Monday, January 5, 2026

Karulla Karalla Gowri Devi Katha - కరుళ్ళ గౌరీదేవి కథ

కరుళ్ళ గౌరీదేవి కథ

ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు కలరు. ఆ అయిదుగురు కొడుకులకు పెండ్లి అయి అయిదుగురు కోడండ్రు కాపురమునకు వచ్చిరి. అందులో అయిదవకోడలు కరుళ్లగౌరీదేవి నోము పట్టినది. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. 

ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి, అత్త సొమ్మొద్దు మామ సొమ్మొద్దు, పుత్రి సొమ్మొద్దు, పురుషసొమ్మొద్దు, నా సొమ్మే నాకిమ్మిని సూర్యదేవుని ప్రార్థించి ఆమెరోజూ నమస్కారములు చేసేది. అట్లు నమస్కారములు చేసిన కొంతకాలమునకు అత్తకు మామకు, బావకు మరదలకు, భర్తకు ఎల్లవారికి ఆమెమీద కోపంగా వుండేది. ఒకరోజున పడుకొని నిద్రపోవుచుండగా మంచముతోపాటు దీసుకొనిపోయి మహారణ్యములో షారవేసిరి. ఆమె కొంతసేపటికి నిద్రమేలుకొని ఆ యడవిలోనే నీళ్ళు పోసుకొని సూర్యభగవానునకు నమస్కారము చేయుచుండగా ఆమె దోసిటిలోనికి నిండుగా వరహాలు వచ్చెను. ఆమె అవి తీసుకొని సమీప 'పల్లెకేగి పసుపు, కుంకుమ, గిన్నె ఉప్పు, మిరపకాయ, బియ్యము మొదలగు యావత్తు సామాగ్రిని కొని ఒక
గొల్లముసలివాని సహాయమున నొక గుడిసెలో నివసించుచుండెను. యింటి వద్దనున్న వారికందరికి అష్టదరిద్రము పట్టుకొని నానాస్థలములు తిరుగుచు తినుటకు తిండి, కట్ట గుడ్డయు లేక బాధపడుచు ఒకరోజున కట్టెపుల్లల నిమిత్తము యీ యడవిలోనికి వచ్చిరి. అట్లు వచ్చి తమకు సమీపములో నొకచోట సూర్యనమస్మారములు చేయుచున్న యా చిన్నదానిని చూచి తక్కిన కోడండ్రంతా"ఇదిగో! మా తోటికోడలు ఈలాగే సూర్యనమస్మారములు చేయుచుండేది" అని తమవారితో చెప్పసెాగిరి. 

సూర్యప్రభావమువల్ల అడవిలోనున్న చిన్నది డబ్బుకలదై మేడలు, మిద్దెలు, తోటలు, దొడ్లు కట్టించి అరిదేశి పరదేశి వస్తే అడ్డములేకుండా అన్నము పెట్టుచుండేది. ఆ సమయమునందు ఆమె అత్తా మామ లక్కడకువచ్చి- "మాకింత అన్నం పెట్టించదవా?” యని యడిగిరి. అప్పుడు అత్తమామ యని ఆమె గ్రహించి "నామామగారు అత్తగారు మీలాగే వుండేవారు. మీదేవూరు? మీరెవర" ని అడిగెను. అందుకు వారు- "మేము ఫలానా!” అని చెప్పిరి. అంతలో పెనిమిటివచ్చెను. వారి ముగ్గురికి తలంటి నీళ్లుపోయించి వారికి సకలోపచారములు చేయుచు పదమూడు కరుళ్ళు కంచములో పెట్టి క్రొత్త కంచముకొని చీర, రవికెలగుడ్డ కరుళ్ళు పెట్టుకొని ఉద్యాపనము చేసికొనెను. ఏడాది అయిన తరువాత చీర, రవిక, పదమూడు కరుళ్ళు క్రాత్త కంచములో బెట్టి ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన: యేడాది నిండిన తర్వాత ఒక క్రొత్త కంచములో పదమూడు కరుళ్ళు పెట్టి చీర , రవికేలగుడ్డతో ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

కథలోప మైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినా ఫలము తప్పదు.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...