ఓంకారేశ్వర్ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లాలోని నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వర్(మాంధాత) ద్వీపం మీద ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయం "ఓం" (ఓంకార) ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉండటం వల్లే దీనికి "ఓంకారేశ్వర్" అనే పేరు వచ్చింది.
ఇక్కడ శివునికి రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి, ఒకటి ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ (దీని అర్థం "ఓంకారానికి అధిపతి" లేదా "ఓం శబ్దానికి అధిపతి"), మరొకటి ప్రధాన భూభాగంలోని నర్మదా నది దక్షిణ ఒడ్డున ఉన్న మమలేశ్వర్ (అమలేశ్వర్) (దీని అర్థం "అమర అధిపతి" లేదా "దేవతల అధిపతి").
మధ్య ప్రదేశ్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, రెండవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఇది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి సుమారు 140 కి.మీ దూరంలో ఉత్తరాన ఉంది.
వాస్తవానికి 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని నమ్ముతారు, వాటిలో 12 అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
క్షేత్ర విశిష్టత:
మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జైన్ కు సుమారు 140 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివ లింగం "భాణలింగం". నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులూ తూర్పు దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం. అదీ ఈక్షేత్ర ప్రశస్తి. పడమర నుండు తూర్పుకు ప్రవహించే వాటిని నదులు అంటారు. అదే తూర్పు నుండి పడమరకు ప్రవహించే వాటిని నదములు అంటారు. కావున నర్మదా నదము
ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహా కాలేశ్వరుడు ఉండటం విచిత్రం. గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. నర్మదానది నర్మదా, కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి మాం దాత్రు పురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు
స్థల పురాణం
పురాణాల ప్రకారం, వింధ్య పర్వత శ్రేణికి అధిపతి అయిన వింధ్యుడు, తాను చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి శివుని పూజించాడు. అతను ఇసుక, బంకమట్టితో పవిత్ర జ్యామితీయ రేఖాచిత్రం, ఒక లింగం సృష్టించాడు. శివుడు ఆ పూజకు సంతోషించి ఓంకారేశ్వర్, అమలేశ్వర అనే రెండు రూపాల్లో కనిపించాడని నమ్ముతారు. మట్టి దిబ్బ ఓం ఆకారంలో కనిపించినందున, ఆ ద్వీపం ఓంకారేశ్వర్గా పిలువబడింది. ఆలయంలో పార్వతి, గణపతికి ఒక ఆలయం ఉంది.
రెండవ కథ మాంధాత, అతని కుమారుడి తపస్సుకు సంబంధించినది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత రాజు (రాముని పూర్వీకుడు) శివుడు జ్యోతిర్లింగంగా వెలసే వరకు ఇక్కడ పూజించాడు. కొంతమంది పండితులు మాంధాత కుమారులు - అంబరీష, ముచుకుంద గురించి కూడా కథ చెబుతారు, వారు ఇక్కడ కఠోర తపస్సు చేసి శివుని మెప్పించారు. దీని కారణంగా, పర్వతానికి మాంధాత అని పేరు వచ్చింది.
మూడవ కథ ప్రకారం, దేవతలు, దానవుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది, ఇందులో దానవులు గెలిచారు. ఇది దేవతలకు పెద్ద దెబ్బ, కాబట్టి దేవతలు శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు.
ఆది శంకరాచార్య గుహ – ఓంకారేశ్వర్, ఆది శంకరాచార్య తన గురువు గోవింద భగవత్పాదులను ఒక గుహలో కలుసుకున్న ప్రదేశం అని చెబుతారు. ఈ గుహను నేటికీ శివాలయం కింద చూడవచ్చు, అక్కడ ఆది శంకరాచార్యుల విగ్రహం ప్రతిష్టించబడింది.
ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు.
ఓంకారేశ్వర్ ఆలయంలోని జ్యోతిర్లింగం "గుండ్రని నల్ల రాయి" అని వర్ణించబడింది, ఇది శివుని రూపాన్ని సూచిస్తుంది, దాని దగ్గర శివుని భార్య పార్వతిని సూచించే తెల్ల రాయి ఉంది.
పురాణ గాథ
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యుడీ పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. ’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే.ళమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు.
మమలేశ్వర జ్యోత్రిర్లింగం
నర్మదా నదీ తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం, అభిషేకం మనమే చేసుకోవచ్చు, శివ లింగం వెనుక పార్వతి అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుడిగా ఉండి పోయాడు.
ఓంకారేశ్వర్ ఆలయంలోని జ్యోతిర్లింగం "గుండ్రని నల్ల రాయి" అని వర్ణించబడింది, ఇది శివుని రూపాన్ని సూచిస్తుంది, దాని దగ్గర శివుని భార్య పార్వతిని సూచించే తెల్ల రాయి ఉంది.
పురాణ గాథ
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యుడీ పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. ’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే.ళమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు.
మమలేశ్వర జ్యోత్రిర్లింగం
నర్మదా నదీ తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం, అభిషేకం మనమే చేసుకోవచ్చు, శివ లింగం వెనుక పార్వతి అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుడిగా ఉండి పోయాడు.
వరగర్వంతో వింధ్య పర్వతం మేరువును దాటి గర్వంగా పెరిగి పోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అధికారంతో నిండిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు వింధ్య గర్వం హరిన్చాటానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమేసాధ్యమని చెప్పి కాశీ పంపాడు. మహర్షిని ప్రార్థించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగిగురువుకు నమస్కరించాడు తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగే ఉండి పొమ్మని శిష్యుడిని శాసించాడు. అప్పటి నుండి అలానే వింధ్య పర్వతం ఉంది ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట.
చరిత్ర
ఈ ఆలయాన్ని క్రీ.శ. 11వ శతాబ్దంలో మాల్వాకు చెందిన పరమార రాజులు నిర్మించారని చెబుతారు. పరమార రాజుల తరువాత, ఆలయ నిర్వహణ చౌహాన్ పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. క్రీ.శ. 13వ శతాబ్దంలో, మహమ్మద్ గజనీతో ప్రారంభమైన ముస్లిం దండయాత్రల ద్వారా ఆలయం ధ్వంసం, దోపిడికి గురైంది. అయినప్పటికీ, ఆలయం పూర్తిగా ధ్వంసం కాకుండా చెక్కుచెదరకుండా ఉంది. మొఘల్ పాలన మొత్తం చౌహాన్ రాజుల ఆధీనంలో ఆలయం ఉంది, పెద్దగా మరమ్మతులు జరగలేదు. 18వ శతాబ్దంలో, హోల్కర్ పాలకులు ఆలయాన్ని పునర్నిర్మించారు. దీని నిర్మాణం మొదటి హోల్కర్ రాణి, గౌతమీ బాయి హోల్కర్ ప్రారంభించింది, తరువాత ఆమె కోడలు దేవి అహల్యాబాయి హోల్కర్ పూర్తి చేసింది. వలస పాలనలో ఆలయం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఖాండ్వా పరిపాలన సహాయంతో భారత పురావస్తు శాఖ (ASI) ఆలయ బాధ్యతను స్వీకరించింది.
రోడ్డు మార్గం: ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, రెండు ఒడ్డులను అనుసంధానించే వంతెనలు ఉన్నాయి. ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు కలపబడింది. ఓంకారేశ్వర నుండి ఉజ్జయినీ (133 కి.మీ.), ఇండోర్ (77 కి.మీ.), ఖాండ్వా (61 కి.మీ..), ఓంకారేశ్వర రోడ్ (12 కి.మీ.) నుండి బస్సు సర్వీసెస్ ఉన్నాయి.
చరిత్ర
ఈ ఆలయాన్ని క్రీ.శ. 11వ శతాబ్దంలో మాల్వాకు చెందిన పరమార రాజులు నిర్మించారని చెబుతారు. పరమార రాజుల తరువాత, ఆలయ నిర్వహణ చౌహాన్ పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. క్రీ.శ. 13వ శతాబ్దంలో, మహమ్మద్ గజనీతో ప్రారంభమైన ముస్లిం దండయాత్రల ద్వారా ఆలయం ధ్వంసం, దోపిడికి గురైంది. అయినప్పటికీ, ఆలయం పూర్తిగా ధ్వంసం కాకుండా చెక్కుచెదరకుండా ఉంది. మొఘల్ పాలన మొత్తం చౌహాన్ రాజుల ఆధీనంలో ఆలయం ఉంది, పెద్దగా మరమ్మతులు జరగలేదు. 18వ శతాబ్దంలో, హోల్కర్ పాలకులు ఆలయాన్ని పునర్నిర్మించారు. దీని నిర్మాణం మొదటి హోల్కర్ రాణి, గౌతమీ బాయి హోల్కర్ ప్రారంభించింది, తరువాత ఆమె కోడలు దేవి అహల్యాబాయి హోల్కర్ పూర్తి చేసింది. వలస పాలనలో ఆలయం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఖాండ్వా పరిపాలన సహాయంతో భారత పురావస్తు శాఖ (ASI) ఆలయ బాధ్యతను స్వీకరించింది.
రోడ్డు మార్గం: ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, రెండు ఒడ్డులను అనుసంధానించే వంతెనలు ఉన్నాయి. ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు కలపబడింది. ఓంకారేశ్వర నుండి ఉజ్జయినీ (133 కి.మీ.), ఇండోర్ (77 కి.మీ.), ఖాండ్వా (61 కి.మీ..), ఓంకారేశ్వర రోడ్ (12 కి.మీ.) నుండి బస్సు సర్వీసెస్ ఉన్నాయి.
వాయు మార్గం: ఓంకారేశ్వరం దగ్గరగా విమానాశ్రయాలు ఇండోర్ (77 కి.మీ.), ఉజ్జయినీ (133 కి.మీ.) నగరాలలో ఉన్నాయి.
రైలు మార్గం: దీనికి సమీపంలో వున్న రైలు స్టేషను ప్రధాన మైనది కాదు. వెస్ట్రన్ రైల్వే యొక్క రత్లాం-ఖాండ్వా విభాగం ఓంకారేశ్వర రోడ్డుకు (12 కి.మీ.) దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబైకి కనెక్ట్ చేసే ఇతర సమీప రైల్వే స్టేషను ఇండోర్లో (77 కి.మీ.) ఉంది. ఖాండ్వా రైల్వే స్టేషను నుండి ఓంకారేశ్వర 2.5 గంటలు పడుతుంది.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం