Tuesday, April 28, 2026

Description of the five forms of Durga - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీకృష్ణుణ్ణి అవతరింపజెయ్యడంకోసం లోకజనని అయిదు రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికీ మళ్ళీ అనేకభేదాలు ఉన్నాయి. భక్తుల్ని అనుగ్రహించడంకోసం వారి అభ్యర్థనలమేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశమాత, దుర్గ, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్ఠాత్రి, శర్వరూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయిని, సుఖమోక్ష హర్షదాత్రి, శోకార్తిదుఃఖనాశిని, శరణాగతదినార్తపరిత్రాణపరాయణ, తేజఃస్వరూప, సర్వశక్తిస్వరూప, సిద్దేశ్వరి, సిద్దిరూప, సిద్ధిద, బుద్ది, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ - ఇత్యాది రూప నామభేదాలతో కీర్షింపబడుతోంది.

ఇక రెండవది శుద్ధసత్త్వస్వరూప. మహాలక్ష్మి సర్వసంపత్స్వరూప, సంపదధిష్ఠాత్రి. పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభమోహకామరోషమదాహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయరూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతిసేవాతత్పరయై నివసిస్తూ ఉంటుంది. సర్వప్రాణికోటిలోనూ శోభారూపంగా ఉంటుంది, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతూంటుంది. పుణ్మాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్యరూప, పాపాత్ములకు కలహాంకురరూప, వేదాలలో హయరూపగా వర్ణింపబడింది. సర్వపూజ్య, సర్వవంద్య.

ఇక మూడవది వాగ్బుద్ధి విద్యాజ్ఞానాదిష్ఠాత్రియైన సరస్వతి, సర్వవిద్యాస్వరూప, బుద్ధి, కవిత, మేద, ప్రతిభ, స్మృతి - ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దయవల్లనే కలుగుతున్నాయి. సిద్ధాంత బేదాలు, అర్థబేదాలూ కలిగించేది ఈ తల్లియే. వ్యాఖ్యాస్వరూపిణి. బోదస్వరూపిణి,  సర్వసందేహభంజిని, విచారకారిణి, గ్రందకారిణి, శక్తిరూపిణి, సర్వసంగీత సంధాన తాళకారణరూపిణి, విషయజ్ఞానవాగ్రూప, ప్రతివిశ్వోపజీవని, వ్యాఖ్యావాదకరీ, శాంత, వీణా పుస్తక ధారిణి, శుద్దసత్త్వస్వరూప, సుశీల, శ్రీ హరిప్రియ, హిమ - చందన - కుంద - ఇందు - కుముద - అంభోజ సన్నిభ, రత్నాజపమాలికతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానించే తపఃస్వరూపిణి, తపఃఫలప్రద, సిద్దివిద్యాస్వరూప, సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మూగవారవుతారు. మృతప్రాయులవుతారు,

ఇక నాల్గవది చతుర్వర్ణాలకూ చతుర్వేదాలకూ వేదాంగాలకూ అధిష్ఠానదేవత, సంధ్యావందన మంత్రతంత్రస్వరూపిణి, ద్విజాతిజాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్యతేజోరూప, సర్వసంస్కారరూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ, ఆత్మశుద్ధికోసం సకలతీర్థాలూ ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. శుద్దస్ఫటికవర్ణ, శుద్దసర్వస్వరూపిణి, పరమానందరూప, పరమ సనాతని.

పరబ్రహ్మస్వరూపిణి. నిర్వాణప్రదాయిని. బ్రహ్మతేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూతమవుతోంది. ఇక అయిదవ రూపాన్ని వర్ణిస్తున్నాను నారదా ! ఆలకించు.

అయిదవది - పంచప్రాణాలకూ అధిష్ఠానదేవత. పంచప్రాణస్వరూపిణి, ప్రాణాధికప్రియతమ అందరికన్నా అందగత్తె, సౌాభాగ్యమానిని, గౌరవాన్విత, వామాంగార్దస్వరూప, తేజోగుణసమన్విత, పరాపర, సారభూత, పరమ, ఆద్య, సనాతని, పరమానందరూప, ధన్య, మాన్య, పూజ్య, శ్రీకృష్ణుడికి రాసక్రీడాధిదేవి, రాసమండల సంభూత, రాసమండలమండిత, రాసేశ్వరి, సురసిక, రాసావాస నివాసిని, గోలోకవాసిని, గోపీవేషవిధాయిక, పరమాహ్లాదరూప, సంతోషహర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, ఆత్మస్వరూపిణి, నిరీహ, నిరహంకార, భక్తానుగ్రహవిగ్రహ, విచక్షణులు వేదానుసారిజ్ఞానంతో ఈవిడను తెలుసుకుంటారు. సురేంద్రమునీంద్రాదులయినా ఈవిడను చర్మచక్షువులతో చూడలేరు. వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకారవిభూషిత, కోటిచంద్రప్రభ, పుష్టసర్వశ్రీయుక్తవిగ్రహ, శ్రీకృష్ణుడిపట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహావతారంలో ఈవిడ వృషభానుడి కూతురుగా జన్మించింది. ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంతా పావనమయ్యింది. శ్రీకృష్ణుడి వక్షఃస్థలంలో స్త్రీరత్నమై విరాజిల్లి నీలమేఘావృతమైన ఆకాశంలో మెరుపుతీగలా భాసించింది.

ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శనభాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ - దేవీపంచమరూపం.

నారదా ! సృష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో కాలరూపంగావో అంశరూపంగానో కళాంశాంశాంశరూపంగానో ఉంటూనే ఉంటుంది. స్త్రీలందరూ దేవిస్వరూపాలే, పరిపూర్ణస్వరూపాలు మాత్రం ఈ అయిదే. ప్రధానాంశ రూపిణులు కొందరున్నారు. వారి గురించి కూడా చెబుతాను, తెలుసుకో.

గంగాది ప్రధానాంశస్వరూపిణులు


Monday, April 27, 2026

SRI DEVI BHAGAVATHAM PART 9 - శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము

శౌనకాది మహామునులారా ! వ్యాసభగవానుడు నాకు చెప్పిన నారద-నారాయణ సంవాదరూపమైన
దేవీ ప్రకృతిస్వరూపారాధనను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి, అంటూ సూతుడు మళ్లీ ఉపక్రమించాడు.

నారాయణుడు నారుదుడితో చెబుతున్నాడు - విరించితనయా ! గణేశజననియైన దుర్గ, రాధ,
లక్ష్మి, సరస్వతి, సావిత్రి - అని ప్రకృతిస్వరూపిణికి అయిదు రూప నామధేయాలున్నాయి.

నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి. వినయంగా
అడిగాడు. నారాయణ మహర్షీ! ఆదిపరాశక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది ? ఎలా ధరించింది?
వాటి లక్షణాలు ఏమిటి ? చరిత్ర ఏమిటి ? గుణగణాలు ఏమిటి ? పూజావిధానాలు ఎమిటి ? ఆయా
అవతారాలు ఎక్కడ ధరించింది ? ఈ విశేషాలు అన్నీ వ్యాఖ్యానసహితంగా తెలియజెయ్యి అని ప్రార్థించాడు. నారాయణమహర్షి వివరంగా తెలియజేశాడు.

ప్రకృతి నిర్వచనం











Definition of nature - ప్రకృతి నిర్వచనం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ప్రకృతి నిర్వచనం

వత్సా ! నారదా ! ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగావు కనక నేను విన్నంత, తెలుసుకున్నంత నీకు తెలియజెప్పుతాను. ఆలకించు. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ. ప్రకృష్టవాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనక ఆ దేవి ప్రకృతి అని కీర్తింపబడుతోంది.

గుణాలలోకెల్లా ఉత్తమోత్తమమైనది సత్వగుణం. దానికి సూచకం ప్రశబ్దం. మధ్యమ రజోగుణానికి కృశబ్దం, చివరి తమోగుణానికి తిశబ్దమూ వాచకాలు. త్రిగుణాత్మకస్వరూపిణి కనక, సృష్టికి ప్రధానకారణం కనుక ఆదిపరాశక్తిని ప్రకృతి ఆంటున్నారు. కృతిశబ్దం సృష్టివాచకం. దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనక ప్రకృతి అని స్తుతింపబడుతోంది.

ఆ ప్రకృతిస్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను (ఆత్మ) రెండుగా విభజించుకుంటుంది. కుడిభాగం పురుషుడుగా. ఎడమభాగం స్త్రీగా (ప్రకృతిగా) రూపు ధరిస్తుంది, అందుకనే యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుషభేదం ఉండదు. అంతా బ్రహ్మమమయే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప. నిత్య. సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెండింటికి భేదం లేదు. అగ్నినీ వేడిమినీ ఎలా విడదీయలేమో అలాగే అత్మశక్తుల్ని విడదీయలేము.

దుర్గాదిపంచరూపవివరణ


Goddess worship - Tithivaras, offerings, fruits - దేవీపూజ - తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - దేవీపూజ - తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు

నారదా! విద్యావిశారదా! చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు. చెబుతాను. ఏకాగ్రచిత్తంతో ఆలకించు. పాడ్యమినాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానంచేస్తే దాతకు  రోగపీడలు తొలగిపోతాయి. విదియ రోజున చక్కరతో పూజించాలి. విప్రులకు శర్కర దానం చెయ్యాలి. దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదియనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వదుఃఖాలూ తొలగిపోతాయి. చవితినాడు పిండివంటలతో దేవిని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. పంచమిరోజున అరటిపండ్లు నివేదించి అవే విద్వాంసులకు దానం చెయ్యాలి. దాతకు మేదావికసనం కలుగుతుంది. షష్ఠి తిథినాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేదవిదులకు దానం చేస్తే దాత అంతటి కాంతిమంతుడు అవుతాడు. సప్తమినాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోకవిముక్తుడవుతాడు. అష్టమినాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమినాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖసంపన్నులవుతారు. దశమినాడు నల్లటి నువ్వులను జగదంబికకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే దాతలకు ఇక యమలోకభయమే ఉండదు. ఏకాదశినాడు పెరుగు నివేదించి దానంచేస్తే అతడు అమ్మవారికి అత్యంతాప్తుడు అవుతాడు. ద్వాదశినాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించినవారుకూడా దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున సెనగపప్పు నివేదనచేసి దానంగా ఇచ్చినవారికి దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. చతుర్దశినాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసినవారు శివుడికి ఆప్తులు అవుతారు. పున్నమినాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్చించినవారు తమ పితృదేవతలను ఉద్ధరించినవారు అవుతారు. అదేరోజున దేవీప్రీతికోసం హవనం చెయ్యాలి.

నారదా! వారాలకుకూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారంనాడు పాయసం, సోమవారంనాడు. పాలు, మంగళవారంనాడు అరటిపండ్లు, బుధవారంనాడు వెన్న, గురువారంనాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారంనాడు ఆవునెయ్యి అమ్మవారికి నివేదనచేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి, అరిష్టాలు తొలగిపోతాయి. ఇరవైయేడు నక్షత్రాలకు కూడా ఇలాగే విశేషార్చనలున్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటికబెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాలలో అమ్మవారికి నివేదనచేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంభాదియోగాలకూ ఇలాగే బెల్లం నెయ్యి తేనె పాలు పెరుగు చల్లబూరెలు ఉండ్రాళ్ళు కజ్జికాయలు వెన్న దోస గుమ్మడి పనస అరటి నేరేడు మామిడి నారింజ దానిమ్మ రేగు ఉసిరిక కొబ్బరి సెనగలు అటుకులు పాయసం - ఇత్యాదులు నివేదన చెయ్యాలి. లడ్డూలు ఉండ్రాళ్ళు నెయ్యి మొదలైనవి కరణాలలో యోగాలలో నైవేద్యం పెట్టాలి.

మదూకపూజ అని మరొక విధానం ఉంది. చైత్రశుద్డ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదియనాడు శుచిగా మధూకవృక్షం క్రింద (ఇప్పచెట్టు) మహాదేవికి పోడశోపచారపూజలు ఆచరించాలి. తృతీయనాడు పంచఖాద్యాలు నివేదన చెయ్యాలి. వైశాఖశుద్దతృతీయనాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తరవాత నెలల్లో వరసగా తేనె. వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, ఫేణి, దధికుర్చిక, ఆవునెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. పన్నెండు నెలలకూ అమ్మవారికి పన్నెండు విశిష్టరూపాలూ నామాలూ ఉన్నాయి. మంగళ - వైష్ణవి - మాయ - కాళరాత్రి - దురత్యయ - మహామాయ - మాతంగి - కాళి - కమలవాసిని - శివ - సహస్రచరణ - సర్వమంగళ ఆనే పేర్లతో మధూకవృక్షం క్రింద అర్చించాలి. ఇలా చేసినవారికి అన్నికోరికలూ తీరుతాయి. అమ్మవారు భక్తుల పాలిటి కల్పవృక్షంకదా ! ఇలా అర్చించి మొక్కినవారికి కొంగుబంగారం అవుతుంది.

అటుపైని మధూకస్థమైన మహేశ్వరిని నర్వకామసమృద్ధికోసం వ్రతపూర్ణత్వ సిద్దికోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్తుతించాలి.

ఓ పరమా! పాపహంత్రీ ! పరమార్గప్రదాయినీ ! పరమేశ్వరీ ! ప్రజోత్పత్తీ ! పరబ్రహ్మ స్వరూపిణీ! మదదాత్రీ ! మదోన్మత్తా ! మానగమ్యా ! మహోన్నతా ! మనస్వినీ ! మునిధ్యేయా ! మార్తాండసహచారిణీ! లోకేశ్వరీ ! ప్రాజ్ఞా ! ప్రళయాంబుద సన్నిభా ! జగన్మాతా ! మహామోహవినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నువ్వు యమలోకాభావకారిణివి. యమపూజ్యవు. యమాగ్రజవు. యమనిగ్రహరూపవు యజనీయవు. జగజ్జననీ ! నమోనమః

ఓ సమస్వభావా ! సర్వేశీ ! సర్వసంగవివర్జితా ! సంగనాశకరీ ! కామ్యరూపా ! కారుణ్యవిగ్రహ కంకాళక్రూరా! కామాక్షీ ! మీనాక్షీ ! మర్మభేదినీ ! మాధుర్యరూపశీలా ! మధురస్వరపూజితా మహామంత్రవతీ ! మంత్రగమ్యా ! మంత్రప్రియంకరీ ! మనుష్యమానసగమా ! మన్మథారిప్రియంకరీ!  అశ్వత్థ వట నింబామ్రకపిత్థబదరీ గతా ! పనసార్కకరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ ! దుగ్ధవల్లీనివాసార్హా ! దయనీయా ! దయాధికా ! దాక్షిణ్యకరుణారూపా ! సర్వజ్ఞ వల్లభా ! నమోనమః.

ఇలా స్తుతించిన వారికి వ్రతసాఫల్యం వెంటనే సిద్దిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించినవారికి ఆధివ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధపురుషార్ధాలలోనూ ఏది కోరినవారికి అది సిద్దిస్తుంది. చతుర్వర్గాలవారికీ అనుకూలమైన స్తోత్రమిది.

ఇలా అర్చించి స్తుతించినవారు సర్వపాపవిముక్తులవుతారు. మానధనులవుతారు. సర్వత్రా మన్ననలు పొందుతారు. కలలోకూడా యమలోకభయం ఉండదు. మహామాయాప్రసాదంవల్ల పుత్రపౌత్రాదికంగా వృద్ధి చెందుతారు. నారదా ! ఇదంతా నరకోద్దారలక్షణమైన దేవిపూజా విధానం. సర్వమంగళకారకం. మధూకపూజ చేసినవారికి రోగబాధలు ఉండవు. నరకయాతనలు ఉండవు. 

అమ్మవారి అనుగ్రహంవల్ల ఇహపరాలలో సకలసుఖాలూ అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందనా! ప్రకృతిస్వరూపిణిగా అమ్మవారికి ఆయిదు రూపాలున్నాయి. నామ రూప ఉత్పత్తులలో అవి జగదానందదాయకాలు. వాటి మాహాత్మ్యాలనూ వాటి ఆర్బావిధానాలనూ వివరిస్తాను తెలుసుకో. ముక్తిప్రదమే కాదు చాలా కుతూహలంగానూ ఉంటుంది - అంటూ నారాయణమహర్షి రవ్వంత విశ్రాంతి తీసుకున్నాడు.


శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Karmagati Vishesha Vyavastha - కర్మగతి విశేషవ్యవస్థ

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - కర్మగతి విశేషవ్యవస్థ

నారాయణు డిట్లనెను: ఆ యనంతుని ప్రభావమును బ్రహ్మపుత్రుడగు నారద భగవానుడు బ్రహ్మసభలో పాటలుగ పాడుచు ఉపాసించును. ఎవ్వాని దివ్యగుణము లీ జగముల సృష్టిస్థితి లయములకు మూలకారణములో యెవ్వని మేలుచూపు మాత్రాన ప్రకృతి గుణములు తమతమ విధులు నెఱవేర్చునో యెవని దివ్య స్వరూపము ధ్రవతేజమో యనాదియో యెవం డొక్కడే యయ్యు పెక్కురూపుల చక్కనిపేరుల భాసిల్లునో యాతని మూలతత్త్వ మెట్టు లెఱుంగబడును! 

ఈ సదసద్రూప విశ్వమే విశ్వరూపు నమృతదయవలన సత్త్వముగ దోచునో యే రసికశేఖరుని లీలా వినోదము భక్తుల మనస్సులను సింహము వలె లాగునో యట్టి యుదారవిక్రము ననన్యగతి నాశ్రయింపవలయును. ఏ హరి శుభనామధేయము నార్తుడుగాని పతితుడు గాని నవ్వులాట కేని యొక్కసారియేని విన్న-కీర్తించినయేని పాపుని పాపరాసులు కూలిపోవునో యాశేష భగవానుని ముముక్షు వాశ్రయింప వలయును ఏవేల శిరముల యనంతుడు నదీ-నద-సాగరములు గిరి-దరీభూములుగల భూమండలము నొక్క పరమాణులీల దాల్చునో యట్టి మొక్క పోనియుక్కుగల్గిన శేషుని వీర్యమహిమను వేయినాల్క లున్నవాడు నుగ్గడింపజాలడు. 

ఇట్టి యనంత గుణగరిష్ఠుడు దురంతవిక్రముడు ననంతప్రభావుడునగు ననంతశేషుడు స్వతంత్రముగ లీలగ నీ భూమి నంతయును తలదాల్చి పాతాళమందున విరాజిల్లుచుండును. మునిపుంగవా! నరులు తమతమ కర్మల ననుసరించి గతులు పొందుదురు. నరులెట్టి కొర్కెలు కొరుకొందురొ యట్టి ఫలితములు బొందుదురు. 

ఓ రాజేంద్రానీకీ విధముగ నల-మృగ-పక్షుల గూర్చి తెల్పితిని. ధర్మబద్దములైన వారివారి కర్మ-కాల-పరిపాక-గతులను గూర్చి వాని మంచి చెడులను గుఱించి నీప్రశ్నలకు తగినట్లుచెప్పితిని. 

నారదు డిట్లనెను; ప్రాణికోటుల కర్మలన్నియును సమానములే గదా! భగవానుడీ లోకముల నింత వింత వింతలు దోప నేల సృజించెనో నాకు దెలుపుము. 

నారాయణు డిట్లనెను: కర్త యొక్క శ్రద్ద ననుసరించి కర్మఫలములు వేర్వేరుగ మూడు విధములుగ నుండును. కర్తకు సాత్విక శ్రద్దవలన సుఖమును రాజుల శ్రద్దవలన దుఃఖమును గల్గును. తామసశ్రద్దవలన దుఃఖమేకాక మూర్ఖత్వమును గల్గును. ఈ శ్రద్దల తరతమ భేదముల వలననే ఫలితము లందును భేదములు గలుగు చుండును. 

ఓనారదా! అవిద్య - అనాది. దానివలన జరుగు పనుల గతులు ప్రవృత్తులు ఫలితములు వేనవేలుగ గల్గుచుండును.

విప్రవర్యా ! కర్మగతుల భేదములను తేటపఱతును. ఈ ముల్లోకముల మధ్యను దక్షిణ దిశయందున భూమికి క్రిందుగ నతలమునకుపైగ నగ్ని ష్వాత్తులను పితృగణములును పితరులును వసింతురు. వారు స్వాత్మసమాధిలో మునింగి తమతమ గోత్రజులను తప్పక దీవించుచుందురు. పితృరాజు-యమధర్మరాజు. అతని భటులు మృతప్రాణులను కొని తెత్తురు. 

యముడు ప్రాణుల కర్మగుణదోషాలను బట్టి విచారశీలుడై వారి వారికి తగిన శిక్ష విధించును. యముడు గణములతోగూడి దైవాజ్ఞ పాటించును శాసించుచుండును. యముడు ప్రాజ్ఞుడై తన యాన జవదాట నట్టి ధర్మత్తత్వజ్ఞులగు వారిని తన యాదేశము పాటించుటకు పంపుచుండును. కొందఱు నరకము లిరువదొకటనియు మఱికొందఱిరువదెనిమిదనియు నందురు. 

వాని సరియగు సంఖ్య చెప్పుదును వినుము. తామిస్రము అంధతామిస్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రారణ్యము శూకరముఖము అంధకూపము కృమి భోజనము సందంశము తప్తమూర్తి వజ్రకంటకము శాల్మలి వైతరణీ పూయోదము ప్రాణరోధము విశసనము లాలాభక్షణము సారమే యాదనము అవీచి అయఃపానము క్షార కర్దమము రక్షోగణము సంభోజము శూలప్రోతము దందశూకము వటారోధము పర్యావర్తనము సూచీముఖము ననున విరువ దెనిమిది నరకములు. ఓ నారదా! ఇవన్నియును పెక్కు యాతనలు పెట్టు నరకభూములు. ఆయా చెడుకర్మల ఫలితముగ ప్రాణు లాయా నరకములందు గూలుదురు.

దుష్కర్మలు - నరకయాతనలు

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Dushkarmalu Narakayatanalu - దుష్కర్మలు - నరకయాతనలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - దుష్కర్మలు - నరకయాతనలు

నారదు డిట్లనెను: ఓ సనాతనమునీ! ఏయే కర్మభేదములు నరకయాతనలు గల్గించునో యాయా కర్మభేదము లెన్ని విధములో నాకు తెలుపుము.

శ్రీనారాయణుడిట్లనెను: ఏ దుష్ఠుడు పరుల భార్యను-ధనమును-సంతతిని హరించునో యా దుష్టుడు యమదూతల బారి జిక్కును. వాడతి భీకరమైన యముని కాలపాశములచే బద్దుడై యాతనలు గల్గించు తామిస్రనరకమున త్రోయబడును. అచ్చడ యమభటులు పాశములు చేతబూని వానిని పట్టి కొట్టి తిట్టి భయపెట్టి పలు ఇక్కట్టులు పెట్టుదురు. 

బ్రహ్మపుత్రా! అపుడా నారకుడు వివశుడై మూర్చిను. ఒక విటుడింకొక పురుషుని మోసగించి వాడింటలేని తఱి వాని పెండ్లమును ధనాదులను విడువ కనుభవించును. అట్టివాడు యమకింకరులచేత నంధ తామిస్రమను నరకాంధ్యమున నెట్టబడును. అటవాడు ఘోర యమ యాతనలు పడును. వాడు మతి-చూపులు చెడిన వాడై మొదలంట నఱుకబడిన చెట్టువలె గూలును. 

అందువలన దాని నంధతామిస్రమని పెద్దలందురు. ''నేను'' ''ఇది నాది'' యును నహంకృతితో నొకడు ప్రాణులకు ద్రోహము తలపెట్టును. అతడు ప్రతిదినమును కార్యమగ్నుడై స్వార్దముతో తన కుటుంబమును మాత్రమే పోషించుకొనును. అట్టివాడు తన వన్నియు నిచ్చటనే వదలిపెట్టి తన కర్మఫలము పొందును. అతడెల్లరకును భితి గొల్పునటి రౌరవనరకము గూలును. 

ఈ లోకమునంగొకడు ప్రాణుల నెల్ల హింసించును. అట్టి హింసకునిచే హింస బొందినవారు నరకములో రురులైవానిని బాధపెట్టుదురు. అందువలన రౌరవమను నరకము పేరేర్పడెనని పండితులు వచింతురు. ఈ రురువనుజంతువు కర్పముకన్న మిక్కిలి క్రూరమైనది. అందుచే నగి మహారౌరవమని పెద్దలచే పేర్కొనబడినది. ఇతరులను బాధించి పీడించువాడీ రౌరవమునపడును. అందువాడు మాంసము తిను రురు జంతువుల చేత తినబడును.

అతిక్రూరముగ కోపముతో పశుపక్షులను బంధించు మూడుని యమదూతలు పట్టి కట్ట కొట్టుదురు. నారదా! వాడుతాను హింసించిన పశు-పక్షుల కెని రోమములు గలవో యన్ని వేలేండ్లు కుంభీపాకనరకమం దుండును. వాని పై సలసలమను వేడినూనెపోయుదురు. 

తనతల్లిదండ్రులకును విప్రులకునుబ్రాహ్మణులకును ద్రోహముబూనువాడు''కాలసూత్ర'' నరకమున పడవేయబడి సూర్యాగ్నుల మంటలచే తపింపచేయబడును. వాని శరీరములోన బైట నాకలి-దప్పుల పెనుమంటలు చెలరేగను. వాడా నరకమందే తిరుగును కూర్చుండును పరుగెత్తును విదురించును. 

దేవఋషీ! ఎవుడు తన వైదికమార్గమును వదలి పాషండమతమును నిరాటంకముగ చేపట్టునో యమభటులు వానిని నరకమున ద్రోతురు. అది అసిపత్రవన మనునరకము. అందు వానిని కొరడాలతో కొట్టుదురు. వాడందు కత్తికి రెండు వైపుల పదునున్న '' యసిపత్ర'' ములచేత చీల్చబడుచు నిటునటు పరుగులు దీయును. అట్లు తన యంగము లన్నియును ఛేదింపబడుచుండగా నయ్యోఏ చచ్చితి! చచ్చితి! ననివాడు మహావేదనపడి మూర్చిల్లి యడుగడుగునకు క్రింద పడిపోవును. అల్పబుద్దిగలవాడు తన ధర్మానుసారముగ పాషండమతఫల మనుభవించును. 

ఒక రాజుగాని రాజపురుషుడుగాని యధర్మముగ నితరులను దండించును. అతడు బ్రాహ్మణులను దండించినచో పాప ఫలముద సూకర ముఖ మనబడు నరకమున యమభటులసచేత త్రోయబడును. అతడచట విసరు తాతిలోని పిండివలె నుగ్గునుగ్గయిన యవయువముల బాధతో నార్తితో కేకలు పెట్టుచు మూర్చిల్లును. 

అతడటుల భాధింపబడి పెక్కురీతుల వేదనలు పొందును. ఎవడితరుల బాధ గుర్తింపలేడో యెవడు నీచకర్మ చేయునో-ఏవా డీశ్వర కల్పితములగు నల్లులు మున్నగు వాని కూడా భాధించునో యా ద్రోహమునకు వా డం ద కూపనరకముందు గూలును.

అతడచట పశు-మృగ-పక్షులచేత పాములచే - తేళ్లచే దోమలచే నల్లులచే పీడింపబడును. అతడా పెంజీకట దోమలు దందశూకములు మున్నగువాని చేత భాదింపబడును. ఇట్టి దురవస్ధ నీచ తనువుగల జంతువు కిచటనే కల్గును. 

ఎవ్వడు తన యన్నమును ధనమును మన్త్రవిహితములైన పంచయజ్ఞములతో దేవతల దేయక కాకివలె తాలొక్కడే యనుభవించునో ఆ పాపి కృమిభోజనమను నరకమునందు క్రూర యమభటులచేత గూల్చబడును. వాడచ్చోట లక్ష యోజనముల వైశాల్యముగల కృమికుండమున బడి తానొక పురుగై యందలి పురుగులచే తినబడును. 

అతిధులకు పెట్టక తానే కుడి చినవాడు నిదే నరకమున గూలును. ఎవ్వడు బంగారముగాని రత్నము గాని దొంగలించునో ఆ వస్తువులు బ్రాహ్ణునివిగాని యితరులవిగాని వచ్చును. నారదా! అట్టిదొంగను యమకింకరులు బాధింతురు. అట్టి దొంగ నచట భగభగమను నయః పిండముల వంటి రోకళ్లతో కసబిస ద్రోక్కుదురు. 

ఎవ్వడైన మదమెక్కి పొందరాని యువతిని తగుల్కొనునో యే రేగిన మదవతియైన తనకు తగనివానితో రుసరుసలాడుచు తమకము దీర్చుకొనునో వారిర్వురిని యమభటులు వాడి కొరడాలతో గొట్టుదురు. మఱి భగ్గున మండు నినుప యువతినిచేసి యాయువకునితోదానిని కౌగిలింపింతురు. 

అ మదవతిని గూడ యినుప యువకునితో కౌగిలింపచేతురు. ఒక్కొక్క పాపాత్ముడు పెక్కురు స్త్రీలను గూడును. యమభటులు వాని నినుము వంటి వజ్రకంటకములు గలశాల్మలీనరకమున పడవేసి బాధింతురు. తమ క్షాత్రము విడనాడి పాఖండమచము పట్టిన రాడపురుషులను స్వధర్మము విడనాడిన నరులు చ్చి దుఃఖము లందుదురు. నారాదా! అట్టి పాపులు మర్యాదలు లేనివారు. వారు పాపదుర్గములప్రక్కనేయున్న యగడ్తల నదులనుబోలు లోతైన వైతరణీతప్తజలములం దుక్కిరిబిక్కిరియగుచుందురు.

నారదా| అందు పెక్కు జలజంతువులు వానిని తినుచున్నను ప్రాణములు వాని శరీరమును వదలిపెట్టవు. వాడిటునటు తిరుగుచుండును. పాపులు తామ చేసికొన్న పాపాలు పండుట వలన మలమూతమ్రలు నెత్రుమాంసములు గోళ్ళ వెండ్రుకలు నెముకలు మేదస్సు మజ్జలతో నిండిన నదిలో వారు మునుగుదురు. 

వృషలీపతులు భ్రష్టాచారులు సిగ్గుమాలినవారును సదాచరనియమములు పాటించని పశువర్తనులునునల మూత్రములు శ్లేష్మరక్తములును శ్లేష్మమలములు నిండిన నదిలోగూలుదురు. ఆ దురాగ్రహులగుయమసేవకు లాపురుల నోళ్లలో మలమూత్రమును నెట్టుదురు.ఏద్విజాతుల వారు గాడిద కుక్క మున్నగు జంతువులను పెంచుదురో-వేటతమకమున మృగములను వేటాడుదురో-ఆ దుర్మార్గులు చచ్చిన మీదట యమభటులువాడిములుకులకుగురి యగుదురు. 

ఏనరాధముల-డాంబికులనుగువారు దంభయాగముతో పశువులను హింసింతురో వారు చచ్చిన పిమ్మటయమ భటులచేత''విశసన'' నరకమున గూల్చబడుదురు. అచట యమభటులు వారిని బెట్టిదంపు కొరడాలతో గొట్టుదురు. ఏ ద్విజు డగ్గలమైన మేహాతిరేక మాపుకోలేక తనసజాతి స్త్రినోటితో రేతస్సు త్రాగించునో ఆమూఢుని భటులు రేతః కుండమున పవడేసి వానిచే రేతస్సు త్రాపుదురు. 

దొంగలు నిప్పంటించు వారు విషము పెట్టువారు గ్రామాలను వర్తకులనుగంపులను దోచువారుఅగు రాజులను రాజులను రాజపురుషులను వీరందఱిని చచ్చిన యమదూతలు ''శ్వానకదన'' మను నరకమున గూల్తురు. ఆ నరకము నందేడు వందల ఇరువదికి పైగా చితవిచిత్రములగు విచిత్రములగు కుక్కలు గబగబ ప్రాణులను పీకి పాకము పట్టను. 

మునీశా| ఈ సారమేయాదన నరకమతి దారుణమైనది సుమా| ఇక మీదట ''అవీచి'' మున్నగు నరకములను గూర్చి వివరుంతును.

శ్రీనారాయణ డిట్లనెను: ఓ దేవమునీ! ఏ పాపులు లేచినది మొదలబద్దము లాడుదురో డబ్బిచ్చి పుచ్చుకొనుటలో నసత్యము లాడుదురో వారు చచ్చిన పిదప దారుణమైన''యవీచి'' నరకమున పడుదురు. అచట వారిని యమ దూతలు నూఱు యోజనముల యెత్తైన పర్వతము నుండి క్రిందకి పడవైతురు. వారాకాశము నుండి క్రింద పడునపుడలలు లేని నేలపై నీటి కెరటాలున్నట్లు దోచును. 

నారదా! అందులకే దానిని''అవీచి'' యందురు. అందు పడినవారు చిత్తు చిత్తుగ క్షీణించినను చావరు. మఱల క్రొత్త తనువులు దాల్తురు. బ్రహ్మపుత్రా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవడైనను సోమపానము చేసి పిదప సురాపానము చేయునో అతడును నరకమున గూలును. యమ భటులతనికి వేడి లోహద్రవము త్రాపుదురు. ఆ ద్రవ మెల్లప్పుడు నిప్పు మంటలతో సలసల క్రాగును. 

ఏ నరాధముడు తనకు గౌరవ పాత్రుడైనవానిని గౌరవింపడో తన కంటె విద్య-జన్మ-తపస్సు-వర్ణము-ఆశ్రమము- ఆచారము లందు శ్రేష్టుడైన వాని నెవడు గౌరవింపడో వారు క్షారకర్దమ నరకమందు యమభటులచేత పడవేయబడును. వాడచట తల క్రిందుగనుండి ఘోరయాతనల ననుభవించును. మునిపుంగవా! ఏ నరుడు గాని నారి గాని నరమేధముతో నేదేని దేవతను గొల్చునో నరపశువు మాంసము తినునో- ఆ చనిపోయిన నర పశువులు తిరిగి యమ లోకము నందు తన్ను చంపి తిన్న వానిని వాడి కత్తితో కోసి తినును. వాని నెత్తురు క్రోలి పెక్కు రీతుల నటించును పాడును. భూమిపై మాంసము తినువారు ప్రవర్తించు రీతిగ యమలోకమందును ప్రవర్తించును. 

నారదా! ఏ నేరములు చేయక మోసములు చేయక వనము లందు గాన గ్రామము లందు గాని సాధు జీవనము గడుపు పుణ్యాత్ముల నెవరు మోసగింతురో ఎవరా సాధులును శూల-కంటక-సూత్రములచే బాధించి వినో దింతురోవారు చచ్చి యమభటులచేత శూల పాత నరకమ మందు పడవేయబడుదురు. వారచ్చట వాడి శూలముల చేత గ్రుచ్చబడుదురు.అఱ్ఱాట క తీరని దప్పిచే వారు పీడితులగుదురు. వాడి ముక్కు కొనలు గల కొంగలు కంకములు మున్నగు పక్షుల చేత చీల్చబడుదురు. 

ఆ పాపులు తమ చేసిన పాపములు తలపోసికొందురు. మఱికొందఱు పాపులు తీవ్ర ప్రవర్తనతో నితరుల నుద్రేక పఱతురు. కొందఱితరులను భయపెట్టుదురు. అట్టివారలు దంద శూకమను నరకమున గూలుదురు. అందు పెక్కు దందశూకము లుండును. వానికైదు గాని యేడు గాని ముఖములుండును. పాము కన్నములోని యెలుకను పట్టి మ్రింగును. అట్లే కొందఱు దుష్ఠులు కటికి చీకటి బావులలో గాని గాదెలలో గాని గుహలలోగాని ప్రాణులను బంధింతురు. అట్టి పాపులను యమ కింకరులు బాధలు పెట్టుదురు. దట్టమైన పొగ మంటలు విషపు మంటలు నిండిన చోట్ల యమ భటులట్టి పాపుల నుక్కిరి బిక్కిరి యగునట్టు లడ్డగింతురు.

నారదా! పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాతులు సుఖప్రదాలయిన లోకాలకు వెడతారు. మహామునీ! సారాంశంగా ఒక్కమాట చెబుతాను, ఆలకించు. దేవీపూజనం దేవి ఆరాధనం - ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ ధర్మం. దీనిని అనుష్టించిన ప్రాణికి మరింక చింతలేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు. సంసార సాగరంనుంచి ఉద్ధరించగలిగినది శ్రీమన్మహదేవి మాత్రమే.

నారాయణ మహర్షీ సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలు అవుతుంది? ఆరాధన విధానం ఎమిటి? లోగడ ఎవరు ఎపుడు ఎలా ఆరాధించి తరించారు? ఏయే కష్టాలను అతిగమించారు?, విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.



శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tala Tala Lokamu - తలాతల లోకము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - తలాతల లోకము

శ్రీనారాయణు ఇట్లు పలికెను: సుతలమునకు క్రింద తలాతలమను లోకము గలదు. అందు గొప్ప దానవపతి త్రిపురాధినాధుడు మయుడనువాడుండును. శివుడు త్రిపురములు గాల్చుతఱి దేవదేవుని దయవలన నితడు రక్షింపబడి రాజ్య సుఖములు పడసెను. 

మయుడు గొప్పమాయావి! మాయావులకు మాయావి! పెక్కురు రక్కసులతనిని తమ కార్యసిద్దికొఱకు సేవించుచుందురు. సుతలమునకు క్రింద మహాక్రోధవశులును కద్రూతనయులునగు నాగరాజులు నివసించు ప్రసిద్ద మహాతలము గలదు. 

నారదా! వీరికి పెక్కుతలలుండును. వీరిలో ముఖ్యులను గీర్తింతును; వినుము. కుహకుడు, తక్షుకుడు సుషేణుడు కాళియుడు. వీరుపెద్ద పడగలుగల్గి మహాబలముగల్గి క్రూరస్వభావముగల క్రూర జాతులు. వీరందఱను గరుత్మంతునికి జంకుదురు. వీరు తమ తమ భార్యాపుత్ర-మిత్ర-కుటుంబముతో గూడి పెక్కుక్రీడలందారితేరి మదించి ప్రవర్తింతురు. 

మహ తలమునకు క్రింద రసాతలమను మహా లోకము గలదు. ఇందు పెద్దఫణములు గల్గిన దైత్యదానవులు వసింతురు. ఇందు సురవైరులు హిరణ్యపురవాసులు కాలేయులనబడు నివాతకవచాది రాక్షసులు వసింతురు. వీరు పుట్టునప్పట్టి నుండియే వీరులు-శూరులు. వీరు శ్రీహరితేజమున మాత్రము నిర్నీర్యులగుదురు. వీరెల్లప్పుడును బిలేశయులవ పగిది వినరమందే వసింతురు. సరమ శక్ర దూతిక. ఈమెమంత్ర వర్ణములుగల వాక్కులకు రసాతలవాసులు గడగడ లాడుదురు. రసాతలము క్రింద నాగలోకపతులు వసించు పాతాళము గలదు.

వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహశంఖ ధృతరాష్ట్ర శంఖచూడ కంబల అశ్వతర దేవోపదత్తక నామములుగల నాగులు ప్రముఖులు. వీరు కోపావేశమున విషములు గ్రక్కుచుందురు. వీరులో నొక కొందరైదుతలలు నేడుతలలు పదితలలు నూఱు పడగలు వేయితలలు గల్గి తమ తమ ఫణా మణి కాంతిరేఖలలతో ఫాతాళమందలి చిమ్మచీకట్లు పారద్రోలుచుందురు. 

నారదా! వీరెల్లరును కోపాటోపముతో బుసలు గొట్టుచుందురు. దీనికి మూలమున ముప్పదివేల యోజనముల వైశాల్యమున నొక భగవత్కళ గలదు. అది తామసకళ. అనంత నామనున నెల్ల దేవతలచేత పూజింపబడుచుండును. అభిమానమునకు లక్షణ మహంకార మందురు. ద్రష్టృ-దృశ్యముల యైక్యమును సంకర్షణ మందురు. అనంతుడనంతమూర్తి; అదిశేషుడు. అతని వేయితలలపై భూమండల మంతయును నిల్చియున్నది. అతని తలలపై నీభూమండల మొక కమలమువలె నొప్పును. లయకాలుడగు రుద్రుడీ చరాచరములను సంహరింపదలచును. 

అపుడతని కన్బొమల నుండి సంకర్షణులను పేర్లగల పదునొకండు ప్యూహముల రుద్రులు ద్బవింతురు. అపుడు ముక్కంటి త్రిశూలము చేబూని మహాభూత భయంకరముగ దోచును. అంత రుద్రుని పదపద్మకాంతులచే కెంపెక్కిన కాలిగోళ్ల కాంతులు పాపఱడుల తలల మణి బింబములపై చెన్నలరును.

అత్తఱి సజ్జను లనన్య భక్తియోగమున తలలు వంచి దోయిలించి మ్రొక్కుచు తమ మొగములు చూచుకొందురు. వారిచెన్నొందు కుండలకాంతులు నిగ్గుటద్దములవంటి చెక్కిళ్లను మఱింత కాంతిమంతముగ జేయును. నాగరాజకన్యకల విలాసములు వంపుసోంపు లందాలు మిక్కిలి యచ్చమైన తళతళ కాంతులు విరజిమ్ముచుందురు. 

వారు తమ నునువెచ్చని భుజదండములకు చందనాగురు కస్తూరి సువాసనలు పూసికొని యలంకరించుకొందురు. వారు పురుషుల యంగములుతాకినంతన కామపరవశలై వలపులేనవ్వులు గురియుచు తలలు వంచి ప్రక్కచూపుల గాంతురు. అనురాగము గల్గినపుడు కమ్మని మైకము మత్తెక్కించుటచే నెఱుపెక్కిన వారి కన్నులు మత్తుగ తిరుగును. 

దయ చూపదలచి నపుడా కన్నులే యాశీస్సులు కురియును. అనంత భగవాను డనంతసత్త్వుడు. అనంత సుగుణవారిధి ఆది దేవుడు మహాద్యుతిమంతుడు. మహాభోగి అతడు సర్వలోకహితముగోరి క్రోధముడిగ సురగణపూజితుడై యచ్చోట విలసిల్లుచుండును. అతనిని ముప్ప్రొద్దులు సురాసులు సిద్దవిద్యాధరగంధర్వలు మునులు నాగులు ధ్యానించుచుందురు. 

అచటి దేవుడనారతము మదించి వ్యాకులత్వ మొందు కన్నులతో నొప్పిన తల వచనామృతముచే తన పార్షదగణములను విబుధులను తనుపును. ఆ దేవుడేనాటికిని వాడని నవనవమగు తులసీదళముల వైజయంతీమాలికను దాల్చి రాణ కెక్కును. ఆ భగవానుడు మత్తెక్కిన గండుతుమ్మెదల శోభను తిరస్కరించు పట్టుపుట్టముగట్టి యొకే కుండలము దాల్చి శోభిల్లును. 

ఆదేవుడు హలముపైతన లావు బూజముమోపి యింద్రునైరావతము పగిది శోభిల్లుచుండును. ఆ దేవేశు డుదారశీలుడని తత్త్వవేత్త లభినుతింతురు.


శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Description of the five forms of Durga - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  దుర్గాదిపంచరూపవివరణ శ్రీకృష్ణుణ్ణి అవతరింపజెయ్యడంకోసం లోకజనని అయిదు రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికీ మళ్ళ...