ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము
పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యాడు. తర్వాత అతడు పరమేశ్వరుణ్ణిగూర్చి అనేకపర్యాయాలు శ్రద్ధతో తపస్సుచేశాడు. ఆ తపస్సుకు ఫలంగా రుక్మిణీకృష్ణులకు కుమారుడై పుట్టాడు. ఈ పునర్జన్మంలో మన్మథుడు శ్రీకృష్ణుని మరొకరూపమా అన్నట్లున్నాడు.
ఆ శిశువే తర్వాత ప్రద్యుమ్ను డనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు. అయితే ఆ పసిగందును శంబరు డనేరాక్షసుడు తనశత్రువుగా పసిగట్టాడు. అందువల్ల ఆ బాలుణ్ణి ఒకనాడు పురిటింట్లో తల్లిసందిటిలో ఉన్నప్పుడు అపహరించి, సముద్రంలో పారవేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడు సముద్రజలంలో అడుగుకు పడిపోగా ఒక పెద్దచేప అతణ్ణి పట్టుకొని మింగేసింది. ఆ సముద్రంలో
జాలరులు పట్టుకొంటా రనేభయంతో చేపలు - ఆ సముద్రంలో చిక్కకుండా పారిపోయేవి. అప్పుడు జాలరులు ఆగ్రహించి వాటిల్ని తప్పించుకొని పోనీకుండా అడ్డగించి, వలలు వేసి పట్టుకొనేవాళ్లు.
జాలరులు సముద్రంలో ప్రద్యుమ్నుణ్ణి మింగిన పెద్దచేపనూ, దానివెంట తిరిగేచేపలనూ పట్టీ తెచ్చి, శంబరాసురునికి కానుకగా సమర్పించారు. అతడు వాటిల్ని వండి తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చి వంట ఇంటికి పంపాడు.
పరీక్షిన్మహారాజా! రాజాంతపురంలోని వంటవాళ్లు ఆపెద్దచేపపొట్టను చీల్చినప్పుడు, దానిలో వారికి ఒక రాచబిడ్డ కనిపించాడు. వెంటనే వా రీవిచిత్రాన్ని రతీదేవికి తెలియజేశారు.
ఒకనాడు నారదుడు శంబరుని అంతఃపురానికి వచ్చి ప్రద్యుమ్నుని జననమూ, శంబరుడు ఆ బాలుణ్ణి చంపటానికి చేసిన ప్రయత్నమూ, అతడు చేపకడుపులో ప్రవేశించటమూ రతికి వివరించాడు;
పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యాడు. తర్వాత అతడు పరమేశ్వరుణ్ణిగూర్చి అనేకపర్యాయాలు శ్రద్ధతో తపస్సుచేశాడు. ఆ తపస్సుకు ఫలంగా రుక్మిణీకృష్ణులకు కుమారుడై పుట్టాడు. ఈ పునర్జన్మంలో మన్మథుడు శ్రీకృష్ణుని మరొకరూపమా అన్నట్లున్నాడు.
ఆ శిశువే తర్వాత ప్రద్యుమ్ను డనేపేరుతో ప్రసిద్ధికెక్కాడు. అయితే ఆ పసిగందును శంబరు డనేరాక్షసుడు తనశత్రువుగా పసిగట్టాడు. అందువల్ల ఆ బాలుణ్ణి ఒకనాడు పురిటింట్లో తల్లిసందిటిలో ఉన్నప్పుడు అపహరించి, సముద్రంలో పారవేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడు సముద్రజలంలో అడుగుకు పడిపోగా ఒక పెద్దచేప అతణ్ణి పట్టుకొని మింగేసింది. ఆ సముద్రంలో
జాలరులు పట్టుకొంటా రనేభయంతో చేపలు - ఆ సముద్రంలో చిక్కకుండా పారిపోయేవి. అప్పుడు జాలరులు ఆగ్రహించి వాటిల్ని తప్పించుకొని పోనీకుండా అడ్డగించి, వలలు వేసి పట్టుకొనేవాళ్లు.
జాలరులు సముద్రంలో ప్రద్యుమ్నుణ్ణి మింగిన పెద్దచేపనూ, దానివెంట తిరిగేచేపలనూ పట్టీ తెచ్చి, శంబరాసురునికి కానుకగా సమర్పించారు. అతడు వాటిల్ని వండి తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చి వంట ఇంటికి పంపాడు.
పరీక్షిన్మహారాజా! రాజాంతపురంలోని వంటవాళ్లు ఆపెద్దచేపపొట్టను చీల్చినప్పుడు, దానిలో వారికి ఒక రాచబిడ్డ కనిపించాడు. వెంటనే వా రీవిచిత్రాన్ని రతీదేవికి తెలియజేశారు.
ఒకనాడు నారదుడు శంబరుని అంతఃపురానికి వచ్చి ప్రద్యుమ్నుని జననమూ, శంబరుడు ఆ బాలుణ్ణి చంపటానికి చేసిన ప్రయత్నమూ, అతడు చేపకడుపులో ప్రవేశించటమూ రతికి వివరించాడు;
ఇంతకు మునుపే ఆమె మాయావతి అనేపేరుతో శంబరుని అంతఃపురంలో పాతివ్రత్యం అవలంబిస్తూ, శివునికంటిమంటల్లో భస్మమైపోయిన తన భర్త మన్మథుడు తిరిగి ఎప్పుడు శరీరధారి అవుతాడో అని ఎదురుచూస్తూంది. అందువల్ల చేపపొట్టలో ఉన్నబాలుడు మన్మథుడే అని తెలుసుకోగలిగింది.
ఆమె తొందరపాటు లేకుండా కొడుకుకోసం తపిస్తున్నదానిమాదిరిగా శంబరునిదగ్గరకువెళ్లి, అతని అంగీకారాన్ని పొంది, వంటవాళ్ల అదుపులో ఉన్న పిల్లవాణ్ణి తెచ్చి పెంచుతూ ఉంది. ఆ బాలుడు పూటపూటకూ పెరుగుతూ యౌవనవంతు డయ్యాడు.
రాజా! ఆ యువకుని సౌందర్యాన్నిగూర్చి ఏమని చెప్పేది? అందగత్తెలు ఎవరైనాసరే ఒకసారి అతనిరూపాన్ని కళ్లారా చూస్తేచాలు - అతనితో భోగించాలని నిశ్చయించి, అతణ్ణి సమీపించే ఆలోచనను, అతని సౌందర్యం వాళ్లకు జనింపజేస్తుంది.
(రూపం అనేది చాలా అర్థవంతమయిన శబ్దం. “రోపయతి విమోహయ తీతి రూపమ్! రుపు విమోహనే - మోహింపజేసేది” అని వ్యుత్పత్తి. మోహింపజేస్తుంది కాబట్టి, రూపం అనే పేరు కలిగింది.)
ఈ పడుచువాడు నిజంగా మన్మథుడే! మన్మథుడు గొప్ప అందగాళ్ల సొగసుతో పోల్చటానికి తగిన సుందరుడయ్యాడు. విరాగియై స్త్రీవైముఖ్యం కలిగిన శివుణ్ణి ఘోరతపస్సు చేసినపార్వతికి అర్ధశరీరం సమర్పించేటట్లు చేశాడు.
రాజా! ఆ యువకుని సౌందర్యాన్నిగూర్చి ఏమని చెప్పేది? అందగత్తెలు ఎవరైనాసరే ఒకసారి అతనిరూపాన్ని కళ్లారా చూస్తేచాలు - అతనితో భోగించాలని నిశ్చయించి, అతణ్ణి సమీపించే ఆలోచనను, అతని సౌందర్యం వాళ్లకు జనింపజేస్తుంది.
(రూపం అనేది చాలా అర్థవంతమయిన శబ్దం. “రోపయతి విమోహయ తీతి రూపమ్! రుపు విమోహనే - మోహింపజేసేది” అని వ్యుత్పత్తి. మోహింపజేస్తుంది కాబట్టి, రూపం అనే పేరు కలిగింది.)
ఈ పడుచువాడు నిజంగా మన్మథుడే! మన్మథుడు గొప్ప అందగాళ్ల సొగసుతో పోల్చటానికి తగిన సుందరుడయ్యాడు. విరాగియై స్త్రీవైముఖ్యం కలిగిన శివుణ్ణి ఘోరతపస్సు చేసినపార్వతికి అర్ధశరీరం సమర్పించేటట్లు చేశాడు.
సృష్టికర్త అయినబ్రహ్మ కన్నకూతురయిన సరస్వతికోసం వావీవరుసా వదలేటట్లు చేశాడు. దేవేంద్రుడు నిలువెల్లా వేయిమచ్చల గుర్తులు (కన్నులు) పొందటానికి మూలకారకుడయ్యాడు.
అతడు మునీశ్వరుల మనోనిగ్రహం ఏ పాటిదో తూకంవేస్తాడు. స్త్రీపురుషులు పరస్పరమూ ప్రేమించుకొనేటట్లు చేస్తాడు. వాడి వత్తలయ్యే పూలవింటితో మహావిజయాలు సాధిస్తాడు. గట్టితనం లేని చిగురాకుకత్తితో లోకాల్ని బాధిస్తాడు.
ఈ విధంగా ప్రజలందరూ మన్మథునిశక్తులను కొనియాడుతున్నారు. పద్మనేత్రుడూ, ఆజానుబాహుడూ, లోకమోహనస్వరూపుడూ అయిన అతణ్ణి సిగ్గూ, చిరునవ్వూ దాగినచూపులతో చూస్తూ, మాయావతి రతివాంఛను ప్రకటించింది. అప్పుడు ఆమెవాలకం చూచి ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నాడు
(1. పంచబాణుడు అంటే అయిదుబాణాలు కలవాడని అర్ధం. తామరపూవు, అశోకము, మామిడి, మల్లె, నల్లగలువ అనేవి ఆ పంచబాణాలు - ఆ బాణాలు చేసే పనులు - సమ్మోహనం (ఆకర్షించునట్లు చేసేది), ఉన్మాదనం (వెరి పుట్టించేది), తాపనం (కాక ఎక్కించేది), శోషణం (శుష్కింపజేసేది), స్తంభనం (కొయ్యవారేటట్లు చేసేది.))
తల్లీ! ఇన్నాళ్లూ నా కొడుకని అందరికీ నన్నుగూర్చి చెప్పావు. ఇప్పుడు సిగ్గులేకుండా, మాతృత్వాన్ని మంటగలిపి, కాముకురాలివలె ఈ విలాసచేష్టలు చేస్తున్నావు. ఇది ఎంతపాడుపని? సత్ప్రవర్తనకు పేరుపొందిన నీవు నన్ను మోహించటం న్యాయంగాదు.
ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి “నీవు విష్ణువునకు కుమారుడవు. మన్మథుడవు. నేను నీపత్నిని. రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను దొంగిలించి, తల్లినుండి వేరుచేసి సముద్రంలో పారవేశాడు. అప్పుడు పెద్దచేప నిన్ను మింగేసింది. ఆ తర్వాత దానిపొట్టనుండి నీవు బయటపడ్డావు. ఇక జరుగవలసిన పనేమిటో చెప్తాను. విను. (శంబరుడు - జటాసురుని కొడుకు)
ఈ శంబరుడు మాయలమారి. దుర్బుద్ధి. యుద్దాల్లో దేవతలనయినా జయిస్తాడు కాని తానుమాత్రం చావడు. కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయలచేత వీణ్ణి సంహరించు.
పాపపుపనులు చేసే ఈ శంబరుడు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నతల్లి “దేవుడా! నాబీడ్డ ఎక్కడికి పోయాడు? వాణ్ణి, నన్నూ ఎడబాపావుగదా!” అని దూడకు దూరమైన ఆవువలె కిందబడి దుఃఖంతో, బాధతో కుయ్యోమొర్రో అని అనకుండా ఉంటుందా?
(శంబరునివల్ల ఏర్పడిన విద్యకు 'శాంబరీవిద్య' అని పేరు. ఇదొక ప్రత్యేకమైన మాయావిద్య.)
అనిచెప్పి, మాయావతి మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నునికి విరోధులమాయ లన్నింటినీ మట్టుపెట్టే 'మహామాయ' అనేవిద్యను ఉపదేశించింది. ఈ విధంగా
మాయాయుద్ధనిపుణుడూ, ధనుర్భాణాలు ధరించినవాడూ అయిన ప్రద్యుమ్నుడు “ఓరీ రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పడవేశావు. ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను. తొందరగా రారా!” అని అన్నాడు. ఆ సమయంలో శంబరుడు మనోజ్ఞమైన దివ్యవస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్దానికి ఉత్సాహంతో కాలుదువ్వుతున్నాయి.
ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికినమాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తొక్కబడిన పాము మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి, వజ్రాయుధధ్వనివంటి సింహనాదం చేసి, బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుణ్ణి గదతో కొట్టాడు.
శంబరుడు తనమీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తనగదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం చేస్తూ తన గదను అతనిమీదికి విసరివేశాడు.
పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మయునినుండి తాను గ్రహించిన రాక్షసమాయను తోడుచేసికొని ఆకాశాని కెగిరి, ప్రద్యుమ్నునిమీద బాణాలజడివానను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడికూడా పట్టువదలక సర్వమాయలను ధ్వంసం చేసే సాత్త్వికమాయను శంబరునిమీద ప్రయోగించాడు. వాడు సర్ప -గుహ్యక-పిశాచమాయలను ప్రద్యుమ్నునిమీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి
ఏమీ మాటాడకుండా ప్రద్యుమ్నుడు యమునివంటివాడై భయంకరఖడ్గంతో శంబరునితలను నరికాడు. కత్తిదెబ్బకు రాక్షసుని చెవిపోగులలోనూ, కిరీటంలోనూ పొదిగిన మణులు నేలమీద రాలిపోయాయి.
లేతచిగురాకుకత్తితో సర్వలోకాలలో నివసించేవారినీ అస్వతంత్రులుగా చేసే పట్టుదలగలవానికి ఉక్కుకత్తితో శత్రువును సంహరించటం ఒకలెక్కా?
పరీక్షిన్మహారాజా! శంబరుడు చనిపోవటంచేత దేవతలు నిర్భయంగా అతణ్ణి నిందించారు. ప్రద్యుమ్నుని ధైర్యశౌర్యాది గుణాలను స్తుతించారు. ఆనందంతో ఎడతెగకుండా పూలవాన కురియించారు.
ఈ విధంగా ప్రజలందరూ మన్మథునిశక్తులను కొనియాడుతున్నారు. పద్మనేత్రుడూ, ఆజానుబాహుడూ, లోకమోహనస్వరూపుడూ అయిన అతణ్ణి సిగ్గూ, చిరునవ్వూ దాగినచూపులతో చూస్తూ, మాయావతి రతివాంఛను ప్రకటించింది. అప్పుడు ఆమెవాలకం చూచి ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నాడు
(1. పంచబాణుడు అంటే అయిదుబాణాలు కలవాడని అర్ధం. తామరపూవు, అశోకము, మామిడి, మల్లె, నల్లగలువ అనేవి ఆ పంచబాణాలు - ఆ బాణాలు చేసే పనులు - సమ్మోహనం (ఆకర్షించునట్లు చేసేది), ఉన్మాదనం (వెరి పుట్టించేది), తాపనం (కాక ఎక్కించేది), శోషణం (శుష్కింపజేసేది), స్తంభనం (కొయ్యవారేటట్లు చేసేది.))
తల్లీ! ఇన్నాళ్లూ నా కొడుకని అందరికీ నన్నుగూర్చి చెప్పావు. ఇప్పుడు సిగ్గులేకుండా, మాతృత్వాన్ని మంటగలిపి, కాముకురాలివలె ఈ విలాసచేష్టలు చేస్తున్నావు. ఇది ఎంతపాడుపని? సత్ప్రవర్తనకు పేరుపొందిన నీవు నన్ను మోహించటం న్యాయంగాదు.
ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి “నీవు విష్ణువునకు కుమారుడవు. మన్మథుడవు. నేను నీపత్నిని. రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడు నిన్ను దొంగిలించి, తల్లినుండి వేరుచేసి సముద్రంలో పారవేశాడు. అప్పుడు పెద్దచేప నిన్ను మింగేసింది. ఆ తర్వాత దానిపొట్టనుండి నీవు బయటపడ్డావు. ఇక జరుగవలసిన పనేమిటో చెప్తాను. విను. (శంబరుడు - జటాసురుని కొడుకు)
ఈ శంబరుడు మాయలమారి. దుర్బుద్ధి. యుద్దాల్లో దేవతలనయినా జయిస్తాడు కాని తానుమాత్రం చావడు. కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయలచేత వీణ్ణి సంహరించు.
పాపపుపనులు చేసే ఈ శంబరుడు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నతల్లి “దేవుడా! నాబీడ్డ ఎక్కడికి పోయాడు? వాణ్ణి, నన్నూ ఎడబాపావుగదా!” అని దూడకు దూరమైన ఆవువలె కిందబడి దుఃఖంతో, బాధతో కుయ్యోమొర్రో అని అనకుండా ఉంటుందా?
(శంబరునివల్ల ఏర్పడిన విద్యకు 'శాంబరీవిద్య' అని పేరు. ఇదొక ప్రత్యేకమైన మాయావిద్య.)
అనిచెప్పి, మాయావతి మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నునికి విరోధులమాయ లన్నింటినీ మట్టుపెట్టే 'మహామాయ' అనేవిద్యను ఉపదేశించింది. ఈ విధంగా
మాయాయుద్ధనిపుణుడూ, ధనుర్భాణాలు ధరించినవాడూ అయిన ప్రద్యుమ్నుడు “ఓరీ రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పడవేశావు. ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను. తొందరగా రారా!” అని అన్నాడు. ఆ సమయంలో శంబరుడు మనోజ్ఞమైన దివ్యవస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్దానికి ఉత్సాహంతో కాలుదువ్వుతున్నాయి.
ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికినమాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తొక్కబడిన పాము మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి, వజ్రాయుధధ్వనివంటి సింహనాదం చేసి, బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుణ్ణి గదతో కొట్టాడు.
శంబరుడు తనమీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తనగదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం చేస్తూ తన గదను అతనిమీదికి విసరివేశాడు.
పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మయునినుండి తాను గ్రహించిన రాక్షసమాయను తోడుచేసికొని ఆకాశాని కెగిరి, ప్రద్యుమ్నునిమీద బాణాలజడివానను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడికూడా పట్టువదలక సర్వమాయలను ధ్వంసం చేసే సాత్త్వికమాయను శంబరునిమీద ప్రయోగించాడు. వాడు సర్ప -గుహ్యక-పిశాచమాయలను ప్రద్యుమ్నునిమీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి
ఏమీ మాటాడకుండా ప్రద్యుమ్నుడు యమునివంటివాడై భయంకరఖడ్గంతో శంబరునితలను నరికాడు. కత్తిదెబ్బకు రాక్షసుని చెవిపోగులలోనూ, కిరీటంలోనూ పొదిగిన మణులు నేలమీద రాలిపోయాయి.
లేతచిగురాకుకత్తితో సర్వలోకాలలో నివసించేవారినీ అస్వతంత్రులుగా చేసే పట్టుదలగలవానికి ఉక్కుకత్తితో శత్రువును సంహరించటం ఒకలెక్కా?
పరీక్షిన్మహారాజా! శంబరుడు చనిపోవటంచేత దేవతలు నిర్భయంగా అతణ్ణి నిందించారు. ప్రద్యుమ్నుని ధైర్యశౌర్యాది గుణాలను స్తుతించారు. ఆనందంతో ఎడతెగకుండా పూలవాన కురియించారు.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము