. అది ఏమనగా మాఘమాస మందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ విన్నమ్రుడై కోరగా వశిష్ఠులవారు మరల యిట్లనెను.

దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యముగు తీర్థమహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.

మాఘమాసములో నదీస్నానం ముఖ్యమైనది. మాఘస్నానములు చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనట అవివేకం, ఎందుకు అనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. అవస్యకమైనది కూడాను.

అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నానమాచరించిన ఏడుజన్నలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానములతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్యరాలయములు మొదలగు మూడువందల పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొవ్చ ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.

ఇక త్రయంబకమనునొక ముఖ్యమైన క్షేత్రం కలదు, అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్రగోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదియును గాక మాఘమాసములో గోదావరియందు స్నానముచేసినయెడల సకలపాపములు తక్షణము హారించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులుకూడా కలిసి తమతమ స్నేహా సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే 'పరంతప' అను ఉపనది ప్రవహించే చోటకూడ శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము గలదు. ఆ క్షేత్రము బ్రహ్మహాత్యా మహా పాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్రము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు,ఈశ్వరునికి అయిదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేరుకూడా కలదుకదా! బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి. నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్దము చేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హాత్యాపాతకము చుట్టుకొన్నది.

శివుడు భయపడి నరికిన బ్రహ్మాతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి ఫుర్రిగా అయినది, ఈశ్వరుడు ఆపుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి 'భిక్షాందేహీ' యని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మముకడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక"చుగాక అని శపించెను.

ఈశ్వరుడు చేయునదిలేక జారి క్రిందపడిపోయిన ఆ లింగము నందే ఐక్యమైపోయినాడు.

అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటిసూర్యుల తేజస్సుకలిగి ప్రళయము సంభవించునా? యన్నట్లు భయంకరముగా నుండెను. అవ్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు
శివసాన్నిధ్యమును పొందగలుగుచున్నారు,

Wednesday, January 28, 2026

Magha Puranam 11 - మాఘ పురాణం 11 మార్కండేయుని వృత్తాంతము

మాఘ పురాణం - 11 వ అధ్యాయం

మార్కండేయుని వృత్తాంతము

వశిష్టులవారు దిలీపునకు మృగశృంగుని వివాహాం, మృకండుని జననము, కాశీ విశ్యనాధుని దర్శనం విశ్యనాధుని వరమునలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి

"మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము" అని వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పదొడగిరి.

మార్కండేయుని అయువు 16 సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను.

అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి, అరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిర కాలములో సకల శాస్త్రములు, వేదాంత, పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసల నందెను.

"కుమారా! నీవు పసితనమందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికుశలత చే అందరి మన్ననలను పొందుచున్నావు అందులకు మే మెంతయో ఆనందించుచున్నాము? ఆయినను గురువుల యెడ పెద్దల యెడ బ్రాహ్మణుల యెడ మరింత భక్తి భావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును, గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగును" అని చెప్పిరి.

అటుల పదిహేను సంవత్సరములు గడచిపోయినవి. రోజురోజుకీ తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నది, పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి ముహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు.

మునీశ్వరులు గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమన్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించాడు అటుల చేసినందులకుఅందరూ ఆశ్చర్యపడి "మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి? అని ప్రశ్నించారు.

అంత వశిష్ఠులవారు! "ఈ బాలుడు కొద్ది దినముబలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవుకమ్ము" దీవించితిరిగదా! అదెటుల అగును? ఈతని ఆయుర్ధాయము పదహారేండ్లేగదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి, “చిరంజీవివై వర్ధిల్లు" మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని భాధవడి “ దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్ఠులవారినే ప్రశ్నించారు. వశిష్ఠులవారు కొంత సేపాలోచించి మునిసత్తములారా! వినుడు. మన మందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి.

మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరి తోపాటు మార్కండేయుడు కూడ నమస్కరించగా బ్రహ్మ "చిరంజీవిగా జీవించు నాయినా” యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయవడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి "పరమేశ్యరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక” యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి "ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగ నేరదు. అని పలికి, వత్సా! మార్కండేయా నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీ కే యాపద కలుగదు, గాన నీవట్లు చేయుము".

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాధుని సేవించి వచ్చెదను, అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండుడు అతనిభార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదన లేక కుమారుని విడిచిపెట్టి యుండలేక, అందరూ కాశీక్షేత్రమునకు బయలు దేరిరి.

కుటుంబసహితముగా కాశీకిపోయి మృకండుడు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు సదాశివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముకడనే యుండెను.

పదహారవయేడు ప్రవేశించెను. మరణసమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములుగొని తెమ్మని అజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ఛ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చునరికి భటులు ఆ సమీపమందు నిలువ లేకపోయిరి. కాలపాశము విసరుటచే చేతులు ఎత్త లేకపోయారు, మార్కండేయునిచుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణములవలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యమున కెరిగించగా - యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయున్నిపై కాలపాశమువిసరెను, మార్కండేయుడు కన్నులు తెరచిచూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయవడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కై లాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమునుచీల్చుకొనివచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను.

యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేకవిధముల ప్రార్థించి జటాధారి కోవమును చల్లార్చు మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమ వర ప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరకదా! అతని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా, గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి "యమా ! నీవు నాభక్తుల దరికి రావలదు సుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.

పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాసఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

Tuesday, January 27, 2026

Magha Puranam 10 - మాఘ పురాణం 10 మృగశృంగుని వివాహము

మాఘ పురాణం - 10 వ అధ్యాయం

మృగశృంగుని వివాహము

దిలీప మహీజునకు వశిష్ఠులవారు ఇట్లు చెప్పసాగిరి "పువ్వు వికసించగానే వాసన వేయును, అది ఒకరు నేర్పవలసీన అవనరము లేదు, అది ప్రకృతినైజము, ఆ విధముగానే మృగశృంగుడు తన బాల్యదశ నుండియే హారినామస్మరణా యందాసక్తి గలవాడయ్యెను.

అతనికి ఐదుసంవత్సరములు నిండినతరువాత గురుకులములో చదువవేసిరి. అచట సకలశాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్నల నొందుచు పాండిత్యము సంపాదించెను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులు యానతిపై దేశాటన చేసి యనేక 
పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి యుండెను.

కమారుడు 
దేశాటన పూర్తిచేసి వచ్చినతరువాత అతని తల్లిదండ్రులు కన్యనుచూచి వివాహాం చేయుటకు నిశ్చయించినారు, మృగశృంగుడు తాను వరించిన సుశీలనుమాత్రమే వివాహాం చేసుకొనెదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివై భవముగా వివాహము చేసిరి,

సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగునిజూచి "ఆర్యా! మాస్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మాఇద్దరినికూడా ఈశుభలగ్నమున పరిణయమాడుము" అని పలికిరి, మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం, అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా "మా సు
శీలను పెండ్లాడినట్లే మమ్ముకూడ పెండ్లాడుమని అడబడుచులు పటుపట్టినారు.

"మరి పురుషునకు ఒక్క భార్యయేకదా? ఇద్దరు భార్యలా?" అని మృగశృంగుడు ప్రశ్నించగా -

ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవికచా ? దశరధునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరుగదా? వారికి లేని అభ్యంతరములు నీకు కలవా? అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముటిరి,

మృగశృంగుడేమీ జవాబు చెప్పలేకపోయాడు,

వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా-"మృగశృంగా అభ్యంతరము తెలుపవలదు, ఆ ఇరువురికన్యలయభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖంచిన నీకు జయము గలుగదు, అయినను యిటువంటి ఘటనలు మున్ను అనేకములు జరగియున్నవి అని పలికిరి. పెద్దలందరి యభిమతము ప్రకారము 
మృగశృంగుడు ఆ యిరువురు కన్యలనుకూడా వివాహం చేసుకున్నాడు.

ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహార్షీ! వివాహము లెన్ని విధములు? వాటి వివరములు "తెలియజేసి నన్ను సంతృప్తుని చేయుడు” అని ప్రార్థించగా - వశిష్ఠులవారు మరల ఇట్లు చెప్పసాగిరి.

రాజా! వివాహము లెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను సావధానుడవై ఆలకింపుము.”

1. బ్రాహ్మాణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు 'బ్రహ్మ' మని పేరు.

2, దైవము: యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును యిచ్చి జేయు "పెండ్లికి 'దైవము' అని పేరు.

3. ఆర్షము :పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని ఆతనికి పెండ్లికూతురు నిచ్చి పెండ్లి చేయు దానిని 'ఆర్షమని' అందురు

4. ప్రాజాపత్యము : ధర్మము కోనం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమనకు '
ప్రాజాపత్యము' అని పేరు.

5. ఆసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయు దానికి '
ఆసుర' మని పేరు.

6. గాంధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటవారు చేసుకొను వివాహమునకు 'గాంధర్వ' వివాహమని పేరు.


7. 
రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని 'రాక్షస' వివాహమని పేరు.

8 పైశాచిక:మోసగించి, అనగా మాయమాటలచే నమ్మించి 
పెండ్లిచేసుకొను దానికి 'పైశాచిక’ మని పేరు.

ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు గాన, వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.

గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో,ఇహమూ,పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే  సరియైన మార్గము.

భార్యయు, భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి జెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిధి సత్కారములాచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొనేవాడే  సరియైన గృహస్థుడనబడును,

నోములు నోచుట, వ్రతములు చేయుట, వర్వదినములలో "ఉపవాసములుండి కార్తీక మాసమందునా మాఘమాసమందునా నదీ స్నానంచేసి, కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించిన వారికి మంచితేజస్సు కలుగును.

ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు దీర్చుకొని, స్నానముచేసి, నిష్టతో భగవంతుని పూజించవలయును. కార్తీక మాసమందు, మాఘ మాసమందు వైశాఖమాసమందు తన శక్తికొలదీ దానధర్మములు చేసినచో గొప్పఫలము కలుగును, గాన ప్రతి మనుజుడూ ఇహసుఖములకే కాకా పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.

పతివ్రతా లక్షణములు

పురుషుడు తనకు సద్గతి కలిగేనిమిత్త మనేక ఘన కార్యములు చేసినకాని మంచిఫలము పొంద లేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తనభర్తను దైవముగా భావించి మనసారా ఆరాధించవలెను.
తన భర్తయొక్క మంచిగుణములనే స్వీకరించవలయునుగాని, అందాన్ని, ఆకారాన్ని చూచి మురిసిపోకూడదు అటులనే పురుషులునూ స్త్రీ యొక్క అందమునే చూడక, శీల గుణమునులెక్కించి ప్రేమతో అదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యాను  రాగములతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును.  ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిధి సేవలయందు కూడ తగు భక్తి శ్రద్ధలతో చేసినయెడల అట్టి 
స్త్రీకి సద్గతి కలుగును.

భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటలయందు సేవకు రాలి వలెనడుచు కొనవలయును. భోజనము వడ్డించునపుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాముగా భోజనము పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలయును. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందము కలుగ జేయవలెను. రూపంలో లక్ష్మిని బోలియుండ వలెను, ఓర్పు వహించుటలో భూదేవినిబోలియుండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడచు కొనునో అమేయే ఉత్తమ స్త్రీ అనబడును.

స్త్రీ బహీష్ఠుఅయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడకూడదు, ఎవరినీ  ముట్టుకొనరాదు. ఆనాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవరోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లుపోసుకొని, శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి, సూర్యభగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయంనందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.

ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముతో కాలంగడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను,

మృకండుని జననము

ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి యాడితిగదా యని మృగశృంగుడు మిగుల అనందించెను. ఆ ముగ్గురు పడతులతోను నంసారము చేయుచుండెను. అటుల కొంత కాలం జరిగినది సుశీలయను భార్య గర్భముధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తనకుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణుడు కావలయునని ఆశకలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణముచేశారు.

మృకండుడు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులయెడ బంధుజనులయెడ పెద్దలయెడ  భయ భక్తులు గలిగి పెరుగుచుండెను ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయం చేసి, విద్య నభ్య సించుటకై గురుకులమునకు పంపించినాడు.

గురుకులములో గురువు చెప్పిన సకలశాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై  గురువు యొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను.

మృకండడు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు 'మరుద్వతి' యనుకన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండి మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించాను. 

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడ పుత్రులు జన్మించి నందున వారికికూడా అన్ని విద్యలు నేర్పిరి.పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను.తన కుటుంబమంతయును మాఘమాసములో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్టతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకొన్న మాఘమాసఫల ప్రభావంచే సంసారమునందు ఏ  ఇబ్బందియులేకుండా వుండుటేగాక, మృగశృంగునకు మనుమలుకూడా కలిగినందున మరింత యానందించి, తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదిగదాయని సంతోషించుచు తనకింక ఏ అశలు లేనందున భగవస్సాన్నిధ్యమునకు బోవలయునని సంకల్పించి, తవస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీమహావిష్ణూవుని ప్రసన్నుని జేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమున కేగెను.

“విన్నావుకదా భూపాలా! మృగశృంగుడు తాను చేసుకొన్న మాఘమాస ఫలమువలన తనకు పుత్రపౌతాభివృద్ధి కలుగుటయే గాక బొందెతో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు.

ఇక అతని 'జ్యేష్టకుమూరుడైన మృకండునియొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠులవారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.

మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండీ జ్యేష్టపుత్రుడగు మృకండుడే నంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండ చూచుచుండెను. ఆయన కొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహామాడి చాలకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను.

"కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హారించుటయేగాక, మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీవిశ్వనాధుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంట సమేతముగా వెళ్ళుదును” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై  బయలుదేరెను.

మార్గ మధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమి కీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు.

కాశీపట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది.. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ది చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు బయలుదేరివెళ్లాడు.

ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని అనందము కలిగెను, తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భిక్తిశ్రద్ధలతో ప్రార్ధించెను.

ఈ విధంగా కుటుంబసహితంగా మృకండడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణచేసి, దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆ విధంగా ఒక సంవత్సరము విశ్వేశ్వరసన్నిధానమందు గడవనెంచెను.

ఒక దినము మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే. తెలివి తప్పి ప్రాణములు విడిచిరి.

మృకండుడు చాల దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహాన సంసారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు.

మృకండునకు ఎంత కాలమునకునూ సంతానము కలుగనందుననే 
కాశీక్షేత్రమునకు  వచ్చినాడుగదా! సంతానముకొఱకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృకండునకు అతని భార్య మరుధ్వతికి అమితానందము కలిగి, పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికాను.

"మహామునీ! మీభక్తికి యెంతయో సంతసించినారము, మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది,  మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము, గాన మీ యభీష్టము నెఱిఁగింపుడు" అని పలికెను.

అంత మృకండుడు నమస్కరించి "మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదే మా నమస్కృతులు. లోక రక్షక! మీ దయవలన నాకు సలక్షణవతి. సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందు వలన నేను మిమ్ము ధ్యానించుచు, ఆమెతో సంసారసుఖము అనుభవించుచున్నాను. కాని ఎంత కాలమైననూ మాకు సంతానం కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి ఉత్తమ గతులు లేవుగదా? కావున మాకు పుత్రసంతానము ప్రసాదించ వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్యరులను ప్రార్థించాడు.

మృకండుని దీనాలావము లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను.

"మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది, బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించిరి.

మృకండునకు ఆశ్చర్యముకలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసివచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకు
మీ ధ్యానమునే సలుపుచు,సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.

"అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యేను.

పరమేశ్యరానుగ్రపామున ఒక శుభ ముహూర్త కాలమున పుత్రుని గనెను, మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను.

ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడుని భాగవతోత్తముడును, అగుమృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను. తిరిగి బ్రతికించెను.

Monday, January 26, 2026

Magha Puranam 9 - మాఘ పురాణం 9 పుష్కరుని వృత్తాంతము

మాఘ పురాణం - 9 వ అధ్యాయం

పుష్కరుని వృత్తాంతము
ఈ విధంగా నాముగ్లురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా - దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులగు వశిష్ఠులవారితో ఇటుల నుడివెను-

"పూజ్యులై న ఓ మహర్షీ! ఈభూలోకమునకు, యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గుకు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళివచ్చినవి" అని ప్రశ్నించెను.

వశి
ష్ఠులవారు దీర్ధముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి,

“మహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము, భక్తిమార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు, వారొకసారి మాఘమాస ములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.

దీనికొక ఉదాహారణ వివరింతును ఆలకింపుము, ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు యీ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికిపోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు విచిత్రమైనది.

పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగల వాడు. పరోకారము చేయుటయే తన ప్రథాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్టతో స్నాన, జములు మొదలగు పుణ్య కార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.

ఒకనాడు యముడు 
పుష్కరుని ప్రాణములుతోడ్కొని రండని తన భటుల కాఙ్ఞాపించినాడు. యమభటులు వెంటనేపోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు.

ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై వుండెను. భటులు తోడ్కొనివచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను, యమ
ధర్మరాజునకు ఏదో భయము అవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తనప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.

యముడు భటులవంక కోపంగాచూచి- “ఓరీ భటులారా! 
పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీనుకువచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణకిపోయిరి.

యమధర్మరాజు పుష్కరునివై పు జూచి నమస్కరించి, జరిగిన పొరపాటుకు క్షమించమనికోరి "భూలోకముసకు వెళ్లుడు" అని చెప్పెను. జరిగిన పారపాటునకు 
పుష్కరుడుకూడా విచారించి, "సరే వచ్చిన వాడను ఈ యమలోకమునుకూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.

పుష్కరుడు ఒక్కొకదిశకు పోయు నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను. జీవులు వారు చేసుకొన్న పనులను బట్టి అనేక విధముల శిక్షాల ననుభవించు చుండుట పుష్కరుడు కనులారా గాంచెను.అతనికి అమితమగు భయముకలిగెను, తన భయము బోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పావజీవులు తమతమ పాపములను పోగొట్టుకొను చుండిరి, వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక భాధలను చూచి వచ్చినందువలన పుష్కరుడు మరింత జ్ఞానంతో స్మరించుచుండెను.

ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్తవిని రామచంద్రుడు యముణ్ణి ప్రార్ధించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.  అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యనేర్పిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమవలన తిరిగి బ్రతికించెను.


Raja Syamala Devi - శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు రాజ శ్యామలా దేవి లేదా రాజ మాతంగి

శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు రాజ శ్యామలా దేవి లేదా రాజ మాతంగి

శ్యామల నవరాత్రులు (మాఘ గుప్త నవరాత్రులు) 9వ రోజున "రాజ మాతంగి" లేదా రాజశ్యామల దేవిని పూజిస్తారు. మాఘ శుద్ధ నవమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి, శ్యామలా దేవి రూపంలో ఆరాధించడం వల్ల వాక్సిద్ధి, విద్యాభివృద్ధి, శత్రు జయం, కోరిన కోర్కెలు నెరవేరడం వంటి 9 మహా వరాలు లభిస్తాయని నమ్మకం.

ఆమె కళలు, సంగీతం, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ దేవితో కూడా సంబంధం కలిగి ఉంది.

మాతంగ మహర్షికి పుత్రికగా, ఒక గిరిజన కన్య రూపంలో పుట్టిందని పురాణాలు చెబుతాయి. అడవులు, వేట, అరణ్యాలు మరియు పక్షులతో (ముఖ్యంగా చిలుకలు, మైనాలతో) ఈమెకు విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే ఈమెను ప్రకృతికి చిహ్నంగా కూడా పూజిస్తారు.

మాతంగి దేవతను సరస్వతీ దేవి యొక్క తాంత్రిక రూపంగా భావిస్తారు. అందుకే రాజశ్యామల దేవిని ఆరాధించిన వారికీ రాజయోగం, జ్ఞానశక్తి, విద్యాప్రాప్తి కలుగుతాయని చెబుతారు.

శ్యామలా దేవిని దేవి మాతంగి, రాజ మాతంగి, శ్రీ రాజ శ్యామల, మహా మందిరిణి అని కూడా అంటారు.

బ్రహ్మాండ పురాణం ప్రకారం.. లలితా త్రిపుర సుందరి దేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో తన సైన్యంలో శ్యామల దేవిని ప్రధాన మంత్రిణిగా నియమిస్తుంది. రాజ్యపాలన, రక్షణ బాధ్యతలను శ్యామల దేవికే అప్పగిస్తుంది. భండాసురుడి తమ్ముడైన విశుకృడి సైన్యాన్ని శ్యామల దేవి తన గానం, బుద్ధిబలం, వ్యూహంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది. అప్పటి నుంచే శ్యామల దేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.

రాజ శ్యామలా దేవి మూడు కళ్ళను కలిగి ఉన్న శక్తివంతమైన దేవత. ఆమె మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. నీల-మేఘ లేదా నీళ్లను మోసుకెళ్లే చీకటి మేఘాలను పోలిన ఆమె రంగుతో, మూడు కన్నుల దేవత అందం మాటల్లో చెప్పలేనిది.


శ్యామల దేవిని పూజిస్తే
శ్యామల దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఈమెను భక్తితో పూజిస్తే, వాక్చాతుర్యం సంగీతం, సాహిత్యం, లలిత కళల్లో ప్రావీణ్యం, లభిస్తాయని విశ్వాసం.

శ్యామల దేవి ఉపాసన వల్ల లభించే ఫలాలు
గుప్త నవరాత్రుల్లో శ్యామల దేవిని ఉపాసించిన వారికి సకల విద్యల్లో ప్రావీణ్యం, ఉద్యోగంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి లభించడం కొత్త ఉద్యోగాలు, పదవులు, రాజకీయాల్లో, పరిపాలన రంగాల్లో ఎదుగుదల, వంటివి కలుగుతాయని నమ్మకం ఉంది. అందుకే ఉన్నత పదవులు ఆశించే వారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను విశేషంగా పాటిస్తారు. యజ్ఞయాగాదులు వంటి క్రతువులు కూడా నిర్వహిస్తారు.

Sunday, January 25, 2026

Magha Puranam 8 - మాఘ పురాణం 8 యమలోక విశేషములు

మాఘ పురాణం - 8 వ అధ్యాయం

యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమ లోకమందు చూచిన వింతలు, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.

యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములనుబట్టి శిక్ష లనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మల కెంతటి కోఠిన శిక్షల ననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి, ప్రతి పంపిణీ ఎఱ్ఱగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్ననూతిలో త్రోసి వేయుదురు, తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు, మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి, చిత్రహింస పెట్టుదురు, అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణకిపోయిరి.

అప్పుడా కన్యలు వారిని ఓదార్చి "మీరు బయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయ మొక్కటేయున్న ది, ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానముచేయుట తనకు తోచిన దానములు ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయేగాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమయినది.

మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానము చేసిన, కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాస 
మంతయు పురాణపఠనము చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట, కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

Shuka Syamala Devi - శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు శుక శ్యామలా దేవి

శుక శ్యామలాదేవి

శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు శుక శ్యామలా దేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు.
ఆమె వాక్కుకు, జ్ఞానానికి, మాధుర్యానికి అధిదేవత. చిలుక వర్ణంలో, మధురమైన మాటలు, సృజనాత్మకత, మరియు విద్యాసామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్యామల నవరాత్రులలో ఈ రూపం పూజింపబడుతుంది.

శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. శ్రీ శుక శ్యామల తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం. చిలుకలను పోలిన శ్యామల చర్మం రంగు మనకు కనిపిస్తుంది. బ్రహ్మండ పురాణం ప్రకారం దేవి మంత్రిణి (శ్యామల) యుద్ధభూమికి వెళ్ళే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగురవేసింది.

శ్రీ శుక శ్యామల దేవి (రాజ శ్యామల దేవికి ఒక రూపం) అంటేనే జ్ఞానం మరియు యుద్ధ తంత్రాల కలయిక. ఇక్కడ 'శుక' అంటే చిలుక. పురాణాల ప్రకారం, దేవి చేతిలో ఉండే చిలుక కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అది సాక్షాత్తు ధనుర్వేదానికి (యుద్ధ శాస్త్రానికి) రూపం. యుద్ధ విద్యలకు సంబంధించిన ఉపవేదం 'ధనుర్వేదం'. ఆ విద్యే ఒక వ్యక్తి రూపంలో (లేదా పక్షి రూపంలో) వచ్చి దేవి చెంత చేరిందని అర్థం. ఇక్కడ శుకుడు (చిలుక) ఆ విద్యకు ప్రతీక.

ఆ విద్యే మూడు తలలు, నాలుగు చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని వున్న దివ్య పురుషుడి లాగా మారింది. ధనుర్వేదానికి మూర్తీభవించిన వ్యక్తి లాగా (చిలుక) కనిపిస్తాడు, అతను దేవికి నమస్కారం చేసి రెండు దివ్యమైన ధనుస్సులు మరియు అక్షయ తునీరం (అనంతమైన బాణాలను కలిగి ఉన్న బాణ సంచిని) అందిస్తాడు,

ఆ విధంగా శ్యామల చేతిలోని చిలుకలన్నీ వివిధ విద్యలుగా ఉంటాయి . భగవతి మాతంగికి చిలుకలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు. చిలుక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగం మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది, అందువల్ల శుక శ్యామలా దేవి వాక్ శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలో ఆమె గురు మూర్తి, శుకుడు ఈ దేవి దగ్గరే విద్యనభ్యసించాడు.

శుకుడు పండితులలో గొప్పవాడు. అతను రాజావశ్యం, గర్వభంజనం మరియు శుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు.

శ్యామల సిద్ధ ఉపాసకులు సాధన, హోమము మొదలైనవాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుతూ చిలుకలు దగ్గరకు వస్తాయి.

చిలుక పలికే మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో, ఈ దేవిని పూజిస్తే మన మాట తీరు (వాక్ శక్తి) అంత ప్రభావవంతంగా మారుతుంది. మనం నేర్చుకున్న విద్యను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పే నైపుణ్యాన్ని ఈమె ప్రసాదిస్తుంది. ఈ దేవిని కేవలం దేవతగానే కాకుండా, విద్యను నేర్పే ఒక గురువుగా భావిస్తారు. ఆమె తన శిష్యులకు (భక్తులకు) చిలుక ఎంత సులభంగా మాటలు నేర్చుకుంటుందో, అంత సులభంగా కష్టమైన విద్యలను కూడా నేర్పిస్తుంది.

ఈ శుక శ్యామల దేవి ఉపాసన చేసేవారికి లోకాన్ని వశం చేసుకునే శక్తి (రాజా వశ్యం), ఎదుటివారి అహంకారాన్ని అణిచివేసే ధైర్యం (గర్వ భంజనం), మాట్లాడే ప్రతి మాట నిజమయ్యే వాక్సుద్ధి (వాక్సిద్ధి) మరియు అపారమైన జ్ఞానం లభిస్తాయి.

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.

Saturday, January 24, 2026

Magha Puranam 7 - మాఘ పురాణం 7 మృగశృంగుడు యమునిగూర్చి తపమాచరించుట

మాఘ పురాణం - 7 వ అధ్యాయం

మృగశృంగుడు యమునిగూర్చి తపమాచరించుట

ఆ విధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీనదిలో దిగి అకాలమృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.

నిశ్చల మనస్సుతో తదేకదీక్షతో  యమునిగూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు  యముడు సంతసించి ప్రత్యక్షమయి "మృగశృంగా నీ కఠోర
దీక్షకు, పరోపకార పరాయణతకు
నేనెంతయు సంతసించితిని, నాగురించి ఇంత
దీక్షతో ఎవ్వరూ తపమాచరించి వుండలేదు, నీకేమి కావలయునో కోరుకొనుము, నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.

ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచిచూడగా = యముడు తన యెదుట నిలబడియున్నాడు. వెంటనే "చేతులు జోడించి "మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీదర్శనమిచ్చుట నాపూర్వజన్మసుకృతము తప్ప వేరు కాదు. ఆకాలమరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను నంతృప్తునిజేయుడు” అని ప్రార్ధించెను.

మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి, అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురుకన్యలకు ప్రాణదానము చేయనెంచి "మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకారబుద్ధి నన్నాకర్షించినది. నీకు జయమగుగాక" అని యముడు దీవించగాా-

మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము  చేసినవారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు, అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగు నటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా-

“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్శరాజు దీవించి యదృశ్యుడ య్యను,


Sri Sarika Syamala Devi - శ్యామల నవరాత్రులలో యేడవ రోజు శ్రీ సారికా శ్యామలా దేవి

శ్రీ సారికా శ్యామలా దేవి

శ్యామల నవరాత్రులలో యేడవ రోజు 'శ్రీ సారికా శ్యామలా దేవి' రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రసాదించే శక్తిగా శ్యామలాదేవిని ఆరాధించడం విశేషం. ఈమె సాక్షాత్తు లలితా త్రిపురసుందరి ముఖ్య సలహాదారు అయిన రాజశ్యామల (మాతంగి) యొక్క అంగ దేవత. ఈ సమయం మాఘమాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 

కళలు, సంగీతము, నృత్యము వీటిలో ప్రావీణ్యము పొందటానికి,
 ఆకర్షణ శక్తి, భోధన శక్తి, ఏకసంథాగ్రాహ్య శక్తి వీటిని ప్రసాదించే మాత సారికా శ్యామలా దేవి.

దేవి తన హస్తాలలో చిలుక, తామర పువ్వు, వరి కంకి, పాశం, అంకుశం, కలశం మరియు సారిక పక్షిని ధరించి, దివ్యమైన వీణను వాయిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. సారికాంబిక జ్ఞానానికి మరియు వాక్కుకు అధిదేవత. సకల విద్యలు, శాస్త్ర నైపుణ్యం మరియు బుద్ధి చాతుర్యాన్ని ప్రసాదించే కరుణామయి సారిక దేవి. సారికా శ్యామలా దేవి అనుగ్రహంతో ఏ విద్యలో నానైనా, ఏ వృత్తి లో నైనా మనం ఉతీర్ణులము కాగలము. 

శ్యామల నవరాత్రులలో 7వ రోజు (మాఘ శుక్ల సప్తమి). ఈ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈమె అరవై నాలుగు కళలకు (64 కళలు) మరియు సమస్త సృజనాత్మక విద్యలకు మూల కారణం. సంగీత, సాహిత్య, నృత్య కళలలో ప్రావీణ్యం పొందాలనుకునే వారు ఈమెను ఆశ్రయిస్తారు. ఈ రోజు విద్య, కళలు మరియు వాక్కులో నైపుణ్యం కోసం చేసే పూజ.

ముదురు శ్యామల వర్ణంతో చేతిలో కమలాని పట్టుకొని, చంద్రుని శిరము పై దాల్చి, ముదురు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది. మాత ధరించే ముదురు రంగు వస్త్రాలు అనంతమైన శున్యుమును సూచిస్తుంది.

సంస్కృతంలో 'సారిక' అంటే మైనా పక్షి. పక్షులు ఎంత సహజంగా పాడతాయో, దేవి కూడా తన భక్తులకు అంత సులభంగా, సహజసిద్ధంగా సర్వ విద్యా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది.సారిక అనే పదానికి 'తీగ వాయిద్యపు వంతెన' అని కూడా అర్థం. అందుకే ఈమె సృష్టిలోని అన్ని శబ్దాలకు, సంగీతానికి మరియు నాదానికి స్వరూపంగా వెలుగొందుతోంది.

సారిక అనగా సన్నని తీగ వాయిద్యము అనగా వీణ ను ధరించి ఉంటుంది. వీణకు వొకవైపు రామచిలుకలు కూర్చొని ఉంటాయి. ఆమె సృష్టి యొక్క అన్ని శబ్దముల స్వరూపము. ఆమె సకల సప్త స్వరముల స్వరూపము.

ఈమెను శారద, వాగీశ్వరి అని కూడా పిలుస్తారు. మాతంగి మరియు సరస్వతి దేవిల కలయికగా ఈమె భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

ముదురు శ్యామల వర్ణంలో ప్రకాశించే ఈ దేవి, అనంతమైన స్పృహకు మరియు నిర్మలమైన జ్ఞానానికి ప్రతీక. ఈమెను పూజించడం వల్ల వాక్శుద్ధి మరియు మేధాశక్తి లభిస్తాయి.


సారికా శ్యామలా దేవి స్తోత్త్రం
శ్యామాం కరాంభోరుహకేళి లగ్నాం!
సోవాతంసాం స్తుతిపాఠమగ్నం 
విద్యాళిహృద్యాం విశదా ముపాసే!
శారీం చతుష్షష్ఠికళా స్వరూపాం 
చతుష్షష్ఠికళారూపాం విద్యాం హృది విరాజితాం!
శ్రావయంతీం కరే దేవీం శారికాదేవతాం భజే!!

సారికా శ్యామలా దేవి మంత్రం : 
'ఓం నమోభగవతే శారికే సకల కళాకోవిదే దేవి భోధయ భోధయ స్వాహా!'

అదే సమయంలో, సాధారణ నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి దేవిని పూజిస్తారు, ఇది భయాన్ని తొలగించి, రక్షణ కల్పిస్తుంది. 

శ్యామల నవరాత్రులు దేవీ శ్యామలాదేవిని (రాజశ్యామల) ప్రసన్నం చేసుకోవడానికి జరుపుకునే అరుదైన ఉత్సవాలు.




Soubhagya Shayana Vratam - సౌభాగ్యశయన వ్రతం

 సౌభాగ్యశయన వ్రతం


మత్స్యరూపంలో వున్న నారాయణుడు నారద మహర్షికి అత్యంత పుణ్యప్రదమైన సౌభాగ్యశయన వ్రతం గురించి ఇలా బోధించాడు.

వ్రతకథ : నారాద! పూర్వం ప్రళయకాలంలో అన్ని లోకాలు దగ్ధమైపోయాయి. అయితే ఆయా లోకాలలో వున్న అన్ని భూతాల సౌభాగ్యాలు ఒక్కటిగా చేరి వైకుంఠానికివెళ్ళి శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో నిలిచాయి. తిరిగి చాలాకాలం తరువాత పునః సృష్టి ప్రారంభమైంది. లోకంలో పురుషాహంకారం అంతా ఆవరించింది. దాని ప్రభావంతో బ్రహ్మ విష్ణువులకి పోటీ ఏర్పడింది. నేను
గొప్పంటే? నేను గొప్ప అని వాదులాడుకోసాగారు. అప్పుడు వారిద్దరి మధ్యలో లింగాకృతితో ఒక మహాజ్వాల ఏర్పడింది. ఆ లింగజ్వాల వేడికి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నిలిచిన “సౌభాగ్యం” కరిగి ఒక ముద్దగా మారి బైటికి వచ్చింది. అది ఎగిరి భూమి మీద పడబోతుండగా బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు దాన్ని పట్టుకుని తినేసాడు. ఆ సౌభాగ్యాన్ని భక్షించిన ప్రభావంతో దక్షుడి
శరీరం అపూర్వమైన లావణ్యంతో తేజస్సుతో ప్రకాశించింది. 

దక్షుడు సౌభాగ్యాన్ని పట్టుకుని తినేటప్పుడు ఆ ముద్దలోని కొన్ని చుక్కలు నేల మీదపడి ఓషధులుగా మారాయి. అవి. 
1.చెఱకు 
2.యవల నుండి తయారుచేసే చక్కర అనగా యవలు 
3.జాజికాయ 
4.ధనియాలు
5.విరిగిన ఆవుపాలు 
6.కుంకుమపువ్వు 
7.బొబ్బర్లు 
8.ఉప్పు 
ఈ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్యాష్టకం అంటారు. దక్షుడు సౌభాగ్యాన్ని పానం చేసిన తరువాత
సౌభాగ్యవతి అయిన కుమార్తె జన్మించింది. ఆమే సతీదేవి. ఆమె ఎంతో లలితంగా లావణ్యంగా వుంటుంది కాబట్టి ఆమే లలిత. పరమేశ్వరుడు ఆ సతీదేవిని వివాహం చేసుకున్నాడు. సతీ దేవి సౌభాగ్యంతో పుట్టింది కాబట్టి ఆమెని ఆరాధించిన వారికి సౌభాగ్యం కలుగుతుంది.

వ్రతవిధానం : వసంతమాసం ప్రారంభంలో అనగా చైత్ర శుక్ష తృతీయ తిధినాడు ఉదయంపూట నువ్వుల పిండితో నూనెతో అభ్యంగనం చేసుకుని శుచిగా స్నానం చేయాలి. ఈ తిథినాడే  పరమేశ్వరుడు లలితాపరమేశ్వరి అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఈ తిథినాడు, శ్రీ లలితాపరమేశ్వరుల ప్రతిమని స్థాపించి వాటికి విధి విధానంగా షోడశోపచార పూజచేయాలి.

పూజావిధి :

1. పాటలాయై నమః - శివస్యదేవ్యాశ్చ పాదౌ పూజయామి
2. జయా
యై-శివాయచ నమః - గుల్ఫే పూజయామి
3. భవానై- త్య్రంబకాయ నమః - జంఘే పూజయామి
4. విజయా
యై-భద్రేశ్వరాయ నమః - జానునీపూజయామి
5. వరదాయై-హరికేశాయ నమః - ఊరూం పూజయామి
6. ఈశానాయై-శంకరాయ నమః - కటిం పూజయామి
7. కాళిన్యై-శూలపాణయే నమః - కుక్షి ద్వయం పూజయామి
8. మంగళాయై-మంగళేశాయ నమః - ఉదరం పూజయామి
9. ఈశాన్వై - సర్వాత్మనే నమః - కుచద్వయం పూజయామి
10. రుద్రాణ్యై-వేదాత్మనే నమః - కంఠం పూజయామి
11. అనంతా
యై-త్రిపురఘ్నాయ నమః - కరౌ పూజయామి
12. కాలానలప్రియాయై- త్రిలోచనాయ నమః - బాహూం పూజయామి
13. సౌభాగ్యభవా
యై-సౌభాగ్య భవనాయ నమః - భూషణాని పూజయామి
14. స్వాహాస్వధా
యై-ఈశ్వరాయ నమః - ముఖం పూజయామి
15. అశోక మధువాసిన్యై-అశోకమధువాసినే నమః - ఓష్ఠౌ పూజయామి
16. చంద్రముఖప్రియాయై- స్థాణవే నమః - ఆస్యం పూజయామి
17. అఖిలాంగ్యై-అర్ధనారీశ్వరాయ నమః - నాసికాం పూజయామి
18. లలితా
యై-ఉగ్రాయ నమః - భ్రువౌ పూజయామి
19. వాసవ్యై - శర్వాయ నమః - అలకాన్‌ పూజయామి
20. శ్రీకంఠనాధాయై-శివాయ నమః - కేశాన్‌ పూజయామి
21. భీమోగ్ర సమరూపిణ్యై - సర్వాత్మనే నమః - శిరః పూజయామి

ఈ విధంగా లలితా - పరమేశ్వరుల్ని పూజించిపైన తెలిపిన సౌభాగ్యాష్ట ద్రవ్యాలని వారికి నైవేద్యంగా సమర్పించి ఉత్తర పూజ చేయాలి. తరువాత గోశృంగం (ఆవుకొమ్ము) ఉంచిన నీటిని త్రాగి ఉపవాసం వుండి నేల మీదే నిద్రించాలి.

మర్నాడు ఉదయం అనగా చవితినాడు స్నానం, జపంచేసి, మంచి వస్త్రాలతో, ఆభరణాలతో బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, లలితా పరమేశ్వరుల ప్రతిమల్ని సౌభాగ్యాష్టక ద్రవ్యాల్ని “శ్రీలలితా పరమేశ్వరః ప్రీయతాం” అని పఠిస్తూ వారికి దానం చేయాలి. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రతినెల తదియనాడు ఈ వ్రతాన్ని చేయాలి.

ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతినెలా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దానంచేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అంటే?

1. చైత్రమాసంలో గోశృంగంలోని నీటిని ఆహారంగా తీసుకుని దానం చేసేడప్పుడు 
'లలితా ప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 
2. వైశాఖ మాసంలో గోమయాన్ని ఆహారంగా తీసుకుని 'విజయా ప్రీయతాం' అనే మంత్రాన్ని దానం చేసేడప్పుడు పఠించాలి.
3. జ్యేష్ట మాసంలో మందారపూలని ఆహారంగా తీసుకుని 'భద్రాప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 
4. ఆషాఢ మాసంలో బిల్వషత్రాల్ని ఆహారంగా తీసుకుని 'భవానీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
5. శ్రావణ మాసంలో పెరుగుని ఆహారంగా తీసుకుని 'కుముదా ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
6. భాద్రపదమాసంలో ధర్ఫోదకాన్ని ఆహారంగా తీసుకుని 'శివాప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
7.ఆశ్వయుజమాసంలో పాలని ఆహారంగా తీసుకుని 'వాసుదేవీప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
8.కార్తీక మాసంలో మీగడ పెరుగుని ఆహారంగా తీసుకుని 'గౌరీ పీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 9. మార్గశిరమాసంలో గోమూత్రాన్ని ఆహారంగా తీసుకుని 'మంగళాప్రీయతాం' అనే మంత్రాన్ని
చదవాలి. 
10.పుష్యమాసంలో నేయిని ఆహారంగా తీసుకుని 'కమలా ప్రీయతాం' అని పఠించాలి. 
11. మాఘమాసంలో నల్లనువ్వుల పొడిని ఆహారంగా తీసుకుని 'సతీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి. 
12. ఫాల్గుణమాసంలో పంచగవ్యాన్ని ఆహారంగా తీసుకుని 'ఉమా ప్రీయతాం' అనే మంత్రాన్ని
చదువుతూ దానం ఇవ్వాలి.

పన్నెండు మాసాలలో లలితా పరమేశ్వరులని వరుసగా 
1.మల్లి
2.అశోకం 
౩.తామర 
4.కడిమి 
5.కలువ 
6.మాలతి 
7. కుబ్దకం (గొజ్జంగి)
8. కరవీరం (ఎర్రగన్నేరు) 
9.రెలు 
10. వాడగన్నేరు 
11.కుంకుమపువ్వు
12.ప్రీంకణం ఈ పూలతో పూజించాలి

వ్రత ఉద్యాపనం : ఈ విధంగా విధివిధానంగా పన్నెండు నెలలపాటు వ్రతాన్ని చేశాక చివరిమాసంలో తాము పూజించిన లలితా - పరమేశ్వరుల ప్రతిమని, దానంచేసే వస్తువుల్ని ఒక కొత్త మంచం మీద వుంచి దాన్ని బ్రాహ్మణ దంపతులకే దానమివ్వాలి. అలాగే యథాశక్తి మరి కొంతమంది బ్రాహ్మణ దంపతులకి వస్త్రాల్ని, ఆభరణాల్ని, ఆవుల్ని దానం చేయాలి. ధనం వున్నవారు దానానికి లోభించకూడదు. అహంకలిగించకూడదు.

వ్రతఫలం : భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. ఈ దివ్య వ్రతాన్ని వరుసగా పన్నెండు సంవత్సరాలు గానీ, పద్దెనిమిది సంవత్సరాలు గానీ చేసినవారు పదివేలకల్పాల వరకూ దేవతలచేత సేవలందుకుంటూ కైలాసంలో నివసిస్తారు.

ఈ సౌభాగ్యశయన వ్రతాన్ని చదివిన వారికి, వినిపించినవారికీ విద్యాధరత్వం, స్వర్గలోక నివాసం లభిస్తాయి. పూర్వం బ్రహ్మదేవుడు, కార్తవీర్యార్దునుడు వరుణుడు, నంది ఈ వ్రతాన్ని ఆచరించారు.

స్త్రీల వ్రత కథలు

Friday, January 23, 2026

Vasya Matangi - శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి

శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి

శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు వశ్య మాతంగి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. మాతంగి అనేది శ్యామల లేదా మాతంగి విద్యలో అన్ని దేవతలకు సాధారణ పేరు ఎందుకంటే ఆమె ఋషి మాతంగుడుని తన తండ్రిగా మరియు మొత్తం మాతంగ ప్రజలను తన ప్రియా జనంగా భావించడం ద్వారా ఆ నామంతో పిలవబడుతోంది.

ముఖ్య వశ్య విద్యాది దేవత కారణంగా ఆమెను మహా వశ్యకారి, వశ్యామాతంగి అని పిలుస్తారు. ఆమె వశ్య, సమ్మోహనాది సిద్ధికి దేవత.సాధకులు తమను తాము ఎల్లప్పుడూ సాధనలో స్థిరంగా ఉంచుకోడానికి  సహాయం చేస్తుంది. సాధనపై దృష్టి పెట్టడానికి కావలసిన స్థితిని కలుగజేస్తుంది.

ఆమె చేతిలో పాషా, అంకుశం, ఖడ్గము, ఖేతం లేదా దండం వంటి వాటిని పట్టుకొని ఉంటుంది. వశ్య మాతంగి అన్ని సిద్దులు మరియు అభిష్టాలను ఇచ్చే దేవత. శీఘ్ర సిద్ది ఫల ధాయిని. ఈమెను దక్షిణ మరియు వామా చార పద్దతులలో పూజిస్తారు.

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.




Ashtottara Shata Shakthi Peetha Stotram - అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

వారాణస్యాం విశాలాక్షీ నైమిషే లింగధారిణీ ।
ప్రయాగే లలితాదేవీ కాముకా గంధమాదనే ॥ 01 ॥

మానసే కుముదా నామ విశ్వకాయా తథాஉ౦బరే ।
గోమంతే గోమతీ నామ మందరే కామచారిణీ ॥ 02 ॥

మదోత్కటాచైత్రరథే జయంతీ హస్తినాపురే ।
కాన్యకుబ్జే తథా గౌరీ రంభా మలయ పర్వతే ॥ 03 ॥

ఏకామ్రకే కీర్తిమతీ విశ్వా విశ్వేశ్వరీ తథా ।
కర్ణికే పురుహస్తేతి కేదారే మార్గదాయికా ॥ 04 ॥

నంద్యాహిమవతః పృష్టే గోకర్ణే భద్రకాళికా ।
స్థాణీశ్వరే భవానీ తు బిల్వకే బిల్వపత్రికా ॥ 05 ॥

శ్రీశైలే మాధవీ దేవీ భద్రా భద్రేశ్వరీ తథా ।
జయా వరాహశైలే తు కమలా కమలాలయే ॥ 06 ॥

రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాలంజరే తథా ।
మహాలింగే తు కపిలా కర్కోటే మంగళేశ్వరీ ॥ 07 ॥

శాలిగ్రామే మహాదేవీ శివలింగే జలప్రియా ।
మాయాపుర్యాం కుమారీతు సంతానే లలితా తథా ॥ 08 ॥

ఉత్పలాక్ష్మీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా ।
గయాయాం మంగళా నామ విమలా పురుషోత్తమే ॥ 09 ॥

విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్యవర్ధనే ।
నారాయణీ సుపార్శ్వే తు త్రికూటే భద్రసుందరీ ॥ 10 ॥

విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే ।
కోటవీ కోటితీర్ధేతు సుగంధా మాధవీ వనే ॥ 11 ॥

కుబ్జామ్రకే త్రిసంధ్యా తు గంగాద్వారే హరిప్రియా ।
శివకుండే శివానందా నందినీ దేవికా తటే ॥ 12 ॥

రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృందావనే తథా ।
దేవకీ మధురాయాంతు పాతాళే పరమేశ్వరీ ॥ 13 ॥

చిత్రకూటే తదా సీతా వింధ్యే వింధ్య నివాసినీ ।
సహ్యాద్రే ఏక వీరా తు హరిశ్చంద్రే తు చంద్రికా ॥ 14 ॥

రమణా రామతీర్దే తు యమునాయాం మృగావతీ ।
కరవీరే మహాలక్ష్మీ రమాదేవీ వినాయకే ॥ 15 ॥

ఆరోగ్యా వైద్యనాథే తు మహాకాళే మే హేశ్వరీ ।
అభయా పుష్ప తీర్థే తు అమృతా వింధ్య కందరే ॥ 16 ॥

మాండవ్యే మాండవీ దేవీ స్వాహా మేహేశ్వరే పురే ।
వేగవే తు ప్రచండాஉథ చండికాஉమర కంటకే ॥ 17 ॥

సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ ।
దేవమాతా సరస్వత్యాం పారాஉవారే తటే స్థితా ॥ 18 ॥

మహాలయే మహాపద్మా పయోష్ణ్యాం పింగళేశ్వరీ ।
సింహికా కృతశౌచే తు కార్తికేయే తు శంకరీ ॥ 19 ॥

ఉత్సలాஉవర్తకే లోలా సుభద్రా సింధు సంగమే ।
ఉమా సిద్ధవనే లక్ష్మీ రనంగా భరతాஉశ్రమే ॥ 20 ॥

జాలంధరే విశ్వముఖీ తారా కిష్కింధ పర్వతే ।
దేవదారు వనే పుష్టి ర్మేధా కాశ్మీర మండలే ॥ 21 ॥

భీమా దేవీ హిమాద్రౌ చ తుష్టి ర్విశ్వేశ్వరే తథా ।
కపాల మోచనే శ్రద్దా మాతా కాయాஉవరోహణే ॥ 22 ॥

శంఖోద్దారే ధ్వని ర్నామ ధృతిః పిండారకే తథా ।
కాలా తు చంద్రభాగాయా మచ్చోదే సిద్ధిదాయినీ ॥ 23 ॥

వేణాయా మమృతా దేవీ బదర్యా మూర్వశీ తథా ।
ఔషధీ చోత్తర కురౌ కుశద్వీపే కుశోదకా ॥ 24 ॥

మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ ।
అశ్వత్థే వందనీయా తు నిధి ర్వైశ్రవణాஉలయే ॥ 25 ॥

గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ ।
దేవలోకే తథేంద్రాణీ బ్రహ్మాస్యే తు సరస్వతీ ॥ 26 ॥

సూర్యబింబే ప్రభా నామ మాతౄణాం వైష్ణవీ తథా ।
అరుంధతీ సతీనాం తు రామాసు చ తిలోత్తమా ॥ 27 ॥

చిత్తే బ్రహ్మకళా నామ శక్తిః సర్వశరీరిణామ్‌ ।
ఏత ద్భక్త్యామయా ప్రోక్తం నామాஉష్టశత ముత్తమమ్‌ ॥ 28 ॥

అష్టోత్తరం చ తీర్థానాం శత మేతదుదాహృతమ్‌ ।
యో జపేత్‌ శ్రణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే ॥ 29 ॥

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధ...