Tuesday, July 21, 2026

Zodiac signs favored by Goddess Lakshmi - లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రాశులపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.

చంద్రుడు, గురుడు మరియు శుక్రుడు అధిపతులుగా కలిగిన రాశుల మీద లక్ష్మీ దేవి చూపు చల్లగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసం, సౌభాగ్యానికి కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశివారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పోషణకు ప్రతీక. కుటుంబాన్ని గౌరవించే స్వభావం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

తులా రాశి
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. సమతుల్యత, అందం, మంచి సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక వంటి లక్షణాలు ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే ఐశ్వర్య యోగాలు కలుగుతాయని భావిస్తారు.

ధనుస్సు రాశి
ఈ రాశికి అధిపతి గురుడు. గురుడు జ్ఞానం, ధర్మం, పుణ్యానికి సూచిక. ధర్మమార్గంలో నడిచేవారిపై లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

మీన రాశి
మీన రాశికి కూడా గురుడే అధిపతి. భక్తి, దయ, దానం, ఆధ్యాత్మికత ఈ రాశివారి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఈ గుణాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం రాశిని బట్టి మాత్రమే కాదు. భక్తి, నిజాయితీ, పరిశుభ్రత, దానం, ధర్మాచరణ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ప్రతి ఒక్కరిపై ఆమె కటాక్షం ఉంటుందని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. రాశి ఒక సూచిక మాత్రమే, సత్కర్మలే లక్ష్మీ కటాక్షానికి నిజమైన మార్గం.

Monday, July 20, 2026

Henna in the month of Ashadha - ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాడ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.. జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలంను ఆషాడం మాసం అని పిలుస్తాం. ఆషాడం వచ్చిదంటే చాలు వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది.

గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమై గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు.

ఆషాఢంలోనే ఎందుకు:
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కలు:
ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక, అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చేతులకి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

Murudeshwar, Bhatkal Taluk, Uttara Kannada District, Karnataka State - మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన 123 అడుగుల భారీ శివ విగ్రహానికి మరియు 20 అంతస్తుల (237 అడుగులు) రాజగోపురానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయం కందుక కొండపై ఉంది, ఇక్కడ సముద్రపు అలల హోరు మధ్య శివ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

శివయ్యకు ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్. మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.

ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

పురాణ కథనం:
మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

చరిత్ర:

ఆత్మలింగం: త్రేతాయుగంలో రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి సాధించిన ఆత్మలింగం ఈ ప్రదేశంతో ముడిపడి ఉంది.

భారీ శివ విగ్రహం: కొండపై భాగంలో ఉన్న ఈ 123 అడుగుల శివుని విగ్రహం సూర్యకాంతిలో మెరుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రాజగోపురం: ఆలయం వద్ద నిర్మించిన 237 అడుగుల రాజగోపురానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దీని పైభాగానికి వెళ్లి చూస్తే అరేబియా సముద్రం మరియు మురుడేశ్వర్ పరిసరాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి.

ఇతర విశేషాలు:
మురుడేశ్వర దేవాలయం: ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది.మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంది.ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు ఉన్నాయి.

మురుడేశ్వర కోట: ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని మన హిందూ రాజులు పునరుద్ధరించాడు.

శివుని విగ్రహం: ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహం.
123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.

ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.

ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డు మార్గం:
హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం:
మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన మార్గం:
మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Bonalu - బోనాలు

బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం దేవికి సమర్పించే నైవేద్యం అని అర్థం.

బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళి దేవి సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది ఆషాడ మాసం నెలలో జరుపుకుంటారు. పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున యెల్లమ్మ (మహాకాళి యొక్క అనేక ప్రాంతీయ రూపాలలో ఒకటి) కోసం ప్రత్యేక "పూజలు" (పూజలు/ వేడుకలు) నిర్వహిస్తారు. ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగ పరిగణించబడుతుంది.

బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం , ఇది సంస్కృత రుణ పదం, దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు-కుంకం, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు.బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు.

ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

పోతురాజు
పురాణాల ప్రకారం, పోతరాజు మాతృదేవత సోదరుడు. ఊరేగింపులో అతని పాత్రను చక్కగా కట్టుకున్న, ఒట్టి శరీరంతో, చిన్నగా గట్టిగా కప్పబడిన ఎర్రని ధోతీని ధరించి, తన చీలమండలపై గంటలు, మరియు అతని శరీరంపై పసుపు మరియు అతని నుదుటి పై నుంచి అభిషేకం చేస్తారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు.

పోతరాజు ఎప్పుడూ ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. అతను మాతృ దేవత ( షిగామ్ అని పిలుస్తారు) మంత్రముగ్ధులను చేసే మహిళా నృత్యకారులను, కొరడా దెబ్బలు మరియు పచ్చ వేప ఆకులను (మార్గోసా) వారి నడుము చుట్టూ కట్టి, బాకాలు మరియు డప్పులతో ఆలయానికి నడిపిస్తాడు.

Thursday, July 16, 2026

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే, జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

ఆషాఢ శుద్ధవిదియ పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.

ప్రాముఖ్యత
హిందూ మతంలో జగన్నాథ రథయాత్రకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ అన్నయ్య బలభద్ర మరియు చెల్లెలు సుభద్రతో పాటు శ్రీకృష్ణుడిని పూజించడానికి అంకితం చేయబడింది. స్నాన పూర్ణిమ నుండి వేడుక ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవంలో మూడు రథాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. పూరి జగన్నాథ దేవాలయం ప్రతి సంవత్సరం వివిధ రకాల పువ్వులు, రంగోలి మరియు దీపాలతో అలంకరించబడుతుంది. 12వ శతాబ్దంలో జగన్నాథ్ పూరీ ఉత్సవం ప్రారంభమైంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి.

ఈ పవిత్రమైన రోజున, పూరీ జగన్నాథ ఆలయం నుండి బలరాం, జగన్నాథుడు మరియు సుభద్ర విగ్రహాలు బయటకు వస్తాయి. భక్తులు పెద్ద పెద్ద రథాలపై విగ్రహాలను ఉంచుతారు. ఆ తర్వాత డప్పు తాళ్లతో నగరమంతటా భక్తులు రథాలను లాగడం ద్వారా, జగన్నాథుడు భక్తులకు గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును అనుగ్రహిస్తాడని మరియు ఈ వ్యక్తులు అన్ని ఆటంకాల నుండి బయటపడి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.

ఆచారాలు
భక్తులు రథాల వద్దకు చేరుకునే ముందు గుండిచా ఆలయాన్ని శుభ్రం చేస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని పిలుస్తారు, దీనికి 16 చక్రాలు, బలభద్రుడి రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు మరియు దీనికి 14 చక్రాలు మరియు సుభద్రా దేవి రథాన్ని 12 చక్రాలు కలిగిన దర్పదలన్ అని పిలుస్తారు. సుభద్ర రథాలకు అర్జునుడు సారథి అవుతాడని మరియు అది రెండు రథాల మధ్య ఉంటుందని నమ్ముతారు.

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది. వైష్ణవ సంప్రదాయాలకు, ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.

ఆలయంపై జెండా
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

సుదర్శన చక్రం
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు.

ఆలయ నిర్మాణం
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.

సింఘద్వారం రహస్యం
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.

Tuesday, July 14, 2026

The Soul's 13-Day Journey - ఆత్మ 13 రోజుల ప్రయాణం

ఆత్మ 13 రోజులు ప్రయాణం మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? 
ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం 

మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. 

మొదటి 3 రోజులు మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారితెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు. 

4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. 

11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు. 

12వ రోజు – సపిండీకరణ ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి. 

13వ రోజు – కర్మకాండ ముగింపు 13వ రోజుఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది. 

ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి? ఆత్మకు శాంతి కోసం కుటుంబానికి మానసిక ధైర్యం కోసం పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు. అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.

అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు కానీ, ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది. 

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. 

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా  ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. 

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. 

కుండను కింద పడేసి పగలగొడతాం అంటే, ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.

Reasons for sleeplessness - నిద్రపట్టకపోవడానికి కారణాలు

నిద్రపట్టకపోవడానికి కారణాలు

అధిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన మనసు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది.

రోజువారీ నిద్ర వేళలు సరిగ్గా లేకపోవడం, ఉదాహరణకు వీకెండ్స్ లో ఆలస్యంగా పడుకోవడం లేదా లేవడం వంటివి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతాయి.

రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకోవడం లేదా కెఫీన్ (కాఫీ, టీ) లేదా ఆల్కహాల్ వంటివి తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది.

రాత్రిపూట మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటివి ఎక్కువగా వాడటం వలన వాటి నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచి, నిద్ర రాకుండా చేస్తుంది.

నిద్రలేమికి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, స్లీప్ ఆప్నియా (నిద్రలో ఊపిరి ఆగిపోవడం), దీర్ఘకాలిక నొప్పి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

ఈ సమస్యలను అధిగమించడానికి, మీరు నిద్రపోయే ముందు చల్లని గదిలో ప్రశాంతంగా ఉండడం, మొబైల్ వాడకం తగ్గించడం, మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులను సంప్రదించడం మంచిది.


స్లీప్ బ్యాంకింగ్
టైమ్ దొరికినప్పుడు ఎక్కువ నిద్రపోయి దాన్ని బ్యాంక్ బ్యాలన్స్‌లాగా తర్వాత వాడుకోవచ్చా?

ఆరోగ్యచిట్కాలు

వారాంతం రావడానికి ముందే, అలారం ఆపేసి, కావల్సినంత సేపు నిద్ర పోవడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటారు. పని రోజుల్లో మిస్సయిన రెస్ట్‌ను తిరిగి పొందేందుకు వారాంతాల్లో దొరికే ఈ సౌకర్యాన్ని వాడుకోవడం సాధారణ వ్యూహం. 
అయితే మనం దీని గురించి కరెక్టుగానే ఆలోచిస్తున్నామా?

నిద్ర లేని రాత్రుల్ని ఎదుర్కోవడానికి, వారాంతం తర్వాత వచ్చే పని రోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, ముందుగానే అదనపు గంటలు నిద్ర పోవడం మంచిదేనా?

నిద్రను తర్వాతి అవసరాల కోసం 'దాచుకోవడం' వల్ల ప్రయోజనాలుంటాయా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి?

స్లీప్ బ్యాంకింగ్- మీరు తక్కువ నిద్రపోయే అవకాశం ఉన్న సమయానికి ముందే అనేక రాత్రులు ఎక్కువ సేపు నిద్రపోవడం.

కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇది ప్రభావవంతమైన వ్యూహం కావచ్చు.

దీని వల్ల మెదడు కీలకమైన వనరులను నిల్వ చేసుకోవడంతో పాటు నిద్ర లేమి వల్ల సమస్యలు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి ఇది సాయపడుతుందనేది పరిశోధకుల అభిప్రాయం.

టిక్‌టాక్‌లో వీడియోలు చేసే వెల్‌నెస్ ఔత్సాహికుల్ల ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.

ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది 'సేఫ్టీ నెట్' లాంటిదని వారి అభిప్రాయం.

స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్‌లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం యూటా స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ట్రేసీ రుప్ నేతృత్వంలోని ఈ బృందం వివిధ ఆపరేషన్లు చేపట్టడానికి ముందు సైనికుల అప్రమత్తతను మెరుగుపరిచే మార్గాల్ని పరిశోధిస్తోంది.

24 మంది సైనికుల్ని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రాత్రి 7 గంటలు, మరో గ్రూపు 10 గంటలు నిద్రపోయేందుకు అనుమతించారు.

తర్వాత వారు తమ రోజు వారీ జీవితంలో 8 గంటల నిద్ర పోవడానికి ముందు ఒక వారం రోజులు రెండు గ్రూపుల వారిని 3 గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు.

ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 10 గంటలు నిద్రపోయినవారు 7 గంటలు నిద్రపోయిన వారి కంటే చురుగ్గా ఉన్నారు. నిద్ర వారికి నియంత్రణలో ఉంది.

నిద్ర లేని రాత్రులకు ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది మానసిక, శారీరక రోగ నిరోధకశక్తిగా పని చేస్తుందని అనేక ఏళ్లపాటు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

2023లో మయామిలోని ఒక ఆసుపత్రిలో వైద్యులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో నైట్ షిఫ్టులో పని చేసే డాక్టర్లు మూడు రోజుల పాటు వారి రోజు వారీ నిద్ర సమయం గంటన్నర అదనంగా నిద్రపోవడం వల్ల రెండు వారాల తర్వాత షిఫ్టులలో మెరుగ్గా పని చేసినట్లు తేలింది.

క్రీడాకారుల విషయంలోనూ ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

సెయిలింగ్ చేసే క్రీడాకారులు స్లీప్ బ్యాంకింగ్‌ను ఫాలో అవుతారు. అదనపు సమయం నిద్ర వల్ల సెయిలర్లు రెగట్టా పోటీల్లో లోపాలు చేయకుండా, వేగంగా పడవను నడిపారు.

మూడు వారాలు రోజుకు 10 గంటలు నిద్ర పోయే రగ్బీ ఆటగాళ్లు, తమపై శారీరక ఒత్తిడి తక్కువగా ఉందని చెప్పారు.

టెన్నిస్ ఆటగాళ్లు వారం రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోయినప్పుడు వారు సర్వీస్ బాగా పడినట్లు తేలింది.

5 నుంచి 7 వారాలు ఎక్కువ నిద్రపోయిన బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో షాట్ కొట్టే కచ్చితత్వం పెరిగింది. వాళ్లు వేగంగా పరుగెత్తగలిగారు.

స్లీప్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ అది వివాదాస్పదంగానే ఉంది.

మనం మనం ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నిద్రను తగ్గించుకునే ఉద్దేశంతో నిద్రను 'నిల్వ చేయడం' సాధ్యం కాదని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.

శరీరం నిజంగా భవిష్యత్ కోసం నిద్రను నిల్వ చేస్తుందా? లేక అంతకు ముందు శరీరానికి అందని నిర్ణీత గంటల నిద్రను భర్తీ చేస్తుందా అనేది గుర్తించడం కష్టమనేది వారి వాదన.

షిఫ్టు వర్కర్లలో స్లీప్ బ్యాంకింగ్ గురించి నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాలు చర్చకు దారి తీశాయి. దైనందిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వారి పనితీరు మెరుగుదలలో ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.

ఈ వాదనకు కారణం మన శరీరానికి నిద్ర ఎందుకు అవసరం ప్రశ్న.

"మనం ఎందుకు నిద్రపోతాం అనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి" అని హాకెన్‌సాక్ మెరిడియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో స్లీప్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ పోలోస్ చెప్పారు

"నిద్రలో మన జీవక్రియ, హార్మోన్లు, నాడీ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిద్రపోయే సమయం మెదడుకు, మన ఆలోచనలను ఏకీకృతం చేయడానికి లేదా అందులో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన సమయం అని భావిస్తారు" అని ఆయన వివరించారు.

రాత్రిపూట నిద్ర లేమితో బాధ పడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటు తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?
శారీరంగా చూస్తే మన శరీరంలోని వేల కోట్ల కణాలకు నిద్ర చాలా అవసరం

"మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ఇంధనం నింపడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఆరోగ్యరమైన నిద్ర అవసరం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖేల్ హోవెల్ చెప్పారు.

"రోజంతా మన శరీరంలో, మెదడులో వివిధ రకాల అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. మనం నిద్ర పోయినప్పుడు మెదడు వాటిని తుడిచి పెట్టేస్తుంది" అని హోవెల్ అన్నారు.

"అనేకమంది పెద్దవాళ్లు రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు బాగా పని చేస్తారని హోవెల్ చెప్పారు.

నాలుగైదు గంటలే నిద్రపోయే వాళ్లు చాలా అరుదుగా ఉంటారనేది ఆయన అభిప్రాయం.

అందుకే నిద్రలేమి, తీవ్రమైన నిద్ర లోపం చాలా హానికరం.

"మనకు ఒక గంట నిద్ర తక్కువైతే తట్టుకోలగం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితేనే సమస్య. దీని ప్రభావం మొత్తంగా మన పనితీరు మీద, సామాజిక జీవితం మీద పడుతుంది" అని పోలోస్ చెప్పారు.

తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు వ్యర్థాలను బయటకు పంపదు. అంటే మీరు సరిగ్గా నిద్రపోని రాత్రి తర్వాతి రోజు ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇబ్బంది పడవచ్చని హోవెల్ చెప్పారు.

శరీరంలో న్యూరోనల్ వేస్ట్‌ను బయటకు పంపడానికి మెదడుకు అవసరమైన మరింత సమయాన్ని స్లీప్ బ్యాంకింక్ ఇస్తుందని రుప్, ఆమె సహచరులు భావిస్తున్నారు.

అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడుకు అవసరమైన గ్లైకోజెన్ స్థాయిలను నింపడానికి కూడా అదనపు నిద్ర ఉపకరిస్తుందనేది వారి వాదన.

స్లీప్ బ్యాంకింగ్ మంచిదేనా?
నిద్ర మధ్యలో మెలకువ వచ్చే వారికెవరికైనా స్లీప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"మీరు కూడా స్లీప్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నించాలనుకుంటే, మీరు నిద్ర సరిపోని రోజులు ఎదురవుతాయని భావించినప్పుడు రోజుకు గంట సేపు అదనంగా నిద్రపోండి. అలా రెండు వారాలు అదనంగా మరో గంట నిద్ర పోయేందుకు ప్రయత్నించండి" అని హోవెల్ చెప్పారు.

ఇందుకోసం అలారంను ఆలస్యంగా లేచేందుకు వీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.

అయితే దీనికి విరుద్దంగా "కొంతమందికి ముందుగా పడుకోవడం మంచి వ్యూహం కావచ్చు. మీ శరీరం ఉదయం 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఉదయం 6 గంటలకు మేల్కొనే అవకాశం ఉంది" అని పోలోస్ చెబుతున్నారు.

మీరు ఇప్పటికే నిద్ర లేమితో బాధ పడుతూ ఉంటే స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ క్లెర్మాన్ ఈ ఆలోచనను తోసిపుచ్చారు.

"స్లీప్ బ్యాంకింగ్ జరుగుతుందని చూపించడానికి, ఎవరైనా అలసిపోనప్పుడు నిద్రపోగలరని మీరు చూపించాలి. అందుకు ఎలాంటిన ఆధారాలు లేవు" అని ఆమె చెప్పారు.

స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తే, గతంలో బాగా నిద్రపోయిన వారు తర్వాతి కాలంలో తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భావించే అవకాశం ఉందని క్లెర్మాన్ ఆందోళన చెందుతున్నారు.

"అలా చేయడం వల్ల వారు తమ ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రాథమికమైన దాన్ని కోల్పోతారు" అని ఆమె విశ్లేషించారు.

మనం భవిష్యత్తు కోసం నిద్రపోతున్నామా లేదా మనం చెల్లించాల్సిన అప్పును తీర్చుకుంటున్నామా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి రాత్రి అదనంగా అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు చిన్న కునుకు తీయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

స్లీప్ బ్యాంకింగ్ పనిచేసినా అది దీర్ఘకాలిక పరిష్కారం కాదని పోలోస్ అంటున్నారు.

"పడుకునే, మేల్కొనే సమయాల క్రమబద్ధమైన షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. తగినంత పరిమాణంలో నాణ్యమైన నిద్రను ఆస్వాదించండి" అని పోలోస్ చెప్పారు.

Zodiac signs favored by Goddess Lakshmi - లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కో...