మృగశృంగుడు యమునిగూర్చి తపమాచరించుట
ఆ విధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీనదిలో దిగి అకాలమృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేకదీక్షతో యమునిగూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి "మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు
నేనెంతయు సంతసించితిని, నాగురించి ఇంతదీక్షతో ఎవ్వరూ తపమాచరించి వుండలేదు, నీకేమి కావలయునో కోరుకొనుము, నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచిచూడగా = యముడు తన యెదుట నిలబడియున్నాడు. వెంటనే "చేతులు జోడించి "మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీదర్శనమిచ్చుట నాపూర్వజన్మసుకృతము తప్ప వేరు కాదు. ఆకాలమరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను నంతృప్తునిజేయుడు” అని ప్రార్ధించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి, అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురుకన్యలకు ప్రాణదానము చేయనెంచి "మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకారబుద్ధి నన్నాకర్షించినది. నీకు జయమగుగాక" అని యముడు దీవించగాా-
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసినవారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు, అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగు నటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా-
“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్శరాజు దీవించి యదృశ్యుడ య్యను,
No comments:
Post a Comment