పోలి పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే, మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతే కాకుండా పోలి పాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు, నీటి కొలనులు, చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి విశిష్టత, పోలి స్వర్గం కథ తెలుసుకుందాం..
అనగనగా ఒక చాకలిది. దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడల్లు కలరు. ఆ చాకలికి ముగ్గురు కోడండ్రు, తాను ప్రతిరోజు కార్తీకమాసములో ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు యుదయము కాకుండా స్నానము చేసికొని, దీపముపెట్టి నెలరోజులా తీరుగ జరిపెను. తరువాత కార్తీక బహుళ అమావాస్యనాడు తెల్లవారుజామునలేచి కడసారపు కోడలు పోలితో “మేము స్నానమునకు వెళ్ళుచున్నాము. మేము వచ్చేవకు యింటివద్ద జాగ్రత్తగా నుండవలసినదినిచెప్పి చాకలిది, ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళిరి.
అప్పుడు చిన్నకోడలులేచి చల్లచేసి కవ్వమును అంటి యున్న వెన్న ఊచ్చుకొని ప్రత్తిచెట్టు క్రిందపడియున్న ఒక ప్రత్తికాడ తెచ్చుకొని వత్తిగా చేసి నూతివద్ద స్నానముచేసి వెన్న, వత్తితో కలిపి దీపము వెలిగించుకొని అత్తగారు రాకుండా ఆదీపము మీద చాకలిబాన మూత వేసెను.
అప్పటి నుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి.
ఈ కథ చెప్పి అక్షతలు వేసికోవలయును.
No comments:
Post a Comment