Thursday, April 23, 2026

Dakshudu Chesina Aparadham - దక్షుడు చేసిన అపరాధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దక్షుడు చేసిన అపరాధం

ఒకప్పుడు దుర్వాసమహర్షి జంబూనదీతీర మేగి యచట వెలసిన శ్రీదేవిని సందర్శించి శ్రీమాయాబీజము నచట జపించెను. అంతట శ్రీదేవేశ్వరి ప్రసన్నయై పూలజుంటి తేనియలకు తిరుగాడు గండుతుమ్మెదలుగల తన మెడలోని పూలదండ ముని కిచ్చెను. ముని దానిని దేవిప్రసాదముగ గ్రహించెను. తాపసు డాకాశమార్గమున బయలుదేరెను.

అతడు సతి తండ్రియగు దక్షుడున్నచోటి కరిగెను. అట జగదంబను దర్శించి యామె పాదపద్మములకు నమస్కరించెను. ఆ పూమాల జూచి 'యిదెవరది? మానవ దుర్లభమైన యిదినీ కెట్లు లభించెనని దక్షుడనెను. దక్షుని మాటలు విని కన్నుల ప్రేమాశ్రులు నిండ 'నిది శ్రీదేవి ప్రసాద' మని డగ్గుత్తికతో ముని పలికెను. దానిని తన కిమ్మని సతి తండ్రియగు దక్షడు ముని నడిగెను. 

శక్తి భక్తులకు ముల్లోకములం దీయరానిది లేదు. అని తలంచి ముని దేవి పుష్పమాలను దక్షున కొసంగెను. దక్షుడు దానిని తన తలపై దాల్చి యింటి కేగెను. ఆ రేతిరి దాని నతడు దంపతుల మెత్తని పానుపుపై నుంచెను. దాని పరిమళములు మూర్కొనుచు దక్షదంపతులు రతియందు సుఖించిరి. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనస్సులో శంకరుడిపై ద్వేషం రగిలింది. ఆల్లుడిమోద కోపం ఆత్మజమోదకు కూడా ప్రసరించింది.

తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడినుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి అహుతి ఇచ్చింది సతీదేవి. అటుపైని ఆ దివ్యతేజన్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీనామధేయంతో పరిఢవిల్లింది - అని చెప్పి ఒక్క క్షణం ఆగేడు వ్యానహర్షి వెంటనే జనమేజయుడు

108 శక్తిపీఠాలు

Wednesday, April 22, 2026

Harihara's pride is broken - హరిహరులకు గర్వభంగం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిహరులకు గర్వభంగం

జనమేజయ డిట్లనెను: పూర్వము శ్రీపరాంబిక గౌరీ-లక్ష్మీ-సరస్వతులను వరుసగ శివ-విష్ణు- బ్రహ్మలను త్రిమూర్తుల కొసంగెను. మఱి దక్షునకు-హిమవంతునకు గల్గిన కన్య గౌరి యెవరు? మఱి పాలసంద్రము కూతురు మహాలక్ష్మి యందురు గదా! గౌరీలక్ష్మలకు మఱల కన్యాత్వ మెట్లు గల్గెను. 

ఓ మునీశా! ఇదంతయు నసంభవమని నాకు దోచుచున్నది. ఇందు సందియమును గల్గుచున్నది. నీ జ్ఞానఖడ్గముతో నా యీ సందేహము బాపుము. 

వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీదేవీ భక్తుడవగు నీకు చెప్పరాని దొక్కటియు నుండదు. నీ వడిగిన పరమాద్బుత రహస్యము వెల్లడింతును. అవధరింపుము. శ్రీపరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తుల కొసంగెను. ఆనాటినుండి త్రిమూర్తులు తమతమ సృష్టి కార్యములు సాగించిరి. 

రాజా! మునుపు హాలాహలులను దైత్యులు మహావిక్రములు. వారొకప్పుడు క్షణములో ముల్లోకములు గెలిచిరి. వారు బ్రహ్మవరమున బలిసి కైలాస వైకుఠములపై దండెత్తిరి. వారితో హరిహరులును యుద్ధమునకు సిద్ధపడిరి. అట్లు వారికి ఘోరముగ నారు వేలేండ్లు సమరము జరిగెను. 

అపుడు దేవదానవ సేనలలో హాహాకారములు మిన్ను ముట్టెను. హరిహరులచేత నెందఱందఱో రక్కసు లుక్కడంగిరి. అంత హరిహరులు తమ తమ నెలవుల కరిగి తమ తమ భార్యల యెదుట తమ వలననే రక్కసులు మడిసిరని గొప్పలు చెప్పుకొనిరి. వారి స్వాహిమానమునకు లక్ష్మీగౌరులు కపటముగ నవ్విరి. హరిహరులు వారి నవ్వు చూచిరి.

వారాది మాయాశక్తికి మోహితులై వారిపై మిక్కిలిగ కోపము జెందిరి. వారు వారి కవమానము గల్గునట్లుగ నోటికి వచ్చునట్లు మాటలాడిరి. ఆ క్షణముననే లక్ష్మీగౌరు లందర్ధానము జెందిరి. అపుడు పెద్దగ కలకలము బయము దేరెను. లక్ష్మీగౌరుల నవమానించుటవలన హరిహరులు తేజము-శక్తి-చేతనము-గోల్పోయి చపలచిత్తులైరి. 

అంత బ్రహ్మ యిట్లు చింతించెను: ఏమి ఈ వింత! దేవతలలో ప్రముఖులు హరిహరులు గదా! నేడు వారు కార్యదక్షులు గాకుండి రేల? ఈ కాలముగాని కాలమునందేమి ఈ వైపరీత్యము. ఏ పాప మెఱుగని యీ జగమునకు ప్రళయము ముంచుకొని రాలేదు గదా! దీని కారణమో తెలియక ప్రతి క్రియ యెట్లు జరుపగలను? అని యీ రీతిగ చింతించి బ్రహ్మ కనులు మొగిడ్చెను. 

అపుడా పరాశక్తి కోపముననే యంతయును జరిగినదని యెఱిగి బ్రహ్మ సావధానుడయ్యెను. అపుడు తపోనిధియగు బ్రహ్మ తన సుతులగు మున్వాదులను సనకాదుల నాహ్వానించెను. వారు వచ్చి నమస్కరింపగ 

బ్రహ్మ వారి కిట్లనెను: నే నిపుడొక పనిలో మునిగియున్నాను. నేను తపము చేయజాలను. హరిహరులు శ్రీపరాశక్తి కోపమునకు గురియై శక్తిహీనులైరి. ఆమె సంతోషించుట కీ జగద్బారమంతయు నేనే వహింపగలను. కనుక మీరలైకాంతిక భక్తితో నత్యద్బుతమైన తప మాచరించి పరాంబికను సంతోషపెట్టుడు. 

ఓ నా పుత్రులారా! హరిహరులు తిరిగి శక్తియుక్తు లగునటుల చేయుడు. మీ కీరితి వర్ధిల్లు గాత. ఆ యిర్వురు మహాశక్తులెవని యింట నుద్బవింతురో యా వంశలో లోకముల నెల్ల పవిత్ర మెనర్చును. ఆ కన్న వారును ధన్యజీవు లగుదురు. అను బ్రహ్మ వాక్కులు విని దక్షాదు లెల్లరును నిర్మలమనస్కులై శ్రీజగదంబ నారాధింపగోరి వనముల కేగిరి.

అటుపిమ్మట వారలెల్లరును హిమాలయముల వనములకేగి శ్రీమాయాబీజజప పరాయణులై నిశ్చలముగ తపమారంభించిరి. రాజా! వారొక లక్షయేండ్లు పరాశక్తిని ధ్యానించిన పిమ్మట శ్రీదేవి ప్రసన్నయై వారికి దర్శనభాగ్యమొసంగెను. ఆ సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిలోచన దయారసముపూర్తిగ వెల్లివిరియగ తన నాలుగు చేతులందు పాశము-అంకుశము-వరాభయముద్రలు దాల్చెను. ఆ యెల్లలోకాలు పరిపాలించు జననినిగని నిర్మలమనస్సులు గలమును లిటుల దేనిని సన్నుతించిరి! 

ఓ వైశ్వానర స్వరూపిణి! ఓ విశ్వరూపిణి! నీకు మా ప్రణామములు. ఏ చిద్రూపిణియం దెల్ల లింగదేహములు నిండియుండునో యా సూత్రాత్మ స్వరూపిణికి జలరూపిణికి మా ప్రణమములు. ఎల్ల దేహములందునిండియున్న యవ్యా కృతరూపిణి- ప్రాజ్ఞస్వరూపిణి- ప్రత్యక్స్వరూపిణి-యగు బ్రహ్మమూర్తికి మా ప్రణమములు. సర్వస్వరూపిణి-సర్వలక్ష్య స్వరూపిణ-యగు జగదంబికకు మాప్రణమములు. ఆ తల్లిని మధుర భక్తితో సన్ను తింతుము. 

అని దక్షాదులు ములు నిర్మలచిత్తులు దేవి చరణకమలములకు ప్రణమిల్లిరి. పిదక పికభాషణియగు శ్రీదేవి సుప్రసన్నయై వారి కిట్లనెను: ఓ మహాత్ములారా! నేను వరదాయినిని. ఏదేని వరము గోరుకొనుడు. అను దేవి మాటలు విని వారు హరిహరులకు మేలు గల్గవలయునని కోరిరి. హరిహరులు మరల తమ తమ శక్తులను గలియవలయునని వారు గోరిరి. 

అపుడు దక్షుడు ప్రత్యేకముగ నిట్లనెను: నా వంశమున నీవు జన్మింపుము తల్లీ. అంబ! నీవు నా యింట జన్మించుము. నేను కృతకృత్యుడను గాగలను. నిన్ను గూర్చి జపము-ధ్యానము పూజలు నీ వివిధ నివాసస్థానములు తెల్పుము. ఓ పమమేశానీ! వీని నన్నిటిని నీ ముఖము నుండి వెల్లడించుము. 

దేవి యిట్లనెను: నా శక్తుల నవమానించుటవలననే హరిహరుల కా దురవస్థ వాటిల్లెను. అట్టి యపరాథ మిక ముందెన్నడు నెవ్వరును చేయరాదు. ఇపుడు నా దయాలేశమున వారి శరీరము కారోగ్యము చేకూరగలదు.

ఆ యిర్వురు శక్తలలో నొకతె నీ యింట మఱియెకతె క్షీరసాగరమున జన్మింపగలరు. హరిహరులు నాప్రేరణ వలన తిరిగి వారిని బడయగలరు. నా ముఖ్యమంత్రము శ్రీమాయాబీజము. అది నాకత్యంతము ప్రియకరమైనది. 

కనుక నా విరాట్స్వరూపమునగాని యీ త్రిభువనేశ్వరీ స్వరూపముగాని ధ్యానించవలయును. లేక సకల జగముల నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైన ధ్యానింపవలయును. మీరు సతతము నన్ను పూజించి ధ్యానింపుడు. ఈ ప్రకారముగ పలికి మణిద్వీపాధివాసినియగు దేవి యంతర్దాన మొందెను పిమ్మట దక్షాదిమునులు మరల బ్రహ్మను చేరిరి. వారు జరిగిన వృత్తాంతమంతయును బ్రహ్మకు నివేదించిరి. 

హరిహరు లంతట స్వస్థులై తమ తమ కార్యములు తామే నిర్వహింప గలిగిరి. ఆనాటినుండి హరిహరులు పరాంబ దయవలన గర్వము మాని శాంతితో నుండిరి. ఒకానొక సమయన పరాశక్తి యవతరించెను. మహారాజా! దేవి దక్షునింట నవతరించెను. అపుడు ముల్లోకము లుత్సవములు జరుపుకొనెను. 

అమరులు ప్రమోదభరితులై పూలసోనలు కురిసిరి. రాజా! స్వర్గధామమున సురలు తమ చేతులందలి కోణములను సాధనములచేత దేవదుందుభులు మ్రోగించిరి. సాధుసజ్జనులు మనస్సులు నిర్మల ప్రసన్నములయ్యెను. నదు లువ్వెత్తుగ ప్రవహించెను. సూర్యుడు మేలు వెల్గులు విరజిమ్మెను. సర్వమంగళ యవతరింపగ నెల్లెడల మంగళ సర్వస్వ మొప్పారెను. 

ఆ పుట్టినట్టి బాల సత్యస్వరూపిణియే యగుటవలన సత్యజ్ఞానులామెను సతి యనిరి.ఆదక్షుని కూతురు మరల శివునకే యీయబడెను. ఆ దాక్షాయణి దక్షునపరాధమునకు దైవయోగమున నగ్నిలో దుమికెను. 

జనమేజయు డిట్లనెను: ఓ మునివరా! ఎంతటి యనర్థ కరమైనమాట వినిపించితివే! ఏ త్రిభువనేశ్వరి నామము స్మరించినంత మాత్ర నెల్లవారి సంసారాగ్ని భయము తొలగిపోవునో యట్టి మహాదేవి యేల నగ్నిలో దగ్దమయ్యెను. దక్షు డేమి యపరాధము చేసెనని యామె యగ్ని కాహుతి యయ్యెను? 

వ్యాసు డిట్లనెను: రాజా! సతీదేవి దగ్దయగుటకుగల కారణము వెల్లడింతు నవధరింపుము.

దక్షుడు చేసిన అపరాధం

DurgaMasuranashini - దుర్గమాసురనాశిని

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దుర్గమాసురనాశిని

పిమ్మట దుర్గమాసురుడు గొప్ప యల్లకల్లోలము జరుగుచున్నదని తన దూతవలన విని ససైన్య ముగ సాయుధుడై బయలుదేరెను. అతడు వేయి యక్షౌహిణుల సేనలతో వచ్చి వేగమున శరములు వదలుచు దేవి చెంత నున్న దేవసైన్యము నెదుర్కొనెను. మఱియు నతడు బ్రాహ్మణుల గుంపుల నడ్డగించెను. 

అపుడు దేవగణములు గగ్గోలు పడెను. విప్రులుమను దేవతలను త్రాహి త్రాహీ యను కేకలు వేసిరి. శివాదేవి వారి మొఱ యాలించి దేవతల చుట్టు తేజోమయ చక్రము నిర్మించెను. అది వారికి శ్రీరామరక్షగ నుండెను. దేవి బయట నిర్బయముగ నిలుచుండెను. ఆపుడు దేవీ దైత్యుల మధ్య నిర్వురకు ఘోర సమరము సంఘటిల్లెను. 

వారి బాణవర్షమువలన సూర్యమండలము కనిపించకుండెను. బాణముల యొండొంటి తాకుడువలన నిప్పురవ్వలు దుముకుచుండెను. వారి గట్టి యల్లెత్రాటి టంకారముతో దిక్కులకు చెవుడు వచ్చెను. అట్టి యుద్ధ సమయమునందు దేవి శరీరమునుండి పలుతీవ్రశక్తు లుద్బవించిరి. వారు కాళిక-తారిణి-బాల-త్రిపుర-భైరవి-రమ-బగళ-మాతంగి-త్రిపురసుందరి-కామాక్షి-తులజాదేవి-జంభిని-మోహిని-ఛిన్నమస్త-గుహ్యాకాళి-దశసహస్ర బాహుక-యనబరగువారు.

వీరుకాక మఱి ముప్పదిరెండు మంది-తర్వాత నరువదినల్గురు-నటుతర్వాత లెక్క పెట్టరానంత మంది- దేవి దివ్యావ యవములనుండి సాయుధలై యుద్బవించిరి. ఆ శక్తులందరవలన దైత్యుని నూఱక్షౌహిణుల సేన తుదముట్టెను. రణరంగమున మృదంగ-శంఖ-వీణాధ్వనులు మిన్ను ముట్టెను. 

అపుడు సేనాపతియగు దుర్గమాసురుడు మొట్టమొదట ముందునకు దుమికి భిన్నశక్తులతో పోర తలపడెను. అట్లు పది దినములు జరిగిన భీకర యుద్ధములో కొన్ని యక్షౌహిణుల సైన్యము హత మయ్యెను. నెత్తురు టేర్లు ప్రవహించెను. అతడు పడునొకండవనాడు రక్తమాల్యంబరంబులు దాల్చి రక్తగంధము పూసికొనెను. అతడు పెద్ద పండుగ జరుపుకొని మహా సంరంభముతో రథమెక్కివచ్చి యెల్లశక్తుల నోడించెను. 

అతడు పిదప తన రథమును శ్రీపరాశక్తి రథము నెట్ట యెదుటికి పోనిచ్చెను. అపుడు దేవి దైత్యుల మధ్య ద్వంద్వయుద్ధము జరిగెను. వారి మధ్య చూపఱు గుండె లవియునట్టుల పోరు ఘోరముగ రెండుజాములు జరిగెను. పిమ్మట దేవి పదునైదు తీవ్రబాణములు వదలెను. వానిలో నాల్గింటివలన నాల్గు గుఱ్ఱములు-నొక్క బాణమున సారథిని-రెంట వాని కండ్లను-రెంట భుజములు-నొక్కట టెక్కమును-ఐదింట వాని యెడదను-వ్రయ్యవ్రయ్యలుచేసి వేసెను. 

వాడు నోట నెత్తురు గ్రక్కుచు శ్రీదేవి సన్నిధిలో నసు వాలు పాసెను. వానినుండి యొక దివ్యతేజము వెలువడి దేవిలో ప్రవేశించెను. బలశాలియగు దైత్యుడు చావగనే యెల్లలోక ములు సంతసిల్లెను. ఆ సమయంబున బ్రహ్మాదులు హరిహరాదులను ముందుంచుకొని పరాభక్తితో మధురవాక్కులతో జగ దంబిక నీ విధముగ నన్నుతించిరి. 

ఓ పరమేశ్వరీ! శాకంభరీ! శతాక్షీ! శివా ! బ్రహ్మాండగోళము లెల్ల భ్రమించి పరిభ్రమిం చుట నీవే మూలకారణము. సకలోపనిషత్తులచేత సుతింపబడు జ్ఞానస్రనూనాంబవు నీవే. ఓ దుర్గమాసుర విభంజనీ! జయ మంగళ స్వరూపిణీ! పంచకోశాంతర సంస్థితా! మాయేశ్వరీ ! నీ కివే మా వందనశతంబులు.

ఏ త్రిభువనేశ్వరి నెల్లమునులు నిర్మల-నిశ్చలచిత్తములతో నను ధ్యానింతురో యట్టి ప్రణవస్వరూపిణీ! జననీ! నీ కివే మా వందనశతంబులు. అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రీ! బ్రహ్మవిష్ణ్వాదుల జననీ! దివ్యమంగళమూర్తియగు జగద్ధాత్రీ! నీ కివే మా వందనశతంబులు. నీవు దయామతల్లివి-పరమేశ్వరివి-విశ్వైకమాతవు-శతాక్షీ మాతవు. 

కాబట్టి పామరులమైన మమ్ముజూచి యేడ్చితివి. నీవు తక్క సర్వేశ్వరుడు నట్లు చేయడు. అని బ్రహ్మవిష్ణువు మొదలుగాగల దేవతలు దేవిని నుతించి వివిధ ద్రవ్యములతో సంపూజించిరి. దేవి యదే క్షణమున సంతుష్టురాయ్యెను. పికభాషిణియగు దేవి ప్రసన్నయై వేదములు దెచ్చి విప్రుల కొసంగి 

యిట్లు పలికెను: ఇవి నా యుత్తము శరీరమువంటివి. వీనిని చక్కగ భద్రముగ రక్షింపుకొనుడు. ఇవి లేనందున గల్గిన యనర్థము. మీ రిపుడే సనిదర్శనముగ జూచితిరి గదా. నన్ను నిరంతరముగ పూజింపుడు. సంసేవింపుడు. మీ మేలు వెల్గుగోరి నేనిదంతయును చెప్పుచున్నాను. నా యీ యుత్తమ దివ్యమహాత్మ్యమును మీరలు సతతము పఠించుడు. దానివలన నేను సంతుష్టిజెంది మీ కోరిక లెల్ల దీర్చగలను. 

దుర్గమాసురుని దెగటార్చుటవలన గల్గిన దుర్గానామమును శతాక్షీనామము నుచ్చరించినవాడు మాయను దాటి పరమపదము జేరగలడు. వేయేల? ఒక ముఖ్య విషయ మేమన సురాసురు లెల్లరును నన్నే సదాగతిగ సతము సేవింపవలయును. అని సచ్చిదానంద స్వరూపిణి యెల్లవారికి సంతోషము గల్గించుచు నచటనే యెల్ల దేవతలు చూచుచుండగ నదృశ్య యయ్యెను. 

ఈ విధముగ పరమకల్యాణకారకమగు శ్రీదేవి మహాత్మ్యము గూర్చిన రహస్యకథ నీకు వివరించితిని. దీనిని యత్నించి రహస్యముగ నుంచుము. ఎవ్వాడీ శ్రీదేవీ పరమాధ్యాయము విశ్వాత్మభావముతో భక్తిద్ధ్రలతో నాలించునో వాడిచట కోర్కె లెల్ల బడసి పిదప తప్పక శ్రీదేవీలోకము జేరలగలడు.

వ్యాసు డిట్లనియెను : ఈ ప్రకారముగ సూర్యచంద్రవంశము లందలి పేరుగాంచిన రాజులు యుత్తమ చరితములు నాచే కొంత వర్ణింపబడదగినవి గలవు. 

ఓ రాజా! వీరెల్లరును శ్రీపరాశక్తి ప్రసాదము వలననే యింతగ మహనీయత్వముబడసిరని తెలిసికొనుము. ఎచ్చటెచ్చట మహదైశ్వర్యములు-ఓజోగుణము-విభూతిమత్త్వవము నుండునో యచ్చటచ్చట నదంతయును శ్రీపరాశక్త్యంశమువలననే కల్గినదని నిక్క మెఱుంగుము. వీరును మఱి తక్కిన రాజులును శ్రీయాదిపరాశక్తి నుపాసించిన వారనియు సంసార వృక్షమూలమును ఛేదించు గొడ్డలివంటి వారనియు తెలియుము. 

కనుక ధాన్యార్థియైన ప్రతివాడు వడ్లపొట్టునువలె సంసార విషయములను వదలి శ్రీత్రిభువనేశ్వరి నెల్లవిధముల సంసేవింపవలయును. ఓ రాజా! ఈ సకల వేదములనెడు పాలసంద్రలను మథించి మథించి తుదకు శ్రీజగదంబికా పాదకమలములనెడు జాతిరత్నములు పడసి ధన్యభాగ్యుడ నైతిని. పంచబ్రహ్మాసనారూఢ-శ్రీపరాశక్తి యొక్కతెయే - మఱవ్వరునుగారు. 

కనుక నామెకు బ్రహ్మ-విష్ణు-రుద్ర-శివ-ఈశ్వర-సదాశివులు వరుసగ భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము అను భూతముల కధిపతులు. ఈ పంచ తత్త్వములకంటె ఇతరమగునది వేదములందవ్యక్తమని చెప్పబడును. ఆమె మణులందు దారమువలె నంతట వ్యాపించియుండుటచే త్రిభువనేశ్వరి యయ్యెను. 

రాజా! శ్రీమాతృదేవత నెఱుగక జీవుడు జన్మకోటులకైన మోక్షసుఖ మందజాలడు. నీలాల నింగిని తోలుతో గప్పలేము గదా! అటులే శ్రీమంగళ##దేవత నెఱుగక మానవులు సుఖములు పడయరు. కనుకనే శ్వేతాశ్వతర శాఖీయులు త్రిగుణములచేత నిగూఢయగు సర్వదేవతాత్మకశక్తిని నెఱుంగగలుగుదురని శ్రుతులయందు ప్రవచించున్నారు. 

కనుక మానవుడు తన జన్మము తరించుట కెల్ల ప్రయత్నములతో సిగ్గుచేగాని భీతిచేగాని భక్తిచేగాని ప్రేమచేగాని సర్వసంగములు వదలి మనస్సును హృదయమున నిలుపవలయును. శ్రీదేవీ నిష్ఠుడు శ్రీమాతృపూజా తత్పరుడై యుండవలయునని వేదాంతభేరి మ్రోగుచున్నది. ప్రతివాడు నెట్టి నెపముతోనైనను నిదురించుచు నడచుచు నిలుచుండుచు శ్రీదేవిని దలచవల యును. 

శ్రీదేవిని నిరంతరము కీర్తించవలయును. బంధములను బాయవలయును. కనుక రాజా! సర్వప్రయత్నముతో శ్రీమహేశ్వరినే భజింపవలయును. మొదట శ్రీదేవతయొక్క విరాడ్రూపమును తర్వాత సూక్ష్మరూపము నటుతర్వాత సర్వాంతర్యామి స్వరూపమును మెల్లమెల్లగ మెట్టు లెక్కునట్టుల గనవలయును. అపుడు చిత్తము నిశ్చలము నిర్మలము నగును.

అపుడీ ప్రపంచ విషయ వానస లుజ్జగించి శ్రీపరాశక్తి-పరబ్రహ్మ స్వరూపిణి-యగు సచ్చిదానంద స్వరూపిణి నారాధింపుము. రాజా! ఆ తల్లియందు చిత్తము లయ మొనర్చుటే భక్తి-యారాధన-యగును. అట్టివారే పరాశక్తి భక్తులు. వారే ధార్మికులు. సూర్యచంద్రవంశజులు-మహామనస్వులు రాజులునైన వారి మహత్త్వ పూర్ణచరిత్రము నిటుల వర్ణించితిని. ఇది పావనము-కీర్తిమంతయు-ధర్మబుద్ధిని-సద్గతిని-నొసంగునది. పుణ్యప్రదము. 
రాజా! దీనితర్వాత నీ కింకేమి విన కుతూహల మగుచున్నదో తెల్పుము. 

హరిహరులకు గర్వభంగం

Mahadevi - Shatakshi Shakambari - మహాదేవి - శతాక్షి శాకంభరి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మహాదేవి - శతాక్షి శాకంభరి

జనమేజయు డిట్లనెను : రాజర్షి-ధార్మికుడు-శతాక్షి పాదభక్తుడునైన హరిశ్చంద్రుని చరిత్రము మహాద్బుతము-విచిత్రము. ఓ మునివరా! ఆ శివాభగవతీ పరాదేవీ యెట్లు శతాక్షి యయ్యెనో వెల్లడించుము. నా జన్మము పార్ధకమొనరిపించుము. శ్రీరాజరాజేశ్వరి యెక్క దివ్యగుణములు వినుట కాసపడిన నిర్మలచిత్తున కెట్లు తనివి తీరను? శ్రీదేవీనిగూర్చిన ప్రతి పదము నశ్వమేధముచే కలుగు శాశ్వతఫల మొసంగును. 

వ్యాసు డిట్లనెను: రాజా! ఆవధరింపుము. శ్రీశతాక్షీదేవి దివ్య సంభవము తేటపఱతును. నూవు శ్రీదేవి భక్తుడవు. నీకు చెప్పరానిది లేదు. మున్ను హిరణ్యాక్షుని వంశమున రురుకుమారుడు గలడు. ఆతడు దుష్టదైత్యుడు-పరమదారుణుడు-మూర్ఖుడు-అతని పేరు దుర్గముడు. దేవతలకు వేదములు జీవగఱ్ఱలు. వేదములు నష్టమైనచో వారును నశింతురు. 

కనుక వేదములను నశింపచేయవలయను. అనితలపోసి యతడు హిమాలయమున కేగి వాయుభక్షుడై బ్రహ్మను గూర్చి ధ్యానించుచు ఉగ్రతప మొనరించెను. అట్లతడు వేయేండ్లు తీవ్రతప మొనరింపగ నతని తపము వేడిమి కెల్ల లోకములును సురాసురులును కడు సంతాపము జెందిరి. 

అంచ నలుమోముల బ్రహ్మ నవ్వు లొలుకు మోముతమ్ములతో రాయంచ నెక్కి యతనికి వరము లీయవత్తెను. సమాధిలో మునిగి కనులు ముసికొనిన దుర్గమునితో బ్రహ్మ యిట్లనెను. నీ మదిలోని కోర్కి కోరుకొనుము. నీకు మేలగుత. నీ తపమునకు మెచ్చితిని. వరము లీయ వచ్చితిని. అని బ్రహ్మ పలుకగవిని దుర్గముడు సమాధి చాలించి లేచెను. 

అతడు బ్రహ్మాను పూజించి యిట్లనెను: ఓ సర్వేశ్వరా! నాకు వేదము లిమ్ము. ఈ ముల్లోకములందు విప్రులచెంత సురలదగ్గఱ నెన్నియో వేదమంత్రములు గలవు. అవన్నియును నా సన్నిధి నుండవలయును. మఱియు నెల్లదేవత లోడిపోవునట్టి బలము నాకిమ్ము. అను దైత్యుని మాటలువిని యట్లేయని మాట యిచ్చి నాలుగు వేదములు తెలిసిన బ్రహ్మ సత్యలోకమునకేగెను.

అనాటినుండి విప్రులు వేదములు మఱచిరి. అందుతే స్నానసంద్యాదులు నిత్సహోమములు శ్రాద్ధజపములు లోపించెను. భూమిపై పెద్ద యల్లకల్లోలము బయలుదేరును. ఏమి ఈ వింత! యని విప్రులు తమలోతా మనుకొనిరి. వేదములులేక మేమేమి చేయగలమని వారనిరి. 

అపుడు భూమిపై నున్న వారికి భరింపరాని యనర్థము చుట్టకొనెను. హవిర్బాగములు లభించనందువలన నిర్జరులు ముసలివారలైరి. అపుడు దుర్గము డమరావతిపై దండెత్తెను. వజ్రకాయుడగు దైత్యునితో బోరాడజాలక దేవతలు పలాయనము చిత్తగించిరి. 

దేవతలు గిరి దుర్గములందలి రత్న సానువులందును గుహలందును దాగి యుండి పరాంబికాశక్తిని మనసార ధ్యానించుచుండిరి. అగ్నిలో హోమములు లేనందున వానలు కురియుటలేదు. వర్షములు లేనందున నేల యెండి బీటలు పాఱను. ఎల్లబావులు-దిగుడు బావులు-చెఱవులు-నదులు-నింకిపోయెను. ఈ యనావృష్టి నూరేండ్లవఱ కుండెను. అపుడు లెక్కకు మిక్కిలిగ జనులు-ఆవులు-పశువులు-చనిపోయెను. 

ప్రతి యిల్లు పీనుగుల పెంటతో నిండెను. ఇన్ని యనర్థములు వాటిల్లగశాంతచిత్తులగు బ్రాహ్మణులు హిమగిరికేగి శ్రీశివాపరాంబిక నారాధింపదలంచిరి. వారాకలిదప్పులు మాని శ్రీమాతృదేవికి శరణాగతులై సమాధి-ధ్యాన-పూజలతో దేవిని సంతుష్టి పఱచిరి. 

ఓ మహేశ్వరీ! యంబికా! మేము పామరులము. సర్వాపరాధులము. మమ్ము కనికరించు మమ్మా. మమ్మింతగ కోపించుట తగదమ్మా. ఓ దేవేశ్వరీ! సర్వాంతర్యామినీ! తల్లీ! కోపించకుము. నీ వెట్లు ప్రేరించిన నట్లే జరుగును గదా. ఇపుడు మాకు నీవు తక్క వేరే దిక్కులేదు. మహేశ్వరీ! నీ వెట్లు తలంతువో యట్లు చేయుటకు శక్తురాలవు.

అమ్మా! మహేశానీ! ఈ ఘోర సంకటమునుండి మమ్ము కడతేర్చుమమ్మా! జీవనమైన నీరే లేనిచో మే మెట్లు జీవింపగలము. సర్వేశ్వరీ! ఓ జగదంబికా! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికా! నీకు నమస్కారమమ్మా! మాయోడల సుప్రసన్నురాలవు గమ్ము. 

నీవు కూటస్వరూపిణివి. వేదాంతవేద్యవు-చిద్రూపిణివి-త్రిభువనేశ్వరివి. నీకు వందనములు తల్లీ! ఎల్ల వేదములు సర్వమును త్రోసిపుచ్చి ఏ యేకైక పరాదేవతనే భావించునో యట్టి సర్వకారణకు నుతులు. 

అట్లు బ్రాహ్మణులు సన్నుతింపగ త్రిభువనేశ్వరి-మహేశ్వరి-యగు పార్వతి యనంతనేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యెను. ఆమె నల్లని కాటుక కొండవలె నుండెను. ఆమె కన్నులు నల్లకమలమువలె నెసగెను. ఆమె స్తనము లెత్తుగ బిగి వట్రునలుగ నలరెను. అమె తన చేతులందు కమలము-బాణము-కారగాయలు-సరసములైన తీయనిపండ్లు-పూలు-చిగులుటాకులు- దాల్చెను. ఆమె చేత నున్న వన్నియు నాకలిదప్పులు పోగొట్టునవి. 

ఆమెచేత చాపమును గలదు. ఆమె యందాల కందాలరాశి. లావణ్యసీమ. ఆమె సూర్యకోటిసమాన-దయారస తరంగిణి-జగద్ధాత్రి-అనంత నయనములతో నుద్బవించినది. ఇట్లు దేవి ప్రత్యక్షమయ్యెను. ఆ తల్లి తన యన్ని వేల కన్నులనుండి లోకములందు వర్షధారలు కురుసెను. 

దేవి కంటి నీటిధారలు నవరాత్రములు కుంభవృష్టిగ గురిసెను. ఆ తల్లి దుఃఖార్తులను గాంచి కన్నీరు వదలి లోకముల నన్నిటిని సంతృప్తి పఱచెను. మఱల నేలపై నోషధు లుద్బవించెను. 

రాజా! ఆ జలములచే నదీనదములు దరులుతన్ని ప్రవహింపసాగెను. మున్ను దిగియున్న దేవతలు బయటి కేతెంతిరి. అపుడు బ్రహ్మణులు దేవత లెల్లరును గలిసి శ్రీదేవి నిటుల నభినుతించిరి. 

ఓ వేదాంతవేద్యా! బహ్మస్వరూపిణీ! నీకు నమస్కారము. తన మాయచే లోకములు సృజించు తల్లికి నమస్కారము. భక్తుల పాలిటి కల్పతరువా! దేవీ! నీవు భక్త సంరక్షణకు దేహము దాల్చితివి.

నిత్యతృపా: భువనేశ్వరి! సాటిలేనిదానా! నీకు నమస్కారము. నీవు మా యెల్లర సుఖశాంతులకొఱకు వేయి కన్నులతో వెల్గుచున్నావు. పెక్కు కన్నులుంట నీవు శతాక్షియను పేర ప్రసిద్ధి గాంచుము తల్లీ! అమ్మా! ఆకలిదప్పులచే పీడితులమైన మాకు నిన్ను నుతింప శక్తి చాలకున్నది. 
అంబికా! మహేశానీ! దయయుంచి వేదములు మాకిమ్ము. 

అను వారి మాటలు శివాభగవతి వినెను. ఆమె చేతులలోని కూరగాయులు తీయని ఫలమూలములు వారికి తినుట కొసంగెను. ఆ తల్లి వారికి వివిధ భక్ష్యభోజ్యములు నొసంగెను. పశువుల మేత మొసంగెను. 

రాజా! ఆమె నవసరము లొలుకుకోర్కులు తీర్చునట్టివి-మరల కొత్త పంటలు పండువరకు సరిపోవునవి- అగు శాకము లొసంగుటవలన నానాటినుండి శాకం భరినామ మున పెరెన్నిక గనెను. 

దుర్గమాసురనాశిని

Sri Ramanujacharya - రామానుజాచార్యుడు

రామానుజాచార్యుడు (1017-1137 CE)

రామానుజ చోళ సామ్రాజ్యం క్రింద ఉన్న శ్రీపెరంబుదూర్ (ప్రస్తుత తమిళనాడు) అనే (భూతపురి పూర్వపు నామం)గ్రామంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1017 AD లో జన్మించాడు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. అతను తల్లి కాంతిమతి మరియు తండ్రి ఆసూరి కేశవ 


కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు: పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవ 
సోమయాజి. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు.

రామానుజులు తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు.

రామానుజ 11వ శతాబ్దంలో ప్రసిద్ధ వేదాంత పండితుడైన యమునాచార్యుడిని కలవడానికి ప్రయత్నించాడు, అయితే వారు కలవలేక పోయారు. యాదవ ప్రకాశాన్ని విడిచిపెట్టిన తర్వాత, రామానుజుడు మరొక వేదాంత పండితుడైన మహాపూర్ణ అని కూడా పిలువబడే పెరియ నంబి ద్వారా శ్రీ వైష్ణవంలోకి దీక్ష పొందాడని చరిత్రకారులు చెప్తారు.

రామానుజుడు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం(విష్ణువు) లో పూజారి అయ్యాడు, అక్కడ మోక్షం ( సంసారం నుండి విముక్తి ) సాధించడం అనేది అధిభౌతిక, నిర్గుణ బ్రహ్మంతో కాకుండా విష్ణువు సహాయంతో సాధించాలని బోధించడం ప్రారంభించాడు. విశిష్టాద్వైతం (జీవుడు, ప్రకృతి మరియు ఈశ్వరుడు వేర్వేరుగా ఉన్నా, ఈశ్వరునితో అనుసంధానించబడి ఉంటారు) అయన తత్త్వం. 
రామానుజులు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా కాలంగా అగ్రగామిగా ఉన్నారు.

భక్తి మార్గం ద్వారా ఈశ్వర ప్రాప్తిని బోధించారు. సమానత్వం, దైవభక్తిని ప్రబోధిస్తూ శ్రీభాష్యం వంటి ప్రసిద్ధ గ్రంథాలను రచించారు.

ప్రధాన రచనలు: బ్రహ్మ సూత్రాల శ్రీ భాష్యం, గీతా భాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపిక, వేదాంత సారం. శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు.

ప్రారంభ జీవితం
రామానుజుడుకి అతని గురువు యాదవ ప్రకాశవేద సాహిత్యాన్ని వ్యాఖ్యానించడంలో విభేదాల కారణంగా విడిపోయినప్పుడు, రామానుజ కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి భక్తుడయ్యాడు . ఈ కాలంలో, రామానుజుల ఉపన్యాసాల కీర్తి చాలా దూరం చేరుకుంది.

వైష్ణవ ఆచార్యుడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం యొక్క మఠాధిపతి అయిన యమునాచార్య రామానుజులను చాలా చిన్న వయస్సు నుండి గమనించేవారు. అయన తన తదుపరి వారసునిగా గుర్తించారు. అందువల్ల ఆలయ వ్యవహారాల్లో తనకు కార్యదర్శి అయిన శ్రీ మహాపూర్ణ అనే శిష్యుడిని పిలిపించి కంచికి వెళ్లి రామానుజులను తీసుకురావాలని కోరాడు.

మహాపూర్ణ రామానుజులను కలుసుకుని, తన గురువు కోరికను తెలియజేసినప్పుడు, రామానుజులు చాలా సంతోషించారు. వెంటనే 
వారిద్దరూ శ్రీరంగానికి బయలుదేరారు. కానీ అప్పటికే శ్రీరంగంలో యామునాచార్య మరణించారని తెలిసింది. 

అప్పుడు వెంటనే రామానుజులు కంచికి బయలుదేరి వెళ్లి యమునాచార్యుడి మరణానికి శ్రీ రంగనాథుడిని బాధ్యులుగా భావించి పూజించడానికి నిరాకరించారు.

కానీ కొంతకాలానికి, తిరువరంగ అరైయర్ మరియు వైష్ణవ సమాజానికి చెందిన ఇతర సభ్యులకు యామునాచార్యుల వారి మరణం వల్ల వైష్ణవ సమాజంలో శూన్యత ఏర్పడిందని భావించారు. కావున, శ్రీ మహాపూర్ణగారు మరోసారి వెళ్లి రామానుజులను శ్రీరంగానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.

ఇంతలో, కంచిలో, రామానుజులు కాంచీపూర్ణ అనే గురువుని కలుసుకునేవారు. అంతేకాక ఆయనకు శిష్యుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై కాంచీపూర్ణను సంప్రదించగా, కాంచీపూర్ణ రామానుజుల కులానికి చెందినవాడు కానందున మర్యాదపూర్వకంగా నిరాకరించి, 
తనకు తగిన గురువు లభిస్తాడని చెప్పాడు. 

దీని తర్వాత కాంచీపూర్ణ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి తిరుపతికి బయలుదేరి ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చారు. చివరకు అతను తిరిగి వచ్చినప్పుడు, అతని ద్వారానే వరదరాజులు రామానుజులకు తన కోరికను తెలియజేసారు.

అందుకని కాంచీపూర్ణ రామానుజులకు శ్రీరంగానికి బయలుదేరి వెళ్లాలని భగవంతుని కోరిక అని సలహా ఇచ్చాడు.

రామానుజులు విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా, శంఖ చక్రాల ముద్రలు వేసుకోవడం వీరి లక్షణం. 

ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు.

రామానుజులు దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు.

రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు.

తిరుక్కోట్టి యార్‌ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు.


ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం.' అని ప్రచారం.

కుల, మత భేదాలు లేకుండా భగవంతుని ముందు అందరూ సమానమేనని ప్రబోధించారు. ఆలయ ప్రవేశం, భక్తి మార్గంలో అణగారిన వర్గాలకు చోటు కల్పించారు.

రామానుజులకు 'యతిరాజు, ఎంబెరుమానార్, ఉడయవర్' అను బిరుదు నామాలు కలవు.

ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు:

మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.

రెండవది విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం "ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి" 

Ganga Saptami - గంగా సప్తమి

గంగా సప్తమి

గంగా నది మన జన్మజన్మ పాపాలు తొలగించే పవిత్రమైన నది . ఆ తల్లిని జీవదాయిని అని కూడా అంటారు, మన పాపాలను తొలగించే పాపనాశిని అంతే కాక మన పాపాలను తొలగించి మన జీవితాన్ని ఉద్దరించేది. 

అదే విధంగా, గంగా సప్తమి అనే పవిత్రమైన రోజును గంగా నది అవతరణ సందర్భంగా జరుపుకునే పండుగ. ఈ రోజును జహ్ను సప్తమి మరియు గంగా పూజ అని కూడా అంటారు.

ఎక్కువగా ఈ రోజు గంగా నది పరీవాహక ప్రాంతాలలో పూజించే పండుగ. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వంటి పుణ్యక్షేత్రాలలో గంగా సప్తమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేశంలోని దాదాపు ఉత్తర ప్రాంతంలో, గంగా సప్తమిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.

వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమిని గంగా సప్తమి అని పిలుస్తారు.

గంగా సప్తమి కథ
మన పురాణాలలోని దేవీ దేవతలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో వున్నాయి. అలాగే పురాణాలలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది. పద్మ పురాణం, బ్రహ్మ పురాణం మరియు నారద పురాణాలలో గంగా నది ప్రస్తావన ఉంది. ఈ పురాణాలు గంగా సప్తమి గూర్చి ప్రత్యేకంగా వర్ణించాయి.

మన హిందూ పురాణాల ప్రకారం గంగ స్వర్గం నుండి భూమిపైకి వచ్చింది. ఆమె భూమిపైకి వచ్చినప్పుడు, ఆ రోజును గంగా అవతరణం అని కూడా పిలుస్తారు . గంగా నది పరవళ్లు త్రొక్కుతూ  భూమిపైకి వస్తున్నప్పుడు మార్గంలో అడ్డువచ్చిన వన్నిటిని నాశనం చేస్తూ వస్తూ  జహ్నుముని ఆశ్రమానికి చేరుకుంది. తన ఆశ్రమం వైపు వస్తున్న భయంకరమైన గంగా ప్రవాహాన్ని చూసి కోపంతో గంగను పూర్తిగా త్రాగేశాడు.

తరువాత, భగీరథుడి కోరిక మేరకు, జహ్ను ముని గంగను గంగ యొక్క పవిత్రత్ర పోకుండా తన చెవి నుండి విడుదల చేసాడు. అందుకే గంగా నదికి జాహ్నవీ అని నామం కూడా స్థిరపడింది. 

భగీరథుడు తన పూర్వీకుల మోక్షం కోసం గంగను భూమిపైకి తీసుకురావాలనుకున్నాడు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి నాడు వచ్చే ఈ రోజుని జహ్ను సప్తమి అని కూడా అంటారు. ముని   గంగను తన కుమార్తెగా భావించి విడుదల చేయడం ద్వారా ఆమెకు పునర్జన్మ లభించింది. కాబట్టి గంగకు జాహ్నవి అనే మరో పేరు వచ్చింది.

గంగా సప్తమి నాడు గంగా నదిలో స్నానం చేయడం, గంగాజలం ఇంట్లో చల్లుకోవడం చాలా మంచిది.

గంగా మాతను పూజించి, దీపారాధన చేసి, దీపాలు వదులుతారు.

పవిత్ర గంగా స్నానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత మరియు సుఖశాంతులు లభిస్తాయి.

హిందువుగా పుట్టిన ప్రతి మానవుడు జీవితంలో ఒక్క సరైన గంగా నదిని దర్శించి స్నానమాచరించి తరిస్తారు.

మన పూర్వికులు మునులు ఋషులు గంగా ప్రదక్షిణ అనగా గంగోత్రినుండి గంగాసాగర్ అనగా గంగ సాగరంలో కలిసే ప్రదేశం వరకు వెళ్లి మరల తిరిగి గంగోత్రి చేరుకుంటారు. 

గంగా నది ప్రవహించే వారణాశి, హరిద్వార్, రుషికేశ్, ప్రయాగ్ రాజ్ నుండి గంగాసాగర్ వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకు దర్శనమిస్తాయి.

గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ప్రతినిత్యం గంగకు హారతి ఇస్తారు. అది చూసి దర్శించి తరించవలసిందే కానీ దానికి సాటి మరోటి లేదు. 

గంగా స్తోత్రం

గంగాష్టకం

Tuesday, April 21, 2026

The appearance of Brahma and the gods to Harishchandra - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు నుంచి తన భార్యతోకూడ తాను దోయిలించి విసుచుండెను. అతడు పరమేశాని! శతాక్షి-త్రిభువనేశ్వరి-పంచకోశాంతరస్ధిత-మూలాధారనిలయ-బ్రహ్మస్వరూపిణి- రక్తాంబరధర-దయారససాగర-నానాయుధధర-జగత్పాలన తత్పర-జగదంబ-అగు దేవిని హృదయమున సంస్మరింపగ ధర్మ దేవతను మున్నిడుకొని యింద్రాది దేనతలు నచ్చోటి కరుగదేంచిరు. 

వారు వచ్చి ధర్మదేవత నోటితో రాజుతో నిట్లనిరి: ఓ మహాప్రభూ: రాజా! అవధరింపుము. నేను (ధర్మదేవుడు) బ్రహ్మా-నారాయణుడు-సిద్ధసాద్యులు-గంధర్వులు-విశ్వే దేవతాలు-మరుద్గణము-చారణులు-లోకపాలకులు-నాగులు-రుద్రులశ్వినులు-ఇంకనుతక్కిన దేవతలును విశ్వామిత్రుడు-ముల్లోకములకు ధర్మానుసారము మేలుగోరువాడును విశ్వామిత్రుడును అందరమును నీకు మేలు చేయగోరి వచ్చియున్నాము. 

అంత ధర్మదేవత యిట్లనెను: రాజా! ఇక దుస్సాహసము వలదు. నేను ధర్మదేవతను. నీ చెంత కేగుదెంచితిని. నీ యింతటి దమము-ఓరిమి-సత్వము మున్నగు సుగుణములకు సుప్రసన్నుడనైతిని. 

ఇంద్రుడిట్లనెను: ఓ హరిశ్చంద్ర మహాశయా! నీ నింద్రుడను. నీ సమీపమునకు వచ్చితిని. నీవు నీ భార్యపుత్రులతో గలిసి సనాతన లోకములు గెల్చితివి. రాజా! నీ విక నీ భార్యాపుత్రులనుగూడి స్వర్గ మలకరింపుము. ఇతరుల కలవిగాని స్వర్గసీమ నీ సత్యకర్మలవలన బజసితివి. 

సూతుడిట్లనియెను: పిదప నపమృత్యువును తొలగించు సమృతవర్షము గురిసెను. ఇంద్రుడమృతవృష్టి నాకాశమునుండి చితిమీది శిశువుపై గురిసెను. అంతలో పూలజల్లుల్లు  గురిసెను. దేవదుందుభులు మ్రోగెను. పిదప హరిశ్చంద్రుని చచ్చిన బాలుడు లేచి వెనుకటి మాదిరిగ సుకుమారుడుగ-ప్రసన్నుడుగ-ఆరోగ్యవంతుడుగ-ప్రేమమూర్తిగ నొప్పెసగెను. హరిశ్చంద్ర రాజంత తన కొడుకును కౌగిలించుకొనెను. అతడు తన భార్యాపుత్రులతో సంపదలతోగూడి దివ్యమాల్యాంబరములు దాల్చెను.

ప్రమోదభరితుడై నిశ్చింతుడై యుండెను. వెంటనే ఇంద్రుడు రాజుతో నిట్లు పలికెను. ఓ మహాత్మా! నీవు నీ పుణ్య సత్కర్మముల ఫలితముగ భార్యాపుత్రులతో సుఖదామమగు స్వర్గసీమ కరుగుదెమ్ము. 

హరిశ్చంద్రు డిట్లనెను: ఓ దేవ రాజా! నా చండాలస్వామి యనుమతిబడయక యతని యప్పు తీర్చక నేను స్వర్గమునకు రాజాలను, 

ఘర్ము డిట్లనెను: నీకు రాబోవు కష్టములు నేను ముందుగ తెలిసికొని నామాయతో నేను చండాలరూపమున నీ కీ పక్కణమును చూపితిని. 

ఇంద్రు డిట్లనెను: రాజా! ఏ పరమస్ధానమును భూమిమీది ప్రజలు గోరుకొందురో యట్టి పుణ్యపురుషులకు నిలయమగు స్వర్గధామమును బొందుము. 

హరిశ్చంద్రు డిట్టనెను: ఓ దేవరాజా! నీకు నమస్కారము. నా మాటయును కొంచెము వినుము. కోసలనగర ప్రజలు నా వియోగ దుఃఖమున నమునిగియున్నారు. అట్టివారివి విడనాడిన నేనెట్టుల స్వర్గమునకు రాగలను? బ్రహ్మాహత్య-సురా పానము-గోవధ-స్త్రీవధ-ఇవన్నియును తన్ను గొల్చు భక్తుని విడనాడికత వాని పాపమునకు సమాన మగును. 

కనుక తన్ను నమ్మి కొల్చువానిని విడువరాదు. వదలినవానికి సుఖ మెక్కడిది? నా ప్రజలు రాక నేను కలదనునింద్రా! నీ స్వర్గమునకు నీవే వెళ్ళుము. సురనరా! నేను స్వర్గములకు వెళ్ళినను మఱినరక మేగినను వారితోడనే వెళ్లగలను. 

ఇంద్రు డిట్ల నెను: ''రాజా! ఒక్కొక్కకని పుణ్యముపాపములు పెక్కురీతులుగ వేర్వేరుగ నుండును. అట్టి వారందఱితో నొక్కుమ్మడిగ నీవు స్వర్గసుఖ మెట్ల గోరుచున్నావు?'' 


హరిశ్చంద్రు డిట్లనెను: ఇంద్రా! రాజు తన ప్రజల బలముచేతనే రాజ్య మనుభవించును. రాజు వారి మూలముననే మహాయజ్ఞములు చేయును. వారీకూపములు నిర్మించును. నేను నా ప్రజల మూలముననేయన్ని మునుష్ఠించితిని. వారంనఱన వదలి నే నొక్కడనే స్వర్గ మేగవలయుదని నే నుపదానాల నీయలేదు. 

దేవేశ్వరా! కనుక నే నేదైన పున్నెము చేసినచో జన్న మొనరించినచో జపము చేసినచో నా కర్మఫలము పెక్కేండ్లను భవింపనలసియున్నచో-అదంతయును నా ప్రజలనుగూడి యొక్కనా డనుభవించిన నా కంతయు చాలును. 

సూతు డిట్లనెను: సరే అట్లే కానిమ్మని త్రిలోకపతి యనెను. పిమ్మట ధర్మదేవత-ఇంద్రుడు-కౌశికుడు-నెల్లరును ప్రసన్న మనస్సులతో నాల్గు వర్ణముల ప్రజలు వసించు కోసలపురి కరిగిరి. 

అపుడు దేవేంద్రు డిట్లనెను: ఓ మహాజనులారా! మీ రిపుడు దుర్లభమైన స్వర్గలోకమునకు వెళ్ళుటకు హరిశ్చంద్రుని సమీపమునకు రండు. హరిశ్చంద్రుడు తన ధర్మబలముతో స్వర్గమును జయించెను. అనగా వారు రాజును చేరిరి. హరిశ్చంద్రు వారిని చూచెను. మీరు నా వెంట స్వర్గమునకు రండని రాజనెను. 

ప్రజలు దేవేంద్రుని వాక్కులు రాజు వాక్కులు విని ప్రమోద మందిరి. వారిలో సంసారముమీద విరక్తి జెందిన కొందఱు తమ సుతులపై కుటుంబభారముంచి స్వర్గ మేగిరి. వారు పరమానందముతో జ్యోతిర్మయులై దివ్యవిమాన మెక్కిరి. అపుడు హరిశ్చంద్ర రాజు తన రోహిత కుమారునకు రాజ్యాభిషేకముచేసి పెద్దలుగల రమ్యమగు నయోధ్యాపుర మతని కప్పగించెను. 

పిదప రాజు తన కుమారు నభినందించి మిత్రులను గౌరవించి పుణ్యభాగ్యము దేవ దుర్లభమైన కీర్తి బడసెను. అట్లు కీరితిబడసి రాజు కింకిణీరవమున చెన్నారి కామమగమనముగల దేవవిమాన మలంకరించెను. ఆ సమయమునందు సకల శాస్త్రార్ధ తత్త్వ విదుడు-మహాత్ముడు- దైత్యాచార్యుడు-నగు శుక్రుడు రాజునుగాంచి యిట్ల పొగడెను. 

శుక్రు డిట్లనెను: ఓహో! ఓరిమియొక్క మహత్తః: ఓహో దానఫలమహిమలు! ఏమని చెప్పవచ్చును. వానివలననే హరిశ్చంద్రు డింద్రలోకమున కరుగగల్గెను. ఈ పకారముగ మీకు హరిశ్చంధ్రోపాఖ్యానమంతయును వినిపించితిని. దుఃఖార్తుడీ కధ విన్నచో వాని దుఃఖము తొల గును. ఈ కధవలన స్వర్గకాముడు స్వర్గమును పుత్రార్ధి పుత్రుని భార్యార్ధి భార్యను రాజ్యార్షి రాజ్యమును బడయగలడు.

మహాదేవి - శతాక్షి శాకంభరి

Dakshudu Chesina Aparadham - దక్షుడు చేసిన అపరాధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దక్షుడు చేసిన అపరాధం ఒకప్పుడు దుర్వాసమహర్షి జంబూనదీతీర మేగి యచట వెలసిన శ్రీదేవిని సందర్శించి శ్రీమాయాబీజము ...