Saturday, August 15, 2026

Sandesham Message - సందేశం

రామాయణం సుందరకాండ 51వ సర్గ - సందేశం

మా ప్రభువు ఏమన్నాడో వినిపిస్తాను.

రథ, గజ తురగ పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు.

ఆయన లోక ప్రజలందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమమయిన తేజస్సు కల ఆ మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్దకొడుకు దండకారణ్యానికి వచ్చాడు.

ధర్మవర్తనుడూ, తీవ్ర బలపరాక్రమ సంపన్నుడూ, అయిన ఆ రా
చంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడూ, భార్య సీత వచ్చారు.

జనకరాజపుత్రి, పతివ్రత అయిన ఆ సీత ఒకనాడు దండకారణ్యంలో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింధచేరి ఋశ్యమూక పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా ప్రభువు.

వానర రాజ్యం సుగ్రీవునకు ధారవోశాడు రాముడు.

మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి.

నువ్వెరుగని వాడుకాదు వాలి,

అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేల కూల్చాడు రాముడు.

ఆడిన మాట ప్రకారం వానరసేనలను నాలుగు దిక్కులకూ పంపించాడు సుగ్రీవుడు.

మా వానర యోధులలో కొందరు వైనతేయులు, 
రికొందరు వాయుదేవసములు, అందరూ తీవ్రగమనం కలవారే.

వారిలో నేను వాయువునకు ఔరసుడనయిన హనుమంతుడను. నూరుయోజనాల సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను. 

నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడవు తపస్వివి. ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితంకాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు.

రామ లక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా ఊపిరి తీసుకోలేడు.

ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితమూ, ధర్మార్థ సంయుతమూ అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయనెవరనుకుంటున్నావో! మానవరూపం ధరించిన దైవం.

ఇక-

నేను సీత జాడ తెలుసుకున్నాను.

మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన.

నువ్వు సీతను అపహరించడం అంటే అయిదు పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికే వాడుండడు కదా! అలానే సీతను అపహరించడమూ.

తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడవు, ధర్మపరుడవు. 

కనక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు.

దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యంకాదు కాని, మానవుడైన రాముడు, వానరుడయిన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది.

నిన్నటివరకూ నువ్వు ధర్మకర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడీ సీతాపహరణమనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమయింది.

జనస్థాన వధం బుద్ధ్వా
బు
ద్ధ్వా వాలి వధం తథ
రామ సుగ్రీవ సఖ్యం చ
బుద్ధ్యస్య హిత మాత్మనః॥

జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేల కూలిన విషయం విన్నావు.

మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు.

రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడింక నీ శ్రేయెమార్గం తెలుసుకోవాలి.

ఇంత చెప్పడం దేనికంటావేమో!

నేనే నీ లంకా నగరాన్ని సర్వనాశనం చెయ్యగలను, కాని రాముడి కది అభి
తం కాదు.

సీతాపహరణం చేసిన వానిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.

పయిగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు.

సర్వ లంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి అవిడ.

కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు.

రామ క్రోధాగ్ని
సీతా తేజోగ్ని

ఈ రెండూ నీ లంకను సర్వనాశనం చేస్తూంటే చూడక తప్పదు నీకు.

నా మాట వను.

నీ సచివ, సామంత, బంధు మిత్రక్రోటిని రామ బాణాగ్నికి ఇంధనం చెయ్యకు.

ఈ సర్వభూతాలనూ ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వం సృష్టించగలవాడు రాముడు.

విష్ణు సమ పరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు.

చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలవరు. ఆయన తలచుకుంటే వీరెవ్వరూ అభయంకూడా యివ్వలేరు, అన్నాడు.

విభీషణుడు

No comments:

Post a Comment

Anveshana Gaadha - అన్వేషణ గాథ

రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు. అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ: నాయనా! సీతాద...