Saturday, April 25, 2026

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి

నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల్పి తిరిగి తన వైకుంఠథామ మరిగెను. పిమ్మట 

బ్రహ్మ మనువుతో నిట్లనెను: స్వాయంభువ మనూ! మహాబాహూ! పుత్రా! తేజస్వులలో శ్రేష్ఠా! ఈ నేలపై నుండి నీకు దోచిన రీతిగ ప్రజా సృష్టి కొనసాగింపుము. దేశకాలములకు తగినచట్లు నుత్తమమైన యజ్ఞసాధనములు సమకూర్చుకొని యజ్ఞ పూరుషునిగూర్చి వేల్పుము. శాస్త్రక్తముగ వర్ణాశ్రమ ధర్మము పాటించుచు ఈ క్రమపద్దతి నే ప్రజావృద్ది జరుగగలదు. 

విద్యావినయసం పదలు-సదాచారము - గల్గి కీర్తిలో కాంతిలో నీకు ప్రతిరూపులగు కుమారవరులను పెక్కురను త్రిగుణాను గుణశీలవతులగు కన్యలను గని పిదప మనస్సును ప్రధాన పురుషునందు చక్కగ నిలుపుము. భక్తిసాధన యోగముతో భగవంతునకు కైంకర్యములు చేయుచు పరమయోగులు పొందునట్టి మాన్యపరమగతిని బొందుము. 

ఈ రీతిగ కమలనిలయుడగు ప్రజాపతి తన పుత్రుడగు మనువును ప్రజాసృష్ఠిలో నియమించి తన నివాసమున కరిగెను. 'సంతతి బడయు' మను తండ్రిమాట జవదాటక స్వాయంభువమను మహీపతి ప్రజాసృష్టికి గండగెను. అంతమునువునకు ప్రియవ్రతుడు - ఉత్తానపాదు డను నిర్వురు కొమరులు గల్గిరి. పిదప మువ్వురు కన్నియలు గల్గిరి. వారి పేర్లు వినుము: 

మొదటి కన్య 'అకృతి' రెండవ కన్నియ 'దేవహూతి' మూడవ కన్నె 'ప్రశూతి'. వీరులోకపావనలై వన్నె గాంచిరి. ఆకృతిని రుచికి - దేవహూతిని కర్దమునకు - ప్రసూతిని దక్షున - కిచ్చి మనువుపెండ్లిచేసెను. ఈ లోకమంతయును వీరి సతంతియే.

ఆకృతి రుచులకు యజ్ఞడను పేరుతో నాది పూరుషుడగు భగవానుడవతరించెను. దేవహూతి కర్దములకు కపిలుడుగ హరి యవతరించెను. ఈ కపిలుడే సాంఖ్యయోగ ప్రవర్తకుడని లోకమున విఖ్యాతి గాంచెను. ప్రసూతి దక్షులకు పెక్కురు ప్రజలు గలిగిరి. వారికి దేవ - తిర్యక్కులు - నరులు మున్నగు వారు లోకవిఖానితులైన వారు గల్గిరి. వీరెల్లరును సృష్టి కర్తలే. 

యజ్ఞభగవానుడు స్వాయంభువ మన్వంతరమందు యామదేవ గుణములతో గూడి రాక్షసుల బారినుండి మనువును గాపాడెను. మహీయోగియగు కపిల భగవానుడు తన యాశ్రమమందుండి దేవహూతికవిద్యనాశకమగు పరమ జ్ఞానము భోధించెను. ఆది సవిశేషమైన ధ్యానయోగము; ఆధ్యాత్మజ్ఞాన నిశ్చయము; అజ్ఞానమను పెంజీకట్లు బాపువెల్గుబాట; కాపిలశాస్త్రమని ప్రచారది మందినది. 

కపిల మహాయోగి తన తల్లికి సాంఖ్య ముపదేశించి పులహాశ్రమ మేగెను. అసాంఖ్యా చార్య మహాశయు డిప్పటికి నచ్చటనే కలడు. ఎవ్వాని దివ్యనామ సంస్మరణమున సాంఖ్యయోగము సిద్దించునో- యోగాచార్యడు-సర్వవరప్రదుడు నగునట్టి కపిలునకు నమస్కారములు. ఇట్లు మను కన్యల యుత్తమవంశము వర్ణించితిని. దీనిని చదివిన-వినన వారి సర్వపాపములు పటాపంచలగును. 

ఇకమీదుట మునుపుత్రుల శుభవంశ వర్ణనము వినిపింతును. దానిని విన్నంతమాత్రన పరమపదము చేకూరును. లోక్యవ్యహారము కొఱకు సకల భూతముల కల్యాణము కొఱకు మనుపుత్రులు ద్వీప- వర్ష- సముద్రములను నేర్పాటు లేర్పరచిరి.

నారాయణుడిట్లనెను: స్వాయంభువ మనువు పెద్దకొడుకు ప్రియవ్రతుడు; పితృసేవాపరుడు; నిత్య-సత్య-ధర్మపరాయణుడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కన్యను - బర్హిష్మతి యను సమాన-శీల- వయో- రూపములు గల యందాలరాశిని-చేపట్టెను. 

ప్రియవ్రతుడు మహాత్ముడామె యందు గుణవంతులగు పదిమంది పుత్రులను ఊర్జస్వతియను కన్నియను గనెను. మొదటివాడు అగ్నీధ్రుడు; రెండవవాడు ఇధ్మజిహ్వుడు; మూడవవాడు యజ్ఞబాహుడు; నాల్గవవాడు - మహావీరుడు; ఐదవ రుక్మశుక్రుడు; ఆరవవాడు ఘృతపృష్ఠుడు; ఎనిమిదవవాడు మేధాతిథి; తొమ్మిదవవాడు వీతిహోత్రుడు; పదవవాడు కవి; ఈపదిమందియు వహ్నినామము గలవారు. 

ఈ పదిమంది పుత్రులలో కవిసవనుడు మహావీరుడను మువ్వురును విరాగులైరి. వీరు ఆత్మ విద్యా నిష్ణాతులై-ఊర్ద్వ రేతస్కులై వీతరాగులై-పరమహంసాశ్రమంమందానందమున నుండిరి. 

ప్రియవ్రతునకు వేరొక భార్యయందు 'ఉత్తమ-తామస-రైవతు'లను మువ్వురు ప్రసిద్ద పుత్రు లుద్బవించిరి. వీరు మన్వంతరముల కధిపతులై ప్రసిద్ధి గాంచిరి. వీరు మహావిక్రమవంతులు. ఇట్లు ప్రియవ్రత మహారాజీ భూమి నేలెను. ప్రియవ్రతుడు మొక్కవోని యింద్రియ పటుత్వముతో పదునొకండరర్బుదముల యేండ్లు పరిపాలించెను. 

సూర్యుడీ భూమిపైనెప్పుడును అర్ధభాముననే వెల్గును. భూమి రెండవ భాగమున కాఱు చీకట్లలముకొనును. ఇట్టి వైపరీత్యము తన యేలుబడిలో నుండుట రాజు మదికి బాధ గలిగించెను. నేనీ సమస్త భూమండలమును నిరాటంకముగ నేలుచుండగ నీ చీకటి యలముటేమి? నీ యోగబలముతో భూమిపై చీకటి తొలగింపగలను. అని స్వాయంభువ పుత్త్రుడు నిశ్చయించుకొని సూర్యప్రభలు చిందించు రథము నిర్మింపజేసి యేడు మారులు భూమిని ప్రదక్షిణించెను. అతని రథము సాగుచుండగ నేమి రేఖలచే భూమిపై నేడు గుర్తలు పడి యవిలోకమున సప్తసముద్రములుగ ప్రసిద్ధిగాంచెను.

భూమిపై గుర్తులు పడని భాగములు ద్వీపములుగ పేర్కొనబడెను. ఆ రథపు చక్రపుంటచుల గుర్తులు గల భాషములు పెద్దయగడ్తలై యేడు సంద్రములుగమారెను. వాని మధ్యభూమి యేడు దీవులుగ నయ్యెను. అవి జంభూద్వీపము, ప్లక్ష ద్వీపము-శాల్మలీ ద్వీపము-కుశద్వీపము - క్రౌంచద్వీపము శాకద్వీపము పుష్కరద్వీపము; 

వాని పరిమాణము లుత్తరోత్తములుగ రెండింతులుగ నుండును. వీనికి నలు వైపుల బైట క్రమముగ క్షార-ఇక్షు-సురా-ఘృత క్షీర దధిజలసముద్రములు గలవు. ఈ నేలపై నీ యేడు సముద్రములును ప్రసిద్ధి గాంచినవి. మొదటిదగు జంబూద్వీపము క్షారసముద్రముచే చుట్టబడియున్నది. ప్రియవ్రతుడు దానికాగ్నీధ్రుని రాజుగతేసెను. ప్లక్షద్వీపముచుట్టును చెఱకు సంద్రము గలదు. ప్లక్ష ద్వీపమువన కిధ్మజిహ్వుడధిపతిగ చేయబడెను. యజ్ఞబాహుడు సురాసంద్రముచే చుట్టబడిన శాల్మలి దీవికి నాయకుడయ్యెను. రమ్యమగు కుశద్వీపము చుట్టు నేతి సంద్రము గలదు. ఈ దీవిని ప్రియవ్రతపుత్రుడుగు హిరణ్యరేతుడేలెను. ఐదవవాడగు ఘృతపృష్ఠుడు మహాబలశాలి. 

ఈ ప్రియవ్రత తనయుడు పాలసంద్రముచే చుట్టబడిన క్రౌంచ ద్వీపమునకు రాజుగ చేయబడెను. పెరుగు సంద్రముచేత చుట్టబడిన యందమైన శాకద్వీపమునకు ప్రియవ్రతసుతుడగు మేధాతిథి ధరానాధుడయ్యెను. వీతిహోత్రుడు మంచినీటి సంద్రముచే చుట్టబడిన పుష్కర ద్వీపమునకు తండ్రిసమ్మతితో రాజయ్యెను. ప్రియవ్రతుడు తనయూర్జస్వతి యను కన్యను శుక్రున కీయగ వారికి పేరు గాంచిన దేవయాని యను కన్య జనించెను. ఈ విధముగ ప్రియవ్రతుడు సప్త ద్వీపములను తన కొడుకులకు పంచిపెట్టి యాత్మ వివేకవంతుడై జ్ఞానము బడయుటకు యోగమార్గవలబించెను.

భువన వ్యవస్థ






Adivarahamurthy - ఆదివరాహమూర్తి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - ఆదివరాహమూర్తి

నారాయణుడిట్లనెను: పరంతాపా! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింపసాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. 

నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యముగనుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. 

దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘురరావమును వినిరి. అంత విప్రులు ఋక్‌-సామ-ఆధర్వణములందలి-ఛంధో మయములగు వచస్సులతో ఆద్యపురుషుని వరాహమును సుంస్తుతించిరి. 

వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు వరాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీట ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.

అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూతకోటుల కాశ్రయభూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తనకోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవునిగనిబ్రహ్మ-మనువు-స్వరాట్టుమున్నగువారతని నిట్లు సంస్తుతించిరిః 

బ్రహ్మయిట్లనెను: ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామఫలప్రదా! నీకు విజయమగుత! నీవుసత్యలోకమును సైతము ప్రతాపముచే కురుచపరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. 

దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింపబడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. 

దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాసరూపమున దేవ - అసుర-నరులను తృప్తిపఱచుచున్నాడు.

సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోకపాలకుడయ్యెను. 

గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోకవంద్యుడగునగు శివుడుసర్వదేవాధినాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లుచున్నాడు. 

ఇన్ని సర్వ శుభలక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవునగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణమునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహదేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. 

అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడుసర్వపాపముక్తుడై వైష్ణవ మార్గము బొందును.

స్వాయంభువమను సృష్టి






Bhuvana Kosamu - భువనకోశము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భువనకోశము

జనమేజయు డిట్లనెను: ఓ విప్రఋషీ! అమృతమునకు తావలమైన సూర్యచంద్రనవంశజులగు రాజుల సచ్చరిత్ర మును నీనోటచెవులారవింటిని. ఇపుడెల్ల మన్వంతరములందును శ్రీదేవి యేయే రూపములు దాల్చిపూజలందుకొనును? ఏయే స్థానములందేయే కర్మములచే నేయే శరీరములు దాల్చి యారాధింపబడి దేవిఫలము లొసగును. ఏ యే మంత్రబీజములచే జపింపబడును? 

ఆదేవి విరాట్స్యరూపవర్ణన యెట్టిది? ఎట్టిధ్యానమువలను బుద్ది సూత్రాత్మలో లీనమగును? అంతయును నాకు విపులముగ తేటతెల్ల మొనరింపుము. దానివలన నాకు శుభము గలుగుత. 

వ్యాసు డిట్లనెను: రాజా! అత్యుత్తమమైన శ్రీదేవ్యారానము గుఱించి చెప్పుచున్నాను. వినుము. అట్టియారాధనముచేసిన-విన్న-కన్నంత-మాత్రన నరుడు సకల శుభములుపడయగలడు. ఇదేవిషయమును గూర్చి మునుపు నారదుడు నారయణునడిగెను. అపుడు యోగవిద్యా ప్రవర్తకుడగు విష్ణు వతనికి చెప్పినవి నీకును చెప్పుదును వినుము. 

పూర్వ మొకప్పుడు నారదుడు యోగాత్మకుడగు పురుషోత్తమునితో నీ వడిగివన విషయము లడిగెను. 

ఓ దేవదేవా! మహాదేవా! పురాణపురుషోత్తమా!జగదాధారా! సర్వజ్ఞా! పోగడ దగిన సద్గుణముల రాశీ! ఈ ప్రపంచముయొక్క మూలతత్త్వ మెఱిగింపుము. ఈజగమంతయు నెచటినుండి పుట్టును? ఎచట ప్రతిష్ఠింబడి యున్నది? ఇది తుదకెచటలయ మొందును? ఎల్ల కర్మఫలము లెచటినుండి గల్గను? దీని నెఱింగినందువలన మోహకారమగు మాయ నశించగలదు? ఎవరి నర్చించిన నెవరిని జపించిన నెవరిని ధ్యానించిన చీకటి యండు సూర్యోదయమునలె స్వాత్మప్రకాశమగు జ్ఞానము గల్గను?

దేవా! నా యీ ప్రశ్నముల కన్నిటికి పూర్తిగ సమాధానము లిమ్ము. వానివలన వేగముగ లోకములన్నియు నజ్ఞాన తమస్సునుండి విడిపడును. అని దేవర్షి ప్రశ్నింపగా పురాణమునిసత్తముడు మహాయేగియగు నారయణుడానందభరితుడై యతని కిట్లు పలికెను: 

ఓయి దేవఋషీ! ఈ జగముయొక్క మూలతత్త్వము వినుము. దాని నెఱుంగుటవలన మానవుడు తిరిగి జగద్బ్రాంతిలో పడడు. ఈ జగత్తు మూలతత్త్వముగూర్చి నాతో దేవియే స్వయముగ మున్ను చెప్పినది. దేవ-ఋషి-గంధర్వ-మనీషులును నాతో చెప్పిరి. ఈజగమును దేవియే త్రిగుణము లాధారముగ చేసికొని పుట్టించును. పెంచును. తుద కామెయే సర్వము నశింపజేయును. 

దేవి దివ్వస్వరూపమును మహర్షులు-సిద్దులు వర్ణించి పూజించి చెప్పిరి. ఆస్వరూపమును స్మరించినంతనే పాపములు తొలగును. కామమోక్షములు గలుగును మొట్టమొదటి బ్రహ్మపుత్రుడు స్వాయంభువ మనువు. ఆతడు ప్రతాపవంతుడు. మన్వంతరాధిపతి-శతరూపాపతి-శ్రీమంతుడు. మనువు కల్మషరహితుడు ప్రజాపతియుగు తన పితృదేవుని భక్తితో సేవింపగ బ్రహ్మ తన కుమారున కిట్లనెను: 

ఓయి వత్సా! నీవు పవిత్రయు-సర్వోత్తమయునగు దేవి నారాధించుము. ఆమె దయవలన నీకు ప్రజాసృష్టి గల్గించు శక్తి గల్గును. అని బ్రహ్మపలుకగ స్వాయంభువ విభుడు జగత్కారణురాలగు జగదంబను గూర్చి తపముచేసి యామెను సంతోషపఱచెను. అతడు నిశ్చలమతితో సర్వ కారణకారణ-సర్వశక్తి-సమష్టిబ్రహ్మశక్తి-అద్య-దేవేశియగుదేవి నిట్లు నుతించెను. 

ఓ జగత్కారణకారణదేవీ! దేవేశ్వరీ! శంఖచక్రగదాహస్తా! నారాయణహృదయ కమలవాసినీ! నీకు శతకోటి నమస్సులు.

ఓ జగన్మాతా! కారణ స్దాన రూపిణి! శివా! సర్వ దేవ సన్నుతా! వేదత్రయ ప్రమాణజ్ఞా! వేదమూర్తీ! నీకు శతకోటినమస్సులు. మాహేశ్వరీ! మాహాభాగా! మహామాయా! మహోదయా! మహాదేవ ప్రియంకరీ! మహాదేవప్రేయసీ! నీకు శతకోటి నమస్సులు. గోపేంద్రప్రియా! జ్యేష్టాదేవీ! మహానందా! మహోత్సవా! మహామాయా! భయహరీ! దేవాదిపూజితా! నీకు శతకోటి నమస్సులు. సర్వమంగల మాంగల్యా శివా! సర్వార్థసాధికా! శరణ్యా! త్య్రంబకదేవీ! గౌరీ! నారాయణీ! నీకు శతకోటి నమస్సులు. 

ఈ విశ్వమంతయు నెవరి వలన నుత్పన్నమై ఎవరితో పడుగు పేకలతో వలె నిత్యము నిండియుండునో ఏది దివ్య చైతన్యపుంజమో యెద్ది తేజో విధానమో యెద్ది యాద్యంతరహితమో ఏ దేవీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగము లన్నిటిని పుట్టించునో హరి పాలించునో రుద్రడు సంహరించునో పద్మసంభవుడును మధుకైటభ భయపడితుడునగు బ్రహ్మ యే దేవిని సన్నుతించి ఘోర దానవ భయము పాసెనో అట్టి దేవిని హ్రీ-కీర్తి-స్మృతి-కాంతి-కమల-గిరిజ-సతి-దాక్షాయణి-వేదగర్బ-బుద్థిదాత్రి-అభయవు నీవే! ఓశ్రీమాతా! నీకు శతకోటి నమస్సులు. 

నేను నిన్నే పూజించి -జపించి-ధ్యానించి-భావించి వీక్షించి-విని-సుతింతును. దేవీ! నాయెడల ప్రసన్ను రాలవు గమ్ము బ్రహ్మవేదములకు నిధి; విష్ణువు లక్ష్మీ నిలయుడు; ఇంద్రుడు త్రిలోకపతి; వరుణుడు జలాధినేత; కుబేరుడు నిధులకునాధుడు; యముడు ప్రేతపతి; నైఋతుడు రక్షోదక్షుడు; సోముడు జలమయుడు; వీరెల్లరు నీ వలన నున్నత పదవులందిరి. జగన్మాతా! నీవు త్రిలోకవంద్యపు; లోకేశ్వరివి; మహా మాంగల్యస్వరూపిణివి; నీకు శతకోటి నమస్సులు తల్లీ!

నారాయణు డిట్లనెను: నారదా! అని యిట్లు దుర్గ-భగవతి-నారాయణి దేవిని సన్నుతింతగ దేవిని ప్రసన్నరాలై మనువున కిట్లు పలికెను. 

బ్రహ్మపుత్రా! రాజేంద్రా! నీ సంస్తవమునకు ప్రసన్నురాలనైతిని. ఏదేని వరమడుగుము. 

మను విట్లనెను: దయామయా! దేవీ! నా భక్తికి ప్రసన్నవైనచో నీ యానతి వలన నేయడ్డంకులు లేక ప్రజాసృష్టి కొనసాగవలయును. 

శ్రీదేవి యిట్లనెను: రాజేంద్రా! నాయనుగ్రహము వలన ప్రజాసృష్టి నిర్విఘ్నముగ నుత్తరోత్తరముగ నభివృద్ధి జెందుగాత! నా మీది భక్తితో నీవు స్తుతించిన యీ స్తోత్రము నెవడు పఠించునో యతనికి తప్పక విద్య సంతతి కీర్తి కాంతి గల్గను; 

రాజా! ఎవరు దేవి దయకు పాత్రులో వారికి ధన ధాన్యములు గల్గను; ఎల్లెడల వారికి విజయము సుఖము గల్గను; శత్రువులు నశింతురు. 

నారాయణు డిట్లనెను: ఈ విధముగ బ్రహ్మపుత్రుడగు మనువునకు వరము లొసంగి యాధీశాలి చూచుచుండగ దేవి యంతర్దాన మొందెను. రాజా! ఇట్లు బ్రహ్మపుత్రుడగు ప్రతాపి యగు మనువు వరములు బడసి తనకోక ప్రత్యేక సాధన మిమ్మని బ్రహ్మనడిగెను. నే నచ్చటి నుండి పుష్కలముగ ప్రజలను సృజింపగలను; యజ్ఞములతో దేవేశిని గూర్తి వెల్తును; త్వరగ నాకు చోటు చూపుము; ఆజ్ఞాపింపుము. ఆను కూమారుని పలుకులు విని ప్రజాపతియు విభుడునగు బ్రహ్మ యీ పని యెట్లు నెఱవేరునాయని దీరఘముగ నాలోచించెను. ఈ యనంతమైన సృష్టి చేసి నా కనంతకాలము గడచిపోయెను. భూమి నీట మునిగెను; అన్నిటికి జలము సదా ధారమయ్యెను, ఈ నా తలంచిన కార్యము నాది పూరుషుడగు భగవానుడే చేయగలడు. ఎవని యాదేశమున నే నిచట నుంటినో యతడే నాకీ పనిచో తోడుపగలడు.

ఆదివరాహమూర్తి






SRI DEVI BHAGAVATHAM PART 8 - శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన శౌనకాదిమ మహర్షులు హర్షపులకితగాత్రులు ఆయ్యారు.

శౌనకాది మహామునులారా! అప్పుడు జనమేజయుడు అడిగినదీ వ్యాసుడు చెప్పినదీ  వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి - అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు.

వ్యాసమహర్షీ! సూర్యచంద్రవంశాల చరిత్రనూ దేవీగీతనూ వినిపించావు. అమృత ప్రాయంగా ఆస్వాదించాను. మన్వంతరాలలో మహాదేవిని ఏయే స్థానాలలో ఎయే రూపాలలో ఏయే పూజలతో ఏయే బీజాక్షరాలతో ఎలాయెలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తెలియజెప్పవా - అని అభ్యర్థించాడు జనమేజయుడు. 

వ్యాసుడు డిట్లనెనుజనమేజయా ! విను. దేవీ ఆరాధనవిధానమంతా చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే. వెనకటికి నారదుడు అడిగితే యోగమార్గప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలివి.

భువనకోశము












Method of external worship - బాహ్యపూజా విధానం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - బాహ్యపూజా విధానం

శ్రీదేవి యిట్లనెను: సాధకుడు ప్రొద్దుప్రొద్దుననే మేల్కాంచి తన బ్రహ్మరంధ్రమున కర్పూరవర్ణముగల దివ్య సహస్రారకమలమందు స్వాత్మరూపుజగు గురుదేవుని సంస్మరించవలయును. గురుదేవుడు లసద్‌భూషలుదాల్చి సకల విచిత్ర శక్తులు గల్గియుండును. 

అతనికి మ్రొక్కి పిదప బుధుడు కండలినీదేవిని మది తలంపవలయును. కుండనీశక్తి బ్రహ్మరంధ్రము జేరునపుడు చైతన్య కాంతి పుంజములు విరజిమ్ముచు క్రిందికి దిగునపుడమృతస్వరూపిణి యగుచు సుషుమ్నా మార్గమున సంచరించునపుడు బ్రహ్మానంద రసస్వరూపమున చెన్నుదలిర్చును. 

అట్టి పరాశక్తిని శరణు వేడుచున్నాను. అని మూలాధారమందలి చైతన్యజ్యోతితో వెలగొందుచున్న సత్యజ్ఞానానంతరూపిణి నగు నన్నే ధ్యానింపవలయును. అటుపిమ్మట శౌచాది నిత్యకృత్యములు తీర్చుకొనవలయును. తర్వాత బ్రహ్మణుడు నన్నుద్దేశించి నా ప్రీతికై యగ్నికారయము జరిపి పిదప సఖాసనమున గూర్చిండి నా పుజకు సంకల్పించవలయును. 

తొలుత భూతశుద్ద జేసి తర్వాత మాయబీజమగు హ్రీంకారముతో మాతృకాన్యాస మొనర్పవలయును. మూలాధార మందు ''హ'' కారమును హృదయమున రేఫమును కన్బొమల నడుమ ''ఈ'' కారమును శిరమున హ్రీంకారమును న్యాస మొనర్పవలయును. పిదప నితర మంత్రములకు చెప్పబడిన న్యాసములను సైతము చేయవలయును. 

తన దేహమందే ధర్మాదులతో పీఠపూజ సలుపవలయును. పిదప ప్రాణయామమువలన హృదయ కమలము విప్పారును. ఆది నా నివాసస్థానము. అచట పంచ ప్రేతాసనముపై శోభిల్లు మహాదేవినగు నన్ను ధ్యానింపవలయును. బ్రహ్మ-విష్ణు-రుద్రుడు-ఈశ్వరుడు-సదాశివుడు అను వీరిని పంచప్రేతము లందురు. వీరు నా పాదమూలమున నిత్యము వినసింతురు. 

వీరు భూమి-నీరు-తేజము-వాయువు-గగనమను పంచభూతములతోను జాగ్రత్త-స్వప్నము-సుషుప్తి-తురీ యము-అతీతమను పంచావస్థలతోను గూడి యుందురు. అవ్యక్త చిద్రూపిణి నగు నేను వీరి కధిపతిని. సర్వాతిశాయినిని. వీరైదుగురును నాకాసనములై యుండుటగూర్చి శక్తితంత్రములందు వెల్లడింపబడెను. 

ఈ విధముగ నన్నే ధ్యానించి మానసోపచారములతో నన్నే పూజింపవలయును. జపింవలయును. జనఫలము దేవి కర్పించి యర్ఘ్య పాత్రాదుల నాసాదించుకోని పూజాద్రవ్యములు శుద్ది చేయవలయును. ''హ్రీం'' లేక ''ఫట్‌'' అను మంత్రమున మంత్రించిన జలముతో శుద్ది చేయవలయును. మొదట దిగ్బంధ మొనరించి పిదప గురువందనము చేసి గురు నానతి బడసిన పిదప మొదట హృదయమున భావించిన దివ్యమంగళ విగ్రహమువంటి విగ్రహము నా వాహనము చేయవలయును.

ఇట్లు ప్రాణప్రతిష్టా మంత్రముతో న వాహనము చేసిన పిదప శ్రద్ధాభక్తులతో శ్రీరాజరాజేశ్వరి కాసనము ఆర్ఘ్య పాద్యములు ఆచమనము నైవేద్య తాంబూలము దేవి కర్పించవలయును. తదుపరి శ్రీచ్రకమందున్న యావరణ దేవతలను చక్కగ పూజింపవలయును. ఇట్లు ప్రతిదినము చేయజాలనిచో ఒక శుక్రవారము నాడైన చేయవలయును. 

ఈ యంగ దేవతలను శ్రీ యాదిదేవి విరజిమ్ముచున్న కాంతిపుంజములుగ నెంచవలయును. పిమ్మట పువరానృత్తిగల మూలదేవిని సుగంధ కుంకుమాదులచే బూజింపవలయును. తావులు వెదజల్లు పూలర్పించవలయును. నన్ను తరువాత నైవేద్యతర్పణతాంబూల దక్షిణలతో తనుపవలయును. 

నగేశా! తర్వాత నీవు రచించిన దేవిసహస్ర నామములతో నన్ను సంతోషపెట్టవలయును. నన్ను తంత్రోక్తమగు కవచముతోను అహంరుద్రేభిః అను దేవిసుక్తముతోను హ్రీంకారోపనిషచ్చులోని థర్వశిమంత్రములోను శ్రీమహావిద్యలోని మహామంత్రములతోను మాటిమాటికి సంతోషపఱచవలయును. 

పిదప భక్తిరసమునపులకిత హృదయుడై జగదంబను తప్పిదములను క్షమింపుమని వేడుకొనవలయును. తర్వాత తన శరీరములోని యణువణువు ప్రేమరసమున గగుర్పాటొదవ నానందభాష్పములతో డగ్గుత్తికతో నృత్యగీతవాద్యములతో దేవిని ప్రసన్నురాలిని చేయవలయును. 

ఓ వేదపారాయణములందును సకల పురాణములందును నేనే ప్రతిపాద్యను. అందువలన వేదపారాణముచేసి నన్నానందపఱచవలయును. బ్రహ్మణులనుముత్తైదువలను పడుగులను కన్యకలనునితంపామర జనమును శ్రీదేవిగబావించి వారికితుష్టిగ భోజనము పెట్టవలయును. పిదప దేవిని యెడదలో నమస్కరించి సంహరముద్రతో దేవి కుద్వాసనము తెప్పవలయును. 

ఓ సువ్రతా! హ్రీంకార మెల్ల మంత్రములకు నాయకమణి వంటిది. కనుకనట్టి హ్రీంకారముతోనే పూజావిధాన మంతయును జరుపవలయును. నేను హ్రీంకార మనెడు నద్దమందు నిత్యము ప్రతిబించుచుందును. కనుక హ్రీంకారమున సమర్పించిన దంతయునుసర్వమంత్రములతో నర్పించిన దానితో సాటియుగును. 

పిదప తన గురుని వస్త్రాదులతో పూజించి తన్ను తాను. ధన్యునిగ తలంచుకొనవలయును. ఎవడీ విధముగ శ్రీభువనేశ్వరీ దేవిని సంపూజించునో- అతని కెప్పుడు నెచ్చట నేదియును సాధ్యము కానిది లేదు. అతడు శరీరము వదలిన పిమ్మట నా మణిద్వీపమును తప్పక చేరుకొనగలడు ఇట్టి నాపరమ భక్తుని దేవీ స్వరూపునిగా నెఱుంగవలయును. ఇతని కెల్ల దేవతలును నమస్కరింతురు. 

ఓరాజా! ఈ విధముగ నీకు శ్రీదేవీ పూజా విధానమంతయును వివరించితిని. ఇదంతయును తెలిసికొని నీ శక్తికి తగినట్లుగ నన్ను పూజింపుము. దానిచే నీవు ధన్య భాగ్యుడవగుదువు. ఈ దివ్య దేవీ గీతాశాస్త్రమును దేవీ భక్తుడు శిష్యుడు గాని వానికిని ధూర్తుడు దుష్టుడునైన వానికి నెప్పుడును చెప్పరాదు. ఈ దేవీ గీతలను ప్రకటించుట తన తల్లి స్తనములను బైటికి చూపుటవంటిది. 

కనుక దేవిగీతలను యత్నముతో సతము రహస్యముగ నుంచవలయుము. దీనిని దేవీభక్తుడు-వినీతశిష్యుడు-పెద్దకొడుకు-సుశీలుడు-సువ్రతుడు-నగు వానికే చెప్పవలయును. దీనిని ప్రత్యేకముగ దేవి పలికి యచ్చోట నంతర్దానమొందెను. 

శ్రీదేవీ దర్శన భాగ్యమున నెల్ల దేవతలు నానంద భరితులైరి. హైమనతీదేవి హిమాలయునకు పుత్రికగ జన్మించి గౌరి యనబరగెను. ఆమెను శంకరున కిచ్చి వివాబము జరిపిరి. పిదప వారికి షణ్ముఖుడు జన్మించి తారకాసురుని దునుమాడెను, 

జనమేజ రాజా!మున్ను సముద్ర మథనము వేళ పెక్కు రత్నములుద్బవించెను, అమరులు లక్ష్మీప్రాప్తికి స్తోత్రము చేయగ లక్ష్మీదేవి సంతుష్టయై సాగరమందుద్బవించెను. దేవతలు లక్ష్మీదేవిని విష్ణునకొసంగిరి. అంత నామె సంతుష్ఠి జెందెను. 

రాజా!ఈవిధముగ నత్యత్తమమైన దేవీ మాహాత్మ్యము వివరింపబడినది. ఈ శ్రీగౌరీలక్ష్ముల యవతార కథ సర్వకామము లీడేర్చను. ఇది మిక్కిలి రహస్యమైనది. దీని నితరులకు చెప్పరాదు. ఈ శ్రీ దేవీగీతను రహస్యముగ పాడుము. ఓ యనఘా! నీవడిగిన దంతయును పవిత్రము పావనము దివ్యమునైనది. దీనిని వినిన తర్వాత నీవేమి వినదలతువో తెలుపుము.

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

Tamasagamas and Antartantric worship - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

లోకమందింకను వివిధ శాస్త్రములు గంవు. అవన్నియు శ్రుతి స్మృతి విరుద్దము లగుటచేత తామసము లనబడును. వామము కాపాలము కౌలకము భైరవము మున్నగు తంత్రములు గలవు. 

ఈ యాగమతంత్రముల ఫలాశకు వేదాధికారము లేనివారు మోహితులు గావలయునని వీనిని శివుడు రచించెను. (వీరు పాపఫలమును భవించుచు శుద్దులై క్రమముగ పుణ్యులై వేద మార్గ మవలంబింతురు) అంతేకాని యితర కారణము లేదు. 

దక్ష భృగు దధీచి మహర్షుల శాపమునకు కొందఱుబలియైరి. వారు వేదబాహ్యులైన బ్రాహ్మణులు. 

అట్టివారిని సోపానక్రమమున నుద్ధరించుటకు శివుడాగమములను రచించెను. శైవము వైష్ణవము సౌరము సాక్తము గాణాపత్యమునను నాగమములను శంకరుడు రచించెను. వానియందు కొన్ని చోట్ల వేదాను కూలముగను కొన్ని యెడల వేదవిరుద్ధముగను వ్రాయబడెను. 

కనుక నందలి వేదానుకూలములగు నంశములను వైదికు లాచరించుటలో నెట్టి దోషమును లేదు. విప్రుడెన్నడును వేదార్దమునకు భిన్నార్దము గ్రహింపరాదు. వేదాధికారి కానివాడే భిన్నార్దములు గ్రహించును. 

కనుక వెదికుడైనవాడు సర్వప్రకారముల వేదమార్గ మనుష్ఠింపవలయును. వేదధర్మమువలని జ్ఞానమే బ్రహ్మ సాక్షత్కారము గల్గించును. ఈ షణత్రయమును విడనాడి నన్నేశరణు పొందినవారు సర్వభూతదయాళురు మానదంభాహంకారములు లేనివారు-ఇట్టి బ్రహ్మచారులును గహస్థులును వానప్రస్థలును సంన్యాసులును మచ్చిత్తులు-మద్గతప్రాణులునై నా తీర్థములు సేవించుటలో నిమగ్నులగుదురు. 

వారు పరభక్తితో నా యీ సంపత్కరమగు విరాట్స్వరూపమునుపాసింతురు. అట్టి నాయందు నిత్యయుక్తిగలవారి యందు నజ్ఞాతము ముండును. నేను జ్ఞానమను సూర్యప్రకాశముతో వారి యజ్ఞానతమము బాపుదును. నగాధిపా! ఇది నా వైదిక పూజయొక్క మొదటి పద్ధతి. దీనినిట్లు సంక్షేపముగ వెల్లండించితిని.

ఇక రెండవ పూజా విధానము తెల్పుచున్నాను. శ్రీ విగ్రహమందుగాని శుద్ధ ప్రదేశమునగాని సూర్యచంద్రమండలములందుగాని జలములందుగాని బాణలింగమందుగాని యంత్రమందుగాని మహావస్త్రమునగాని శ్రీహృదయ కమలమందుగాని పరాత్పరాదేవిని ధ్యానింపనలయును. 

దేవి సుగుణ-సౌందర్యలావణ్యరేణ్య-కరుణామృత తరంగిణి-సర్వావయవసుందరి-దివ్యా రుణారుణ-తరుణీమణీ-శృంగారరసాధినాయిక-భక్తార్తినివారిణీ-ప్రసన్నవదనాంబుజ-కిశోరచంద్రశేఖర-పాశ-అంకుశ-వర-అభయ ముద్రలుగలది-దివ్యానంద స్వరూపిణియగు దేవిని షోడశోపచారపూజల నర్చింపవలయును. 

అభ్యంతరపూజ యందధికారము గల్గనంతవరఱకు నీ బాహ్యపుజ నాచరింపవలయును. అధికారము గల్గిన పిదప దీనిని వదలవచ్చును. ఉపాధిరహితమైన బ్రహ్మజ్ఞానమే నా స్వరూపము. ఇట్టి నా యాత్మస్వరూపమున చిత్తముతాదాత్మ్యమందుటే యాభ్యంతర పూజ యగును. కనుక జ్ఞానస్వరూపిణినగు నాయందైకాంతిక బావమున చిత్తము నిలుపవలయును. 

ఈ యాత్మజ్ఞానముదక్క మిగిలిన జగమంతయును నట్టిదే. మాయామయయే. కనుక మాత్మస్వరూపిణి-సర్నసాక్షిణినగు నన్నే నిర్వకల్ప భక్తితో యోగయుక్తత్తముతో నిరంతరము ధ్యానింపవలయును. ఓ గిరిరాజా! దీనితర్వాత బాహ్యపూజా విధానము చెప్పబడుచున్నది సావధానముగ వినుము.

బాహ్యపూజా విధానం

Friday, April 24, 2026

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల్ల స్త్రీ పురుషులు తప్పక నిష్ఠతో నాచరింపవలయును. అనంతతృతీయావ్రతము-రవికల్యాణినీ వ్రతము-
అర్ద్రానందకరమను తృతీయా వ్రతము-శుక్రవార వ్రతము-కృష్ణ చతుర్దశీ వ్రతము-భౌమవారవ్రతము-ప్రదోష వ్రతము-మున్నగునవి దేవీముఖ్యవ్రతము.

మొదట పూజాస్థానము దేవదేవుడగు మహాదేవుని శ్రీ దేవీని పీఠముపై నుంచ వలయును. ప్రదోషసమయమున శ్రీదేవీ సన్నిధానమున నెల్ల దేవతల యెదుట నృత్యమొనరిణపవలయును. పగలంతయు నుపవసించి ప్రదోషమున మంగళమయియగు శివను పూజింపవలయును.

ఇట్లు ప్రతి పక్షమందును వ్రతము లాచరించిన దేవి మిక్కిలి సంతోషంచును నగేశా! సోమవారవ్రతము నాకత్యంత ప్రియమైన వ్రతము. ఇటుల శ్రీదేవిని చక్కగ నర్చించి రాత్రివేళ భుజింపవలయును. నాకురెండు నవరాత్ర మహోత్సవములను మిక్కిలి ప్రియకరములు.

ఇవికాక నా ప్రీత్యర్ధము మచ్చర ముడిగి నిత్య మైమిత్తికము లాచరింపవలయును. వ్రతము లాచరింపవలయును. అటు లొనర్చిన నా ప్రియభక్తుడు నా సాయుజ్య పదవి పొందును. ఇంక నా మహోత్సవములు పెక్కు గలవు. వానిలో డోలోత్సవముశయ నోత్సవము జాగరణోత్సవము రధోత్సవము దమనోత్సవము మున్నగు నుత్సవము లాచరింపవలయును.

ముఖ్యముగ శ్రావణమాసమందు పవిత్రోత్సవము నాకు మిక్కిలి యిష్టమైనది. ఇట్లు నా భక్తుడైనవాడు దేవీ మహోత్సవములు భక్తిశ్రద్ధలతో జరుపవలయును. పిమ్మట నా భక్తులను-ముతైదువలను-బాలికలను-వడుగులను-దేవిభావమున నర్చించి వారిలో నన్నే కనుచు వారికి భోజనము పెట్టవలయును. డబ్బునకు గింజువలాడుకొనక వీరి నెల్లరిని పుష్పతాంబూల వస్త్రములతో సమ్మానింపవలయును.

ఇట్లు ప్రతియేడు జాగరూకుడై దేవీభక్తు డాచరింపవలయును. అట్టివాడు కృతార్ధుడు-ధన్యభాగ్యుడు-పుణ్యాత్ముడు-నా ప్రేమకు పాత్రుడు. ఈ విధముగ నాకు ప్రియమైన విషయము లన్నియును సంక్షేపముగ దెలిపితిని. దీని నంతయును దేవీభక్తుడుగాని వానికిని ప్రియశిష్యుడుగాని వానికిని చెప్పరాదు.

హిమాలయు డిట్లనెను: ఓ దేవదేవీ! మహేశానీ! దయారసతరంగిణీ! జగదంబికా! ఇపుడు నీ దివ్య పూజా విధానము చక్కగ దెలుపుము. 

శ్రీ దేవి యిట్లనెను: గిరిసత్తమా! శ్రీదేవికి మిక్కిలి ప్రియమైన పూజావిధానము తెల్పుదును. శ్రద్దగ వినుము. నా పూజ రెండు విధములు. బాహ్యము-అభ్యంతరము. బాహ్యపూజ మరల వైదికము-తాంత్రికమని రెండు విధములు. 

ఓ భూధరా! వైదికపూజయు మూర్తిభేదముచే మరల రెండు విధములు. మొదటిది వేదదీక్ష నందినవాడు వేదమంత్ర పూర్వకముగా దేవి నా వాహనాదులతో నర్చించుట-తంత్రదీక్షతో తంత్రోక్త విధానముగ చేయు పూజ తాంత్రికపూజ. ఇట్టి పూజ్యారహ్యస మెఱుగక వైదిక దీక్షితుడు తంత్రోక్తముగా గాని తంత్రదీక్షితుడు వైదోక్తముగ గాని పుజింపరాదు. అట్లు పూజించిన మూఢమతి తప్పక పతితుడగును. 

తొలుత వైదిక పూజావిధానమువివరింతును. ఆలింపుము. ఓ గిరివరా! ఇంతకుమునుపు మా యే వేయితలలు వేయికన్నులు వేయి పాదములుగల మహాద్బుత రూపము సాక్షాత్తుగ దరిశంచితివో ఏది సర్వశక్తులకు మూలశక్తియో ఏవరేణ్యతేజము బుద్దిప్రేరకమో ఏది పరాత్పరతరమో యట్టి నా రూపమును నిత్యము పూజించి ధ్యానించి స్మరింపవలయును. 

నగా! ఇదివైదికమార్గమలోని మొదటిపూజా విధానము చెప్పబడెను. ఇట్లు పూజించువాడు నిశ్చలమతితో గంభాహంకృతులు వదల వలయును. నీవును దేవీతత్పరుడవై దేవీహోమమువల చేయుచు దేవీశర మొందుచు దేవీగత చిత్తముతో సర్వమును దేవీభావమునగనుచు దేవీజపధ్యానములు నిరంతరము సలుపుచుండుము. నిత్యము ప్రేమభక్తితో సర్వాత్మభావముతో నన్యప్రేమతో నా మహాయజ్ఞములు జరిపివేల్చుము. నన్నే ప్రసన్నురాలినిచేయుము. ఈరీతి చేసిన నాయను గ్రహమువలన భవబంధములనుండి విముక్తుడవు కాగలవు. ఎనరు మచ్చిత్తులై మద్గతప్రాణులై నా భక్తవరులై యుందురో-

వారిని తప్పకనే నీ ఘోరదురితసంసారిమునుండి వెంచనే సముద్దరింతును. నేను కర్మయుక్త ధాన్యముచేత భక్తిజ్ఞానము చేత వీనిలో దేనిచేనైన లభింతును. గిరిరాజా! అంతేకాని కేవలము కర్మముచే నేను చిక్కను. ధర్మమువలన భక్తి-భక్తివలన జ్ఞానము-గలుగును. శ్రుతి స్మృతిలందు చెప్పబడినది ధర్మమగును గాని యితర శాస్త్రములందు చెప్పబడినది ధర్మముగాదు. అది ధర్మాబాస మనబడును. 

నాయందజ్ఞానము లేదు. నేను సర్వజ్ఞురాలను. నానుండియే వేదములు పుట్టుటచేత వేదములు భ్రాంతిలేని సత్యవస్తువులు. సుప్రమాణములు. మన్వాది మహర్షలు వేదములలోని యాంతరార్థంమును గ్రబించి స్మృతులు రచించిరి. కనుక స్మృతులును వేదప్రమాణకములే. 

కాని కొన్నిచోట్ల తంత్రార్దమును దృష్టిలోనుంచుకొని తెలుపబడిన ధర్మాంశములను వైదికులు గ్రహింపరాదు. వేదము నంగీకరింపని యితర శాస్త్రకారుల వాక్కులజ్ఞానదూషితము లగుటచేతవారి మాటలు ప్రమాణములు గావు. కనుకమోక్షము గోరువాడు ధర్మమెఱుంగుటకు వేదమునే ప్రమాణముగ గ్రహింపవలయును. ఎట్లు లోకమునందురాజాజ్ఞ చెల్లుబడియగుచుండునో - అట్లే సర్వేశ్వరి నగు నాశాసనము లోకమున చెల్లుబడి యగుచండును. 

నా వేదానుశాసనము నెవడును తిరస్కరింపరాదు. నా వేదాజ్ఞను గాపాడుటకే బ్రాహ్మణ క్షత్రియ జాతులు గలిగించితిని. నా వేదవాక్కులందలి రహస్యము తప్పకనెఱంగవలయును. గిరీశా| ధర్మహాని గల్గినప్పుడు అధర్మముపెచ్చుపెరిగినపుడు నేను శాకంభరి మున్నగు పెక్కు దివ్యరూపములు దాల్తును. విబుధులు వేద రక్షకులు. దానవులు వేదవినాశకులు. నావేదధర్మ మనుసరించని వారికొఱకు నరకములు కల్పించితిని. వానిని గుఱించి విన్న మాత్రానగుండె లవిసిపోవును.

ఎవ్వడు వేదధర్మమును తూలనాడి యితర ధర్మము లనుసరించునో యట్టి ధర్మబాహ్యుని రాజు తన దేశమునుండి వెడలగొట్టవలయును. అట్ట వారిని బంతినుండి వెలివేయవలయును. వారితో విప్రులు మాటాడరాదు. 

తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల...