Monday, July 27, 2026

The Story of Svaha - స్వాహా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వాహా వృత్తాంతం

నారదా ! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్గానాల్లు వీరికి అందడంలేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్సుడై శ్రీకృష్ణపరమాత్మను శరణు శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతిరూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్తమయ్యింది. వరం కోరుకోమంది.

జగన్మాతా! దయచేసి నువ్వు అగ్నికి దాహకశక్తిగా ఆవతరించు. నువ్వులేనిదే అగ్ని దేనినీ దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వేల్చేటప్పుడు ప్రతిమంత్రానికీ చివర నీపేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నిశక్తితో అగ్నిదగ్దమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్త్పులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్నతల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభ - శక్తి కలిగించు,

చతుర్వదనా ! నేను శ్రీకృష్ణపరమాత్మను కోరి తపన్సు చేస్తున్నమాట నీకు తెలునుగదా ! మరి ఈ అభ్యర్థన ఎమిటి ? నువ్వూ నేనూ శివుడూ ఆదిశేషుడూ ధర్ముడూ గబేశుడూ అందరం మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అది అంతా ఆ పరాత్సరుడి ఆజ్ఞయేకదా ! ఆంతటివాడికి ఇల్లాలిని కాదలిచి ఇప్పుడు దేవతలకోసమని అగ్నికి పరిచర్యలు చెయ్యనా ! ఎలాగ ? ఆ కృష్ణపరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలాఉంటే అలా చేస్తాను - అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపన్సు కొనసాగించింది. ఒంటికాలిమీద నిలిచి లక్షసంవత్సరాలు చేసింది. శ్రీ కృష్ణపరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహరరూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశయై మూర్భపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలిసిపోయిన ఆ కృశాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.

ప్రకృతీ ! నగ్నజిత్తు కూతురుగా నాగ్నజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. ఆప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కళాంశగా వారాహివవుదువుగాని. అప్పుడూ నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అశ్నికి దాహికశక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు. నీతో ఆనందిస్తాడు - అని చెప్పేసి అంతర్భ్థానం చెందాడు.

ఆంతలోకీ వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ష్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబికను ఆ ప్రకృతిదేవిని ధ్యానించాడు. పూజించాడు. స్తుతించాడు. మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు.

ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో నూరేళ్ళపాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. పన్నెండు దివ్యసంవత్సరాలు మోసి దక్తిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అని ముగ్గురు పుత్రులను ప్రసవించింది.

బుషషులూ మునులూ బ్రాహ్మణులూ క్షత్రియులూ స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిర్హానాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం వేదహీనుడైన విప్రుడు పతిసేవా విహీనయైన స్తీ విద్యావిహీనుడైన పురుషుడు ఫలశాఖా విహీనమైన వృక్షం ఎలా నింద్యాలూ నిష్రయోజనాలో అలాగ స్వాహాశబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు, ఇది భుక్తి ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారదా ! ఇంకా ఎమి కావాలో అడుగు. అని నారాయణమహర్షి విరమించాడు.

మహర్షీ! అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావుకదా ! వాటిని మరికాస్త వివరంగా తెలియజేసి పుణ్యంకట్టుకో - అన్నాడు నారదుడు, బ్రహ్మపుత్రా ! సావధానంగా ఆలకించు. ఎ ఇ9ిజ్ఞం చెయ్యాలన్నా మున్ముందుగా స్వాహాదేవిని, సాలగ్రామంలోగానీ కలశంలోగానీ ఆవాహనచేసి శుష్చింబాలి. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగం మంత్రపిద్ధిన్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం ఫోగదు. సఫలం కాదు.

స్యాహాం మంత్రాంగయుక్తాం చ మంత్రసిద్ది స్వరూపిణీమ్‌ |

సద్దాం చ సిద్దిదాం నూణాం కర్మణాం ఫలదామ్‌ శుభామ్‌ ॥ (43 - 47)

ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలూ చెయ్యాలి. ఓం ప్రాం శ్రీం వహ్నిజాయాయై దేవ స్వాహా అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది. అభీష్టాలు తీరుస్తుంది.

ప్వాహా వహ్నిప్రియా వహ్నిజాయా సంతోషకారిణీ |

శక్తి క్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రువా ॥

గతిప్పదా వరాణాం చ దాహికా దహనక్షమా |

పంసారపారరూపా చ ఘోరపంసారతారిణీ ॥

దేవజీవవరూపా దేవపోషణకారిణీ ।

షోడశైతాని వామావి యః పకేద్భక్తి సంయుతః ॥

పర్వపిద్దిర్భవేత్తవ్య ఇహ లోకే పరత్ర చ ॥ (43 - 53) నారదా! ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశనామావళి. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియాకొశలం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు. భార్యాదూరుడు భార్యా నహితుడవుతాడు. దంపతులు సుఖసంతోషాలతో వర్థిల్లుతారు.




Srihari's Praise of Lakshmi - శ్రీహరి చేసిన లక్ష్మీప్రశంస

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శ్రీహరి చేసిన లక్ష్మీప్రశంస

హే బ్రహ్మన్‌! భయపడకు. దేవతలారా! ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు! మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితమూ సత్యమూ సారభూతమూ పరిణామంలో సుఖావహమూ చెబుతున్నాను. ఆసంఖ్యాక విశ్వాలూ ఆ విశ్వాల్లో ఉన్న జనాలూ నాకు అధీనులయినట్లే నేనూ నా భక్తులకు పరాధీనుడిని. అస్వతంత్రుణ్ణి. నా భక్తుడు ఎవరిమీదనైనా అలిగితే నేనింక వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దూర్వాసుడు శంకరాంశ సముద్భవుడు. నాకు అత్యంతాప్తభక్తుడు. వైష్ణవుడు. మత్పరాయణుడు. ఆతడిచ్చిన శాపం కారణంగా నేనూ లక్ష్మీదేవీ మీ గృహాలు విడిచి వచ్చేశాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణదేవతార్చన లేనిచోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు.

నా భక్తులను నిందించినా నన్ను నిందించినా రమాదేవికి భరించరాని కోపంవస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసరానగానీ నా జన్మతిథినాడుగానీ ఉపవాసం ఉండక భుజించిన మూఢుని ఇంటిలో నిముషం ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడూ కన్యావిక్రయం చేసేవాడూ అతిథిని సత్కరించనివాడూ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైనా తొక్కదు. పాపాత్ముల ఇళ్ళకు వెళ్ళదు సరే, పాపాత్ముల ఇళ్ళకు వెళ్ళేవారి ఇళ్ళకుకూడా తాను వెళ్ళడు ఆచారభ్రష్టులూ ధర్మభ్రష్టులూ అయితే వారి గృహాలనుంచి తక్షణం నిర్గమిస్తుంది. సూపకారులుగా వృషవాహకులుగా అశుద్ధ హృదయులుగా పరదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతినీళ్ళు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్యభక్షకులన్నా అగమ్యాగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను.

గోటితో గడ్డిపరకలు తుంపుతూ నేలపైరాస్తూ నిరాశా నిస్పృహలకు లోనైనవారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైధునం - ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అస్సలు ఉండదు.

సంధ్యావిహీనుడూ అదీక్షితుడూ ఆచారవర్జితుడూ అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమశత్రువు. తడికాళ్ళతోగాని నగ్నంగాగానీ నిద్రించేవారి ఇంటినుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలుమోపదు. అభ్యంగనస్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకినా తొడలపై మద్దెలవాయించుకున్నా లక్ష్మికి కోపం వస్తుంది.

వ్రతోపవాసహీనుడూ విష్ణుభక్తివర్జితుడూ అశుచీ అయితే విప్రుడైనా అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించినా నిందించినా దయాహీనుడై జీవహింస చేసినా అటువంటివారి లోగిళ్ళనుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయివచ్చేస్తుంది.

హరిభక్తి హరిసేవ హరిగుణకీర్తన ఉన్నచోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంసగానీ కృష్ణభక్తుల ప్రశస్తులుగానీ వినిపించేచోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని సాలగ్రామ శిల తులసి ఉన్నచోటా వాటికి ధ్యానవందనాది సేవలు జరిగేచోటా తానై వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన శివగుణస్తోత్రం దుర్గార్చన దుర్గాస్తుతి జరిగేతావుల్లో విప్రార్చన విప్రసేవ దేవతాపూజాదికం జరిగే గృహాలలో ఆలయాలలో స్థిరనివాసం ఎర్పరుచుకుంటుంది.

దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవివైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియా! నువ్వు కళాంశరూపంతో క్షీరసాగరంలో జన్మించు - అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు త్రిప్పి - చతుర్వదనా! క్షీరసాగరాన్ని మథించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు - అని చెప్పేసి చటుక్కున లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి దేవతలు క్షీరసముద్రతీరం చేరుకున్నారు. మందరపర్వతాన్ని కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూని కూర్మాన్ని మట్టుచుట్టుగా నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగరమథనం చేశారు. ధన్వంతరి అమృతం ఉచ్చైఃశ్రవం చింతామణి ఐరావతం సుదర్శనం లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. 

బ్రహ్మేశానాది సకలదేవతలూ లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగయై వారివైపు వారి గృహాలవైపూ క్రీగంటి చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో తేజస్సుతో ఆభరణాలతో వాహనాదులతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివిరిసాయి. ఇంద్రుడు తన అమరావతినీ స్వర్గలోకాన్నీ స్వాధీనం చేసుకున్నాడు.

ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం


Brihaspati's counsel to Indra - ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం

స్వర్గలోకమంతా దైత్యదానవరాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవ్వరూ కనపడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకినీతీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పుముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు. గరి
ష్ఠుడు. ధర్మిష్ఠుడు. బంధువర్గానికి ఇష్టుడు. జ్ఞానుల్లో శ్రేష్ఠుడు. భ్రాతృవర్గంలో జ్యేష్ఠుడు. రాక్షసులకు అనిష్ఠుడు. బృహస్పతి ఒక జాముసేపటికి ధ్యానం ముగించి కళ్ళుతెరిచాడు. గట్టుకి వచ్చాడు. ఇంద్రుడు ఎదురువెళ్ళి సవినయంగా నమస్కరించాడు. పాదాల పైపడి బిగ్గరగా విలపించాడు. దుర్వాసో మునిపుంగవుడి శాపమూ జ్ఞానప్రాప్తీ దానవ దురాక్రమణమూ అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి.

శిష్యా! దేవేంద్రా! విన్నాను. అంతా విన్నాను. ఎందుకూ రోదిస్తావ్‌? ఏడ్చి సాధించేది ఏమీ లేదు గుండెలు చిక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడూ ఆపదల్లో బెంబేలుపడడు. సంపత్తికానీ విపత్తికానీ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమనుమాత్రం మిగులుస్తాయి.

పూర్వజన్మల్లో చేసుకున్న సుకృతదుష్కృతాల ఫలాలు జన్మజన్మలకీ అనుభవించాల్సిందే. ఇది ఎవరికీ తప్పదు. చక్రనేమిక్రమంలో సుఖదుఃఖాలూ సంపద్విపత్తులూ వస్తుంటాయి. పోతుంటాయి. దుఃఖించాల్సింది ఎముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మమూ క్షయించదు. కల్పకోటి శతజన్మలెత్తినా నశించదు. శుభాశుభకర్మఫలాలు అవశ్యానుభోక్తవ్యాలని వేదమూ చెబుతోంది, కృష్ణపరమాత్ముడూ చెప్పాడు. కర్మఫలానుభవం పూర్తిఅయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలిఉన్నా పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవవూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా వెళ్ళగా ఎప్పటికో ముక్తి. కర్మఫలానుభవపూర్తి. అలాకాక ఇహజన్మలో మళ్ళీ సకామ - దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవం. జన్మపరంపరలో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుతుండవలసిందే.

అందుచేత దేవరాజా! ఒకరి శాపంగానీ ఒకరి ఆశీస్సుగానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించినా మహాదైన్యం లభించినా కర్మఫలమే. కోటి జన్మలనుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించనిదే వదలదు.

దేశ-కాల-పాత్ర భేదాలవల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నపుడు ఏ రోజున చేసినా ఫలం సమానమేకానీ పుణ్యదినాల్లో పుణ్యప్రదేశాల్లో పుణ్యాత్ములకు(పాత్రత) ఇస్తే ఫలం కోటిరెట్లు అధికంగా లభిస్తుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసినా క్షేత్రభేదాన్నిబట్టి (నేల సారవంతము - నిస్సారమూ) పంట దిగుబడిలో హెచ్చతగ్గులున్నట్టే పాత్రభేదాన్నిబట్టి పుణ్యఫలంలోనూ ఆధిక్యన్యూనత్వాలుంటాయి.

మామూలురోజుల్లో విప్రుడికి దానం చేసినదానికంటి ఆమావాన్య - రవిసంక్రమణ దినాల్లో దానాలు చేస్తే నూరురెట్లు ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది. చాతుర్మాస్యంలోగానీ పున్నమినాడుగాని అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణంనాడు కోటిగుణంగానూ సూర్యగ్రహణంనాడు శతకోటిగుణంగానూ దక్కుతుంది. అక్షయతిథినాడైతే అక్తయఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలిస్తూ ఉంటాయి. ఒక్క దానానికేకాదు జపమూ తీర్థస్నానమూ దేవతారాధనమూ మొదలైన సత్కర్మలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తుంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తుంటాడు. కర్మఫల పరతంత్రుడై జన్మలనూ రూపాలనూ సమకూరుస్తుంటాడు.

ఈ బ్రహ్మదేవుడుకూడా నారాయణుడి ఆజ్ఞమేరకే ఇవన్నీ చేస్తుంటాడు. నారాయణుడు విధాతకు విధాత. రక్షకుడికి రక్షకుడు. సంహర్తకు సంహర్త. కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహావిపత్తిలోనైనా మధుసూదనుడిని తలచుకుంటే అంతటి విపత్తిలోనూ మహాసంపత్తి కలుగుతుందని శంకరు డంతటివాడు ప్రవచించాడు.

బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుణ్ణి కౌగిలించుకొని శుభాశీన్సులు అందించాడు.

నారదా! దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంటబెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దూర్వాసుడి శాపాన్నీ తవ దురవస్థనూ దేవతల స్థితిగతులనూ విన్నవించాడు. అందరూ శిరసా నమస్కరించారు. రక్ష - రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి -

బిడ్డా! నా వంశంలో జన్మించావు. నాకు మునిమనుమడివి. ఉచితానుచితాలు తెలిసినవాడివి. విచక్షుణుడివి. పైగా బృహస్పతికి శిష్యుడివి. దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్షప్రజాపతి స్వయంగా విష్ణుభక్తుడు. ప్రతాపవంతుడు. ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైనవాడు ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత. తండ్రీ పరిశుద్ధుడు. మాతామహుడూ మాతులుడూ (మేనమామ) జితేంద్రియులు. మరి అటువంటివాడు ఎలా ఆహంకృతుడవుతాడు? అసలెలా అహంకరించగలిగావు? దుర్వాసుడిచ్చిన పారిజాతాన్ని - విష్ణుప్రసాదాన్ని - ఏనుగుమీదకి ఎలా విసిరెయ్యగలిగావు? పైతృక - మాతామహ - గురుదోషాలవల్ల మూడింటివల్లా సాధారణంగా మానవుడు హరిదోషి అవుతాడు.

భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి. సర్వదేహాలలోనూ (ఆత్మగా) ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆక్షణంలోనే శవమైపోతుంది. ప్రాణికోటిలో నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు. విష్ణుమూర్తి ప్రాణం. ప్రకృతిదేవి - బుద్ధి స్వరూప. నిద్రాదిశక్తులన్నీ ఆ ప్రకృతిమాత కళలే. జీవుడంటే భోగశరీరధారి. పరమాత్మకు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరంనుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకి కదిలితే పరివారమూ కదులుతుంది.

శివుడూ ఆదిశేషుడూ విష్ణువూ ధర్ముడూ మహావిరాట్స్వరూపుడూ నువ్వూ నేనూ అందరమూ ఆ శ్రీకృష్ణపరమాత్మ అంశలమే. భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీచేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనేకదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతులమీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో! ఎంత అపరాధం! ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుడి పాదపద్మాలనుంచి నేరుగా జారివచ్చిన ఆ పారిజాతాన్ని శిరసావహించినది ఏనుగైతే మాత్రమేమి అదే పరమపూజ్యం. దేవతలమందరమూ ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవవంచితుడివి. దైవమేకదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుణ్జి ఎవరూ రక్షించలేరు.

నువ్వు చేసిన పిచ్చిపనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలయ్యింది. పద, అందరమూ ఆ వైకుంఠానికే వెడదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం. సేవిద్దాం. అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది - అని అందరినీ వెంటబెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు.

భగవంతుడూ, సనాతనుడూ తేజస్వరూపుడూ అయిన శ్రీకృష్ణపరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాడు. శాంతస్వరూపుడు. ఆదిమధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పార్షదులూ సరస్వతీదేవీ సేవిస్తున్నారు. చతుర్వేదాలూ భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తోంది. బ్రహ్మాదిదేవతలు అందరూ సాష్టాంగనమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి. మైమరిచి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్కపెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపారజూశాడు. దేవతల ముఖాల్లో భయమూ దైన్యమూ తాండివిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై వాహనాది వివర్జితులై శూన్యదేహలతో బోసిబోతున్నారు.

శ్రీహరి చేసిన లక్ష్మీప్రశంస


Durvasa's curse on Indra - ఇంద్రుడికి దూర్వాసుడి శాపం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడికి దూర్వాసుడి శాపం

నారదా ! మధుపానప్రమత్తుడై దేవేంద్రుడు - త్రిలోకాధిపతి - రంభతో రహఃక్రీడాపరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. వైకుంఠంనుంచి కైలాసానికి వెడుతూ దుర్వాసుడు వీరి కంటబడ్డాడు. బ్రహ్మతేజస్సుతో గ్రీష్మమార్తాండుడిలాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగిపోసిన బంగారు రంగులో ఉన్నాడు. జడలుగట్టిన జుట్టు తలచుట్టూ వేలాడుతూ ఊగుతోంది. తెల్లని యజ్ఞోపవీతం. దండకమండలువులు. నొసట బాలచంద్ర బింబంలాంటి కుంకుమబొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంటనడుస్తున్నారు.

చూడగా దేవేంద్రుడు ఎదురువెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినుతించారు. ఆందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతడికి కానుక చేశాడు. అది జరామృత్యుహరమూ శోకవినాశకమూ మోక్షకారకమూ అయిన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకుని శిరస్పుమీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంగా తన ఐరావతం శిరస్పుమీదకు విసిరాడు. ఆ పుష్పస్పర్శతో అది రూపగుణతేజోవయస్సులలో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగును ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు.

ఈ సంఘటనతో దుర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్రా! కన్నూ మిన్నూ కానకండా ఉన్నావు. సంపన్మదమత్తుడివై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగుమీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసి ప్రసాధంగా పొందిన పువ్వూ పండూ నీరూ దేనినైనా చేతికందినంతనే కన్నులకి అద్దుకుని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది.

శ్రీభ్రష్టుడూ బుద్దిభ్రష్టుడూ రాజ్యభ్రష్టుడూ అవుతాడు. పూర్వజన్మ సుకృతవిశేషంవల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించినవాడు మాత్రమే విష్ణుభక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడవుతాడు, నైవెద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి నుతులూ నతులూ చేస్తే సాక్షాద్విష్ణుతుల్యుడవుతాడు. అతడి స్పర్శతోగాని అతడి గాలిసోకినాగానీ సకలతీర్థాలూ పరిపూతాలవుతాయి. అతడి పాదరజస్సుతో వసుంధర అంతా పావనమవుతుంది. పుంశ్చల్యన్న - అవీరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ ఆభక్ష్యభక్షణ దోషాలు నశిస్తాయి.

ఇంద్రా! శ్వపచుడైనా (కుక్కమాంసం తినేవాడు) విష్ణుసేవి అయితే తనవంశంలో కోటితరాలను ఉద్ధరించినవాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణుప్రసాదము అనేమాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ ఏడుజన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే కోటిజన్మల కిల్బిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం.

శక్రా! అటువంటి పరమపావనమైన విష్ణుప్రసాదాన్ని గర్వంతో కరి మస్తకంమీదకి విసిరేశావు కనక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక! నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్యపెట్టను. నువ్వొక లెక్కా? నీ తాతముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు ఆవమావిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం - పారిజాతాన్ని శిరసున ధరించింది కనక - అంటూ దుర్వానుడు చిందులుతొక్కాడు.

దేవేంద్రుడు గజగజలాడాడు. దుర్వాసుడి పాదాలమీద పడ్డాడు. సిగ్గువిడిచి బిగ్గరగా రోదించాడు. మునీశ్వరా! నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వేర్యమనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ముక్తిమార్గాన్ని ఛేదిస్తుంది. భక్తిని ఆటంక పరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు. జ్ఞానం కలిగించు.

ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్రా! సంపత్తిమిరాంధుడికి ముక్తిమార్గం కనపడదు. అది జన్మమృత్యుజరాశోకరాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడికన్నా మూఢుడూ సురామత్తుడూ ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారుగానీ బంధుత్వాలూ ఆప్యాయతలూ ఉండవు. విషయాంధుడూ విహ్వలుడూ మహాకాముకుడూ రాజసికుడూ అవుతాడే తప్ప ఐశ్వర్యమదమత్తుడికి సాత్త్వికమార్గం కనిపించదు. విషయాంధులు రెండు రకాలుగా ఉంటారు. రాజసుడూ తామసుడూ. శాస్త్రజ్ఞానంలేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాస్త్రంకూడా రెండురకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తిమార్గం ఒకటి, నివృత్తిమార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తిమార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలనే సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదాయకమై జన్మ మృత్యుజరాకరమైన ఈ మార్గంలో అనేకజన్మల పర్యంతం పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నాం అనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశుపక్ష్యాది జన్మలు ఎత్తి ఎత్తి కట్టకడపటికి ఎవరో ఒక సాధుపురుషుడు తత్త్వదీపంతో ముక్తిమార్గం చూపిస్తే అప్పుడు భవబంధవిచ్చేదనానికి ప్రయత్నం చేస్తారు. తపస్సులు చేసీ నిరాహారంగా వ్రతదీక్షలు పూనీ అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నమూ సుఖప్రదమూ అయిన ముక్తిపథాన్ని చేరుకుంటారు.

నారదా! దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలంపాటు దుర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి, తనరాజధాని అమరావతికి బయలుదేరాడు.

ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం


The Story of Mahalakshmi - మహాలక్ష్మి ఉపాఖ్యానం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - మహాలక్ష్మి ఉపాఖ్యానం

నారదుడు ఆనంద భరితుడై మరొక ప్రశ్నవేశాడు. సావిత్రీయమసంవాదం మిషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను. జస్మ ధన్యమయ్యింది. ఇప్పుడు లక్ష్మి ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు - అని అడిగాడు. నారాయణమహర్షి ప్రారంభించాడు.

నారదా! సృష్టికి ఆదిలో శీకృష్ణపరమాత్మకు వామాంగంనుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందకాకారం, శ్యామ, న్యగ్రోధపరిమండిత, పన్నెండేళ్ళ నవయౌవనవతి. శ్వేతచంపకవర్ణంలో చూపులకి హాయిగా ఉంది. మనోహారిణి. శరత్పూర్ణచంద్రబింబానన. శరత్పద్మపత్ర విశాలాక్షి ఆవిర్భవించిన ఆదేవి ఈశ్వరేచ్చతో హఠాత్తుగా రెండురూపాలు ధరించింది. రూపం రంగు తేజస్సు వయస్సు కాంతి యశస్సు వస్త్రధారణ భూషణధారణ చిరునవ్వు గుణగణాలు వీక్షణాలు ప్రేమ అనునయం అన్నింటా అచ్చం ఒకేలాగా ఉన్నరెండు స్త్రీమూర్తులు. వామభాగం మహాలక్ష్మిగా దక్షిణభాగం రాధాదేవిగా రూపుదాల్చింది.

వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణపరమాత్మను వరించింది. తరవాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారిపట్ల గౌరవాచరాలతో పరమాత్మ తానుకూడా రెండు రూపాలు ధరించాడు. దక్షిణభాగం నుంచి ద్విభుజుడు, వామభాగం నుంచి చతుర్భుజుడూ అవతరించారు. ద్విభుజుడు రాధాకాంతుడు. చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధసత్త్వస్వరూపుడై గోపగోపీగణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీసహితంగా వైకుంఠానికి తరలివెళ్ళాడు. అన్నింటా సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణనారాయణులు.

స్నిగ్ధదృష్టులతో సమస్త విశ్వాన్నీ లక్షిన్తుంది కనక ఈ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతమ. సాత్త్వికురాలు, శుద్ధసత్త్వస్వరూప, సర్వసౌభాగ్యసంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద. సర్వాంగనా ప్రధాన. ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్స్వరూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం వెలుగొందుతోంది. పాతాళంలో నాగలక్ష్మిగా, రాజులలో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా పద్మినులలో క్షీరసముద్రరాజతనయగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా ఇలా రత్నాలలో ఫలాలలో జలాలలో రాజులలో రాజపత్నులలో దివ్యస్త్రీలలో గృహాలలో సర్వసస్యాలలో వస్త్రాలలో స్థలాలలో దేవతాప్రతిమలలో మంగళఘటాలలో మాణిక్యాలలో ముత్యాలలో పుష్పమాలికలలో మణులలో హీరాలలో క్షీరాలలో చందనాలలో వృక్షాలలో నవమేఘాలలో - అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతున్నాయి.

ఈ మహాలక్ష్మిని మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజనారాయణుడు అర్చించాడు. తరవాత బ్రహ్మదేవుడూ శంకరుడూ అర్చించారు. క్షీరసముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వాయంభువమనువు అటుపైని మహారాజులూ ఉపాసించారు. ఋషీంద్రులూ మునీంద్రులూ మానవులూ అర్చించారు. పాతాళంలో నాగులు ఉపాసించారు.

భాద్రపద శుక్షాష్టమినాడు ప్రారంభించి పక్షం రోజులపాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మీవ్రతం చేశాడు. చైత్ర భాద్రపద పుష్యమాసాలలో ప్రతి మంగళవారంనాడూ విష్ణుమూర్తి అర్చించాడు. పుష్యసంక్రాంతి నాడూ మాఘమంగళవారాలలోనూ వర్గాంతంలోనూ భువనత్రయాలలో స్వాయంభువమనువు లక్ష్మీపూజలు చేశాడు. ఇంద్రుడూ మంగళవారాలే ఆర్చించాడు. కేదార - నీల - సుబల - నల - ధ్రువ - ఉత్తానపాద - బలి - కశ్యప - దక్ష - కర్ణమ - వివస్వత్‌ - ప్రియవ్రత - చంద్ర - కుబేర - వాయు - యమ - వహ్ని - వరుణాది దేవతలందరూ సర్వత్ర భక్తితో పూజలు చేశారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాధిదేవత. సర్వసంపత్స్వరూపిణి.

నారాయణప్రియ వైకుంఠవాసిని వైకుంఠాధిష్టానదేవత సనాతని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధుకన్యకగా ఎలా జన్మించింది? ఎవరు ఎలా స్తుతించారు? ఎలా అర్చించారు? అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. మహర్షి అందుకున్నాడు -

నారదా! పూర్వకాలంలో దుర్వాసుడి శాపానికి గురియై ఇంద్రుడూ దేవతలూ పదవిసంపద్భ్రష్టులై భూలోకానికి పోవలసివచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లినమయ్యింది.

ఆ తరవాత దేవతలు గుమికూడి బ్రహ్మను శరణు వేడారు. అతడు శంకరుణ్ణి సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణుడిని శరణువేడుకొన్నారు. ఆప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతో క్షీరసముద్రుడి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధురాజకన్య అయ్యింది.

దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించినవేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలిచ్చింది. విష్ణుమూర్తికి దివ్యవనమాల ఇచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్యసంపదలను పొందగలిగారు.

క్లుప్తంగా ముగించాడు నారాయణమహర్షి వింటున్న నారదుడికి సంతృప్తి కలగలేదు. దుర్వాసుడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు? ఇంద్రుడు ఏ తప్పుచేశాడు? లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా! దేవదానవులు క్షీరసముద్రాన్ని ఎలా మథించారు? మహాలక్ష్మి దర్శన మిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు? వారిద్దరికీమధ్య నడిచిన సంవాద స్వరూపం ఏమిటి? - ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాముచేశాడు. సరే నారాయణమహర్షి ఆరంభించాడు.

ఇంద్రుడికి దూర్వాసుడి శాపం


The Glory of the Goddess as Narrated by Yama - యముడు చెప్పిన దేవీమహిమ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యముడు చెప్పిన దేవీమహిమ

వెయ్యి వదనాలున్న ఆదిశేషుడు, అయిదు ముఖాలున్న పరమేశ్వరుడు, నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, ఆరు ముఖాలున్న కార్తికేయుడు, యోగీంద్రులకు గురువైన గణేశుడు - విరే దేవీగుణకీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే ఇక నేనా! సకలశాస్త్రాలూ, చతుర్వేదాలూ అమ్మవారి అనంతగుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయేమో. సరస్వతీదేవి ఆయినా పూర్తిగా తెలుసుకోగలిగిందనీ చెప్పగలుగుతుందనీ నేననుకోను. ధర్మ సనకసనందన సనత్కుమార కపిల సూర్యాది బ్రహ్మమానస పుత్రులే దేవీగుణ సమగ్రవర్ణనకు సమర్థులు కారంటే ఇంక మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా! సిద్ధులకూ సాధ్యులకూ మునీంద్రులకూ యోగీంద్రులకూ సాధ్యంకానిది నావల్లమాత్రం అవుతుందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవిపాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఎముంది! దేవీభక్తులకుమాత్రమే ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే ఏ కొంచెమో తద్గుణ కీర్తనం చెయ్యగలరు. అదికూడా ఆమె కరుణయే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ, అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞానిగురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ గోలోకంలో నిర్జనారణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవిమాహాత్మ్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు. శివుడేమో తనలోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియచేశాడు. తపఃఫలంగా దేవీమహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్నవేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురుపరంపర. నాకు తెలిసిందే తక్కువ. ఆయినా నువ్వు అడిగావు కనక చెబుతున్నాను. నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంక ఇతరులకు ఎలా తెలుస్తాయి? ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికి తెలుసా?

సర్వకారణకారణుడు సర్వాత్మకుడు సర్వభగవంతుడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వవేత్త సర్వపరిపాలకుడు నిత్యరూపి నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరాశంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడూ అయిన పరాత్పరుడు (ప్రకృతి) మాయావిశిష్టుడై ప్రకృతిశబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. ఆగ్ని - దాని దాహకశక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృత రూపాలూను. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడంకోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరీరూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి. అతడు శ్రీకృష్ణపరమాత్మ,

ఆ గోపకిశోరుడు నీలమేఘశ్యాముడు. కందర్పకోటి సుందరుడు. లీలాధాముడు, మనోహరుడు. వికసిత పుండరీకాక్షుడు. శరచ్చంద్రవదనుడు. రత్నభూషణవిరాజితుడు. నవ్వు రాజిల్లెడు మోమువాడు. పీతాంబరధారి. బ్రహ్మతేజోబంధురుడు. పరబ్రహ్మస్వరూపుడు. కంటికి హాయిగా ఉంటాడు. శాంతాకారుడు. రాధాకాంతుడు. రాసమండలంలో రత్నసింహాననంమిద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడివైపే. చిరునవ్వులన్నీ ఇతడిమీదనే. మురళిని నిరంతరం మోగిన్తుంటాడు. ద్విభుజ నారాయణుడు. వనమాలికా విభూషితుడు. కౌస్తుభాలంకృతోరస్కుడు. మహోజ్జ్వలుడు.

కుంకుమాగురు కస్తూరీ చందనచర్చిత శరీరుడు. చంపకమాలతీపుష్పమాలికాలంకృతుడు. నెమలిపింఛం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో కృష్ణపరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు.

ఈ కృష్ణపరబ్రహ్మ ఆజ్ఞకు భయపడి - బ్రహ్మదేవుడు సకల జీవరాశినీ తత్తత్కర్మానుసారం సృష్టిస్తుంటాడు. తపస్వులకు తపఃఫలాలను ఇస్తుంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పాలిస్తుంటాడు. కాలాగ్నిరూపుడై రుద్రుడు సంహరిస్తుంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినదీ జ్ఞానదాత అయినదీ జ్ఞానులకు గురువైనదీ యోగీశ్వరుడైనదీ భక్తివైరాగ్య సంయుతుడైనదీ పరమానందసంయుక్తుడైనదీ ఆ కృష్ణపరమాత్మ అనుగ్రహంవల్లనే. ఇలా త్రిమూర్తులేకాదు పంచభూతాలూ అష్టదిక్పాలకులూ సూర్యచంద్రులూ నవగ్రహాలూ - సమస్తమూ తమ తమ విధులను నిర్వర్తించేది ఈ కృష్ణపరమాత్ముని ఆజ్ఞకు భయపడియే. సకాలంలో వృక్షాలు ఫలించేదీ లతలు పుష్పించేదీ జల - స్థల జంతుజాలం జీవించేదీ కాలం చెల్లగానే మరణించేదీ అంతా అతడి ఆజ్ఞప్రకారమే. విషమరంగంలో పోరాడుతున్నా అతడి ఆజ్ఞలేనిదే ఏ ప్రాణీ మరణించదు.

వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా, అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులనూ సముద్రాలనూ పర్వతాలనూ సకల చరాచర ప్రాణికోటినీ ఓర్పుతో భరిస్తున్నా - ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే.

డెబ్భైయ్యొక్క దివ్యయుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. ఇరవై ఎనిమిదిమంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలూ రేయీ, ఇలా ముప్ఫయి రోజులతో మాసం, రెండు మాసాలతో ఋతువు, ఆరు ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది.

బ్రహ్మాయుష్షు పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటుకాలం. ఆయన చక్షుర్నిమీలనం చేస్తే అది ప్రాకృతప్రళయం. అప్పుడు సర్వదేవతలూ చరాచరజంతువస్తుజాలమూ సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభిపంకజంలోకి ఉపసంహారం పొందుతారు. లీనమవుతారు.

వైకుంఠంలో క్షీరసముద్రమధ్యాన శేషతల్పంమిద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణపరమాత్ముని వామపార్యంలో లినమవుతాడు. జ్ఞానాధిదేవత శివుడు శ్రీ కృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలోని సర్వశక్తిస్వరూపిణులూ కృష్ణమాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి అతడి బుద్ధిలో లినమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి ఆ శ్రీకృష్ణుడి వక్షఃస్థలంలో. కృష్ణుడి అంశ గణేశుడు అతడి బాహువుల్లో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మిలోకీ, లక్ష్మీదేవి రాధాదేవిలోకీ అంతరిస్తారు. సకల గోపికలూ దేవకాంతలూ రాధలోనే లీనమవుతారు. రాధాదేవి ఆంటే కృష్ణుడి ప్రాణాధిదేవత. అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది. వేదశాస్త్రాలు సావిత్రిలోకీ, సావిత్రి సరస్వతిలోకీ, సరస్వతి శ్రీకృష్ణుడి జిహ్వాభాగంలోకీ అంతర్భవిస్తారు. గోలోక గోపకులు అతడి రోమాలలోకీ వారి ప్రాణాలు అతడి ప్రాణాలలోకీ, అగ్నిదేవుడు జఠరాగ్నిలోకీ సకలజలాలూ రసనాగ్రభాగంలోకీ వైష్ణవులు అతడి పాదపద్మాలలోకీ - ఇలా విరాడంశలన్నీ శ్రీకృష్ణమహావిరాడ్రూపంలో లీనమైపోతాయి. సకలవిద్యలూ అతడి రోమకూపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలమంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇదే ప్రాకృతప్రళయం.

శ్రీకృష్ణపరమాత్మ రెప్పవాలిస్తే ప్రాకృత ప్రళయం. రెప్పతెరిస్తే పునస్సృష్టి. బ్రహ్మాదిదేవతలు ఆవిర్భవించి తమ విధులు నిర్వర్తిస్వారు. సృష్టి అంతా మళ్ళీ కళకళలాడుతుంది. ఇలా ఎన్నిసార్లు సృష్టిలయాలు జరిగాయో ఎవరూ లెక్కించి చెప్పలేరు. భూగోళంలో ఎన్ని మట్టిరేణువులున్నాయంటే ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణపరమాత్మ ఎన్నిసార్లు రెప్పవాల్చాడో తెరిచాడో ఎవరు చెబుతారు? ఎప్పుడు వాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవరు చెప్పగలరు? అంతా అతడి ఇష్టం. ఈశ్వరేచ్చ. సృష్టిలయాలు తదనుగుణంగా జరుగుతూనే ఉంటాయి.

(శ్రీకృష్ణుడు రెప్పవేస్తే ప్రాకృత ప్రళయమన్నారా, బ్రహ్మదేవుడికి నూరేళ్ళు నిండితే (దేవమానం ప్రకారం శతాబ్దం గడవాలి) అది సూత్రప్రళయం. దాన్నే బ్రహ్మప్రళయమంటారు. ఇప్పటికి ఎందరు బ్రహ్మలు లయించి పునరుద్భవించారో ఎవరూ చెప్పలేరు).

ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తమూ శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి. ఒక్కడే పరాత్పరుడు నిర్గుణుడు. ఆగ్ర ఆసీత్‌ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్తమూలప్రకృతి. అవ్యాకృతపదవాచ్య. చిదభిన్న ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరివల్లా కాదు.

సావిత్రీ! వేదాలు నిర్వచించిన ముక్తులు నాలుగువిధాలు, సాలోక్య - సారూప్య - సామీప్య - నిర్వాణాలు, దేవీభక్తి వీటన్నింటికన్నా గొప్పది. అందుకే దేవీ మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకోరు. దేవీసేవనే కోరుకుంటారు. శివత్వ - అమరత్వ - బ్రహ్మత్వసిద్ధులూ జన్మ మృత్యు జరా వ్యాధి భయ శోకాది రాహిత్యం దివ్యరూపధారణం - వీటిని నిర్వాణమనీ మోక్షమనీ అంటుంటారు. ముక్తి ఆంటే సేవారహిత స్థితి. భక్తి అంటే సేవావివర్దని. భక్తిముక్తులకు ఇదీ తేడా. చేసిన శుభాశుభకర్మల ఫలాలను అనుభవించడమే నిషేకమంటే. దాన్ని ఖండించగలిగినది శ్రీకృష్ణభక్తిమాత్రమే. కనక సృష్టిలయాలకూ జన్మమృత్యువులకూ అతీతంగాని శివత్వాదిసిద్ది రూపమైన ఆ ముక్తికన్నా కర్మఫలానుభవత్యాగరూపమూ (నిషేకఖండనం) శ్రీవిభు సేవారూపమూ అయిన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు. వేదాలు చెప్పే స్థిరమైన తత్త్వజ్ఞానం ఇదే, శుభప్రదమైన తత్త్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను. నీ భర్తను పునరుజ్జీవితుణ్ణి చేశాను. ఇక వెళ్ళిరా. నీకు శుభమగుగాక - అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు, కానీ సావిత్రి కదలనివ్వలేదు. పాదాలు పట్టుకుని విలపించదొడగింది. ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోదించింది. యముడికే జాలి కలిగింది. సంతృప్తి కలిగింది. కళ్ళు చెమ్మగిల్లాయి.

వత్సా! లక్షసంవత్సరాలు నీ భర్తతో సుఖసంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం చేరుకుందువుగాని. ఇప్పటికి ఇక ఇంటికి వెళ్ళు. వెళ్ళి సావిత్రీవ్రతం ఆరంభించు. అది పద్నాలుగేళ్ళ వ్రతం. స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ట శుక్షచతుర్దశినాడు ఆరంభించడం శుభప్రదం. భాద్రపద శుక్లాష్టమినాడు మహాలక్ష్మీవతం ప్రారంభించు. ఇది పదహారేళ్ళ నోము. సౌభాగ్యసంపత్ప్రదం. ప్రతి మంగళవారంనాడూ మంగళ ప్రదాయి శ్రీదేవిని ఉపాసించు. ప్రతి మాసంలోనూ శుక్షషష్టినాడు షష్టీదేవిని, ఆషాఢ సంక్రాంతినాడు మనసాదేవిని, కార్తికమాసంలో రాసాధిదేవత రాధను, ప్రతినెలా శుక్లాష్టమినాడు ఉపవాసపూర్వకంగా విష్ణుమాయా స్వరూపిణి దుర్గతినాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు. ఈవిడ పరప్రకృతి. పతిపుత్రవతులైన పతివ్రతలలో యంత్రాలలో ప్రతిమలలో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించేవారికి సకల సంపదలూ సుఖసంతోషాలూ సిద్ధిస్తాయి. వైకుంఠం కరతలామలకంలాగా లభిస్తుంది. దేవివిభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమకర్తవ్యం. సర్వరూప అయిన పరమేశ్వరిని సర్వకాల సర్వావస్థలలోనూ ఉపాసించాలి. ఇంతకన్నా మానవజన్మకు సార్థక్యం లేదు. కృతకృత్యత్వం లేదు - అని చెప్పేసి యముడు ఇక క్షణం ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

సావిత్రీ సత్యవంతులు ఇంటికి తిరిగివచ్చారు. జరిగిన విచిత్రాలు చెప్పారు. సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు. మామగారికి చూపు వచ్చింది. రాజ్యం దక్కింది. సావిత్రి సంతానవతి అయ్యింది. లక్ష సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ, యమధర్మరాజు ఉపదేశించిన నోములన్సీ చేస్తూ, దేవీపాదపద్మార్చనను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది. కట్టకడపట ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవలోకం చేరుకుంది.

నారదా! సావిత్రి అంటే సూర్యాధిదేవత, సూర్యమంత్రాధిష్టానదేవత. వేదమాత. వేదసవిత్రి. కనకనే సావిత్రి అయ్యింది.

జీవకర్మవిపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానం సవిస్తరంగా వినిపించాను. ఇంకా ఏమి కావాలో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి

మహాలక్ష్మి ఉపాఖ్యానం


Description of the Pit of Hell - నరకకూప వర్ణన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - నరకకూప వర్ణన

నరకకూపాలగురించి ఆడిగావుకదూ! విను. ప్రతికుండమూ వర్తులాకారంలో పూర్ణచంద్రమండలం లాగా ఉంటుంది. లోతుగా ఉంటుంది. రకరకాల కఠినశిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి, ప్రళయందాకా శిధిలంకావు. ఈశ్వరుడు ఇచ్చామాత్రంగా విటిని సృష్టించాడు. పాతకులను క్లేశపెట్టడానికే ఇవి ఆవిర్భవించాయి. మండుతున్న అగ్నిగోళంలాగా పదిబారల మంటలతో క్రోశవిస్తీర్ణంగా ఉంటుంది వహ్నికుండం. పాపాత్ముల హాహాకారాలు వినిపిస్తుంటాయి. కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించదు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్యమధ్య పాపులను పొడుస్తూ విధినిర్వహణ చేన్తుంటారు. మరుగుతున్న నీళ్ళతో క్రూరజల జంతువులతో భీకర కాకారవాలతో క్రోశార్థ విస్తీర్ణమై తప్తక్షారోదకకుండం పాపిజన సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలూ మారుమోగుతుంటాయి.

యమకింకరులు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పాడుస్తుంటారు. పైకి తేలినవాడినల్లా లోపలికి కుక్కుతుంటారు. క్రోశ వైశాల్యంగా రకరకాల విట్కుండాలు ఉన్నాయి. అన్నీ మలపిచ్చిలాలు. పురుగులు లుకలుకలాడుతుంటాయి. మహాపాతకులు వాటిలో పార్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టులై హాహాకారాలు చేస్తుంటారు. తపతపా కొట్టుకుంటుంటారు. రక్షమాం - రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తుంటాయి. కానీ మా దూతలకు జాలి అనేదే తెలియదు. అరిచినకొద్దీ పాడుస్తుంటారు.

శ్లేష్మకుండాలు శ్లేష్మ - శ్లేష్మకీటక పరిపుష్టాలు. క్రోశార్థ వైశాల్యంతో గరకుండం. గరకీటాలు కిటకిటలాడుతుంటాయి. వాటికోరలు వజ్రకఠినాలు. వాటి కన్నులు మలపూరితాలు. అవి కుడుతూంటే పాపాత్ములకు దుష్కర్మల ఫలం తెలిసివస్తుంది. ఇటువంటివే వసాకుండాలు. శుక్లకుండం వీటన్నింటికన్నా లోతులో కైవారంలో పెద్దది. శుక్ల - శుక్ల కీటక పరిపూర్ణం. రక్తవర్ణంలో ఉంటుంది. దుర్గంధభూయిష్ఠం. దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ. వలవలా ఏడుస్తూ భరించలేక భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. దుష్కర్మఫలభోగం పూర్తి అయ్యేదాకా మా దూతలు ఊరుకోరు. బాదుతూనే ఉంటారు. గాత్రమలకూపం నాల్గింతలు పెద్దది. నిత్యం పాతకిసంకులంగా ఉంటుంది. మజ్జాకుండం ఇలాంటిదే. వీటిలో కన్యావిక్రయ మహాపాపిష్టులు పాహి పాహి నినాదాలు చేస్తుంటారు. పరుషభాషణులూ నిందాపరాయణులూ చాడీలకోర్లూ శికలు అనుభవించే కర్ణవిట్కూపాలు ఇంకా పెద్దవి. నఖాదికూపాలలో చీరుకుపోతున్న శరీరాలతో నెత్తురులోడుతూ హాహాకారాలు చేస్తూ పాపాత్ములు కనపడుతుంటారు. దీనంగా కన్నీరుకారుస్తూ రక్ష - రక్ష ఆని పెడబొబ్బలు పెడుతుంటారు. ప్రతప్త లోహకూపాలన్నీ గవ్యూతివిస్తీర్ణాలు. వాటిలో ప్రతప్తలోహ ప్రతిమలుంటాయి. పాపాత్ములు వాటిని కౌగిలించుకోవాలి. యమదూతలు తన్ని ఆ పని చేయిస్తుంటారు. చుర్రున కాలుతూంటే మలమల మాడిపోతారు. ఆయాలోహాలు కరిగి ద్రవరూపంలో ఎర్రగా జాలువారుతుంటాయి. ఆ చుక్కలు మీదపడుతుంటే హాహాకారాలు మిన్నుముడతాయి.

ధ్వాంతకుండం ద్విగవ్యూతి విస్తృతం. చర్మకుండ తప్తసురాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి. శాల్మలీకుండంనిండా వృక్షకంటకాలే. యమభటులు పాపులను పట్టి వీటిలోకి విసురుతుంటారు. ముళ్ళు గుచ్చుకుని ఆర్తనాదాలు ముల్లోకాలకీ వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపులు మంట మంట అనే అరుపులు అయ్యో అమ్మో కుయ్యో మొర్రోలు ఎటుచూసినా ఇవే మారుమ్రోగుతుంటాయి. కీటకాల ఆనందనృత్యాలూ కాకుల కోలాహలాలూ సర్పజాతుల హిస్సాకారాలు క్రూరజంతువుల భీషణ ధ్వనులూ - యమలోకం అతిభయంకరం సుమా! ఒకవైపున శస్త్రతల్పాలు. మరోవైపున శరతల్పాలు. వాటిమధ్య పూయకుండాలు. తాడిచెట్టంత పాడుగుండే సర్పాలతో నిండిన సర్పకుండాలు. ఆపైని మశాదికుండత్రయం. ఇవన్నీ క్రోశార్థవిస్తీర్ణాలే. కాళ్ళూ చేతులూ బంధింపబడి సర్పదష్టులై వృశ్చిక కుండంలో వృ
శ్చికదష్టులై శరకుండంలో శరక్షతగాత్రులై గోళకుండంలో కీటకభక్షితులై దారుణంగా విలపించి గిలగిలా తన్నుకుంటున్న మహాపాపులు కాపాడండి కాపాడండి అని ఆరుస్తుంటారు. నక్రకుండ మూత్రకుండ మంథానకుండాలు అర్ధక్రోశ విస్తృతాలు. బీజకుండం నూరుధనుస్సుల లోతు. ధ్వాంత కుండమూ అంతే లోతు. పాషాణకుండం లోతు రెండింతలు ఎక్కువ. వైశాల్యమూ ఎక్కువే. చూర్ణకుండం క్రోశమాత్ర విస్తీర్ణం. ధనుశ్శతం లోతు. చక్రకుండంలో అన్నివైపులా పళ్ళచక్రాలు పదహారు పూటిలతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతుంటాయి. వాటిమధ్య పడి చెరుకుగడల్లాగా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే హాహాకారాలకు సకలవిశ్వాలూ కంపిస్తాయి.

అసిపత్ర సూచీకుండాలు విస్తీర్ణంలో సమానాలు. ధగధగలాడే కత్తులతో వాడిగా మొనదేలి ఉన్న లోహకంటకాలతో ఇవి నిండిఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపులరక్తం గట్టులకి ఎగజిందుతుంటుంది. ఇవి పంచాశద్ధనురాయామాలు. గోకము అనే ఒక జంతువు ఉంది. దాని ముఖాకృతిలో ఉండే కూపాన్ని గోకకుండం అంటారు. ఇది ఇరవై ధనుస్సుల లోతూ వెడల్పూను. దీనినిండా ఆ భయంకర జంతువులే తెళ్ళుతుంటాయి. పాతకుల్ని కుళ్ళబొడుస్తుంటాయి. కొంచెంకొంచెంగా భక్షిస్తుంటాయి. ఇవి ఎప్పుడూ తలలు పైకి ఎత్తవు.

ఈ కుండాలన్నింటిలోనూ కలిపి ఎంతమంది ఉంటారో దానికి నాలుగురెట్లు ఎక్కువమంది పాపాత్ములుంటారు కుంభీపాకనరకంలో. ఇది సర్వకుండప్రధానం. ఇక్కడ శిక్షలూ అంతే - అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న పాతకులతో అన్ని కుండాలూ రేయింబవళ్ళు దభీదభీమని మోగుతుంటాయి. తప్తపాంసుకుండంలో కాలిన ఇనపరజనులాంటి ధూళి సుడిగుండాలు తిరుగుతుంటుంది. కమిచీదెబ్బల్లా పాపుల దేహాలకు వాతలు పడుతుంటాయి. కాలిన ఇటుకలతో జ్వాలాముఖకుండం. తప్తవాలుకాకుండం. వీటిలో పడటమేమిటి పాపాత్ములు మూర్చిల్లుతారు. ధనుశ్శత విస్తీర్ణమైన నాగకుండం, అశ్వకుండం - ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసాక్రీడలు జరుపుతాయి. ఎనభయ్యారు కుండాలూ ఒకదానికన్న ఒకటి భయంకరంగా ఉంటాయి. ఫాపాత్ములతో కిటకిటలాడుతుంటాయి. అంతటా భరించరాని దుర్గంధం. అంతటా భరించరాని హాహాకారాలూ ఆర్తనాదాలూ. సావిత్రీ! ఇదీ నరకకూప లక్షణం. ఇంకా ఏమి తెలుసుకోదలిచావో, అడుగు.

యమధర్మరాజా! నరకకూపాల భయానకచరిత్ర తెలిసింది. వాటినుంచి తప్పించుకునేందుకు ఏకైకమార్గం దేవీమంత్రోపాసన. కనక దయచేసి దేవీభక్తిని నాకు ప్రబోధించు. స్త్రీజాతి తత్త్వజ్ఞానవిహీనం కదా! అందుచేత తత్త్వజ్ఞానసారమైన దేవీభక్తిని ఉపదేశించి పుణ్యంకట్టుకో.

యజ్ఞ దాన తీర్థస్నాన తపోవ్రతాచరణల వల్ల లభించేపుణ్యం, ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించడంవల్ల కలిగే పుణ్యంలో పదహారవవంతుకి సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. గౌరవార్హతలో తండ్రికన్నా తల్లి నూరురెట్లు గొప్పది. జ్ఞానదాత గురువు - తల్లికన్నా నూరురెట్లు ఎక్కువ గౌరవార్హుడు.

సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు. పుత్రీ! ఇంతకుముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను. ఇప్పుడు దేవీభక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనై ఇస్తున్నవరం. దేవీగుణకీర్తనం అడిగినవారికీ చెప్పినవారికీ విన్నవారికీ అందరికీ శుభప్రదం. తారణకారణం.

యముడు చెప్పిన దేవీమహిమ


The Story of Svaha - స్వాహా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వాహా వృత్తాంతం నారదా ! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియ...