Wednesday, February 4, 2026

Magha Puranam 28 - మాఘ పురాణం 28 బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట

మాఘ పురాణం - 28 వ అధ్యాయం

బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట

వశిష్ఠుడు దిలిపునితో మరల ఇట్లు వివరించెను. రాజా! ఒకప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు వాదములాడుచుండిరి. ఆ వాద మెట్టిదనిన

ఒకనాడు బ్రహ్మదేవుడును పరమేశ్వరుడును 'నేను ఆధికడను' అని ఒకరు, కాదు 'నేనే సర్వాధికుడను' అని మరి ఒకరు తగవులాడుకొనిరి. పద్నాలుగు లోకాలకు అధివతిని నేను అని సాంబశివుడనగా "ఓ మహేశా! నీవు అధిపతి వెట్లగుదువు? ఆ పద్నాలుగు లోకాల జీవరాసులు పుట్టించిన సృష్టికర్తను నేను. గనుక నీ కంటే నేనే గొప్పవాడను". అని బ్రహ్మ వధించెను. వడ ప్రతి వాదములు పెద్దవయ్యేను. అటుల వెయ్యేండ్లవరకు కొనసాగించినందున సృష్టి కార్యక్రమములు స్థంభించిపోవుచున్నావని విష్ణువు విశ్వరూపముతో ప్రత్యక్షమయ్యెను.

బ్రహ్మ, ఈశ్వరుడు ఆ విరాటరూపమును తిలకించినారు, అందు సమస్తలోకములు  ఇమిడి యున్నవి. సప్తసముద్రాలు  ఘర్జించుచున్నవి. ఆ విశ్వరూపుని చెవులలో ఒక వైపు బ్రహ్మ, మరొక వైపు ఈశ్వరుడు కనబడిరి. ఇది  అంతయు బ్రహ్మ, మహేశ్వరులు చూచి గంధ పుష్ప అక్షతలతో పూజించిరి. ఆ విశ్వరూపుని ఆ విశ్వవ్యాప్తుని, విరాట స్వరూపుని ఆధ్యంతములను ఎవరు తెలిసికొని వచ్చెదరో వారే అధికులని నిశ్చయించి బయలుదేరినారు. అట్లు వారు వెయ్యేండ్లు తిరిగినారేగాని ఆ విరాట్‌ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకొనలేక విసిగిపోయి మరల యధాస్థానమునకు వచ్చి ఇట్లు వాపోయినారు.

వెయ్యేండ్లు రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి అలసిపోయినా మే గాని ఈ విరాటరూపుని ఆద్యంతములు తెలుసుకొన లేక పోయాము. గాన మనమెవరమూ అధికులము కాము. ఈ సృష్టి కంతకు మూల కారకుడు మహా విష్ణువే. ఇతడే సృష్టికర్త ఇతడే లయకారుడు, ఇతడే సర్వాంతర్యామి. తన కుక్షి యందిడుకొని కాపాడు కళ్యాణధాముడు ఇతడే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు,  సర్వలోకాలను ఏకైకనాధుడు అట్టి మహానుభావుడగు నారాయణుడే అధికుడుగాని మనమెవ్వరమూ అధికులము కాజాలము. అని నిశ్చయించుకొని విష్ణుమూర్తిని స్తోత్రం చేయగా తన విరాట స్వరూపాన్ని వదలి యధరూపముతో "ఓ అన్నలారా! మీరిద్దరునూ ఎంతో కాలమునుండి కలహించుచున్న విషయము గురించి మీకు జ్ఞానోదయము కలుగుటకు నేనీ విశ్వరూపమును మీకు చూపదలచి ఇట్లు చేసితిని. నాయొక్క రూపమునకు అది అంతమును కనుగొనలేక నిశ్చేష్టులయి మీ కలహాన్ని ఆపుచేసితిరి. సమస్త భూమండలానికి, సమస్త ప్రాణికోటికి, సమస్త దేవతలకు  సృష్టికర్తను నేనేయని గ్రహించి స్తుతించిరి. మీ రెండులకి కలహించుకొంటిరో చెప్పెదను వినుడు.

మీరిరువురు రజోగుణ తమోగుణములకు కట్టుబడి యుండుటచే మీకీ అహాంభావం కలిగినది. సత్త్వము, రాజము, తమము అను మూడు గుణములు కలవు. ఈ మూడు గుణాలుగలవాడే 
గొప్పవాడు. అతడు తేజోవంతుడగును. ఈ సృష్టికి పూర్వం ఈవిశ్వమంతా చీకటిగా వుండేది. పంచభూతాలు సృష్టింవబడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకు ఉపక్రమించినాను. ఒక బంగారుగోళమును చేసి దానికి అవయవస్ఫుటం కలిగించి మూడు రూపములుగా చేసితిని. ఆ మూడు 
రూపములే మీరు నేనున్నూ, మనముగ్గురం సృష్టి స్థితిలయములకు ముఖ్యకారకుల
మైనాము. సృష్టిని చేయువాడు బ్రహ్మగాను, పోషించువాడుగా నేను నాశనం చేయువాడు శివుడుగాను. ఏర్పడితిమి. గనుక మనం త్రిమూర్తులము. నేనే మీరు మీరే నేను. నాకు పూజలు చేసిన మీకు చెందును, మీకు పూజలు చేసిన నేను పొందుదును. గనుక మిరిరువురకునూ భేదమేలేదు. మొదటలేని భేదము ఇప్పుడెందులకు కలిగినది? మీకున్న రజోగుణ, తమోగుణ ప్రభావముల వలనే అహాంకార పూరితులై ఇట్లు ప్రవర్తించినారు గాన శాంతింపుడు.

బ్రహ్మదేవా! సమస్తప్రాణులను సృష్టించుచున్న సృష్టికర్తవు నీవు, వేదమునకు స్ధానభూతుడవు నీవు. స్వశక్తి చేత యోగమునుపొంది నా నాభికమలమునందు జన్మించినావు. గనుక నీకునూ నాకు భేదము లేదు. అని శ్రీమహావిష్ణువు బ్రహ్మను వారించెను.

తరువాత శివునివైపు తిరిగి “ఓ సాంబశివా! నీవు సమస్తలోకములకు ఆధార కర్తవు. దేవతలచే సదా పూజింపబడువాడవు. పరమానంద స్వరూపుడవు. శరణాగతరక్షకుడవు. బ్రహ్మజ్ఞానివి, ప్రళయ కాల
రుద్రుడవు. ఓంకార స్వరూపుడవు. పరమేశ్వరుడవు. నీ ఘనతను తెలుసుకొనగోరి నారదుడొకనాడు నా వద్దకువచ్చి శంకరుని మహాత్మ్యమును వివరింపమని కోరగా నాతనికి నీచరిత్రమును తెలిపితిని. అప్పటి నుండి నారదుడు నిన్ను అనేక విధములుగా స్తోత్రము చేయుచున్నాడు. 
నారదునివలన సమస్త లోకాలకు నీ మహిమ వెల్లడయినది.

నీవు పరబ్రహ్మవు ఈ ప్రపంచమంతయు నీ రూపమే. నావలెనే నీవునూ అంతటా వ్యాపించి యున్నావు. నీకును నాకును భేదమేలేదు. కోటిసూర్యప్రకాశితుడవు. మేరుపర్వత నివాసుడవు సర్వప్రవంచాన్ని నీరౌద్రరూపంచే నాశనము చేయగలవాడవు. నీ కోపాగ్నికి ముల్లోకములు గడగడ వణికిపోవును, నీవు శక్తి స్వరూపుడవు అనంతుడవు ఆది దేవుడవు, ఆత్మస్వరూపుడవు, భక్తులు నిన్ను 'శివ శివ' యని ప్రార్ధించినంత మాత్రమున వారి కష్టములు పోగొట్టువాడవు. అట్టినీవు ఇంత పంతము పూనుట న్యాయమా? నేనే నీవు, నీవే నేను అందువలననే శివకేశవులని మనలను భక్తులు వూజించుచున్నారు. నీవు నిర్వికల్ప నిరాడంబరుడవు, త్రినేత్రుడవు,  సదా ధ్యాన స్వరూపుడవు. భక్తులు నిన్ను ధ్యానింతురు భక్తులకు నీవు ధానము చేయుదువు. పార్వతీదేవిని నీ అర్ధశరీరములో నిల్పుకొన్నవాడవు, నందివావానారూఢుడవు పరాత్పరుడవు గాన నీవును నాతో సమానుడవే అని ఈశ్వరునికి విష్ణుమూర్తి తెలిపెను.

ఈ విధంగా బ్రహ్మకు ఈశ్వరునికి వారి వాదనల సారాంశమును తెలియపరచి, ఇద్దరికి సఖ్యత కుదిర్చెను. అంత బ్రహ్మయు మహేశ్వరుడును జగదాధారుడయిన శ్రీమహావిష్ణువును స్తోత్రము చేయగా శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సహితముగా అంతర్దానమయ్యెను.


Magha Puranam 30 - మాఘ పురాణం 30 ఫలశృతి

మాఘ పురాణం - 30 వ అధ్యాయం

ఫలశృతి

సూతమహర్షి శౌనకాదిమునులతో ఇట్లు పలికిరి-"సనకాది మునులారా! ఇంతవరకు మాఘమాస మాహాత్మ్యము, మాఘస్నానము వలన కలిగేడు ఫలమును, వశిష్ఠులవారు దిలీపునకు తెలియచేసిన విధమును మీకు వివరించితిని. మీరు తలపెట్టిన ఈ పండ్రెండు సంవత్సరముల మహాయజ్ఞము కూడా పూర్తికావస్తున్నది. రేపటిదినము మాఘమాసపు ఆఖరి దినము గాన మనమందరం గంగా నదికి పోయి స్నాన మాచరించి విష్ణువుని పూజింతుము రండి అని సూతమహాముని మాఘపురాణం చెప్పుట పూర్తి గావించిరి.

మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు వుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానము చేయవలయును. ఆటు తర్వాత సూర్యునకు నమస్కరించి, వైష్ణవాలయమునకు పోయి
శ్రీమన్నారాయణుని పూజింపవలయును. మాఘమాసము యొక్క నెల దినములున్నూ ఈ విధముగా ఆచరించిన యెడల సకలైశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ది కలిగి జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలుగును.

Magha Puranam 29 - మాఘ పురాణం 29 మాఘ ఏకాదశీ మహాత్మ్యము (క్షీరసాగర మథనము)

మాఘ పురాణం - 29 వ అధ్యాయం

మాఘ ఏకాదశీ మహాత్మ్యము (క్షీరసాగర మథనము)

ఓ దిలీపుడా! అశ్వమేధయాగము చేసినవాడును, మాఘమాసములో స్నానము చేయేయువాడును, అటులనే ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసముండువాడును వైకుంఠ ప్రాప్తుడగును, ఇందుల కెట్టి సందియమూ లేదు. ఏకాదశీ వ్రతమహిమవలన అంబరీషుడు దూర్వాసుని వలన ఎట్టి అటంకమును పొందక తిరిగ 
దూర్వాసునే ఆశక్తి  వెంబడించి ఆతని గర్వమణచినది, ఈ వృత్తాంతము నీకు తెలిసియేయున్నది. అయినను నీవు అడిగితివిగాన మరియొక దృష్టాంతరం నీకు వివరించెదను.

ఒకనాడు దేవతలును, రాక్షసులును అమృతము కొరకు పాలనముద్రము మధించినారు. మేరు  పర్వ'తాన్ని తీసుకువచ్చి కవ్వముగాను, వాసుకి యనుపామును, కవ్వపుత్రాడుగాను చేసిరి. ఆ పామును మేరువర్వతానికి చుట్ట బెట్టినారు. పాముతల వైపు ఎవరుందురా ? యని సందేవామురాగా, మేముందుమని వాసుకి తల వైపు పట్టుకొనిరి. దేవతలు తోకవైపు వుండిరి. ఈ విధముగా దేవదానవులు పాలసముద్రాన్ని మధించగా మొదట లక్ష్మీదేవి జన్మించెను. విష్ణుమూర్తి శ్రీమహాలక్ష్మిని తీసుకొని తన భార్యగా స్వీకరించెను. తరువాత ఉచ్చైశ్రవమను గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము, అమృతభాండము జన్మించెను. అన్నియు భ|దవరచి వుంచమని దేవేంద్రునికి విష్ణుమూర్తి వప్పగించెను.

మరల 
పాలనముద్రము చిలికినారు. అందులోనుండి అగ్నితో సమానమైన గొప్ప తేజస్సుతో కూడిన హాలాహాలము బైటకు వచ్చినది అది మహావిషము, ఆ విషజ్వాల అన్నిలోకాలకు వ్యాపించినది. ఆ వేడికి సర్వము నాశనమగుచున్నది. ఆ మహావిషాన్ని చూచి దేవతలు, రాక్షసులుకూడ భయపడసాగిరి. మరికొంత సేపువున్న యెడల వారందరిని హతమార్చి వేయగలదు, వారికి మరో మార్గము లేక ఈశ్వరుని "హరర మహాదేవా! వృషభధ్వజా! శరణు, మము యీ ఆపదనుండి రక్షింపుము” అని స్తుతించిరి. 

శంకరుడు దేవతలయొక్క రాక్షసులయొక్క ఆర్తనాదమును విన్నాడు. ఇక ఒక్క క్షణమైనను జాగు చేయకూడదని గ్రహించి తన నోరు తెరచి, ఆ కాలకూట విషాన్ని మ్రింగి, కంఠము నందుంచుకున్నాడు.  ఆ కాలకూట విషమువల్త శంకరుని కంఠము నల్లబడిపోయినది. అందుచేతనే నీలకంఠుడనే పేరు సార్థకమయ్యెను.

పాలనముద్రాన్ని మధించుట ఆపుజేసిరి. అమృతం మాకు కావలయునని దేవతలు, మాకు కావలయునని రాక్షసులు, వాదన చేసిరి.

మాయామాను వేషధారుడగు శ్రీహరి ఈ వాదములను గ్రహించినాడు, ఆయన స్త్రీ రూపము ధరించెను. ఆమెయే మోహిని, ఆమె అందచందాలు జూచిన ఏ స్త్రీ కూడా సరితూగదు.

అమృతముకొఱకు జగడమాడుకొనుచున్న దేవదానవులు మధ్యకు జగన్మోహిని వచ్చి " ఓ  అమాయకులారా! ఎందులకీ రాద్దాంతం? మీకందరికీ నేను సమానముగా అమృతాన్ని పంచి పెట్టుదును. కనుక దేవతలందరూ ఒక వరుసలోను, దానవులందరూ ఒక వరుసలోను అసీనులు కండు అని చెప్పి ఆ మోహిని రూపమును చూడగానే మారు మాటలాడలేక అటులే చేయమనికోరి రెండు పంక్తులుగా కూర్చుండిరి. జగన్మోహిని అమృత బాండాన్ని రెండుగా జేసి ఒక దానిలో సురాపానం, వేరొక దానితో అమృతాన్ని వేసి నాట్యము చేయుచున్నట్లు వయ్యారి నడకలతో చిరునవ్వునవ్వుచూ వారలను ముగ్ధులను జేసి అమృతాన్ని దేవతలకు, కల్లును రాక్షసులకు గుర్తుతెలియకుండా వడ్డించు చుండగా, ఈ మాయ కనిపెట్టి ఇద్దరు రాక్షసులు రాహువు, కేతువు 
అనువారు రాక్షస పంక్తినుండి దేవతలలోనికీ మారురూపమున వచ్చి కూర్చొని జగన్మోహిని పంచుతున్న అమృతాన్ని గ్రోలిరి.

జగన్మోహిని అది కనిపెట్టి చక్రాయుధముతో వారి శిరస్సులు త్రెంచెను. వారు త్రాగిన అమృతమింకను గొంతుక నుండి దిగనందున వారు చనిపోయిరి. ఆ యమృతమును దేవతలు జుఱ్ఱుకొనిరి. యీ మోసమునకు రాక్షసులు హాహాకారాలు చేసిరి. ఇద్దరు రాక్షసులు మాయచేత పంక్తిలోకివచ్చి అమృతము సేవించెనని, దేవతలు రొదచేసిరి. కడకు రాక్షసులంతా ఏకమై "ఈ అమృతం మాకక్కరలేదు. మేమెవరికి భయపడము, మాకు చావులేదు" అని ఎవరిమట్టుకు వారు వెళ్లిపోయిరి. మిగిలిన అమృతముని విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలసి దేవేంద్రునికిచ్చి వారి నివాసములకు వెళ్లిపోయిరి.

పాలసముద్రము మధించగా వచ్చిన అమృత కలశము నొక చోట వుంచు సమయమున విధివశమున రెండు చుక్కలు భూమి మీద పడినవి. ఆ రెండు చుక్కలు పడిన చోట రెండు అందమైన మొక్కలు బయలుదేరినవి. ఆ రెండు మొక్కలలో ఒకటి పారిజాత మొక్కగను
రెండవది తులసి మొక్కగను భూమియందు పెరిగినవి. అటుల పెరుగు చున్న మొక్కలకు సత్రాజిత్తు అనువాడు ప్రతినిత్యము నీరు పోసి పెంచుచుండెను.

కొంత కాలమునకు పారిజాతవృక్షము పుష్పించెను. దేవేంద్రుడు గగన మార్గమున బోవుచు పారిజాత పుష్ప సువాసనకు దిగివచ్చి పువ్వునుకోసి తన భార్యయగు శచీదేవి కిచ్చెను. మిగిలిన దేవత స్త్రీలుకూడా అడిగిరి. మరల ఇంద్రుడు రహాస్యముగ ఆ తోటలో ప్రవేశించెను. పారిజాత పువులు ఎవరో కోయుచున్నారని సత్రాజిత్తు విష్ణుపాదాలవద్దనున్న అక్షతలు పువ్వులపైన ఆ వనమంతా చల్లి యున్నందున, దేవేంద్రుడు పారిజాత పుష్పమును తెంచుచుండగా విష్ణు  మహిమ వలన అతనికి దేవత్వముపోయి మూర్చపోయాడు. దేవతలు ఈ వార్తవిని నారదుని బ్రతిమలాడి వారందరూ కృష్ణునికడకు వెళ్ళి జరిగిన సంగతులు విన్నవించగా కృష్ణుడు సత్రాజిత్తుకడకు బయలు దేరెను.

సత్రాజిత్తు ఆషాఢశుద్ధ ఏకాదశినాడు ఉపవాసముండి ఆ రాత్రి జాగరణ చేసి ద్వాదశినాడు సద్బ్రాహ్మణులకు దానములు యిచ్చి వున్నందున అతడు అమోఘమైన శక్తి  కలిగి యున్నందున కృష్ణభగవానుడు వరమిచ్చి అతని తోటలో ఉన్న'పారిజాత వృక్షమును' దేవేంద్రుని కిప్పించెను. ఈవిధముగ నే తులసీవనమునకు వెళ్ళి తులసిని తన సన్నిధిలో వుండమని చెప్పగా తులసీదేవి  అటులనే అని అప్పటి నుండి విష్ణుదేవునితో సమానముగా పూజింపబడెను.

యన్మూలే సర్వతీర్థాని యన్నధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాస్య తులసి తాం నమామ్యహమ్ 


అని తులసీ దేవిని శుచియై పూజించిన యెడల సకల సౌభాగ్యములు చేకూరును.

Tuesday, February 3, 2026

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం

ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లికుమారుడు  చనిపోయెను.

ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖంచి విరక్తి భావముతో యిల్లు విడిచి గంగానదీతీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.

ఆవిధముగా చాల సంవత్సరములు ఆచరించుటవలన ననేక మాఘమాస స్నానఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సుచేసుకొనుచూ  ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుటవలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే యుండి తరువాత బ్రహ్మాలోకమునకు పోయైను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవ కార్యములు తీర్చుటకు అప్సర స్త్రీ గా జేసి "తిలోత్తమ“యను పేరుతో సత్యలోకమునకు పంపెను.

అ కాలంలో సుందోప సుందులనే యిద్దరు రాక్షస సోదరులు బ్రహ్మనుగూర్చి ఘోరతపస్సు చేసిరి.
వారి తవస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "మీ కేమి కావలయునో కోరుకొనుడు” అని యనగా "సామీ! మాకు యితరులవలన మరణము కలుగకుండ నుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా బ్రహ్మ అటులనే యిచ్చితి" నని చెప్పి అంతర్ధాన మయ్యెను.

బ్రహ్మదేవుని వరము పొందిన నా యిద్ధరు రాక్షసులు మహాగర్వముగలవారై దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను "మహానుభావా! సుందోప సుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం గలవారై తపశ్శాలురను బాధించుచు, దేవలోకమునకువచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి, నానాబీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకేదైనా యపాయమాలోచించు” మని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి, తిలోత్తమను పిలిచి "అమ్మాయి! సుందోపసుందులను రాక్షసులను ఎవరివలనను మరణము కలుగదని వరం ఇచ్చియున్నాను. వరగర్వంతో చాల అల్లకల్లోలం చేయుచున్నారు. గాన నీవు పోయి నీచక చక్యముతో వారికి  మరణము కలుగునటల ప్రయత్నించుము” అని చెప్పను, '

తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమెచేత వీణవట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు నా రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయిన నటు, యెటు తిరిగిన నటులామెను అనుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండిరి. ఆమెను "నన్ను వరింపుము, నన్ను వరింపుము" యని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి.

ఓ రాక్షసాగ్రేశ్వరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు యిష్టమే మిరిద్దరూ నాకు సమానులే, నేను మీ యిద్దరి యెడల ప్రేమతోనున్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది, గాన నా కోరిక యొకటున్నది. అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను" అని తిలోత్తమ చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిబెట్టి 'నేను బలవంతుడను' '
నేను బలవంతుడను' అని ఇద్దరును తొడలు గొట్టుకొనిరి, భుజములు చరిచిరి. మాటలు చేతలవరకు వచ్చి ఒకరినొకరు త్రోసుకొనిరి గ్రుద్దుకొనిరి, మల్లయుద్ధము చేసిరి, ఇక ఆయుధములు పట్టుదశవచ్చిగదలు పట్టిరి. ముద్గరాలూ ఎత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు డీకొన్నట్లుగా వున్నది. మేఘాలు ఉరిమినట్లుగా ఉరిమి భయంకరముగా యుద్ధము చేసిరి. గదాయుద్గముమాని కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్దములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి. ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను "దేవతలందరు దీవించిరి. ఆమె బ్రహ్మలోకమునకు పోయి జరిగినదందా తెలియ పర్చగాబ్రహ్మ సంతోషించి, త్రిలోత్తమా! నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోప సుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రత పలమే గాన నీవు దేవలోకానికి వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలందరికంటే  నీవే అధికురాలవగుదువు అని దీవించి పంపెను.

Magha Puranam 26 - మాఘ పురాణం 26 సుధర్ముడు తండ్రిని చేరుట

మాఘ పురాణం - 26 వ అధ్యాయం

సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదోగాని తన తల్లి అడవిలో పిలిచే చంపబడినది. ఇప్పుడు పెంపుఢుతల్లి అడవిలో విడిచి పెట్టి వెళ్ళిపోయినది. ఇక అ పిల్లవానిని దినరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూా కలుగ లేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు ఆరోదనకు పక్షులు, జంతువులు, మృగములుకూడ రోదనచేసి ఆ బాలునికి రక్షణగా వుంచి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవిజంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందూచూ ఏ తులసి చెట్టువద్ద పడివుండెనో, ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.

అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయంగలవాడయ్యెను. ప్రతి దినము తులసిపూజ భగవన్నామ స్మరణ చేస్తూ న"న్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా" అని ప్రార్ధించుచు, ఒకొక్కప్పుడు విరక్తుడై "ఛీ ఎంత ప్రార్ధించినా నాగతి ఇంతేనా? నేను బ్రతికెందుకు? అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి "ఓ బాలచంద్రా! నీ విట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసము ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన యెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును" అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.

ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీ కేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనాపాలనా చేయువారైనను లేరు. పుట్టినది మొదలు కష్టములేతప్ప సుఖమన్నది ఎరుగను. ఈవనచరములే నన్నురక్షించి పోషించుచున్నవి. గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కర లేదు.” అని ప్రార్ధించెను.

"ఓయీ రాజనందనా! నీవు ఇంకను బుకొకమునందు ధర్మముగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి, నీకన్నతల్లిని గురించి బెంగతో వున్నాడు, గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆకొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుని తోడుయిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.

అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో, యని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారిజాడ తెలియనందున విచారమనస్కుడై రాచ కార్యములు చూడకుండెను. ఆటువంటి సమయములో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతము తెలియ జేయుసరికి సులక్షణ మవో రాజు అమి తానందభరితు డై ఇాలుని కౌగలించుకొని మునీక(రునికి oo కుమాగునికి మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలుచేసి కుమారునికి సుధర్ముడని పేరుపెట్టి పట్టాభిషేకము చేసెను.

Magha Puranam 25 - మాఘ పురాణం 25 సులక్షణ మహారాజు వృత్తాంతము

మాఘ పురాణం - 25 వ అధ్యాయం

సులక్షణ మహారాజు వృత్తాంతము

వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు.తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు.

సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమిలాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్ర సంతానము లేక పోవుటచే తనకు గతులులేవు కదా! కాగా తన వంశము ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను.

ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికీ సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను.

"మునిశ్రేష్టులారా! నేను వంగ దేశాధీశుడను. న పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగ లేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లొనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహా రాజు పలుకులాలకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. "రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణ మేమనగా-పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రముని పాలించి యుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘమాసస్నానమైనా చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక బ్రాహ్మణునకు గుమ్మడి కాయ నైనా దానం చేసియున్నచో ఈజన్మలో పుత్రసంతతి కలిగివుండేది. గాన వెనుక కర్మ ఫలంవలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలుగ లేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కుష్మాండదానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతానము కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు" అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలచే జీనింపచేయుయు” అని పలికిరి. మహా భాగ్యం అని ఫలమును కండ్ల కద్దుకొని యింటికి వెళ్ళిఫోయినాడు.

భర్తరాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి "భోజనానంతరం సేవింపుడు" అని తన గదియుదు ఫలమును భద్రపరచి తాను భోజనసాలకు పత్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడ భార్యకు మిక్కిలి ఆశకలిగి మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించెదనని తలపోసి, రహాస్యమార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆఫలమును భుజించి ఏమియు ఎరుగనిదానివలే అందరితో కలిసి తిరుగుచుండెను.

సులక్షణమహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్ర ఫలమువద్దకు వచ్చిరి. బంగారు పళ్ళేమందుంచిన ఫలము కనిపించలేదు. రాజుకు యెక్కడ లేని కోపము వచ్చి సింహగర్జన చేసినాడు. మాకేమియు తెలియ" దని అందరూ ప్రమాణముగా చెప్పిరి.

ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహమువలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకొంటిని అని దిగులు చెంది బెంగతో మంచము పట్టినాడు. మంత్ర ఫలము తినిన చిన్న భార్య భర్త కడకువచ్చి “నాధా! నా అశకొలదీ ఆఫలము నేనే తినివేసినాను క్షమింపు"మని వేడుకొనెను. అప్పటికి రాజు కొంత తృప్తి చెంది, వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని ఊరకుండెను. గారాబముతో అమెను చూచెను.

కనిష్ఠ గర్భవతి అయినందున నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెఱ్ఱతో ఓర్వ లేకపోయారు. ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని అలోచించి ఆమె గర్భము చెడులాగున, అమె తిను ఆహారములో ఓషధము కలిపి పెట్టినారు, వరపుత్రుడుగా పుట్టుచున్నాడు గనుక గర్భములోని శిశువునకు ఏ అపాయమూ కలుగలేదు. కాని ఓషధముయొక్క తీవ్రతవలన ఆమెకు పిచ్చిఎత్తినది. ఆ పిచ్చివలన ఒకనాటి రాత్రి ఆమె అడవీలోనికి వెళ్ళిపోయినది. అప్పటికి నిండుచూలాలు అయివున్నందున ఆ యడవిలో బండరాతిమీద మగశికువును ప్రసవించినది. ఆమె ప్రసవించినచోట ఒక పులి కాచుకొని వున్నందున, వెంటనే పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపితినెను.

పాపమాపసిబిడ్డ రక్తపుమరకలతో నుండి ఏడ్చుచుండెను. రాజహంసలు ఆహారము కొరకు తిరుగుచూ ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటిముక్కులతో
మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పరుండబెట్టినవి.ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి ఒక ఏడాది వరకు పెంచినవి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకవని ఆ బాలుని తీసుకొని కొంత దూరములోనున్న తమజాతి హంసలకు అప్పగించివెళ్ళిపోయినవి.

ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తెనె గుజ్జు మొదలగునవి తెచ్చి పెంచుచుండగా ఒక తపస్వి తనయిద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానముచేసి దుస్తులు మార్చుకొనుచుండగా హంసలతో తిరుగుచు తప్పటడుగులు వేస్తూ కొలనువద్దకువస్తున్న బాలుని చూచి మక్కువ కలిగి వారి వెంట తీసుకొనిపోయిరి.

రాజకుమారుడు వారి ఆశ్రమములో మూడు సంవత్సరములు గడిపెను. కొద్దికొద్దిగా మాటలు వచ్చుచున్నవి. వానిని చూచి నాకొడుకు అని పెద్దభార్యకు ఈర్ష్యజనించెను. పిల్లవాడు సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా వానిని ఎత్తుకొనిపోయి అడవిలో దిగ బెట్టి వచ్చెను. భర్తవచ్చి పిల్లవాడేని ఆడిగననూ నిజపుసంగతి చెప్పలేదా దుర్మార్గురాలు.

Magha Puranam 24 - మాఘ పురాణం 24 విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట

మాఘ పురాణం - 24 వ అధ్యాయం

విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట - శూద్ర స్త్రీ వృత్తాంతము 

మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాకా దేవతలకు గంధర్వులకు కుడా పరమపవిత్రమైనది.

ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికివచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్యమాత్రం స్నాన మాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక వుండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆగంధర్వుడొక్కడే వెళ్ళి పోయాడు.

ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటచూచెను. ఆమె అందము యౌవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెనుప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా, మరలనాగంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చిచూడగా విశ్వామిత్రుడు, గంధర్వ స్త్రీతో క్రీడించుచుండిరి. 

అదృశ్యమును చూచి మండిపడుచు "నీవు తపస్వివై యుండి కూడా కామతృష్ణ గలవాడవైతివి గాన నీకు కోతిముఖం సంభవించుగాక" యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు" మని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. 

విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈ విషయము తెలిసికొని విశ్వామిత్రునికడకు వచ్చి "విశ్వామిత్రా! క్షణభంగుకరమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపఃశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము గంగానదిలో స్నానముచేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈపాషాణముపై చల్లుము అని నారదుడు వివరించగా. 

విశ్వమిత్రుడు గంగానదిలో స్నానముచేసి విష్ణువును ధ్యానించి కమాండలముతో నీరు తెచ్చి పాషాణంగామారిన గంధర్వస్త్రీ పై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వమిత్రుడు తపస్సుకు విళ్ళిపోయినాడు.

Magha Puranam 28 - మాఘ పురాణం 28 బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట

మాఘ పురాణం - 28 వ అధ్యాయం బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట వశిష్ఠుడు దిలిపునితో మరల ఇట్లు వివరించెను. రాజా! ఒకప్పుడు బ్రహ్మ, ఈ...