Monday, January 12, 2026

Sahasra Phalala Nomu Katha - సహస్ర ఫలాల నోము కథ

సహస్ర ఫలాల నోము కథ

"సహస్ర ఫలాలు నోచిన చాలపుణ్యము. వర్ణించుటకు సహస్ర కరములు ఆదిశేషునకైనా అలవిగాదు. “ఎల్లకాలము చేసెడి నోము ఏమిటయ్యా!” అని పార్వతి శివునడుగుగా-“ఎల్ల కాలము చేసెడినోము సహస్ర ఫలాలనోమే పార్వతీ! ఈ నోము నోచిన భామలమీద నీకుదయ నాకుదయ, విష్ణునకుదయ, లక్ష్మికిదయ, బ్రహ్మకుదయ, సరస్వతికిదయ చంద్రునకుదయ, సూర్యునకుదయ, ముక్కోటి దేవతలకు దయ మూడులోకాలకుదయ ఈనోము నోచినవారి, కెల్లకోరికలుతీరి, ఇహపరము వారి దేయగునే పార్వతీ!” యని పరమేశ్వరుడు చెప్పినాడుట.

ఈ పాట పాడుకొని అక్షింతలు వేసుకొనవలెను.

ఉద్యాపనము: ఒక్కొక్క పండుదినుసుకు వేయి చెప్పున వేయిదినుసుల పండ్లు వానివానికి తగిన దక్షిణలతో బ్రాహ్మణ దంపతులకు దానమీయవలయును. ఏ కాలములో దొరికేపండ్లా కాలములో చేసికోవచ్చును. ఇచ్చినవారి కీయకుండా వేయిదినుసులు వేయిమంది బ్రాహ్మణదంపతులకు ఈయవలెను భక్తితప్పకున్న ఫలము తప్పదు.

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...