సగర చక్రవర్తి కథాప్రారంభము
బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభార్య అతణ్జి అనుసరించే ప్రయత్నంచేసింది. కాని ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకొన్న ఔర్వముని ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. కొంతకాలానికి ఆమెకు గర్భం నిండగా ఆమెసవతులు ఈర్ష్యతో ఆమె తినే అన్నంలో విషం కలిపి పెట్టారు. కాని దానిచే గర్భవిచ్చిన్నం కాకుండా ఆ విషంతోపాటు మహానుభావుడైన సగరుడు జన్మించి, గొప్ప యశఃప్రకాశంతో చక్రవర్తి అయ్యాడు.
సగరుడు తండ్రిపగకోసం యుద్దాలుచేసి హైహయ బర్బరాదులను చెండాడాడు. తాళజంఘాదుల్ని చంపాడు. తన శత్రువుల తలలు గొరిగించాడు. వస్త్రహీనులుగా భయంకర రూపాలతో ఉండేటట్లు చేశాడు. సగరుడనే పేరుగల ఆ రాజు సామాన్యుడా? (సామాన్యుడు కాడు).
సూర్యచంద్రుల కాంతులు ప్రసరించునంతటి భూమిని సగరుడు తన భుజబలంతో శత్రురాజులను అణచి పరిపాలించాడు. మేరుపర్వత ధీరుడని, పరాక్రమవంతుడని, శత్రునగరనాశకుడని ఆ సగరుణ్ణి ప్రశంసింపవచ్చు.
ఔర్వముని చెప్పడంవల్ల వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు ఈశుడు అయిన హరినిగూర్చి ఆ సగరుడు అశ్వమేధాలను చేశాడు. ఒక యజ్ఞంలో అశ్వాన్ని వదలగా ఇంద్రుడు దాన్ని తీసుకొనిపోయి నాగలోకంలో కపిలమునికి సమీపంలో కట్టివెళ్ళాడు. అక్కడ గుర్రం కనబడక రాజు తనకుమారులను అన్ని దిక్కులకు వెతకడానికి పంపాడు. వారు భూమిమీది సప్తద్వీపాల్లో వెదకి అశ్వం కనపడకపోవడంతో అంతటితో తిరిగిరాక ప్రాభవంతో భుజబలంతో భూమినంతటిని పొడిచి పొడిచి త్రవ్వారు.
ఈ విధంగా సుమతికొడుకులు నేలను త్రవ్వి, పాతాళలోకంలో ఈశాన్యదిక్కున కపిలమహర్షికి సమీపంలో ఉన్న గుర్రాన్నిచూచి
(సగరుని భార్యల్లో సుమతి ఒకతె.)
“అయ్యారే! తెలుసుకున్నాం, ఆలస్యం దేనికి? వీడే గుర్రాన్ని దొంగిలించాడు. ఈ పాపిని పట్టి చంపండి. పెద్దసాధువైన మునివలె కళ్లుతెరవకుండా, మురికినోరు కదలించకుండా పంతంపట్టాడు” అంటూ ఆ అరవైవేలమంది తమ ఆయుధాలను ఝళిపిస్తూ దగ్గరకు వస్తుండగా
కపిలమహర్షి కళ్లుతెరవగా సగరపుత్రులు తమ శరీరాల్లో అగ్ని పుట్టి, ధైర్యాల్ని కోల్పోయారు. అహంకరించి మూఢులై రాజకుమారులందరూ ఆ నిముషంలోనే బూడిదయ్యారు. సాధువుల్ని, మునులను కష్టపెట్టె గర్విష్ఠులు జీవించగలరా?
కొంతమంది కపిల మహర్షి కోపాగ్నిచేత సగరుని కొడుకులు చచ్చారంటారు. కాని ఆ మహర్షి పరమశాంతుడు. ఆనందమయమూంర్తి ఆయన కోపిస్తాడా? ధూళి భూమిమీద పుడుతుంది గాని ఆకాశంలో కాదుగదా! సగరునికొడుకులు తాము చేసుకొన్న దోషంచేత శరీరాల్లో అగ్నిపుట్టి నాశనమయ్యారు కాని, ఏ సాంఖ్యశాస్త్రంచేత జ్ఞానులు సంసారసాగరాన్ని మృత్యుభయాన్ని పోగొట్టుకొంటారో, ఆ శాస్త్రాన్ని రూపకల్పన చేసిన భగవన్మూర్తి సమస్తబోధకుడు ఆయిన, ఆయనకు మిత్రులని, శత్రువులని ఎవ్వరుంటారు? (ఎవ్వరూ ఉండరు).
సగరునికి కేశినియందు అసమంజసుడనే కొడుకు కలిగాడు. సమంజసమైన గుణాలులేక పూర్వజన్మలో ముని శ్రేష్ఠుడై ఉండికూడ సహవాసదోషంచేత పతితుడై సగరునికి పుట్టాడు. కాని పూర్వజన్మ స్మరణచేత వాడు ప్రజలకు, తనవారికి కూడా కష్టం కలిగించే పనులు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు.
ఆ అసమంజసుడు క్రమంగా అయోధ్యానగర వీథుల్లో ఆడుకునే చిన్నపిల్లలను సరయూనదిలో పడవేశాడు. నగర ప్రజలు, తండ్రి అయిన సగరుడు అతనిని దూషించారు. వాడు తరువాత గొప్పజ్ఞానం కలిగి తనయోగశక్తితో ఆ పిల్లలను కొద్దిరొజుల తర్వాత నగరానికి తెచ్చాడు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ అసమంజసునికొడుకు అంశుమంతుడనేవాడు నీతిమంతుడై తాత దగ్గర పనులు నిర్వర్తించేవాడు. అప్పుడు సగరుడు మనుమనితో యాగాశ్వాన్ని వెదికి తీసుకరమ్మని పంపాడు. వాడు తన తండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి, వారు తవ్విన పెద్దగొయ్యిలో ప్రవేశించి, అక్కడ బూడిదకుప్పల పక్కన ఉన్న గుర్రాన్నిచూచి, దాని పక్కన ఉన్న కపిలుడనే పేరుగల శ్రీహరికి నమస్కరించి ఇట్లా స్తోత్రం చేశాడు.
బుద్ధిని స్వాధీన పరచుకొని సమాధిస్థితిలో ఉండి కూడా తాననుకొనే శరీరానికి వేరుగా ప్రకాశించే నిన్ను బ్రహ్మకూడా చూడలేడు. ఏ నాటికైనా తెలుసుకోలేడు. ఆ బ్రహ్మయొక్క మనస్సు, అవయవాలు, బుద్ధిలో పుట్టె పెద్దజీవుల్లో కూడ అల్పులమైన మాకు తెలుసుకోవడం సాధ్యమా? తమలోనే నీవుండగా నిన్ను తెలుసుకోలేరు. బాహ్యమైన గుణాలనుమాత్రమే చూస్తారు. ఒక్కొక్కప్పుడు వాటిని కూడ చూడలేక తమస్సు పాలవుతారు. శరీరధారులు గుడ్డీవారై నీ మాయకు లోబడి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. బాహ్యమైన సంబంధాలకు విలువనిస్తారు.
అని విన్నపం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టమని అడగక, తండ్రులు నాశనమైన విషయాన్ని ప్రస్తావించక, నమస్కరించి నిలబడ్డ అంశుమంతునితో అపారమైన కరుణతో కపిలముని ఇట్లా అన్నాడు.
బుద్ధిమంతుడైన బాలకా! ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకపో. అవివేకులైన మీ తండ్రులు బూడిద అయినారు. ఈ బూడిదకుప్పమీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగుతుంది.
(గంగాజలాన్ని గూర్చి అంశుమంతుడు ప్రస్తావించలేదు. కపిలభగవానుడే సెలవిచ్చాడు. అసలు ఈ కథ పరమార్ధమే అది. ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించడం, కపిలమహర్షి దగ్గర కట్టివేయడం ఎందుకు? ఇది కూడా ఆ పరమార్ధమే. దేవనది భూలోకానికి రావడం ఆ పరమార్థమే.)
అని ఆ ముని చెప్పగా ఆయనకు నమస్కరించి అంశుమంతుడు గుర్రాన్ని తెచ్చి సగరునికిచ్చాడు. అతడు ఆ గుర్రంతో యాగాన్ని పూర్తిచేసి, మనుమనికి రాజ్యమిచ్చి బంధాలనుండి విముక్తుడై ఔర్వుడు చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు.
తండ్రులు బూడిద అయిన ప్రదేశానికి దేవనదిని తెస్తానని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేక, మనోదుఃఖంతో అంశుమంతుడు మరణించాడు.
అతనికొడుకు దిలీపుడు భూమి మీదికి గంగను తేవడానికి తపస్సు చేశాడు కాని తేలేక గతించాడు.
దిలీపునిపుత్రుడైన భగీరథుడు గొప్పతపస్సుచేసి, అమృతమయకటాక్షాలు కలది, గొప్పఅలలతో కూడింది, ముఖపద్మంపై ఆసక్తిగల తుమ్మెదలు కలది. శివజటాజూటం రంగస్థలంగా కలది అయిన గంగను దర్శించాడు.
గంగను చూచి భగీరథుడు నమస్కరించగా గంగ దయతో వరం కోరుకొమ్మనింది. అందుకు ఆ రాజకుమారుడు ఇట్లన్నాడు.
తల్లీ! మా వారిబూడిద రాసులను నీ నీటిలో కలుపుకో. నీ నీటి స్పర్శచేత మావాళ్లకు స్వర్గం సిద్ధిస్తుంది. ఇది నిజం.
వికసించిన హృదయం కలదానివి, పుణ్యాత్మురాలివి, అలల సంపదచే రెల్లు, మల్లెపూలల శోభను జయించిన దానివి. ఉత్తముల పాలిట శ్రేష్ఠమైన కల్పవృక్షానివి అయిన ఓ గంగామాతా! నిన్ను మనసులో నిండుగా భజిస్తాను.
(ఫుల్లాంతరంగ అనడంవల్ల ఆమె విశాలహృదయం, 'సుధీకల్పలతామతల్లి అనడంవల్ల మంచివారి పాలిట కల్పవృక్షానివనే సూచనతో తను కోరిన వరమీయవలసిందని భగీరథుడర్థించినట్లయ్యింది.)
అని స్తుతిస్తున్న భగీరథునితో లోకపావని గంగామాత ఇలా పలికింది.
ఆకాశమార్గం నుండి వచ్చి భూమిమీద పడే నా వేగాన్ని నిలుప కలిగిన సామర్థ్యం ఎవరికుంది? ఆ వేగంతో నేను భూమిని చీల్చుకొని పాతాళానికి వెళతాను. నేను వస్తే మానవులు నాయందు స్నానంచేసి కడిగేసుకొన్నవారు ఆ పాపాలను నాకు అంటగడతారు. ఆ పాపాలను నేనెక్కడ వదిలించుకోను.
ఆ కారణంచేత ఆలోచిస్తున్నానన్న లోకమాతతో రాజశ్రేష్ఠుడైన భగీరథు డిట్లన్నాడు.
ఓ దివ్యగంగా! పరతత్త్వం తెలిసినవారు, ప్రశాంత మనస్కులు, తపోనిష్ఠ కలవారు, గౌరవార్హులు, మహనీయులు అయిన మానవులు వచ్చి, నీ నీటిలో మునకలు వేసే సమయంలో విశ్వానికి ప్రభువు, సమస్తపాపహరుడు అయిన ఆ శ్రీహరి వారిహృదయాల్లో నిండి ఉంటాడు కదా! వారిపాపాలు నిన్నాలా అంటుకుంటాయి? (అంటుకోవు).
ఓ తల్లీ! తనలో అనేకమైన లోకాలుండడం, తాను ఆ లోకాల్లో ఉండడం దారాల్లో వస్త్రముండే రీతిగా విశ్వమయుడైన పరమేశ్వరుడు కాక నీ నీటి వేగాన్ని అడ్డుకునే నేర్పు ఎవరికుంది? నిన్ను భరించడానికి శివుణ్ణి ప్రార్థిస్తాను.
అని తెలిపి గంగాదేవి దగ్గర సెలవు తీసుకొని భగీరథుడు వెంటనే శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
అపుడు భక్తవత్సలుడైన పరమశివుడు ఆ భగీరథుని ప్రయత్నానికి మెచ్చుకొని, విష్ణుపాదాలను స్పృశించడంవల్ల పవిత్రమైన జలంతో ఆకాశంనుండి భూమి మీదికి అవతరించే గంగను తన శిరస్సుపై ధరించాడు.
(లోకంలో భగీరథప్రయత్నం అనేమాట వ్యాప్తివెనుక ఉన్న ఆ భగీరథుని శ్రమను గ్రహించాలి.)
శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము
Telugu Library
Tuesday, March 24, 2026
The Ikshvaku Dynasty - ఇక్ష్వాకు వంశానుక్రమము
ఇక్ష్వాకు వంశానుక్రమము
ఒకరోజు వైవస్వత మనువు తుమ్మగా అతని ముక్కురంధ్రం నుండి గొప్పకీర్తి కలిగిన పుణ్యాత్ముడు ఇక్ష్వాకుడు వైకల్యం లేకుండా పుట్టి సూర్యవంశానికి రాజయ్యాడు.
(మనువుకు పదిమంది సంతానం. ఇక్ష్వాకుడు తొమ్మదవవాడు. ఇంతవరకు ఎనిమిదిమంది వృత్తాంతాలు చెప్పబడ్డాయి.
ఇక్ష్వాకుడికి నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో వికుక్షి నిమి, దండకుడు అనేవారు వరుసగా పెద్దకొడుకులు. వీరు ఆర్యావర్తంలోని హిమాలయానికి, వింధ్యకు మధ్యనున్న కొంతభూమిని పాలించారు. తరువాతి ఇరవై ఐదుమంది తూర్పుభాగాన్ని పాలించారు. మరో ఇరవైఐదుమంది పడమటి భాగాన్ని పాలించారు. ఇంక మిగిలిన నలబైఏడుమంది ఉత్తరదక్షిణభూములకు రాజులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్ధం చేయాలనుకొని పెద్దకొడుకు, కీర్తిమంతుడు అయిన వికుక్షినిచూచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెమ్మన్నాడు.
తండ్రి ఆనతిని విని వికుక్షి అట్లేనని దట్టమైన అడవులకు వేటకువెళ్లాడు. అక్కడ జంతువుల్ని వేటాడిచంపాడు. శరీరం బాగా అలసిపోయింది. తట్టుకోలేని ఆకలిబాధతో సగమై, ఒక కుందేలును పట్టుకొని తిన్నాడు. తినగా మిగిలిన మాంసఖండాన్ని దోషంలేదనే భావంతో వెంటనే తండ్రికి తెచ్చిఇచ్చాడు.
అపుడు కులగురుడు వసిష్ఠుడు వికుక్షి కుందేలుమాంసం తినడం మనస్సులో గ్రహించాడు. “ఇది ఎంగిలిపడిన మాంసం. పితృకర్మలకు పనికిరాదు. వీడు దుర్బుద్ది కలవాడు” అని అన్నాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని రాజ్యంనుండి బయటకు వెడలగొట్లాడు.
గుణవంతుడైన ఇక్ష్వాకుడు కొడుకును వెళ్ళగొట్టి, ఆ వసిష్ఠమహర్షి చెప్పింది ఆచరించి యోగియై, అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని వదలి మోక్షాన్ని పొందాడు.
తండ్రి మోక్షం పొందగా నీతిశాలి వికుక్షి తనను ప్రజలు శశాదుడని పొగడుతుండగా ఈ భూమిని పరిపాలించి విష్ణువును గూర్చి ప్రయత్నపూర్వకంగా యాగాలు చేశాడు. పురంజయుడనే కొడుకును కన్నాడు. అతనిని గూర్చి లోకాలు కకుత్స్థుడని, అమరేంద్రవాహనుడని పేర్కొన్నాయి.
(పూర్వపద్యంలో వికుక్షి చేసిన దోషం చెప్పబడింది. కాని వాణ్ణి ప్రజలు కీర్తించారు. అనేకయాగాలు చేశాడు. అంటే ప్రజామోదం పొందాడన్నమాట. దోషం చేసినా దాన్ని సర్దుకున్నాడు. శశాదుడు అనగా కుందేలును తిన్నవాడని అర్థం.)
కృతయుగం చివర్లో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిన దేవేంద్రుడు విష్ణువుతో మొరపెట్టుకొన్నాడు. అప్పుడు విష్ణువు ఇంద్రా! పురంజయునిలో నేను ఆవేశిస్తాను. నువ్వు ఎద్దువై అతణ్ణి మోయుమన్నాడు. ఇంద్రుడు ఎద్దుగా మారి తనమూపుపై పురంజయుణ్ణి మోశాడు. విష్ణుతేజస్సు తనలో వ్యాపించగా పురంజయుడు ధనుర్భాణాలను ధరించి ప్రళయకాలాగ్నివలె యుద్దానికి బయలుదేరాడు.
ఆ విధంగా బయలుదేరి రాక్షసవీరుల శరీరాలను ఖండించి, కుత్తుకలను ముక్కలుగా ఖండించి, కొందరిని యముని నగరానికి పంపి, మరికొందరిని నాగలోకానికి తరిమాడు. అంతటితో ఊరుకోక పురంజయుడనే పేరు సార్థకం అయ్యేటట్లు ఆ రాక్షసులనగరాలనుకూడా కూల్చాడు.
ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసులపురాలను జయించిన కారణంచేత పురంజయుడని, ఎద్దురూపంలో ఉన్న దేవేంద్రుడు వాహనం కావటంచేత ఇంద్రవాహనుడని, అతని మూపురంమీద ఎక్కి యుద్ధంచేయటంచేత కకుత్స్థుడని మూడుపేర్లతో ప్రఖ్యాతి పొంది, రాక్షసుల ధనాలను ఇంద్రుని కిచ్చాడు. అతని కుమారుడు అనేనసుడు. అతనికొడుకు పృథుడు. అతనికొడుకు విశ్వగంధుడు. విశ్వగంధునికొడుకు చంద్రుడు. చంద్రునికొడుకు యువనాశ్వుడు. అతని కొడుకు శ్రవస్తుండు. ఈతడే శావప్తి అనే పేరుగల నగరాన్ని నిర్మించాడు. శవస్తికొడుకు బృహదశ్వుడు. ఇతనికొడుకు కువలయాశ్వుడు. ఆ రాజశ్రేష్ఠుడు
వీరుడైన కువలయాశ్వుడు బలిష్ఠుడై తన ఇరవైఒక్కవేలమందికొడుకులతో ఉదంకుని ఆనతిమేరకు వెళ్ళి, దేవతల శత్రువైన దుంధుడనేవాణ్ణి చంపాడు.
దుంధుడనే రాక్షసుణ్ణి చంపటంచేత కువలయాశ్వునికి దుంధుమారుడనే పేరు కలిగింది. దుంధుని నోటినుండి వెడలిన కువలయాశ్వుని కొడుకులు బూడిద అయ్యారు. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురుమాత్రం బ్రతికారు. వారిలో దృఢాశ్వునికి హర్యశ్వుడు, వానికి నికుంభుడు, వానికి బర్హిణాశ్వుడు, వానికి కృతాశ్వుడు, వానికి సేనజిత్తు, వానికి యువనాశ్వుడు పుట్టారు. ఆ యువనాశ్వుడు సంతానంలేక నూర్వురుభార్యలతో భయపడుతూ ఉండినాడు. అప్పుడు కొందరుమునులు దయతలచి సంతానంకోసం అతనితో ఇంద్రయాగం చేయించారు. ఆ యాగంలో
రాజుభార్యకు, పుత్రలాభంకోసం బ్రాహ్మణులు నీటిని మంత్రించి, నియమంగా ఆ నీరున్నకలశాన్ని దాచి నిద్రపోయారు. ఆ రాత్రి రాజు దప్పికతో విధిలేక యాగశాలను ప్రవేశించి, ఆ నీటిని త్రాగాడు. అపుడు బ్రాహ్మణులు మేల్కొని నీళ్లు ఏమైనాయి? ఎవరు త్రాగారు? అని రాజు త్రాగిన విషయాన్ని గ్రహించారు. ఆశ్చర్యపోయి “ఈశ్వరాజ్ఞను ఎవడు దాటగలడు? ఇప్పుడేం చేయాలి? ఆ భగవంతుడికి నమస్మారం” అంటూ
ఆ బ్రాహ్మణులు విచారిస్తుండగా కొంత సేపటికి యువనాశ్వునిపొట్టచీల్చుకొని చక్రవర్తి లక్షణాలతో ఒక కొడుకు పుట్టాడు. తల్లిలేని కారణంచేత పొట్టనిండక ఏడుస్తున్న ఆ శిశువుదగ్గరికి ఇంద్రుడు వచ్చి తన వ్రేలును వాడినోటిలో ఉంచాడు. అట్లా త్రాగినందున ఆ బాలునికి మాంధాత అనే పేరుపెట్టి వెళ్ళాడు. ఈ విధంగా
(మాం = నన్ను, ధాతా = త్రాగగలడు అని ఇంద్రుడు - అన్నాడు. శిశువు అట్లే చేశాడు. ఆ శిశువుకు మాంధాత అని పేరయ్యింది.)
పొట్టపగిలి ముద్దుకొడుకు పుట్టినా తండ్రి చావలేదు. దేవతల, బ్రాహ్మణుల దయ అలా ఉంటుంది కదా! అధికమైన దైవబలం కలిగినవాడు జీవిస్తాడేకాని చెడిపోతాడా? చెడిపోడు.
ఈ విధంగా బతికిన యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సుచేసి సిద్ధిపొందాడు. ఆ తరువాత
ఆ బాలుడు పడమటి దిక్కున పుట్టె బాలచంద్రునివలె దినదిన ప్రవర్ధమానుడై, నిండు యౌవనం పొంది, రావణాది రాక్షసులను, శత్రురాజులను దండించాడు. అతణ్ణి దేవేంద్రుడు త్రసదస్యుడు అని పొగిడాడు. అతడు యజ్ఞవస్తువులు, యజమాని, మంత్రాలు, ఋత్విక్కులు, యజ్ఞకాలాలు అన్నీ విష్ణుమయంగా భావించి, గొప్పగా దక్షిణలనిచ్చి యజ్ఞాలు చేశాడు.
ఆ మాంధాత శ్రీహరిదయతో శత్రువులను శిక్షిస్తూ, చంద్రసూర్యులు సంచరించే చోటులన్నింటిని సిరిసంపదలతో తులతూగేటట్లు పరిపాలించాడు.
పిమ్మట ఆ మాంధాతకు శతబిందుని కూతురైన బిందుమతివల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే ముగ్గురుకొడుకులు, ఏభైమందికూతుళ్లు కలిగి పెరుగుచుండగా
మహానుభావుడైన సౌభరి అనే ముని యమునానదినీటిలో తపస్సుచేస్తూ, భార్యాపుత్రులతో కలిసి సంసారసుఖాన్ని అనుభవిస్తున్న చేపలరాజును చూశాడు. సంసార మందలి కోరికతో మాంధాతను ఆయన పుత్రికలలో ఒక కన్యను తన కిమ్మని అడిగాడు. ఆ రాజు స్వయంవరంలో కన్యనిస్తాను గ్రహించమన్నాడు, వయసులో ఉండే కన్య నాలాంటి ముసలివాణ్ణి ఎందుకు ఇష్టపడుతుంది. ముసలితనంతో వణుకుతున్నాను. జుట్టు నెరిసింది. ఒంట్లో కాంతిగాని, బిగువుగాని లేదు. కన్యను లోబరచుకొనే ఉపాయమేది? అని అనుకున్నాడు.
పువ్వులాంటి శరీరం గల కన్య యౌవనవంతుణ్ణి, సౌందర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి కోరుకుంటే కోరుకోవచ్చుగాని, ఎదురుగా నున్న ముసలిమునినైన నన్ను ఎందుకు కోరుకుంటుంది?
అని యోచించి సౌభరి తన తపశ్శక్తితో ముసలితనాన్ని విడిచి లతవయస్సు యువకుడై చక్కగా అలంకరించుకొని మాంధాత దగ్గరకు వచ్చాడు. అపుడారాజు అంతఃపుర రక్షకుల నాజ్ఞాపించగా వారు ఆ మునిని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువెళ్లి చూపించారు. చూపగా
మన్మథుడు మోహావేశాన్ని కల్గించగా, ఆ కన్యలందరు ఆ మునీశ్వరుని చూచి “కొమ్మలారా! వీడు నలకూబరుడో, మన్మథుడో, జయంతుడో పొరబాటున ఇక్కడికి వచ్చాడు. ఆలస్యమెందుకు” అంటూ మేము మేము అని సంచలిత మనస్కులై అందరు వరించారు.
ఈ విధంగా ఆ రాజకన్యలనందరిని పెళ్ళాడి, సౌభరి తన తపోమహిమతో అనేక లీలావినోదాలు సృష్టించి సుందర భవనాల్లోనూ, కేళీపర్వతాల్లోనూ, కలువలు వికసించిన సరస్సుల్లో, కోకిలల, చిలుకల, తుమ్మెదల మనోజ్ఞ నాదాలతో సుందరమైన ఉద్యానవనాలలో, మణులు పొదిగిన తిన్నెలపైనా, గొప్పశయ్యలపైనా, కొండగుహల్లో శృంగారవతులైన స్త్రీలు తన ఆజ్ఞలు పాటిస్తుండగా, అందమైన ప్రదేశాలలో వస్త్రమాల్యానులేపనాదులను కల్పించి, ఇష్టభోజనాలతో పూటపూటకు ఒక ఆశ్చర్యకరమైన అందంతో ఆ రాజకుమార్తెలను సంతృప్తిపరచాడు.
అధికమైన నేతిధారలచేత తృప్తిపొందని అగ్నివలె, మునీశ్వరుడు పలువురు రాచకన్యలకు ఒకడే భర్తగా అయిఉండి కూడా తృప్తి పొందలేకపోయాడు.
పైవిధంగా మునీశ్వరుడు ఉద్యానవనంలో ఆ రాజకుమార్తెలతో అనేకవిధాల విహారాలతో, అనురాగాలతో, రాకపోకలతో కొన్నిరోజులు గడిపాడు.
పిమ్మట కొంతకాలానికి మంధాతృమహారాజు ముని ఏమయ్యాడో? కుమార్తెలు ఎన్నికష్టాలు పడుతున్నారో? అని ఆలోచించి, వెదుకుతూవచ్చి ఒక గొప్ప నగరంలో మణులు పొదిగిన భవంతిలో చక్రవర్తివలె విహరిస్తున్న తాపసరాజును చూచి సంతసించి, ఆశ్చర్యపడి ఆ మునిచేత గౌరవాలు పొంది, మెల్లగా కుమార్తెలను చేరి ఇలా అన్నాడు.
నా బిడ్డలారా! మీ భర్త అన్యోన్యంగా ఉంటున్నాడా? బాగా ఆదరిస్తున్నాడా? అని అడిగాడు - మాంధాత. ఆరాచ కుమార్తెలు అందరూ తండ్రీ! నా తోడే నా తోడే అంటూ బాగా ఆదరిస్తున్నాడన్నారు.
('తోడు' శబ్దానికి 'అన' అనే అర్థముంది. నాన్నా! నేను నిజమే చెబుతున్నాను. ఇది నా ఆన (నా సాక్షి) అని ఆ రాజు మాంధాతతో బిడ్డలందరూ చెప్పారు.)
పిమ్మట కొంతకాలానికి లౌకికబంధాలకు చిక్కిన సౌభరి ఏకాంతంలో తనకు తానే విచారించుకొని చేపల జంట పొత్తును చూడ్దంచేత తాను సంసారబంధంలో చిక్కుకోవడం తెలుసుకొని, పశ్చాత్తాపంతో ఇట్లా అనుకున్నాడు.
ఉపవాసాలతో శుష్కించడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలి వేయడమో, తపస్సులో గడపడమో, శ్రీహరిధ్యానంలో ఉండడమో చేయక ఎందుకు ఈ మాటలాడి ఈ స్థితి తెచ్చుకొన్నాను. నా తపస్సంతా నశించింది. కపటమైన స్త్రీ కౌగిళ్లు మోక్షాన్ని కల్గిస్తాయా? (కల్గించవు).
నేనొక మునినట, తత్త్వం తెలిసినవాడనట, మోక్షం తప్ప ఇతరసుఖాల జోలికి వెళ్ళనట, ఏభైమంది భార్యలట, మేడల్లో నివాసమట, ఐదువేలమంది కొడుకులట. దీని కంతటికి కారణం చేపలరాజు సౌఖ్యం చూడడ మట. నవ్విపోతారుగాని పెద్దవారు మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు)
తపస్సు చేసేవాడు, తత్త్వవేత్త అయినవాడు, మోక్షాన్ని కోరేవాడు ఏకాంతం కోరుకుంటాడు. కపటముని మాత్రం సంసారంలో తగుల్కొంటాడు.
అని దుఃఖించి తన్ను తాను నిందించుకొని, తన చేతను విమర్శించుకుంటూ ఇహపరాలను సాధించాలని నిశ్చయించి, సంసారాన్ని వదలి, భార్యలతో వానప్రస్థధర్మాన్ని స్వీకరించి, అడవులకు వెళ్ళి తపస్సుచేసి శరీరాన్ని వదలి అగ్నితో పరమాత్మను చేరుకున్నాడు. తరువాత
అగ్ని దేవుణ్ణి జ్వాలలు విడిచి పెట్టక అనుసరించినట్లు సౌభరిభార్యలుకూడా అతణ్ణి అనుసరించి, అతను పొందిన స్థితినే పొందారు.
మాంధాతకొడుకుల్లో అంబరీషుణ్ణి తాత యువనాశ్వుడు అతనిని కుమారునిగా స్వీకరించాడు. ఆ అంబరీషునికి యౌవనాశ్వుడు, అతనికి హారితుడు పుట్టారు. ఆ కారణంచేత అంబరీష, యౌవనాశ్వ, హారితులు మాంధాతృ గోత్రానికి ముఖ్యపురుషులైనారు. మాంధాత రెండవకొడుకు పురుకుత్సుడు. నాగకుమారులు అతణ్ణి పాతాళానికి తీసుకొనిపోయి, తమ చెల్లెలు నర్మద నిచ్చి వివాహం చేశారు. అక్కడ ఎందరో గంధర్వనాథుల్ని చంపి, తాను నాగలోకం వెళ్లి సంచరించిన విషయం స్మరించిన వాళ్లకు పాముల వల్ల భయం లేకుండా వరం పొంది, తిరిగివచ్చాడు. పురుకుత్సునికి త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి అరుణుడు, అతనికి త్రిబంధనుడు, అతనికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవత్రుడే త్రిశంకుడని ప్రసిద్ది పొందాడు. ఆ త్రిశంకుడు
గురుశాపంవల్ల చండాలుడైన అతడు మహానుభావుడైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి, అతని ప్రభావంచేత స్వర్గానికి వెళ్ళాడు. దేవతలు అతణ్ణి ఒప్పుకోక తోసివేశారు. అతడు తలకిందుగా దీనుడై రావడం చూచి, విశ్వామిత్రుడు తన గొప్పతనంతో ఆకసంలో నిలిపాడు. నేటికీ ఆ త్రిశంకుడు అక్కడే ఉన్నాడు. అతనికొడుకు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడితని వద్దకు వచ్చి యాగం నెపంతో అతని సంపదను హరించి, అతణ్ణి కులహీనునికి సేవకుడుగా చేశాడు. కాని హరిశ్చంద్రుడు అసత్యం పలుకక కష్టాల పాలయ్యాడు.
ఆ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధపెట్టడం విని, వసిష్ఠుడు విశ్వామిత్రుని గద్దవు కమ్మని శపించాడు. విశ్వామిత్రుడు వసిష్ఠుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. పక్షిరూపాలు పొందినా ఆ ఇద్దరూ శత్రువులై పోరాడారు. ఆ తరువాత హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని ఉపదేశంతో వరుణుణ్ణి భక్తితో ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షం కాగా హరిశ్చంద్రు డతనికి నమస్కరించి ఇలా అన్నాడు.
ఓ వరుణదేవా! నాకు మంచి వీరుడైన కొడుకునిస్తే అతణ్లి యాగపశువుగా మార్చి, నీవు సంతోషించేటట్లు హోమం చేస్తాను. కాబట్టి కొరత లేకుండా కొడుకు నిమ్ము.
అని అడిగిన హరిశ్చంద్రునికి కొడుకు కలుగుగాక అని వరమిచ్చి వరుణుడు వెళ్ళాడు. ఆ వరుణుని అనుగ్రహంచేత హరిశ్చంద్రునికి రోహితుడనే కొడుకు కలిగాడు. అపుడు వరుణుడు హరిశ్చంద్రుని కుమారుణ్ణి గురించి
వరుణుడు హరిశ్చంద్రుని వాగ్దానం ప్రకారం పురిటి లోపల వచ్చి కొడుకును బలి ఇవ్వుమనగా పురుడు దాటితేగాని కుదరదు అన్నాడు. పండ్లు రావడానికి ముందువచ్చి అడుగగా పండ్లు లేకపోవడంచేత బలికి అనర్హుడన్నాడు. పండ్లు వచ్చాక అడుగగా పడిపండ్లు రాలేదు కాబట్టి అనర్హుడన్నాడు. పాలపండ్లు పోయి మళ్లీ పళ్లు వచ్చాక అడుగగా యుద్దాలకు ఉపయోగపడితేనే అర్హత కలుగుతుందన్నాడు. ఈ విధంగా రాజు కొడుకుమీద ప్రేమచేత కాలక్షేపం చేశాడు. తండ్రి మనసులోని భావం తెలిసి కొడుకు ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళాడు.
ఇట్లా రోహితుడు ఇల్లువిడిచి అడవికిపోయి ధనుర్భాణాల్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వరుణుని కారణంచేత హరిశ్చంద్రుడు మహోదరవ్యాధితో బాధింపబడుతున్నాడని తెలిసి, నగరానికి వచ్చే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకొని ఇంద్రుడు ముసలితపసిగా వచ్చి ఇట్లా అన్నాడు.
(వరుణుడు జలదేవత. జలదేవతకు అపచారం చేసినకారణంగా జలతత్వం - అధికమై మహోదరవ్వ్యాధి పట్టి పీడించింది.)
ఓ రాజకుమారా! పుణ్యక్షేత్రాలను దర్శించు. పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యాత్ములను కలుసుకో, పుణ్యకథలు విను. నీకు ఉపయోగముంటుంది.
అని ఇంద్రుడీ విధంగా రోహితుణ్ణి మరలించాడు. అతడు ఒక సంవత్సరం అడవిలో తిరిగి ఇంటిముఖం పట్టాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి అతణ్ణి నివారించాడు.
ఈ విధంగా దేవేంద్రుడు ఆ బాలుణ్ణి ఐదేండ్లు నివారించాడు. ఆఱవ ఏడు ఆ కుమారుడు అడవినుండి ఇంటికి వస్తూ అజీగర్తుని నడిమికొడుకు, మంచినడవడిక గలవాడు అయిన శునశ్శేఫుణ్ణి తీసుకవచ్చి తండ్రికి అప్పగించాడు. ఆ రాజు నరమేధం చేసి వరుణాది దేవతలను సంతృప్తి పరచాడు. ఆ యాగానికి హోత కౌశికుడు, అధ్వర్యుడు భృగువు, ఋత్విక్కు జమదగ్ని సామవేదగానం చేసినవాడు వసిష్ఠుడు. ఈ యాగానికి సంతోషించి దేవేంద్రు డా రాజుకు బంగారు రథం ఇచ్చాడు.
ఆ శునశ్శేఫుని గొప్పతనం తర్వాత చెప్తాను. భార్యతోకూడిన హరిశ్చంద్రుడు పాటించిన సత్యనిష్ఠకు మెచ్చిన విశ్వామిత్రుడు అతనికి తత్త్వజ్ఞానాన్ని బోధించాడు. అపుడాతడు మనసు అన్నమయం కాబట్టి అన్నరూపియైన భూమిని తెలుసుకొని దాన్ని జలంలో కలిపాడు. జలాన్ని తేజస్సులో లీనం చేశాడు. తేజస్సును వాయువులో కలిపాడు. వాయువును ఆకాశంలో కలిపాడు. ఆకాశాన్ని తామసాహంకారంలో కలిసేలా చేశాడు. అహంకారత్రయాన్ని మహత్తత్త్వంలో వీలీనమయ్యేలా చేశాడు. లోకసృష్టికి సంకల్పరూపమైన మహత్తత్త్వంలో విషయాహంకారాన్ని తొలగించాడు. అది పోగానే పరమాత్మను తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంవల్ల సంసారకారణమైన ప్రకృతిని భస్మం చేసి, అజ్ఞానాన్ని మోక్షసుఖ పారవశ్యంతో తొలగించి, అన్ని బంధాలనుండి విముక్తుడైన ఆ హరిశ్చంద్రుడు అవాఙ్మానస గోచరంబైన ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. అతని కొడుకు రోహితునికి హరితుడు, అతనికి చంపుడు పుట్టారు. చంపుడు తన పేరుమీద చంపానగరాన్ని నిర్మించాడు. అతడికి సుదేవుడు, అతనికి విజయుడు, అతనికి రుచికుడు, అతనికి వృకుడు, అతనికి బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు
ఒకరోజు వైవస్వత మనువు తుమ్మగా అతని ముక్కురంధ్రం నుండి గొప్పకీర్తి కలిగిన పుణ్యాత్ముడు ఇక్ష్వాకుడు వైకల్యం లేకుండా పుట్టి సూర్యవంశానికి రాజయ్యాడు.
(మనువుకు పదిమంది సంతానం. ఇక్ష్వాకుడు తొమ్మదవవాడు. ఇంతవరకు ఎనిమిదిమంది వృత్తాంతాలు చెప్పబడ్డాయి.
ఇక్ష్వాకుడికి నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో వికుక్షి నిమి, దండకుడు అనేవారు వరుసగా పెద్దకొడుకులు. వీరు ఆర్యావర్తంలోని హిమాలయానికి, వింధ్యకు మధ్యనున్న కొంతభూమిని పాలించారు. తరువాతి ఇరవై ఐదుమంది తూర్పుభాగాన్ని పాలించారు. మరో ఇరవైఐదుమంది పడమటి భాగాన్ని పాలించారు. ఇంక మిగిలిన నలబైఏడుమంది ఉత్తరదక్షిణభూములకు రాజులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్ధం చేయాలనుకొని పెద్దకొడుకు, కీర్తిమంతుడు అయిన వికుక్షినిచూచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెమ్మన్నాడు.
తండ్రి ఆనతిని విని వికుక్షి అట్లేనని దట్టమైన అడవులకు వేటకువెళ్లాడు. అక్కడ జంతువుల్ని వేటాడిచంపాడు. శరీరం బాగా అలసిపోయింది. తట్టుకోలేని ఆకలిబాధతో సగమై, ఒక కుందేలును పట్టుకొని తిన్నాడు. తినగా మిగిలిన మాంసఖండాన్ని దోషంలేదనే భావంతో వెంటనే తండ్రికి తెచ్చిఇచ్చాడు.
అపుడు కులగురుడు వసిష్ఠుడు వికుక్షి కుందేలుమాంసం తినడం మనస్సులో గ్రహించాడు. “ఇది ఎంగిలిపడిన మాంసం. పితృకర్మలకు పనికిరాదు. వీడు దుర్బుద్ది కలవాడు” అని అన్నాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని రాజ్యంనుండి బయటకు వెడలగొట్లాడు.
గుణవంతుడైన ఇక్ష్వాకుడు కొడుకును వెళ్ళగొట్టి, ఆ వసిష్ఠమహర్షి చెప్పింది ఆచరించి యోగియై, అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని వదలి మోక్షాన్ని పొందాడు.
తండ్రి మోక్షం పొందగా నీతిశాలి వికుక్షి తనను ప్రజలు శశాదుడని పొగడుతుండగా ఈ భూమిని పరిపాలించి విష్ణువును గూర్చి ప్రయత్నపూర్వకంగా యాగాలు చేశాడు. పురంజయుడనే కొడుకును కన్నాడు. అతనిని గూర్చి లోకాలు కకుత్స్థుడని, అమరేంద్రవాహనుడని పేర్కొన్నాయి.
(పూర్వపద్యంలో వికుక్షి చేసిన దోషం చెప్పబడింది. కాని వాణ్ణి ప్రజలు కీర్తించారు. అనేకయాగాలు చేశాడు. అంటే ప్రజామోదం పొందాడన్నమాట. దోషం చేసినా దాన్ని సర్దుకున్నాడు. శశాదుడు అనగా కుందేలును తిన్నవాడని అర్థం.)
కృతయుగం చివర్లో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిన దేవేంద్రుడు విష్ణువుతో మొరపెట్టుకొన్నాడు. అప్పుడు విష్ణువు ఇంద్రా! పురంజయునిలో నేను ఆవేశిస్తాను. నువ్వు ఎద్దువై అతణ్ణి మోయుమన్నాడు. ఇంద్రుడు ఎద్దుగా మారి తనమూపుపై పురంజయుణ్ణి మోశాడు. విష్ణుతేజస్సు తనలో వ్యాపించగా పురంజయుడు ధనుర్భాణాలను ధరించి ప్రళయకాలాగ్నివలె యుద్దానికి బయలుదేరాడు.
ఆ విధంగా బయలుదేరి రాక్షసవీరుల శరీరాలను ఖండించి, కుత్తుకలను ముక్కలుగా ఖండించి, కొందరిని యముని నగరానికి పంపి, మరికొందరిని నాగలోకానికి తరిమాడు. అంతటితో ఊరుకోక పురంజయుడనే పేరు సార్థకం అయ్యేటట్లు ఆ రాక్షసులనగరాలనుకూడా కూల్చాడు.
ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసులపురాలను జయించిన కారణంచేత పురంజయుడని, ఎద్దురూపంలో ఉన్న దేవేంద్రుడు వాహనం కావటంచేత ఇంద్రవాహనుడని, అతని మూపురంమీద ఎక్కి యుద్ధంచేయటంచేత కకుత్స్థుడని మూడుపేర్లతో ప్రఖ్యాతి పొంది, రాక్షసుల ధనాలను ఇంద్రుని కిచ్చాడు. అతని కుమారుడు అనేనసుడు. అతనికొడుకు పృథుడు. అతనికొడుకు విశ్వగంధుడు. విశ్వగంధునికొడుకు చంద్రుడు. చంద్రునికొడుకు యువనాశ్వుడు. అతని కొడుకు శ్రవస్తుండు. ఈతడే శావప్తి అనే పేరుగల నగరాన్ని నిర్మించాడు. శవస్తికొడుకు బృహదశ్వుడు. ఇతనికొడుకు కువలయాశ్వుడు. ఆ రాజశ్రేష్ఠుడు
వీరుడైన కువలయాశ్వుడు బలిష్ఠుడై తన ఇరవైఒక్కవేలమందికొడుకులతో ఉదంకుని ఆనతిమేరకు వెళ్ళి, దేవతల శత్రువైన దుంధుడనేవాణ్ణి చంపాడు.
దుంధుడనే రాక్షసుణ్ణి చంపటంచేత కువలయాశ్వునికి దుంధుమారుడనే పేరు కలిగింది. దుంధుని నోటినుండి వెడలిన కువలయాశ్వుని కొడుకులు బూడిద అయ్యారు. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురుమాత్రం బ్రతికారు. వారిలో దృఢాశ్వునికి హర్యశ్వుడు, వానికి నికుంభుడు, వానికి బర్హిణాశ్వుడు, వానికి కృతాశ్వుడు, వానికి సేనజిత్తు, వానికి యువనాశ్వుడు పుట్టారు. ఆ యువనాశ్వుడు సంతానంలేక నూర్వురుభార్యలతో భయపడుతూ ఉండినాడు. అప్పుడు కొందరుమునులు దయతలచి సంతానంకోసం అతనితో ఇంద్రయాగం చేయించారు. ఆ యాగంలో
రాజుభార్యకు, పుత్రలాభంకోసం బ్రాహ్మణులు నీటిని మంత్రించి, నియమంగా ఆ నీరున్నకలశాన్ని దాచి నిద్రపోయారు. ఆ రాత్రి రాజు దప్పికతో విధిలేక యాగశాలను ప్రవేశించి, ఆ నీటిని త్రాగాడు. అపుడు బ్రాహ్మణులు మేల్కొని నీళ్లు ఏమైనాయి? ఎవరు త్రాగారు? అని రాజు త్రాగిన విషయాన్ని గ్రహించారు. ఆశ్చర్యపోయి “ఈశ్వరాజ్ఞను ఎవడు దాటగలడు? ఇప్పుడేం చేయాలి? ఆ భగవంతుడికి నమస్మారం” అంటూ
ఆ బ్రాహ్మణులు విచారిస్తుండగా కొంత సేపటికి యువనాశ్వునిపొట్టచీల్చుకొని చక్రవర్తి లక్షణాలతో ఒక కొడుకు పుట్టాడు. తల్లిలేని కారణంచేత పొట్టనిండక ఏడుస్తున్న ఆ శిశువుదగ్గరికి ఇంద్రుడు వచ్చి తన వ్రేలును వాడినోటిలో ఉంచాడు. అట్లా త్రాగినందున ఆ బాలునికి మాంధాత అనే పేరుపెట్టి వెళ్ళాడు. ఈ విధంగా
(మాం = నన్ను, ధాతా = త్రాగగలడు అని ఇంద్రుడు - అన్నాడు. శిశువు అట్లే చేశాడు. ఆ శిశువుకు మాంధాత అని పేరయ్యింది.)
పొట్టపగిలి ముద్దుకొడుకు పుట్టినా తండ్రి చావలేదు. దేవతల, బ్రాహ్మణుల దయ అలా ఉంటుంది కదా! అధికమైన దైవబలం కలిగినవాడు జీవిస్తాడేకాని చెడిపోతాడా? చెడిపోడు.
ఈ విధంగా బతికిన యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సుచేసి సిద్ధిపొందాడు. ఆ తరువాత
ఆ బాలుడు పడమటి దిక్కున పుట్టె బాలచంద్రునివలె దినదిన ప్రవర్ధమానుడై, నిండు యౌవనం పొంది, రావణాది రాక్షసులను, శత్రురాజులను దండించాడు. అతణ్ణి దేవేంద్రుడు త్రసదస్యుడు అని పొగిడాడు. అతడు యజ్ఞవస్తువులు, యజమాని, మంత్రాలు, ఋత్విక్కులు, యజ్ఞకాలాలు అన్నీ విష్ణుమయంగా భావించి, గొప్పగా దక్షిణలనిచ్చి యజ్ఞాలు చేశాడు.
ఆ మాంధాత శ్రీహరిదయతో శత్రువులను శిక్షిస్తూ, చంద్రసూర్యులు సంచరించే చోటులన్నింటిని సిరిసంపదలతో తులతూగేటట్లు పరిపాలించాడు.
పిమ్మట ఆ మాంధాతకు శతబిందుని కూతురైన బిందుమతివల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే ముగ్గురుకొడుకులు, ఏభైమందికూతుళ్లు కలిగి పెరుగుచుండగా
మహానుభావుడైన సౌభరి అనే ముని యమునానదినీటిలో తపస్సుచేస్తూ, భార్యాపుత్రులతో కలిసి సంసారసుఖాన్ని అనుభవిస్తున్న చేపలరాజును చూశాడు. సంసార మందలి కోరికతో మాంధాతను ఆయన పుత్రికలలో ఒక కన్యను తన కిమ్మని అడిగాడు. ఆ రాజు స్వయంవరంలో కన్యనిస్తాను గ్రహించమన్నాడు, వయసులో ఉండే కన్య నాలాంటి ముసలివాణ్ణి ఎందుకు ఇష్టపడుతుంది. ముసలితనంతో వణుకుతున్నాను. జుట్టు నెరిసింది. ఒంట్లో కాంతిగాని, బిగువుగాని లేదు. కన్యను లోబరచుకొనే ఉపాయమేది? అని అనుకున్నాడు.
పువ్వులాంటి శరీరం గల కన్య యౌవనవంతుణ్ణి, సౌందర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి కోరుకుంటే కోరుకోవచ్చుగాని, ఎదురుగా నున్న ముసలిమునినైన నన్ను ఎందుకు కోరుకుంటుంది?
అని యోచించి సౌభరి తన తపశ్శక్తితో ముసలితనాన్ని విడిచి లతవయస్సు యువకుడై చక్కగా అలంకరించుకొని మాంధాత దగ్గరకు వచ్చాడు. అపుడారాజు అంతఃపుర రక్షకుల నాజ్ఞాపించగా వారు ఆ మునిని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువెళ్లి చూపించారు. చూపగా
మన్మథుడు మోహావేశాన్ని కల్గించగా, ఆ కన్యలందరు ఆ మునీశ్వరుని చూచి “కొమ్మలారా! వీడు నలకూబరుడో, మన్మథుడో, జయంతుడో పొరబాటున ఇక్కడికి వచ్చాడు. ఆలస్యమెందుకు” అంటూ మేము మేము అని సంచలిత మనస్కులై అందరు వరించారు.
ఈ విధంగా ఆ రాజకన్యలనందరిని పెళ్ళాడి, సౌభరి తన తపోమహిమతో అనేక లీలావినోదాలు సృష్టించి సుందర భవనాల్లోనూ, కేళీపర్వతాల్లోనూ, కలువలు వికసించిన సరస్సుల్లో, కోకిలల, చిలుకల, తుమ్మెదల మనోజ్ఞ నాదాలతో సుందరమైన ఉద్యానవనాలలో, మణులు పొదిగిన తిన్నెలపైనా, గొప్పశయ్యలపైనా, కొండగుహల్లో శృంగారవతులైన స్త్రీలు తన ఆజ్ఞలు పాటిస్తుండగా, అందమైన ప్రదేశాలలో వస్త్రమాల్యానులేపనాదులను కల్పించి, ఇష్టభోజనాలతో పూటపూటకు ఒక ఆశ్చర్యకరమైన అందంతో ఆ రాజకుమార్తెలను సంతృప్తిపరచాడు.
అధికమైన నేతిధారలచేత తృప్తిపొందని అగ్నివలె, మునీశ్వరుడు పలువురు రాచకన్యలకు ఒకడే భర్తగా అయిఉండి కూడా తృప్తి పొందలేకపోయాడు.
పైవిధంగా మునీశ్వరుడు ఉద్యానవనంలో ఆ రాజకుమార్తెలతో అనేకవిధాల విహారాలతో, అనురాగాలతో, రాకపోకలతో కొన్నిరోజులు గడిపాడు.
పిమ్మట కొంతకాలానికి మంధాతృమహారాజు ముని ఏమయ్యాడో? కుమార్తెలు ఎన్నికష్టాలు పడుతున్నారో? అని ఆలోచించి, వెదుకుతూవచ్చి ఒక గొప్ప నగరంలో మణులు పొదిగిన భవంతిలో చక్రవర్తివలె విహరిస్తున్న తాపసరాజును చూచి సంతసించి, ఆశ్చర్యపడి ఆ మునిచేత గౌరవాలు పొంది, మెల్లగా కుమార్తెలను చేరి ఇలా అన్నాడు.
నా బిడ్డలారా! మీ భర్త అన్యోన్యంగా ఉంటున్నాడా? బాగా ఆదరిస్తున్నాడా? అని అడిగాడు - మాంధాత. ఆరాచ కుమార్తెలు అందరూ తండ్రీ! నా తోడే నా తోడే అంటూ బాగా ఆదరిస్తున్నాడన్నారు.
('తోడు' శబ్దానికి 'అన' అనే అర్థముంది. నాన్నా! నేను నిజమే చెబుతున్నాను. ఇది నా ఆన (నా సాక్షి) అని ఆ రాజు మాంధాతతో బిడ్డలందరూ చెప్పారు.)
పిమ్మట కొంతకాలానికి లౌకికబంధాలకు చిక్కిన సౌభరి ఏకాంతంలో తనకు తానే విచారించుకొని చేపల జంట పొత్తును చూడ్దంచేత తాను సంసారబంధంలో చిక్కుకోవడం తెలుసుకొని, పశ్చాత్తాపంతో ఇట్లా అనుకున్నాడు.
ఉపవాసాలతో శుష్కించడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలి వేయడమో, తపస్సులో గడపడమో, శ్రీహరిధ్యానంలో ఉండడమో చేయక ఎందుకు ఈ మాటలాడి ఈ స్థితి తెచ్చుకొన్నాను. నా తపస్సంతా నశించింది. కపటమైన స్త్రీ కౌగిళ్లు మోక్షాన్ని కల్గిస్తాయా? (కల్గించవు).
నేనొక మునినట, తత్త్వం తెలిసినవాడనట, మోక్షం తప్ప ఇతరసుఖాల జోలికి వెళ్ళనట, ఏభైమంది భార్యలట, మేడల్లో నివాసమట, ఐదువేలమంది కొడుకులట. దీని కంతటికి కారణం చేపలరాజు సౌఖ్యం చూడడ మట. నవ్విపోతారుగాని పెద్దవారు మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు)
తపస్సు చేసేవాడు, తత్త్వవేత్త అయినవాడు, మోక్షాన్ని కోరేవాడు ఏకాంతం కోరుకుంటాడు. కపటముని మాత్రం సంసారంలో తగుల్కొంటాడు.
అని దుఃఖించి తన్ను తాను నిందించుకొని, తన చేతను విమర్శించుకుంటూ ఇహపరాలను సాధించాలని నిశ్చయించి, సంసారాన్ని వదలి, భార్యలతో వానప్రస్థధర్మాన్ని స్వీకరించి, అడవులకు వెళ్ళి తపస్సుచేసి శరీరాన్ని వదలి అగ్నితో పరమాత్మను చేరుకున్నాడు. తరువాత
అగ్ని దేవుణ్ణి జ్వాలలు విడిచి పెట్టక అనుసరించినట్లు సౌభరిభార్యలుకూడా అతణ్ణి అనుసరించి, అతను పొందిన స్థితినే పొందారు.
మాంధాతకొడుకుల్లో అంబరీషుణ్ణి తాత యువనాశ్వుడు అతనిని కుమారునిగా స్వీకరించాడు. ఆ అంబరీషునికి యౌవనాశ్వుడు, అతనికి హారితుడు పుట్టారు. ఆ కారణంచేత అంబరీష, యౌవనాశ్వ, హారితులు మాంధాతృ గోత్రానికి ముఖ్యపురుషులైనారు. మాంధాత రెండవకొడుకు పురుకుత్సుడు. నాగకుమారులు అతణ్ణి పాతాళానికి తీసుకొనిపోయి, తమ చెల్లెలు నర్మద నిచ్చి వివాహం చేశారు. అక్కడ ఎందరో గంధర్వనాథుల్ని చంపి, తాను నాగలోకం వెళ్లి సంచరించిన విషయం స్మరించిన వాళ్లకు పాముల వల్ల భయం లేకుండా వరం పొంది, తిరిగివచ్చాడు. పురుకుత్సునికి త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి అరుణుడు, అతనికి త్రిబంధనుడు, అతనికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవత్రుడే త్రిశంకుడని ప్రసిద్ది పొందాడు. ఆ త్రిశంకుడు
గురుశాపంవల్ల చండాలుడైన అతడు మహానుభావుడైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి, అతని ప్రభావంచేత స్వర్గానికి వెళ్ళాడు. దేవతలు అతణ్ణి ఒప్పుకోక తోసివేశారు. అతడు తలకిందుగా దీనుడై రావడం చూచి, విశ్వామిత్రుడు తన గొప్పతనంతో ఆకసంలో నిలిపాడు. నేటికీ ఆ త్రిశంకుడు అక్కడే ఉన్నాడు. అతనికొడుకు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడితని వద్దకు వచ్చి యాగం నెపంతో అతని సంపదను హరించి, అతణ్ణి కులహీనునికి సేవకుడుగా చేశాడు. కాని హరిశ్చంద్రుడు అసత్యం పలుకక కష్టాల పాలయ్యాడు.
ఆ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధపెట్టడం విని, వసిష్ఠుడు విశ్వామిత్రుని గద్దవు కమ్మని శపించాడు. విశ్వామిత్రుడు వసిష్ఠుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. పక్షిరూపాలు పొందినా ఆ ఇద్దరూ శత్రువులై పోరాడారు. ఆ తరువాత హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని ఉపదేశంతో వరుణుణ్ణి భక్తితో ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షం కాగా హరిశ్చంద్రు డతనికి నమస్కరించి ఇలా అన్నాడు.
ఓ వరుణదేవా! నాకు మంచి వీరుడైన కొడుకునిస్తే అతణ్లి యాగపశువుగా మార్చి, నీవు సంతోషించేటట్లు హోమం చేస్తాను. కాబట్టి కొరత లేకుండా కొడుకు నిమ్ము.
అని అడిగిన హరిశ్చంద్రునికి కొడుకు కలుగుగాక అని వరమిచ్చి వరుణుడు వెళ్ళాడు. ఆ వరుణుని అనుగ్రహంచేత హరిశ్చంద్రునికి రోహితుడనే కొడుకు కలిగాడు. అపుడు వరుణుడు హరిశ్చంద్రుని కుమారుణ్ణి గురించి
వరుణుడు హరిశ్చంద్రుని వాగ్దానం ప్రకారం పురిటి లోపల వచ్చి కొడుకును బలి ఇవ్వుమనగా పురుడు దాటితేగాని కుదరదు అన్నాడు. పండ్లు రావడానికి ముందువచ్చి అడుగగా పండ్లు లేకపోవడంచేత బలికి అనర్హుడన్నాడు. పండ్లు వచ్చాక అడుగగా పడిపండ్లు రాలేదు కాబట్టి అనర్హుడన్నాడు. పాలపండ్లు పోయి మళ్లీ పళ్లు వచ్చాక అడుగగా యుద్దాలకు ఉపయోగపడితేనే అర్హత కలుగుతుందన్నాడు. ఈ విధంగా రాజు కొడుకుమీద ప్రేమచేత కాలక్షేపం చేశాడు. తండ్రి మనసులోని భావం తెలిసి కొడుకు ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళాడు.
ఇట్లా రోహితుడు ఇల్లువిడిచి అడవికిపోయి ధనుర్భాణాల్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వరుణుని కారణంచేత హరిశ్చంద్రుడు మహోదరవ్యాధితో బాధింపబడుతున్నాడని తెలిసి, నగరానికి వచ్చే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకొని ఇంద్రుడు ముసలితపసిగా వచ్చి ఇట్లా అన్నాడు.
(వరుణుడు జలదేవత. జలదేవతకు అపచారం చేసినకారణంగా జలతత్వం - అధికమై మహోదరవ్వ్యాధి పట్టి పీడించింది.)
ఓ రాజకుమారా! పుణ్యక్షేత్రాలను దర్శించు. పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యాత్ములను కలుసుకో, పుణ్యకథలు విను. నీకు ఉపయోగముంటుంది.
అని ఇంద్రుడీ విధంగా రోహితుణ్ణి మరలించాడు. అతడు ఒక సంవత్సరం అడవిలో తిరిగి ఇంటిముఖం పట్టాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి అతణ్ణి నివారించాడు.
ఈ విధంగా దేవేంద్రుడు ఆ బాలుణ్ణి ఐదేండ్లు నివారించాడు. ఆఱవ ఏడు ఆ కుమారుడు అడవినుండి ఇంటికి వస్తూ అజీగర్తుని నడిమికొడుకు, మంచినడవడిక గలవాడు అయిన శునశ్శేఫుణ్ణి తీసుకవచ్చి తండ్రికి అప్పగించాడు. ఆ రాజు నరమేధం చేసి వరుణాది దేవతలను సంతృప్తి పరచాడు. ఆ యాగానికి హోత కౌశికుడు, అధ్వర్యుడు భృగువు, ఋత్విక్కు జమదగ్ని సామవేదగానం చేసినవాడు వసిష్ఠుడు. ఈ యాగానికి సంతోషించి దేవేంద్రు డా రాజుకు బంగారు రథం ఇచ్చాడు.
ఆ శునశ్శేఫుని గొప్పతనం తర్వాత చెప్తాను. భార్యతోకూడిన హరిశ్చంద్రుడు పాటించిన సత్యనిష్ఠకు మెచ్చిన విశ్వామిత్రుడు అతనికి తత్త్వజ్ఞానాన్ని బోధించాడు. అపుడాతడు మనసు అన్నమయం కాబట్టి అన్నరూపియైన భూమిని తెలుసుకొని దాన్ని జలంలో కలిపాడు. జలాన్ని తేజస్సులో లీనం చేశాడు. తేజస్సును వాయువులో కలిపాడు. వాయువును ఆకాశంలో కలిపాడు. ఆకాశాన్ని తామసాహంకారంలో కలిసేలా చేశాడు. అహంకారత్రయాన్ని మహత్తత్త్వంలో వీలీనమయ్యేలా చేశాడు. లోకసృష్టికి సంకల్పరూపమైన మహత్తత్త్వంలో విషయాహంకారాన్ని తొలగించాడు. అది పోగానే పరమాత్మను తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంవల్ల సంసారకారణమైన ప్రకృతిని భస్మం చేసి, అజ్ఞానాన్ని మోక్షసుఖ పారవశ్యంతో తొలగించి, అన్ని బంధాలనుండి విముక్తుడైన ఆ హరిశ్చంద్రుడు అవాఙ్మానస గోచరంబైన ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. అతని కొడుకు రోహితునికి హరితుడు, అతనికి చంపుడు పుట్టారు. చంపుడు తన పేరుమీద చంపానగరాన్ని నిర్మించాడు. అతడికి సుదేవుడు, అతనికి విజయుడు, అతనికి రుచికుడు, అతనికి వృకుడు, అతనికి బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు
Monday, March 23, 2026
Ambarishopakyanam/AmbarishStory/Ambarish vruthantam - అంబరీషోపాఖ్యానము
అంబరీషోపాఖ్యానము
సద్గుణవిశిష్టుడైన అంబరీషుడు ఏడుదీవులతో కూడిన విశాలభూభారాన్ని తన భుజస్తంభాల పై మోసి శుభప్రాప్తితో రాజ్యవైభవ సంపద కలిగి కూడా చెడునడత లేకుండా నిత్యం విష్ణుపూజలతో కాలం గడపుతూ ఏమరుపాటు లేకుండా ఈ లోకంలో ప్రసిద్ధిని పొందాడు.
అంబరీషుడనే ఆ రాజచంద్రుని మనస్సు విష్ణుపదములందే. మాటలు విష్ణుగుణ కీర్తనమందే. చేతులు విష్ణ్వాలయం శుభ్రపరచడమందే. వీనులు హరికథలను వినడమందే. చూపులు విష్ణురూపదర్శనమందే. శిరస్సు హరినమస్కారమందే, పాదాలు విష్ణ్వాలయాలను చుట్టి రావడమందే. ఆసక్తి హరికైంకర్యమందే. స్నేహం వైష్ణవభక్తులతోనే. ముక్కు వైష్ణవ భక్తుల పాదపద్మములందే. నాలుక తులసీదళ సేవనమందే. కోరికలు పుణ్యకరమైన విషయాలందే ఉండేవి.
(పైన చెప్పినట్లేగాక) ఆ రాజు గొప్పవైభవంతో పుణ్యాత్ముడై యజ్ఞాలకు ప్రభువైన విష్ణువునుగూర్చి వసిష్ఠాదిమునులతో సరస్వతీనది ఒడ్డున భూరిసంభావనలిచ్చి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ అంబరీషుడు మట్టి పెళ్లను బంగారాన్ని సమానంగా చూస్తూ, సర్వకర్మలు విష్ణుపరంగా చేస్తూ రాజ్యాన్ని పాలించాడు. విష్ణువునందు, విష్ణుభక్తులయందు మనసు లంకెపెట్టి తనకు విధించబడ్డ రాజ్యపాలనాకార్యాన్ని వదలిపెట్టకుండా రాజర్షిగా పేరుపొందాడు.
ఇంకా ఆ భక్తాగ్రేసరుడైన అంబరీషుడు
భగవద్భక్తుడైన ఆ రాజు 'హరి' అని తలుస్తాడు. హరి అని దర్శిస్తాడు. 'హరి' అని స్పర్శిస్తాడు. 'హరి'యని వాసనలు చూస్తాడు. హరియని 'రుచి' చూడాలనుకొంటాడు. హరిహరీ! ఆ మహాత్ముడైన అంబరీషుణ్ణి కొనియాడడం సులువైనపని కాదు.
పై చెప్పిన విధంగా (పంచేంద్రియ ప్రవృత్తి) భగవన్నిమగ్నుడు, పుణ్యాత్ముడైన ఆ రాజు మెల్లమెల్లగా పరిపాలనచేస్తూ ఉండగా
భగవదధీన మనస్కుడైన ఆ రాజుకు మెల్లగా గుర్రాలు, ఏనుగులు, సంపదలు, ఉద్యానవనాలు, సంతానం, బంధువులు, మిత్రులు, నగరం, అంతఃపురంవంటి భోగభాగ్యాలపట్ల ఆసక్తి తొలగిపోయింది.
ఆ తరువాత కొంతకాలానికి సంసారంపట్ల సంబంధాన్ని వదలుకొని, పవిత్రుడై ఏకాంతంలో భక్తిపారవశ్యంలో ఉండగా ఆ రాజర్షికి భక్తులపట్ల ప్రేమకలవాడైన హరి శత్రువులను శిక్షించేది, ఆత్మీయుల్ని రక్షించేది అయిన సమస్త విశ్వంలో ఎదురులేని చక్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. తరువాత
ఓ రాజా! ఆ మహారాజు తనకు తోడు నీడవలె తనకు తగిన గుణ శ్రేష్ఠురాలైన పట్టపుదేవితో కలిసి, విష్ణువును గూర్చి ఒక సంవత్సరం పాటు ద్వాదశీవ్రతాన్ని చక్కగా చేశాడు.
ఈ విధంగా వ్రతంచేసి, వ్రతాంతంలో కార్తికమాసంలో మూడురాత్రులు ఉపవాసం చేశాడు. యమునానదిలో స్నానంచేసి, మధువనంలో మహాభిషేక పూజావిధానంతో అవసరమని విధింపబడిన అనేక వస్తువులను కలిగి, విష్ణుదేవుణ్ణి అభిషేకించి, మనోహరమైన గంధాలను సమర్పించి, కొంగొత్త సువాసనలు వెదజల్లే పూలతో పూజ చేశాడు. ఆ తరువాత
(ద్వాదశీవ్రత సమాప్తిలో చేయవలసిన విధివిధానం చెప్పబడింది. కార్తికమాసంలో మూడురాత్రుల ఉపవాసం, అనేకపరికరాలతో, గంధాలను, పువ్వులను సమర్పించడం అనేవి విధులు-ఉపవాసం అనగా ఉప= సమీపంలో, వాసం = వసించడం (ఉండడం) ఎవరికి? ఆ భగవంతునికి. అంతటా ఉండే ఆయనకు సమీపంలో ఎలా ఉండడం అనేది ప్రశ్న అంటే భగవచ్చింతన కలిగి ఉండడం. ఈ విధంగా వ్రతాన్ని రాజు పూర్తిచేశాడు.)
పాలు ఏరై ప్రవహిస్తుండగా తిరుగాడేవి, లేతవయసులో ఉండేవి, అందమైనవి, పోట్లమారితనం లేనివి, వెండితొడిగిన గిట్టలు గలవి, బంగారు కుప్పెలు కలిగిన పెద్దకొమ్ములతో ప్రకాశించేవి, దూడల మెడలను నాకుతూ ప్రేమగా చూచేవి, పలురంగులు కలిగినవి అయిన ఆరువందలకోట్ల ఆవులను వైదికశ్రేష్ఠులకు ఆ రాజు దానం చేశాడు.
(ఇవన్నీ మేలు జాతి ఆవుల లక్షణాలు. దానం ఇచ్చేటపుడు మంచిజాతి ఆవులను ఇవ్వడం ధర్మం. లేత వయసులో ఉండడంవల్ల సంతానోత్పత్తి కలవి కావడం, వెండి బంగారు తొడుగులచే ఆరాధింపబడినవైనం తెలుస్తోంది.)
వెంటనే ఆ రాజు చాలమంది బ్రాహ్మణశ్రేష్ఠులకు భక్తితో సంతృప్తిగా భోజనంపెట్టి, ఉపవాసం తర్వాత పారణ చేయడానికి పూనుకొన్నాడు.
ఆ సమయంలో వేదాలను ఆపోశన పట్టినవాడు, తపస్సంపన్నుడు, సాటిలేని యోగాభ్యాసనిపుణుడు, సూర్యునివంటి తేజస్సు కలవాడు అయిన దుర్వాసుడు ఆ రాజు ఇంటికి అతిథిగా వచ్చాడు.
అట్లావచ్చిన మునిని చూచి లేచి నిలబడి, ఆయన కూర్చోడానికి ఆసనం ఏర్పాటు చేసి, పాదపూజచేసి, క్షేమం అడిగి రాజు తన ఇంట్లో భోజనం చేయుమని ప్రార్ధించాడు. ఆ మహాత్ముడుకూడా సంతోషించి రాజుకోరికను ఒప్పుకొన్నాడు. ఆయన యమునానదికి వెళ్ళి స్నానంచేసి ధ్యానంచేస్తూ మునుగుతూ లేస్తూ ఆలస్యం చేశాడు. రాజు చేసే పారణ ముహూర్తంలో సగంగడియ మాత్రమే ఉంది. ద్వాదశిలోనే పారణ చేయవలసిన విషయాన్ని విచారించి, బ్రాహ్మణ తిరస్కారం వల్ల కలిగే దోషాన్నీ శంకించి, పండితులను పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు.
(అహోరాత్రానికి - 30 ముహూర్తాలు. ఒక్క ముహూర్తం= 48 ని. ఒక్క గడియ= 24 ని.
సద్గుణవిశిష్టుడైన అంబరీషుడు ఏడుదీవులతో కూడిన విశాలభూభారాన్ని తన భుజస్తంభాల పై మోసి శుభప్రాప్తితో రాజ్యవైభవ సంపద కలిగి కూడా చెడునడత లేకుండా నిత్యం విష్ణుపూజలతో కాలం గడపుతూ ఏమరుపాటు లేకుండా ఈ లోకంలో ప్రసిద్ధిని పొందాడు.
అంబరీషుడనే ఆ రాజచంద్రుని మనస్సు విష్ణుపదములందే. మాటలు విష్ణుగుణ కీర్తనమందే. చేతులు విష్ణ్వాలయం శుభ్రపరచడమందే. వీనులు హరికథలను వినడమందే. చూపులు విష్ణురూపదర్శనమందే. శిరస్సు హరినమస్కారమందే, పాదాలు విష్ణ్వాలయాలను చుట్టి రావడమందే. ఆసక్తి హరికైంకర్యమందే. స్నేహం వైష్ణవభక్తులతోనే. ముక్కు వైష్ణవ భక్తుల పాదపద్మములందే. నాలుక తులసీదళ సేవనమందే. కోరికలు పుణ్యకరమైన విషయాలందే ఉండేవి.
(పైన చెప్పినట్లేగాక) ఆ రాజు గొప్పవైభవంతో పుణ్యాత్ముడై యజ్ఞాలకు ప్రభువైన విష్ణువునుగూర్చి వసిష్ఠాదిమునులతో సరస్వతీనది ఒడ్డున భూరిసంభావనలిచ్చి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ అంబరీషుడు మట్టి పెళ్లను బంగారాన్ని సమానంగా చూస్తూ, సర్వకర్మలు విష్ణుపరంగా చేస్తూ రాజ్యాన్ని పాలించాడు. విష్ణువునందు, విష్ణుభక్తులయందు మనసు లంకెపెట్టి తనకు విధించబడ్డ రాజ్యపాలనాకార్యాన్ని వదలిపెట్టకుండా రాజర్షిగా పేరుపొందాడు.
ఇంకా ఆ భక్తాగ్రేసరుడైన అంబరీషుడు
భగవద్భక్తుడైన ఆ రాజు 'హరి' అని తలుస్తాడు. హరి అని దర్శిస్తాడు. 'హరి' అని స్పర్శిస్తాడు. 'హరి'యని వాసనలు చూస్తాడు. హరియని 'రుచి' చూడాలనుకొంటాడు. హరిహరీ! ఆ మహాత్ముడైన అంబరీషుణ్ణి కొనియాడడం సులువైనపని కాదు.
పై చెప్పిన విధంగా (పంచేంద్రియ ప్రవృత్తి) భగవన్నిమగ్నుడు, పుణ్యాత్ముడైన ఆ రాజు మెల్లమెల్లగా పరిపాలనచేస్తూ ఉండగా
భగవదధీన మనస్కుడైన ఆ రాజుకు మెల్లగా గుర్రాలు, ఏనుగులు, సంపదలు, ఉద్యానవనాలు, సంతానం, బంధువులు, మిత్రులు, నగరం, అంతఃపురంవంటి భోగభాగ్యాలపట్ల ఆసక్తి తొలగిపోయింది.
ఆ తరువాత కొంతకాలానికి సంసారంపట్ల సంబంధాన్ని వదలుకొని, పవిత్రుడై ఏకాంతంలో భక్తిపారవశ్యంలో ఉండగా ఆ రాజర్షికి భక్తులపట్ల ప్రేమకలవాడైన హరి శత్రువులను శిక్షించేది, ఆత్మీయుల్ని రక్షించేది అయిన సమస్త విశ్వంలో ఎదురులేని చక్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. తరువాత
ఓ రాజా! ఆ మహారాజు తనకు తోడు నీడవలె తనకు తగిన గుణ శ్రేష్ఠురాలైన పట్టపుదేవితో కలిసి, విష్ణువును గూర్చి ఒక సంవత్సరం పాటు ద్వాదశీవ్రతాన్ని చక్కగా చేశాడు.
ఈ విధంగా వ్రతంచేసి, వ్రతాంతంలో కార్తికమాసంలో మూడురాత్రులు ఉపవాసం చేశాడు. యమునానదిలో స్నానంచేసి, మధువనంలో మహాభిషేక పూజావిధానంతో అవసరమని విధింపబడిన అనేక వస్తువులను కలిగి, విష్ణుదేవుణ్ణి అభిషేకించి, మనోహరమైన గంధాలను సమర్పించి, కొంగొత్త సువాసనలు వెదజల్లే పూలతో పూజ చేశాడు. ఆ తరువాత
(ద్వాదశీవ్రత సమాప్తిలో చేయవలసిన విధివిధానం చెప్పబడింది. కార్తికమాసంలో మూడురాత్రుల ఉపవాసం, అనేకపరికరాలతో, గంధాలను, పువ్వులను సమర్పించడం అనేవి విధులు-ఉపవాసం అనగా ఉప= సమీపంలో, వాసం = వసించడం (ఉండడం) ఎవరికి? ఆ భగవంతునికి. అంతటా ఉండే ఆయనకు సమీపంలో ఎలా ఉండడం అనేది ప్రశ్న అంటే భగవచ్చింతన కలిగి ఉండడం. ఈ విధంగా వ్రతాన్ని రాజు పూర్తిచేశాడు.)
పాలు ఏరై ప్రవహిస్తుండగా తిరుగాడేవి, లేతవయసులో ఉండేవి, అందమైనవి, పోట్లమారితనం లేనివి, వెండితొడిగిన గిట్టలు గలవి, బంగారు కుప్పెలు కలిగిన పెద్దకొమ్ములతో ప్రకాశించేవి, దూడల మెడలను నాకుతూ ప్రేమగా చూచేవి, పలురంగులు కలిగినవి అయిన ఆరువందలకోట్ల ఆవులను వైదికశ్రేష్ఠులకు ఆ రాజు దానం చేశాడు.
(ఇవన్నీ మేలు జాతి ఆవుల లక్షణాలు. దానం ఇచ్చేటపుడు మంచిజాతి ఆవులను ఇవ్వడం ధర్మం. లేత వయసులో ఉండడంవల్ల సంతానోత్పత్తి కలవి కావడం, వెండి బంగారు తొడుగులచే ఆరాధింపబడినవైనం తెలుస్తోంది.)
వెంటనే ఆ రాజు చాలమంది బ్రాహ్మణశ్రేష్ఠులకు భక్తితో సంతృప్తిగా భోజనంపెట్టి, ఉపవాసం తర్వాత పారణ చేయడానికి పూనుకొన్నాడు.
ఆ సమయంలో వేదాలను ఆపోశన పట్టినవాడు, తపస్సంపన్నుడు, సాటిలేని యోగాభ్యాసనిపుణుడు, సూర్యునివంటి తేజస్సు కలవాడు అయిన దుర్వాసుడు ఆ రాజు ఇంటికి అతిథిగా వచ్చాడు.
అట్లావచ్చిన మునిని చూచి లేచి నిలబడి, ఆయన కూర్చోడానికి ఆసనం ఏర్పాటు చేసి, పాదపూజచేసి, క్షేమం అడిగి రాజు తన ఇంట్లో భోజనం చేయుమని ప్రార్ధించాడు. ఆ మహాత్ముడుకూడా సంతోషించి రాజుకోరికను ఒప్పుకొన్నాడు. ఆయన యమునానదికి వెళ్ళి స్నానంచేసి ధ్యానంచేస్తూ మునుగుతూ లేస్తూ ఆలస్యం చేశాడు. రాజు చేసే పారణ ముహూర్తంలో సగంగడియ మాత్రమే ఉంది. ద్వాదశిలోనే పారణ చేయవలసిన విషయాన్ని విచారించి, బ్రాహ్మణ తిరస్కారం వల్ల కలిగే దోషాన్నీ శంకించి, పండితులను పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు.
(అహోరాత్రానికి - 30 ముహూర్తాలు. ఒక్క ముహూర్తం= 48 ని. ఒక్క గడియ= 24 ని.
పారణ : వ్రతాలు, దీక్షలు సందర్భంలో ఉపవాసం ఉండి అనంతరం ఆహారం తీసుకోవడాన్ని పారణం అంటారు.)
'దుర్వాసమహర్షి యమునకు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. ద్వాదశి కూడా వెళ్ళిపోతోంది. అది వెళ్ళిపోయేలోగా పారణ చేయాలి. తగిన ధర్మాన్ని నాకు చెప్పండి' అన్నాడు రాజు.
తనకు కలిగిన ధర్మసంకటాన్ని ముందుంచిన రాజుతో బ్రాహ్మణులు ఇలా అన్నారు.
రాజా! అతిథి స్నానానికి పోయి రాకపోవడంచేత ద్వాదశి పారణను మానివేయడం ధర్మంకాదు. నీటిని స్వీకరించండి. అది తినినట్లుకాదు; తిననట్లుకాదు; సలిలభక్షణం అంగీకారమైందే.
బ్రాహ్మణులు రాజుగారి ధర్మసందేహాన్ని పోగొట్టారు. ఆ రాజర్షి మనసులో విష్ణువును ధ్యానించి నీటిని పారణ చేశాడు. స్నానానికి వెళ్ళిన మునికోసం ఎదురు చూస్తుండగా
ఆ సమయంలో యమునానదిలో స్నానాదికం పూర్తిచేసి వచ్చిన మునీశ్వరుడు అంబరీషుని సేవలు అందుకొన్నాడు. తన బుద్ధితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. బొమముడి కలిగిన ముఖంతో, శరీరం కంపిస్తుండగా, కోపంతో రెట్టించిన, ఆకలి నకనకమంటుండగా, ఇలా అన్నాడు. “ఈ ఐశ్వర్య మదాంధుని, ఈ ఘాతుకుణి, గర్విష్ఠుణ్ణి మీరందరూ చూచారా? వీడు విష్ణుభక్తుడుకాదు. నన్ను అతిథిగా పిలిచి నా రాకకుముందే భుజించి, ధర్మభంగం చేసి దుర్మార్గుడయ్యాడు. నా శక్తి ఇప్పుడు ప్రదర్శిస్తాను. నేను కోపిస్తే ఎక్కడైనాసరే అడ్దుపడేవాడెవడు?” అంటూ
దుర్వాసుడు పటపటమని పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకొనలనుండి తీక్ష్ణమైన నిప్పులు చిటచిటమని రాలుతుండగా చెంపలు పొంగగా హూంకారం చేస్తూ తన జుట్టులోని శిఖను ఒక దాన్ని పెరికి దాన్ని చేత ఆయుధంకల్గిన సంహారక దేవతను సృష్టించి రాజుపై వదిలాడు.
ప్రళయాగ్నితో సమానురాలై, చేతితో శూలాన్ని ధరించి, నేల సురసురమని అణగిపోయేటట్లు పాదాలతో తొక్కుతూ విజృంభించి రాజును సమీపించింది.
విశ్వరూపుడైన విష్ణువు దుర్వాసుని దుష్కృత్యాన్ని తెలిసికొని 'అజ్ఞాని'యైన తపసిమాయను సరిచేయమని చక్రాన్ని పంపాడు. అది ప్రళయాగ్నివలె వచ్చింది.
ఆ విధంగా వచ్చిన చక్రం మునిపంపిన కృత్యను కాల్చి, అంతటితో ఆగక మునిని వెంబడించింది. ముని మేరు పర్వతగుహలో దూరగా అదికూడ సర్పాన్ని వెంబడించే దావాగ్నివలె అందులో ప్రవేశించింది. అంతేగాక
పరులకు మరలించుటకు వీలులేని విష్ణుచక్రం ఒక్క ఉదుటున ముని వెంటబడి భూమిలో దూరితే భూమిలోకి దూరుతుంది. సముద్రంలో మునిగితే తానుకూడ సముద్రాలలో మునుగుతుంది. ఉద్వేగంతో ఆకాశానికి పాకితే తాను కూడా ఆకాశానికి ఎగబాకుతుంది. దిక్కుల్లోకి వెళితే దిగ్వీథుల్లోకి వెళుతుంది. దారిలో ముని ఆగితే తానూ ఆగుతుంది. నిలబడితే నిలబడుతుంది. తొలగినట్లైతే తాను కూడా తొలగిపోతుంది.
ఏ లోకానికైనా వెంబడించి తనతో వచ్చే చక్రాగ్నిజ్వాలల్ని ఆర్పగలిగినవారు లేకపోవడంతో దుర్వాసుడు దేవతలలో ప్రథముడు అయిన బ్రహ్మ దగ్గరకువెళ్ళి, సృష్టి కార్యంలో కౌశలం కలిగిన విలాసమైన చూపులుగల ఓ బ్రహ్మా! 'నన్ను కాపాడు. చక్రాన్ని అడ్డుకో' అని ప్రార్థించాడు.
రెండు పరార్దాల ప్రమాణంకల ఈ కాలాన్ని కాలస్వరూపుడై లోకములో చక్కగా నిండించి, పరిపూర్తి అయిన వెంటనే కళ్లలో ఎర్రదనం వ్యాపించినంతనే వాటిని ఏ ప్రభువు బూడిదచేస్తాడో ఆ ప్రభువైన విష్ణువుయొక్క చక్రాగ్ని జ్వాలలకు అడ్డుపడ కలిగినవాడెవ్వడున్నాడు?
(ద్విపరార్థం అంటే రెండు పరార్థాలు. కేవలం ఇంత అల్పమాత్రం సమయంలో లోకాల్ని నిండిస్తాడు. కోపం కలిగిన వెంటనే వాటిని భస్మీభూతం చేస్తాడు. లోకాలన్ని రెండు పరార్థాల కాలంలోనే పుడుతున్నాయి, గిడుతున్నాయి. అంటే ఎక్కడో కాదు. మనలోనే కదా! ఎన్నో సృష్టింపబడుతున్నాయి. కాసేపటికి లయమవుతున్నాయి.)
ఆ శ్రీహరి ఆజ్ఞను నేను, ఈశ్వరుడు, దక్షుడు, ఇంద్రాదులు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు అందరం లోకకళ్యాణకరమని, గొప్ప కార్యమని, సాటిలేనిదని అనుకొంటూ తలదాలుస్తాం.
'కాబట్టి తాను చక్రాగ్నిని ఆపడానికి అశక్తుణ్ణి' అని బ్రహ్మ అన్నాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని సందర్శించి ఆయినకు సుదర్శనచక్ర విషయం చెప్పాడు. అపుడు ఆ పరమేశ్వరుడిలా అన్నాడు.
నాయనా! విను. ఈ విశ్వప్రభువువైన విష్ణువులో అనేక వేలసంఖ్యలైన బ్రహ్మాండాలు ఆయా సమయంలో పుడుతుంటాయి. నశిస్తుంటాయి. అదేకాదు మేము ఎవరి మాయకు లోనవుతున్నామో, నేను (ఈశ్వరుడు) దేవలుడు, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైనవారు పరతత్త్వజ్ఞులు, సిద్ధపతులు, ఎవరి మాయను తెలుసుకోలేక ఇటువంటి స్థితిని పొందుతున్నామో అటువంటి సర్వేశ్వరుని యొక్క విశిష్ట ఆయుధాన్ని (చక్రాన్ని) నివారించడం మా వల్లకాదు.
మునీశ్వరా! నీవు ఆ పరమాత్మ శరణంకోరు. అతడు నీకు మేలు చేస్తాడు. అని చెప్పిన శివుని నుండి నిరాశపాందిన దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి
ఆ వైకుంఠంలో ఎత్తైన మణిభవనంపై లక్ష్మీదేవితో సరససల్లాపాలతో విహరించే దేవతా ప్రభువైన విష్ణుణ్ణి చూచి “ఓ వరదా! భక్తరక్షాపరాయణా! దేవేశా! చక్రాగ్నిమంటల్ని మాన్పవా?” అని అభ్యర్థించాడు.
పరమాత్మా! నీ మాహాత్మ్యం అనే సముద్రంయొక్క చివరను నిజంగా తెలుసుకోలేక నీవాత్సల్యానికి పాత్రుడైన నీ భక్తునికి అల్పబుద్ధితో హాని చేశాను. నా అజ్ఞానాన్ని క్షమంచు. నరకలోకవాసి యైనవాడుకూడా నీ పేరును స్మరిస్తే సౌఖ్యస్థితి పొందకుండా ఉంటాడా? (పొందుతాడని భావం)
ఇలా చెప్పి, పాదపద్మాలకు నమస్కరించి, లేవకుండా అట్లే ఉండే దుర్వాసుణ్ణి చూచి, శ్రీహరి ఇలా అన్నాడు.
దుర్వాసుడు ఆవిధంగా పల్కి పాదాల మీది నుంచి లేవక అట్లే ఉండగా విష్ణుడిలా అన్నాడు. ఓ మహార్షీ! బుద్ధిమంతులైన సాధువులు నా మనసును అలవోకగా కొల్లగొట్టుకొని పోతుంటారు. పవిత్రమైన భక్తి అనే తీగలతో మదపుటేనుగును కట్టినట్లు నేర్పుతో నన్ను కట్టివేస్తారు. ఆ బంధాలకు చిక్కి భక్తులయందలి ప్రేమతో నేను వారిని అనుసరిస్తుంటాను.
(పాదపద్మాలకు మొక్కిన దుర్వాసుడు పాదాలను వదలలేదు. అంటే సంపూర్ణ శరణాగతిని పొందాడు. భగవానుని భక్తజనవత్సలకు ఈ పద్యం తార్కాణం. భగవానుడు స్వేచ్చగా విహరించే మదగజం. దాన్ని బంధించాలంటే మంచి తీగలు కావాలి. అవికూడా భక్తి అనే తీగలు. ఆ భక్తితీగలతో ఆయన్ను బంధించవచ్చు. ఆ బంధనాలకు చిక్కిన ఆయన భక్తుడెలా వెళ్తే అలాగా వెళుతుంటాడు.)
నాభక్తుడునా క్షేమాన్ని కోరుతుంటాడు. భక్తులకు నేనే దిక్కు భక్తుడెక్కడికి వెళితే నేను ఆవు వెంటబడే కోడెలాగా వెంటబడి వెళతాను.
దేహాన్ని జీవితాన్ని సంతానాన్ని బంధువులను, భార్యను, ఐశ్వర్యాన్ని వదలి నన్నుతప్ప మరిదేనినీ ఎప్పుడునూ తెలియని వారిని, ఎట్టివారినైనా నేను వదలను.
(భగవంతుని పొందుకోరడానికి మార్గాన్ని భగవానుడే చెబుతున్నాడు. అన్నింటిని వదలి నన్నే దిక్కుగా భావించేవారు ఏ లక్షణాలతో ఉన్నా, వారిని వదలను. ఎల్లప్పుడు కాపాడుతుంటాను అని భావం. అయితే పైన చెప్పినవన్నీ వదలటమెలాగా, శరీరం, జీవితం, ఆలుబిడ్డలు, ఐశ్వర్యం వీటిని వదిలేస్తే భగవానునిరక్ష లభిస్తుంది. అంటే వీటిమీద అహంకారమమకారాల్ని వదలాలి. భగవానుడే దిక్కుగా భావించేవారిని కాపాడుతూ ఉంటాడనడానికి గజేంద్రమోక్షం మంచి తార్కాణం.
ఉత్తముడైన భర్తను పతివ్రతలు ఇష్టపడినట్లు, బుద్ధిమంతులైన భక్తులు పంచేంద్రియాల మార్గాలను అరికట్టి తమమనసులో నన్న భావించుకుంటారు.
ఓ బ్రాహ్మణుడా! సజ్జనుల హృదయం నాది. వారిహృదయమే నేను. లోకాలన్నిటిలో సాధులను నేనుమాత్రమే తెలుసుకోగలను. నా నడవడిని వారుమాత్రమే తెలుసుకోగలరు.
(సాధుల హృదయాలనిండా నిండి ఉన్న భగవానునికి సాధులకు అభేదమని భావించాలి. 'సజ్జనులందుందఱచు సొచ్చియుందు' అన్నాడు వామనుడు.)
భూదేవులైన బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనేవి మోక్షాన్ని కల్గిస్తాయి. అవినయపరులకు ఇవే హానిని కలిగిస్తాయి.
నా తేజస్సు సజ్జనుల్లో నిండి ఉంటుంది. వారికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది. మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం.
ఓ బ్రాహ్మణుడా! నీకు జనులు పొగడే మంచి గుణవంతుడు, దయాపరుడు అయిన అంబరీషుడు అభయం ఇస్తాడు. అక్కడికే వెళ్ళు. అతని మనసుకు ప్రీతి కలిగించి శరణుకోరు. ఇది నీకు మంచి మార్గం సుమా!
అని ఆ లక్ష్మీపతి ఆనతివ్వగా, ప్రకాశవంతమైన చక్రజ్వాలలవల్ల ఆయాసపడ్డవాడు, కళతప్పినవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతిచేత గొప్ప ప్రజ్ఞకలవాడు హితమితభాషి అయిన అంబరీషుణ్ణి వెంటనే భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు.
దుర్వాసుడు చూచి దుఃఖించి ఆ రాజు కాళ్లను పట్టుకొని విడువకుండగా, ఆ రాజచంద్రుడు తన పాదస్పర్శకు జంకి, దయా హృదయుడై విష్ణుచక్రాన్ని ఈ విధంగా స్తోత్రం చేశాడు.
శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా! నీవే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలివి, ప్రాణేంద్రియాలు నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, యజ్ఞఫలానివి, నీవే లోకపాలకులు! నీవే సర్వాత్మవు, కాలానివి, లోకానివి నీవే, అనేకయాగభోక్తవు, నిత్యానివి, మూలతేజానివి నీవే. అటువంటినీకు నమస్కరిస్తున్నాను. మహర్షిని కాపాడు. నాకంతే చాలు.
ఓ చక్రాయుధమా! యుద్దాల్లో నీవు విష్ణువుచేత వదలబడడాన్ని ముందే విని నీ పదునుచేత ఎలాగూ చావడం జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు, మొదలైన శరీరావయవాలు వాలిపోగా ప్రాణవాయువులను వదలుతారు (మరణిస్తారు).
కలతనిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూచి మరణిస్తారు. తెల్లవారిన తరువాత వారి భార్యలు అది చూచి ఏడుస్తారు.
ధర్మమయమైన నీకాంతులు చీకటిని పారద్రోలుతూ, వెలుగులను పుట్టిస్తూ, సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్నుగూర్చి వర్ణించడం బ్రహ్మకు అశక్యం. నీ రూపం సర్వోత్కృష్టములలో మొదటిదై ఉన్నది. తుది లేదు. మహోన్నతమైనది.
పుండరీకాక్షుడైన హరి దుర్జనులను శిక్షించడానికి నిన్ను నియోగించగా నీవు పూనుకొన్నావు. అయినా ఇకచాలు. ధర్మప్రవృత్తితో ఆపన్నుడై ఉన్న మునిని రక్షించు.
అని చక్రాన్ని పొగిడి నుదుటియందు చేతులు జోడించి (నమస్కరించి) ఇట్లా అన్నాడు.
ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు తోకచుక్కలాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్చమైన ఆకారంకలది, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం దేవేంద్రుని రక్షించేది అయిన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను.
అని ప్రశంసించి ఇంకా ఇలాగన్నాడు.
నేను విధించబడిన ధర్మమార్గంలో నడిచేవాడనయితే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసినవాడనయితే, బ్రాహ్మణుడు మాకు దైవసమానుడే అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక.
సర్వగుణాశ్రయుడైన హరి నా సేవచేత పరవశుడే అయితే, సర్వాత్మల యందుండువాడయితే, ఇప్పుడీ బ్రాహ్మణుడు సుఖాన్ని పొందుగాక.
ఈ విధంగా రాజు స్తుతించగా మునిని మన్నించి, బాధ పెట్టకుండా విష్ణుచక్రం మరలివెళ్లింది. తరువాత దుర్వాసుడు నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజుని ఆశీర్వదించి ఇలా అన్నాడు.
ఓ రాజోత్తమా! నా తప్పుకాచి మేలుచేశావుకదా! విష్ణువు పాదపద్మాల్ని ఇంతగా సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. నీ బోటి సన్నార్గుల విషయంలో అరుదేమికాదు. నీ వంటివారికి, దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా సహజగుణాలై సరసకు వస్తాయి కదా!
ఓ రాజోత్తమా! ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సోకితే సమస్తమైన పాపాలు తొట్రుపాటుతో కిందు మీదై వైదొలగుతాయో, అటువంటి మంచిని కలుగబేసే, మంగళకరమైన తీర్ధం (గంగ) పాదములందుగల దేవేశుడైన విష్ణుని నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డముండదు.
'ఓ రాజా! నేను చేసిన తప్పును పట్టించుకోకుండా, చక్రాగ్ని దహించుటనుండి నన్ను తప్పించావు. నీ కరుణరసం నీకే తగును రాజా! చెప్పాలంటే నా ప్రాణాలు పోయి మళ్లీవచ్చాయి. ధన్యుడనయ్యాను. ఎప్పుడూ నీ శ్రేయస్సునే కోరుతాను. ఇక వెళతాను'. అన్నాడు మహర్షి
అని దుర్వాసుడు చెప్పగా విని ఆ రాజముఖ్యుడైన అంబరీషుడు మునిపాదాలకు ప్రణమిల్లి, గౌరవించి ఇష్టమైన భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్తి పొందాడు.
మరల ఆ దుర్వాసమహర్షి అంబరీషుడితో ఇలా అన్నాడు.
ఓ రాజచంద్రా! ఈ రోజు నిన్ను చూచాను. వీనులవిందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనంచేశాను. వ్రతఫలితం దక్కింది. నేను బతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇకమీదట సుఖంగా కూర్చొని పొగడుతూ ఉంటారు. ఇక వెళతాను.
అని పలికి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి ప్రశంసించి ఆకాశమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన వచ్చివెళ్ళినప్పటికి ఒక సంవత్సరం నిండి ద్వాదశీవ్రతం పూర్తి అయింది.
“మునికి వచ్చిన కష్టం పోగొట్టడానికి నేనెంత వాడిని. అంతా విష్ణువు దయావిశేషమే” అంటూ రాజు ముని తినడంచేత పవిత్రమైన అన్నాన్ని తిన్నాడు.
హరిసేవకులకు బ్రహ్మపదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలని భావించి అంబరీషుడు రాజ్యంతో తనకుగల సంబంధాన్నే వదలుకున్నాడు.
ఈ విధంగా విరక్తి కలిగినవాడై, మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువుకాగా కామక్రోధాదులను జయించినవాడై తనతో సమానులైన కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని వారికి అప్పగించి అడవికి వెళ్లాడు.
ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు. భోగపరుడవుతాడు. పుణ్యాత్ముడవుతాడు.
(ఇది అంబరీషుని కథకు ఫలుశ్రుతి.)
ఆ అంబరీషునికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అని ముగ్గురు కొడుకులు. వారిలో కేతుమంతుడు, శంభుడు విష్ణువును గూర్చి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళారు. విరూపునికి పృషదశ్వుడు, అతనికి రథీతరుడు పుట్టారు. ఆ మహాత్మునకు సంతానం లేకపోవడం చేత అంగిరసుడనే ముని అతని భార్యకు బ్రహ్మతేజోవంతులైన కొడుకులను ప్రసాదించాడు. వాళ్ళు రథీతరగోత్రులుగాను, ఆంగిరసులనే బ్రాహ్మణులుగాను ప్రఖ్యాతి పొందారు, అని చెప్పి శుక మహర్షి ఇట్లా అన్నాడు.
'దుర్వాసమహర్షి యమునకు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. ద్వాదశి కూడా వెళ్ళిపోతోంది. అది వెళ్ళిపోయేలోగా పారణ చేయాలి. తగిన ధర్మాన్ని నాకు చెప్పండి' అన్నాడు రాజు.
తనకు కలిగిన ధర్మసంకటాన్ని ముందుంచిన రాజుతో బ్రాహ్మణులు ఇలా అన్నారు.
రాజా! అతిథి స్నానానికి పోయి రాకపోవడంచేత ద్వాదశి పారణను మానివేయడం ధర్మంకాదు. నీటిని స్వీకరించండి. అది తినినట్లుకాదు; తిననట్లుకాదు; సలిలభక్షణం అంగీకారమైందే.
బ్రాహ్మణులు రాజుగారి ధర్మసందేహాన్ని పోగొట్టారు. ఆ రాజర్షి మనసులో విష్ణువును ధ్యానించి నీటిని పారణ చేశాడు. స్నానానికి వెళ్ళిన మునికోసం ఎదురు చూస్తుండగా
ఆ సమయంలో యమునానదిలో స్నానాదికం పూర్తిచేసి వచ్చిన మునీశ్వరుడు అంబరీషుని సేవలు అందుకొన్నాడు. తన బుద్ధితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. బొమముడి కలిగిన ముఖంతో, శరీరం కంపిస్తుండగా, కోపంతో రెట్టించిన, ఆకలి నకనకమంటుండగా, ఇలా అన్నాడు. “ఈ ఐశ్వర్య మదాంధుని, ఈ ఘాతుకుణి, గర్విష్ఠుణ్ణి మీరందరూ చూచారా? వీడు విష్ణుభక్తుడుకాదు. నన్ను అతిథిగా పిలిచి నా రాకకుముందే భుజించి, ధర్మభంగం చేసి దుర్మార్గుడయ్యాడు. నా శక్తి ఇప్పుడు ప్రదర్శిస్తాను. నేను కోపిస్తే ఎక్కడైనాసరే అడ్దుపడేవాడెవడు?” అంటూ
దుర్వాసుడు పటపటమని పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకొనలనుండి తీక్ష్ణమైన నిప్పులు చిటచిటమని రాలుతుండగా చెంపలు పొంగగా హూంకారం చేస్తూ తన జుట్టులోని శిఖను ఒక దాన్ని పెరికి దాన్ని చేత ఆయుధంకల్గిన సంహారక దేవతను సృష్టించి రాజుపై వదిలాడు.
ప్రళయాగ్నితో సమానురాలై, చేతితో శూలాన్ని ధరించి, నేల సురసురమని అణగిపోయేటట్లు పాదాలతో తొక్కుతూ విజృంభించి రాజును సమీపించింది.
విశ్వరూపుడైన విష్ణువు దుర్వాసుని దుష్కృత్యాన్ని తెలిసికొని 'అజ్ఞాని'యైన తపసిమాయను సరిచేయమని చక్రాన్ని పంపాడు. అది ప్రళయాగ్నివలె వచ్చింది.
ఆ విధంగా వచ్చిన చక్రం మునిపంపిన కృత్యను కాల్చి, అంతటితో ఆగక మునిని వెంబడించింది. ముని మేరు పర్వతగుహలో దూరగా అదికూడ సర్పాన్ని వెంబడించే దావాగ్నివలె అందులో ప్రవేశించింది. అంతేగాక
పరులకు మరలించుటకు వీలులేని విష్ణుచక్రం ఒక్క ఉదుటున ముని వెంటబడి భూమిలో దూరితే భూమిలోకి దూరుతుంది. సముద్రంలో మునిగితే తానుకూడ సముద్రాలలో మునుగుతుంది. ఉద్వేగంతో ఆకాశానికి పాకితే తాను కూడా ఆకాశానికి ఎగబాకుతుంది. దిక్కుల్లోకి వెళితే దిగ్వీథుల్లోకి వెళుతుంది. దారిలో ముని ఆగితే తానూ ఆగుతుంది. నిలబడితే నిలబడుతుంది. తొలగినట్లైతే తాను కూడా తొలగిపోతుంది.
ఏ లోకానికైనా వెంబడించి తనతో వచ్చే చక్రాగ్నిజ్వాలల్ని ఆర్పగలిగినవారు లేకపోవడంతో దుర్వాసుడు దేవతలలో ప్రథముడు అయిన బ్రహ్మ దగ్గరకువెళ్ళి, సృష్టి కార్యంలో కౌశలం కలిగిన విలాసమైన చూపులుగల ఓ బ్రహ్మా! 'నన్ను కాపాడు. చక్రాన్ని అడ్డుకో' అని ప్రార్థించాడు.
రెండు పరార్దాల ప్రమాణంకల ఈ కాలాన్ని కాలస్వరూపుడై లోకములో చక్కగా నిండించి, పరిపూర్తి అయిన వెంటనే కళ్లలో ఎర్రదనం వ్యాపించినంతనే వాటిని ఏ ప్రభువు బూడిదచేస్తాడో ఆ ప్రభువైన విష్ణువుయొక్క చక్రాగ్ని జ్వాలలకు అడ్డుపడ కలిగినవాడెవ్వడున్నాడు?
(ద్విపరార్థం అంటే రెండు పరార్థాలు. కేవలం ఇంత అల్పమాత్రం సమయంలో లోకాల్ని నిండిస్తాడు. కోపం కలిగిన వెంటనే వాటిని భస్మీభూతం చేస్తాడు. లోకాలన్ని రెండు పరార్థాల కాలంలోనే పుడుతున్నాయి, గిడుతున్నాయి. అంటే ఎక్కడో కాదు. మనలోనే కదా! ఎన్నో సృష్టింపబడుతున్నాయి. కాసేపటికి లయమవుతున్నాయి.)
ఆ శ్రీహరి ఆజ్ఞను నేను, ఈశ్వరుడు, దక్షుడు, ఇంద్రాదులు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు అందరం లోకకళ్యాణకరమని, గొప్ప కార్యమని, సాటిలేనిదని అనుకొంటూ తలదాలుస్తాం.
'కాబట్టి తాను చక్రాగ్నిని ఆపడానికి అశక్తుణ్ణి' అని బ్రహ్మ అన్నాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని సందర్శించి ఆయినకు సుదర్శనచక్ర విషయం చెప్పాడు. అపుడు ఆ పరమేశ్వరుడిలా అన్నాడు.
నాయనా! విను. ఈ విశ్వప్రభువువైన విష్ణువులో అనేక వేలసంఖ్యలైన బ్రహ్మాండాలు ఆయా సమయంలో పుడుతుంటాయి. నశిస్తుంటాయి. అదేకాదు మేము ఎవరి మాయకు లోనవుతున్నామో, నేను (ఈశ్వరుడు) దేవలుడు, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైనవారు పరతత్త్వజ్ఞులు, సిద్ధపతులు, ఎవరి మాయను తెలుసుకోలేక ఇటువంటి స్థితిని పొందుతున్నామో అటువంటి సర్వేశ్వరుని యొక్క విశిష్ట ఆయుధాన్ని (చక్రాన్ని) నివారించడం మా వల్లకాదు.
మునీశ్వరా! నీవు ఆ పరమాత్మ శరణంకోరు. అతడు నీకు మేలు చేస్తాడు. అని చెప్పిన శివుని నుండి నిరాశపాందిన దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి
ఆ వైకుంఠంలో ఎత్తైన మణిభవనంపై లక్ష్మీదేవితో సరససల్లాపాలతో విహరించే దేవతా ప్రభువైన విష్ణుణ్ణి చూచి “ఓ వరదా! భక్తరక్షాపరాయణా! దేవేశా! చక్రాగ్నిమంటల్ని మాన్పవా?” అని అభ్యర్థించాడు.
పరమాత్మా! నీ మాహాత్మ్యం అనే సముద్రంయొక్క చివరను నిజంగా తెలుసుకోలేక నీవాత్సల్యానికి పాత్రుడైన నీ భక్తునికి అల్పబుద్ధితో హాని చేశాను. నా అజ్ఞానాన్ని క్షమంచు. నరకలోకవాసి యైనవాడుకూడా నీ పేరును స్మరిస్తే సౌఖ్యస్థితి పొందకుండా ఉంటాడా? (పొందుతాడని భావం)
ఇలా చెప్పి, పాదపద్మాలకు నమస్కరించి, లేవకుండా అట్లే ఉండే దుర్వాసుణ్ణి చూచి, శ్రీహరి ఇలా అన్నాడు.
దుర్వాసుడు ఆవిధంగా పల్కి పాదాల మీది నుంచి లేవక అట్లే ఉండగా విష్ణుడిలా అన్నాడు. ఓ మహార్షీ! బుద్ధిమంతులైన సాధువులు నా మనసును అలవోకగా కొల్లగొట్టుకొని పోతుంటారు. పవిత్రమైన భక్తి అనే తీగలతో మదపుటేనుగును కట్టినట్లు నేర్పుతో నన్ను కట్టివేస్తారు. ఆ బంధాలకు చిక్కి భక్తులయందలి ప్రేమతో నేను వారిని అనుసరిస్తుంటాను.
(పాదపద్మాలకు మొక్కిన దుర్వాసుడు పాదాలను వదలలేదు. అంటే సంపూర్ణ శరణాగతిని పొందాడు. భగవానుని భక్తజనవత్సలకు ఈ పద్యం తార్కాణం. భగవానుడు స్వేచ్చగా విహరించే మదగజం. దాన్ని బంధించాలంటే మంచి తీగలు కావాలి. అవికూడా భక్తి అనే తీగలు. ఆ భక్తితీగలతో ఆయన్ను బంధించవచ్చు. ఆ బంధనాలకు చిక్కిన ఆయన భక్తుడెలా వెళ్తే అలాగా వెళుతుంటాడు.)
నాభక్తుడునా క్షేమాన్ని కోరుతుంటాడు. భక్తులకు నేనే దిక్కు భక్తుడెక్కడికి వెళితే నేను ఆవు వెంటబడే కోడెలాగా వెంటబడి వెళతాను.
దేహాన్ని జీవితాన్ని సంతానాన్ని బంధువులను, భార్యను, ఐశ్వర్యాన్ని వదలి నన్నుతప్ప మరిదేనినీ ఎప్పుడునూ తెలియని వారిని, ఎట్టివారినైనా నేను వదలను.
(భగవంతుని పొందుకోరడానికి మార్గాన్ని భగవానుడే చెబుతున్నాడు. అన్నింటిని వదలి నన్నే దిక్కుగా భావించేవారు ఏ లక్షణాలతో ఉన్నా, వారిని వదలను. ఎల్లప్పుడు కాపాడుతుంటాను అని భావం. అయితే పైన చెప్పినవన్నీ వదలటమెలాగా, శరీరం, జీవితం, ఆలుబిడ్డలు, ఐశ్వర్యం వీటిని వదిలేస్తే భగవానునిరక్ష లభిస్తుంది. అంటే వీటిమీద అహంకారమమకారాల్ని వదలాలి. భగవానుడే దిక్కుగా భావించేవారిని కాపాడుతూ ఉంటాడనడానికి గజేంద్రమోక్షం మంచి తార్కాణం.
ఉత్తముడైన భర్తను పతివ్రతలు ఇష్టపడినట్లు, బుద్ధిమంతులైన భక్తులు పంచేంద్రియాల మార్గాలను అరికట్టి తమమనసులో నన్న భావించుకుంటారు.
ఓ బ్రాహ్మణుడా! సజ్జనుల హృదయం నాది. వారిహృదయమే నేను. లోకాలన్నిటిలో సాధులను నేనుమాత్రమే తెలుసుకోగలను. నా నడవడిని వారుమాత్రమే తెలుసుకోగలరు.
(సాధుల హృదయాలనిండా నిండి ఉన్న భగవానునికి సాధులకు అభేదమని భావించాలి. 'సజ్జనులందుందఱచు సొచ్చియుందు' అన్నాడు వామనుడు.)
భూదేవులైన బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనేవి మోక్షాన్ని కల్గిస్తాయి. అవినయపరులకు ఇవే హానిని కలిగిస్తాయి.
నా తేజస్సు సజ్జనుల్లో నిండి ఉంటుంది. వారికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది. మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం.
ఓ బ్రాహ్మణుడా! నీకు జనులు పొగడే మంచి గుణవంతుడు, దయాపరుడు అయిన అంబరీషుడు అభయం ఇస్తాడు. అక్కడికే వెళ్ళు. అతని మనసుకు ప్రీతి కలిగించి శరణుకోరు. ఇది నీకు మంచి మార్గం సుమా!
అని ఆ లక్ష్మీపతి ఆనతివ్వగా, ప్రకాశవంతమైన చక్రజ్వాలలవల్ల ఆయాసపడ్డవాడు, కళతప్పినవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతిచేత గొప్ప ప్రజ్ఞకలవాడు హితమితభాషి అయిన అంబరీషుణ్ణి వెంటనే భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు.
దుర్వాసుడు చూచి దుఃఖించి ఆ రాజు కాళ్లను పట్టుకొని విడువకుండగా, ఆ రాజచంద్రుడు తన పాదస్పర్శకు జంకి, దయా హృదయుడై విష్ణుచక్రాన్ని ఈ విధంగా స్తోత్రం చేశాడు.
శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా! నీవే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలివి, ప్రాణేంద్రియాలు నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, యజ్ఞఫలానివి, నీవే లోకపాలకులు! నీవే సర్వాత్మవు, కాలానివి, లోకానివి నీవే, అనేకయాగభోక్తవు, నిత్యానివి, మూలతేజానివి నీవే. అటువంటినీకు నమస్కరిస్తున్నాను. మహర్షిని కాపాడు. నాకంతే చాలు.
ఓ చక్రాయుధమా! యుద్దాల్లో నీవు విష్ణువుచేత వదలబడడాన్ని ముందే విని నీ పదునుచేత ఎలాగూ చావడం జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు, మొదలైన శరీరావయవాలు వాలిపోగా ప్రాణవాయువులను వదలుతారు (మరణిస్తారు).
కలతనిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూచి మరణిస్తారు. తెల్లవారిన తరువాత వారి భార్యలు అది చూచి ఏడుస్తారు.
ధర్మమయమైన నీకాంతులు చీకటిని పారద్రోలుతూ, వెలుగులను పుట్టిస్తూ, సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్నుగూర్చి వర్ణించడం బ్రహ్మకు అశక్యం. నీ రూపం సర్వోత్కృష్టములలో మొదటిదై ఉన్నది. తుది లేదు. మహోన్నతమైనది.
పుండరీకాక్షుడైన హరి దుర్జనులను శిక్షించడానికి నిన్ను నియోగించగా నీవు పూనుకొన్నావు. అయినా ఇకచాలు. ధర్మప్రవృత్తితో ఆపన్నుడై ఉన్న మునిని రక్షించు.
అని చక్రాన్ని పొగిడి నుదుటియందు చేతులు జోడించి (నమస్కరించి) ఇట్లా అన్నాడు.
ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు తోకచుక్కలాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్చమైన ఆకారంకలది, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం దేవేంద్రుని రక్షించేది అయిన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను.
అని ప్రశంసించి ఇంకా ఇలాగన్నాడు.
నేను విధించబడిన ధర్మమార్గంలో నడిచేవాడనయితే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసినవాడనయితే, బ్రాహ్మణుడు మాకు దైవసమానుడే అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక.
సర్వగుణాశ్రయుడైన హరి నా సేవచేత పరవశుడే అయితే, సర్వాత్మల యందుండువాడయితే, ఇప్పుడీ బ్రాహ్మణుడు సుఖాన్ని పొందుగాక.
ఈ విధంగా రాజు స్తుతించగా మునిని మన్నించి, బాధ పెట్టకుండా విష్ణుచక్రం మరలివెళ్లింది. తరువాత దుర్వాసుడు నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజుని ఆశీర్వదించి ఇలా అన్నాడు.
ఓ రాజోత్తమా! నా తప్పుకాచి మేలుచేశావుకదా! విష్ణువు పాదపద్మాల్ని ఇంతగా సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. నీ బోటి సన్నార్గుల విషయంలో అరుదేమికాదు. నీ వంటివారికి, దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా సహజగుణాలై సరసకు వస్తాయి కదా!
ఓ రాజోత్తమా! ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సోకితే సమస్తమైన పాపాలు తొట్రుపాటుతో కిందు మీదై వైదొలగుతాయో, అటువంటి మంచిని కలుగబేసే, మంగళకరమైన తీర్ధం (గంగ) పాదములందుగల దేవేశుడైన విష్ణుని నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డముండదు.
'ఓ రాజా! నేను చేసిన తప్పును పట్టించుకోకుండా, చక్రాగ్ని దహించుటనుండి నన్ను తప్పించావు. నీ కరుణరసం నీకే తగును రాజా! చెప్పాలంటే నా ప్రాణాలు పోయి మళ్లీవచ్చాయి. ధన్యుడనయ్యాను. ఎప్పుడూ నీ శ్రేయస్సునే కోరుతాను. ఇక వెళతాను'. అన్నాడు మహర్షి
అని దుర్వాసుడు చెప్పగా విని ఆ రాజముఖ్యుడైన అంబరీషుడు మునిపాదాలకు ప్రణమిల్లి, గౌరవించి ఇష్టమైన భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్తి పొందాడు.
మరల ఆ దుర్వాసమహర్షి అంబరీషుడితో ఇలా అన్నాడు.
ఓ రాజచంద్రా! ఈ రోజు నిన్ను చూచాను. వీనులవిందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనంచేశాను. వ్రతఫలితం దక్కింది. నేను బతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇకమీదట సుఖంగా కూర్చొని పొగడుతూ ఉంటారు. ఇక వెళతాను.
అని పలికి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి ప్రశంసించి ఆకాశమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన వచ్చివెళ్ళినప్పటికి ఒక సంవత్సరం నిండి ద్వాదశీవ్రతం పూర్తి అయింది.
“మునికి వచ్చిన కష్టం పోగొట్టడానికి నేనెంత వాడిని. అంతా విష్ణువు దయావిశేషమే” అంటూ రాజు ముని తినడంచేత పవిత్రమైన అన్నాన్ని తిన్నాడు.
హరిసేవకులకు బ్రహ్మపదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలని భావించి అంబరీషుడు రాజ్యంతో తనకుగల సంబంధాన్నే వదలుకున్నాడు.
ఈ విధంగా విరక్తి కలిగినవాడై, మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువుకాగా కామక్రోధాదులను జయించినవాడై తనతో సమానులైన కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని వారికి అప్పగించి అడవికి వెళ్లాడు.
ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు. భోగపరుడవుతాడు. పుణ్యాత్ముడవుతాడు.
(ఇది అంబరీషుని కథకు ఫలుశ్రుతి.)
ఆ అంబరీషునికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అని ముగ్గురు కొడుకులు. వారిలో కేతుమంతుడు, శంభుడు విష్ణువును గూర్చి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళారు. విరూపునికి పృషదశ్వుడు, అతనికి రథీతరుడు పుట్టారు. ఆ మహాత్మునకు సంతానం లేకపోవడం చేత అంగిరసుడనే ముని అతని భార్యకు బ్రహ్మతేజోవంతులైన కొడుకులను ప్రసాదించాడు. వాళ్ళు రథీతరగోత్రులుగాను, ఆంగిరసులనే బ్రాహ్మణులుగాను ప్రఖ్యాతి పొందారు, అని చెప్పి శుక మహర్షి ఇట్లా అన్నాడు.
Vaivasvata Manvantara Story - వైవస్వత మనువంశ కథనము
వైవస్వత మనువంశ కథనము
ఓ మహారాజా! ఈ మనువువంశాన్నిగురించి చక్కగా వివరించి చెప్పటానికి లక్షసంవత్సరాలైనా సరిపోదు. కాని అంత సమయం తీసుకోకుండా త్వరగా నాకు తెలిసినంతవరకు నీకు వివరిస్తాను. విను.
భగవానుడు ఎక్కువ తక్కువ పొడవులకు అతీతమైనవాడు అంటే రూపరహితుడు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా నాశనమైనా విశ్వరూపుడు కావడంచేత తానొక్కడే ఆశ్చర్యకరంగా మిగులుతాడు.
ఓ పరీక్షిన్మహారాజా! కల్పాంతంలో నిల్చిన ఆ దివ్యపురుషునినాభినుండి బంగారుకమలం ఉద్భవించింది. ఆ కమలంలో స్వయంభువై బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మమనసునుండి మరీచి జన్మించాడు. అతనికి కశ్యపుడు, కశ్యపునికి దక్షునికూతురైన అదితికి సూర్యుడు, అతనికీ సంజ్ఞకు మనువైన శ్రాద్ధదేవుడు, ఆ మనువుకు శ్రద్ధకు శుభకీర్తి కలిగిన పదిమందికుమారులు కలిగారు.
శ్రాద్ధదేవుడనే మనువుకు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి అనే పదిమంది కొడుకులు కలిగారు. వీరు జన్మించటానికి పూర్వం మనువు కొడుకులు లేనివాడై యజ్ఞదేవతలైన మిత్రావరుణులను గూర్చి
మనువు సంతానంకోసం యజ్ఞాన్ని చేస్తుండగా, అతనిభార్య హోతతో 'నాకు యజ్ఞఫలంగా కుమార్తె కలిగేటట్లు యజ్ఞాన్ని చేయి అని పల్కి' భక్తితో క్షీరవ్రతాన్ని చేసింది. ఆమె చెప్పినట్లుగా అధ్వర్యుడు హోతతో 'ఆమెకోరినట్లే చెప్పి వేల్చు' అని అన్నాడు. అతడు హవిస్సును చేబూని 'కూతురు కలుగుగాక' అని సంకల్పం చెప్తూ వేల్చాడు. హోత వ్యతిరేక చేష్టవల్ల 'ఇల' అనే స్త్రీ పుట్టింది. దానిని చూచి మనువు తీవ్రమనస్తాపం పొంది, అయ్యో! పుత్రసంతానం మంచిది కదా కూతురెందుకని అనుకొంటూ వసిష్ఠునిదగ్ధరకు పరుగుతీశాడు.
పైన చెప్పబడినట్లు తన అసంతృప్తిని తనలోనే అణచుకొని, వసిష్ఠునిదగ్గరకు వెళ్ళి ఆయనతో ఇలా మొర పెట్టుకొన్నాడు.
అయ్యా! కొడుకులు కలగాలని నేను ఈ యజ్ఞాన్ని మీ అనుజ్ఞతో చేస్తే ఈ కుమార్తె ఎందుకు కలిగింది? మీ బోటి వారిశక్తికి హద్దు ఉండదుగదా!
“అదీగాక మీరు బ్రహ్మవాదులు. మంత్రవాదులు. పాపం అంటకుండా చూచేవారు. కాని జరిగింది మాత్రం వేరుగా ఉంది” అని అన్నాడు. అపుడు మా ముత్తాతయైన వసిష్ఠుడు అకార్యంవల్ల జరిగినవిషయాన్ని గ్రహించి, మనువుతో ఇలా అన్నాడు.
ఓ రాజా! హోత మోసం చేయడంవల్ల యాగఉద్దేశానికి వ్యతిరేకంగా కూతురు కలిగింది. అయినా నీవు మెచ్చుకొనేటట్లు నీకు కొడుకును ప్రసాదిస్తాను. నా కౌశలాన్ని బలాన్ని చూడు.
(యజమాని చేసే యాగఉద్దేశానికి అనుకూలంగా హోత వషట్కారం చెప్పాలి. తద్విరుద్ధంగా చెప్పడం కల్లతనమే. కాని ఒకసారి పుట్టిన ఆడశిశువును మగవాడుగా మార్చడం అద్భుతమైన విషయమే. దాన్ని సాధించటానికి నేర్పు, శక్తి కావాలి. అదే జరిగితే రాజు మెచ్చుకోకుండా ఎట్లుంటాడు? అలామారిన కొడుకు 'ప్రియాత్మజుడు' కాకుండా ఎట్లుంటాడు? అనే విషయాలు ద్యోతక మవుతాయి.
రాజుతో పైవిధంగా పలికి భగవానుడైన వసిష్ఠమహర్షి కీర్తియందాసక్తితో మనువుకుమార్తె పురుషత్వంకోసం ఏకాగ్రతతో ఆదిపురుషుడైన విష్ణువును స్తుతించగా, ఆ స్వామి మెచ్చుకొని, ఆ మహర్షి కోరిన వరాన్ని ప్రసాదించాడు. ఆ కారణంచేత ఇలా పుత్రిక సుద్యుమ్నుడనే పేరుతో కొడుకై రాజ్యపాలనం చేస్తూవుండగా
(లోకంలో సంతానం భగవన్నిర్ణయం. అసంతృప్తడైన మనువు మహర్షికి తన దుఃఖాన్ని చెప్పుకొన్నాడు. కాని కొడుకును ప్రసాదించమని అడగలేదు. కాని అద్భుతంగా వసిష్ఠుడు కూతురిని కొడుకుగా చేశాడు. కారణం కీర్తితత్పరత అని కవే చెప్పాడు. గహనమైన విషయం సాధించటంవల్ల కలిగే కీర్తియా? లేక లోకకల్యాణకారకమైన కీర్తియా? రెండోది సరైందని భావించాలి.)
సుద్యుమ్నుడనే ఆ రాజు ఒకరోజు కొందరు మంత్రులు వెంటరాగా, మేలుజాతి గుర్రాన్నెక్కి సొగసైన వింటిని, వాడియైన బాణాలను ధరించి, దట్టమైన అరణ్యాల వెంబడి పెద్దమృగాలను వేటాడుతూ మేరుపర్వతసమీపంలోని కుమారవనాన్ని ప్రవేశించాడు. అక్కడ పార్వతీపరమేశ్వరులు ఎప్పుడూ ఏకాంతవిహారం చేస్తుంటారు. ఆ వనంలో ప్రవేశించగానే రాజు స్త్రీ అయ్యాడు. అతని సేవకులుకూడా స్త్రీలుగా మారారు. ఆ రాజుగుర్రంసైతం ఆడుగుర్రంగా మారింది.
ఈ విధంగా ఆ వనప్రవేశంచేత పురుషత్వం కోల్పోయి, స్త్రీలై పరస్పరం ముఖాలు చూచుకొని దుఃఖీంచారు అని చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
'రాజు, ఆయన అనుచరులు ఆ వనంలో ప్రవేశించినంతనే స్త్రీలయ్యారని అన్నావు. ఏ కారణంచేత వాళ్లు స్త్రీలయ్యారు? లోకంలో ఇటువంటి దేశాన్ని గూర్చి ఎప్పుడూ వినలేదు. నా కుతూహలం తీరేటట్లు వివరించండి.
ఈ ఆశ్చర్యకరమైన విషయంతో బాటు మరొక విషయంకూడా.
పౌరుషవంతుడైన మానవుడు స్త్రీత్వం కోల్పోయి, మగవాడు కావడం బాగుండవచ్చుగాని; పేరుప్రతిష్ఠలకు భంగం కలిగేట్టుగా పురుషత్వం కోల్పోయి స్త్రీ కావడం బాగుంటుందా?
పై విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకమహర్షి ఇట్లన్నాడు.
చీకట్లను పారదోల గలిగిన తేజోవంతులైన కొందరు మునులు పరమేశ్వరుణ్ణి సందర్శించే కోరికతో, ఆ వనంలో ప్రవేశించారు. భర్తతొడలపై కూర్చున్న పార్వతీదేవి వారిని చూచి, సిగ్గుతో వస్త్రం ధరించింది. వారు 'పార్వతీ పరమేశ్వరులు ఏకాంతవిహారంలో ఉన్నారు. ఇది దర్శన సమయం కాదని' నరనారాయణులున్న బదరికావనానికి వెళ్లారు.
పై సన్నివేశకారణంగా పరమాత్ముడైన ఈశ్వరుడు పార్వతీదేవి వినోదాలకోసం ఇట్లా కట్టడిచేశాడు.
'ఈ ప్రదేశంలో ప్రవేశించేవాడు స్త్రీ అగుగాక' అన్న ఆ ఈశ్వరుని మాటచేత సుద్యుమ్నుడు స్త్రీగా మారి, ఆ అడవులలో తిరిగిన చోటే తిరుగుతూ ఉండినాడు.
ఈ విధంగా చెలికత్తెలతో స్త్రీరూపం పొందిన సుద్యుమ్నుడు రాజకుమార్తె హోయలతో స్త్రీ సొందర్యాన్ని వెదజల్లుతూ దైవయోగంచేత చంద్రునికొడుకు మహిమాన్వితుడైన బుధుని ఆశ్రమంలో తిరుగాడుతుండగా
(సుద్యుమ్నుడు ప్రథమంగా స్త్రీ. వసిష్ఠ మహర్షి తపశ్శక్తిచేత పురుషుడు. బుధునిఆశ్రమంలో తిరగడం దైవయోగం. రాచకూతురు చూపులతో స్త్రీభావాల్ని నెరపడం ప్రేరకం. ఇన్ని విషయాలు ఒక్కచోట చేర్చబడ్డాయి.)
పద్మదళనేత్ర అయిన ఆ స్త్రీ చంద్రునికొడుకైన బుధుణ్ణి చూచింది. అపుడే అతను కూడ ఆమెను చూచాడు. సరిగ్గా అదే సమయంలో దొంగవాడైన మన్మథుడు తొందరగా తన చిగురుటాకు కత్తిని తీసి, పరుగెత్తి వారిని కొట్టాడు.
ఈ విధంగా మన్మథుని బిగువైన చిగురాకు ఆయుధం తాకిడికి వారిరువురు రతివినోదాలలో మునిగారు. దాని ఫలితంగా వారికి పురూరవుడనే కొడుకు పుట్టాడు. ఈ విధంగా
మనువు కుమారుడైన సుద్యుమ్నుడు మరొకరికి ఆలుకావడంచేత కొడుకును గని, ఆ జీవితానికి విసిగి, దుఃఖంతో చింతిస్తూ గురువైన వసిష్ఠుణ్ణి తలచుకొన్నాడు. అలా తలచుకోగానే ఆ మహర్షి కూడా వచ్చాడు.
వసిష్ఠుడు ఆవిధంగా అక్కడికి వచ్చి సుద్యుమ్నుడు పురుషుడు కావటంకోసం పరమేశ్వరుణ్ణి సేవించగా ఈశ్వరుడు ఆతని శ్రమకు మెచ్చి ఇట్లన్నాడు.
తాను పూర్వం అన్నమాట వ్యర్థం కాకుండా, ఆ ముని సంతోషించేటట్లు శివుడు 'ఈ సుద్యుమ్నుడు ఒక నెలపురుషుడుగాను, మరో నెల స్త్రీ గాను ఉంటాడు. ఈ మార్పులతో జీవిస్తూ, రాజ్యాన్ని పాలిస్తాడు. వెళ్లు అనగా వసిష్ఠుడు సుద్యుమ్నుని దగ్గరకు వచ్చాడు. ఆ విధంగానే సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలిస్తూ
(పూర్వం విష్ణువు ఇచ్చిన వరానికి, ఇప్పుడు తాను(శివుడు) ఇచ్చిన శాపానికి భంగంరాకుండునట్లు సుద్యుమ్నుడు ఒకనెల పురుషుడుగా, మరోనెల స్త్రీగా ఉండునట్టూ, రాజ్యపాలన స్తంభించకుండా ఉండేటట్లు అనుగ్రహించాడు శివుడు.)
ఓ రాజా! గురువుదయవల్ల అతడు ఆ విధంగా స్త్రీత్వం పొంది, మరల పురుషుడవుతూ, ప్రజలు ఆనందిస్తుండగా భుజబలంతో భూమిని పాలించాడు.
ఆ సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగి ధర్మానురక్తులై ఉత్తరదిక్కులోని భూములకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు వృద్దుడయినందువల్ల, పురూరవునికి రాజ్యమిచ్చి, ప్రతిష్ఠానపురాన్ని విడిచి, వానప్రస్థానికి వెళ్ళాడు. ఆ విధంగా
ఈ విధంగా కొడుకు సుద్యుమ్నుడు అరణ్యాలకు పోగా, వైవస్వతమనువు సంతానంకోసం దుఃఖిస్తూ యమునానదీ తీరంలో విష్ణువునుగూర్చి నూరేండ్లు తపస్సు చేశాడు. అపుడు హరి అతనికి ఇక్ష్యాకుడు మొదలైన పదిమందికొడుకులను అనుగ్రహించాడు. వారిలో పృషధ్రుడనేవాడు గురువు ఆజ్ఞమేరకు ధర్మాల్ని పాటిస్తూ ఆవులమందను కాచేవాడు. ఒకరోజు అర్ధరాత్రి దట్టమైన మేఘాలు కమ్ముకొని జడివాన కురవసాగింది. అతడు ఆవులన్నింటిని ఒకచోట చేర్చి, క్రూరమృగాల బారిన పడకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాడు.
కమ్ముకొన్న చీకట్లో ఒక పెద్దపులి మెల్లగా ఒదిగి ఒదిగి ఉన్నట్లుండి పైకెగిరి ఆకస్మికంగా మందలోని ఒక ఆవును అది భయంతో అరుస్తూ ఉండగా పట్టుకొనింది.
పెద్దపులి గాలి సోకి గుంపుగా ఉన్న ఆవులన్నీ బెదరి లేచి ఒక్కసారిగా అంబా అని అరుస్తూ చెల్లాచెదరుగా పరుగుతీశాయి.
పృషధ్రుడు ఆ చీకట్లో కనబడక కత్తిని చేతపూని పెద్దపులి అనుకొని ఒక పుల్లావు తలను నరికి, తెగలేదనుకొని మళ్లీ తెగవేసి దారిలో ఖడ్గరక్తాన్ని చేతితో తుడుస్తూ, దగ్గరికి చేరి, తల తెగిపడిన ఆవును చూశాడు.
తల నరుకబడిన ఆవును చూచి దుఃఖీతుడైన పృషధ్రుని కులగురువు వసిష్ఠుడు చూచి కోపంతో ఈ నేరంచేత నీవు రాచరికానికి దూరమై శూద్రుడవవుతావు అని శపించాడు. అతడు కూడ చేతులు జోడించి గురుదయతో, అనుమతితో
సర్వాత్మకుడైన హరియందును, ఇతరునియందును భక్తితాత్పర్యాలను ప్రదర్శించాడు. ఊర్ధ్వరేతస్కుడై, ప్రాణులకు ఇష్టుడై, ఇంద్రియప్రవృత్తికి దూరుడై, విషయసాంగత్యంమాని, ప్రశాంతుడై దేనినీ స్వీకరించక, తానై దేనినీ కోరక, లభించినదానితో బ్రతుకుతూ, ఆత్మావలోకనంతో కృతార్థుడై మందునివలె, గ్రుడ్డివలె, చెవిటివలె నేల నాలుగు చెరగుల తిరిగి చివరకు అడవులకు వెళ్ళి కార్చిచ్చులో పడి పరబ్రహ్మంలో లీనమయ్యడు.
(పులిగా భావించి గోహత్య చెయ్యడంతోను, వసిష్ఠుని శాపంవల్ల వైరాగ్యం చెందిన పృషద్రుడు నిర్లిప్తుడై జీవిస్తూ, చివరకు శాపఫలం పొందకుండానే మోక్షం పొందడం అనేది చాల విశేషం. ఎలాంటి కర్మపరిపాకాలనైనా సాధనలవల్ల పోగొట్టుకోవచ్చు.)
మనువుకొడుకుల్లో చివరివాడైన కవి ఇంటినీ, రాజ్యాన్నీ వదలి చుట్టాలతో అడవికి పోయి, భగవంతుడైన హరిని పవిత్రమైన మనసుతో ధ్యానించి మోక్షాన్ని పొందాడు.
కరూశుడనే మనువు కొడుకువల్ల కారూశులనే రాజులు కలిగారు. వారు ధర్మప్రియులు, బ్రాహ్మణప్రియులై ఉత్తర దిక్కులోని భూములకు రక్షకులైనారు. దృష్టునివల్ల ధార్ష్టమనే వంశం కలిగి బ్రహ్మజ్ఞానసంపన్నతతో భూతలంలో ప్రసిద్ధి పొందింది. నృగుని వంశంలో సుమతి, అతనికి భూతజ్యోతి, అతనికి వసువు, అతనికి ప్రతీతుడు, అతనికి ఓఘవంతుడు కలిగారు. ఓఘవంతుని కుమార్తె ఓఘవతిని సుదర్శనుడు వివాహమాడాడు. నరిష్యంతుడనే మనువు కొడుక్కి చిత్రసేనుడు, ఆ రాజుకు దక్షుడు, ఆ పుణ్యాత్మునికి మీఢ్వాంసుడు, ఆ సజ్జనునికి శర్వుడు, ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు, ఆ రాజుకు వీతిహోత్రుడు, ఆ బుద్ధిమంతునికి సత్యవ్రతుడు, ఆ మహానుభావునికి ఉరుశ్రవుడు, ఆ వీరునికి దేవదత్తుడు, ఆ పండితునికి అగ్నివేశుడు జన్మించారు. అగ్నివేశుడు కానీనుడనే ప్రసిద్ధితో జాతకర్ణుడనే మహర్షిగా వెలిశాడు. అతని పేరు మీద 'ఆగ్నివేశ్యాయన' మనే బ్రాహ్మణవంశం ఏర్పడింది.
(ఈ వచనంలో కరూశుడు, ధృష్టుడు, నృగుడు, నరిష్యంతుడు అనే మనువుకుమారుల వంశాలు చెప్పబడ్డాయి. నరిష్యంతునివంశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి విశేషణం చెప్పబడింది. అంటే ఆ వంశం అన్ని ఉత్తమగుణాలతో విరాజిల్లిందనుకోవాలి.)
ఓ రాజశ్రేష్ఠుడా! నరిష్యంతుని వంశాన్ని గూర్చి నీకు చెప్పాను. ఇప్పుడు దిష్టుని వంశాన్ని గురించి స్పష్టంగా చెప్తాను. గ్రహించు.
దిష్టుని కొడుకు నాభాగుడనేవాడు కర్మవశాత్తు వైశ్యత్వాన్ని పొందాడు. ఆ నాభాగునికి హలంధనుడు కలిగాడు. అతనికి వత్సప్రీతి. అతనికి ప్రాంశువు, అతనికి ప్రమితి, అతనికి ఖమిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతడికి వివింశతి, అతనికి రంభుడు, అతనికి ధర్మాత్ముడైన ఖనినేత్రుడు, అతనికి కరంధనుడు, అతనికి అవిక్షిత్తు, అతనికి మరుత్తుడు జన్మించారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతడి చరిత్ర విను.
ఓ రాజా! ఆ మరుత్తుని యాగానికి అంగిరసునికొడుకు మహాయోగియైన సంవర్తుడు నిర్వహణ వహించాడు. దానిని పరివేష్టించినవారు మరుత్తులు. విశ్వేదేవతలు సదస్యులు. అతడు అధికదక్షిణలతో బ్రాహ్మణ సమూహాన్ని తృప్తిపరచాడు. దేవేంద్రుడు సోమపానంచేత తృప్తుడై, యాగద్రవ్యాల్ని సువర్ణమయం చేశాడు. ఈ విధంగా ఆ మరుత్తుడు చేసినట్లు ధైర్యం, త్యాగం, తెగింపు కలిగి యాగం చేసినవారిని సర్వలోకాల్లో ఎక్కడా చూడము.
యజ్ఞకార్యం చేత ప్రసిద్ధి పొందిన ఆ మరుత్తుకు దముడనేవాడు, అతనికి రాజవర్ధనుడు. అతనికి సుధృతి, అతనికి సౌదృతేయుడు, అతనికి కేవలుడు, అతనికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, అతనికి బంధుడు, అతనికి తృణబిందుడు అనే వాళ్లు కలిగారు. అపుడు
అప్పరస స్త్రీయైన అలంబుస తృణబిందుణ్ణి చూచి ఇష్టపడి చివరకు మన్మథ బాణాలమంటలచేత మోహావేశంతో సమీపించి అతణ్ణి పొందింది.
ఆ దంపతులకు ఇలబిల అనే కూతురు పుట్టింది. ఆమెను విశ్రవసుడు భార్యగా పొందగా, ఐలబిలుడనే పేరుగల కుబేరుడు పుట్టాడు. అంతేగాక ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధూమకేతుడనబడే ముగ్గురుకొడుకులు కలిగారు. వీరిలో విశాలుడు వంశాభివృద్ధికరుడై వైశాలి అనే నగరాన్ని నిర్మించాడు. ఈయనకు హేమచంద్రుడు, అతనికి ధూమ్రాక్షుడు, అతనికి సహదేవుడు, ఆ బలశాలికి కృశాశ్వుడు, అతనికి సోమదత్తుడు జన్మించారు. ఆ సోమదత్తుడు
దేవేంద్రుడు ప్రశంసించేటట్లు ఆ సోమదత్తుడు అశ్వమేధయాగం చేసి సద్గతికి వెళ్లాడు. అతని కొడుకు సుమతికి జనమేజయుడనే కొడుకు కలిగాడు.
పై చెప్పబడిన వారంతా వైశాలురు అనే పేరుతో ప్రసిద్ధిపొంది, తృణబిందుని కీర్తిని వ్యాపింపజేసి రాజ్యపాలన చేశారు మరియు
బ్రహ్మతత్పరుడైన మనువుకు శర్యాతి అనే రాజు జన్మించాడు. అతడు అంగిరసుని యజ్ఞంలో రెండవనాడు చేయవలసిన కర్మకాండను ఏర్పరచాడు. అతని కుమార్తె సుకన్య ఒకరోజు తండ్రితోపాటు అరణ్యానికి వెళ్ళింది. అక్కడ చ్యవనమహర్షి ఆశ్రమానికి వెళ్ళి చెలికత్తెలతో పూలూపండ్లు కోయటానికి తిరుగుతూ ఒక పుట్టలో వెలుగుతున్నరెండుజ్యోతులను చూచి, దైవఘటన చేత చాపల్యంతో తెలివి తక్కువగా వాటిని మిణుగురుపురుగుల జంట అనుకొని పదునైన ముల్లుతో గుచ్చింది.
(తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే! తెలియక అగ్గిని తాకితే కాలకమానదు.)
ఓ రాజా! పుట్టలో ఉన్న ఆ జ్యోతుల్ని ముల్గుతో గుచ్చగా ఆ పుట్టరంధ్రాలనుండి రక్తం కారింది. ఆ వెంటనే అక్కడనున్న రాజభటులందరికి మలమూత్రాలు స్తంభించిపోయాయి.
ఆ రాజభటుల్ని చూచి రాజర్షియైన శర్యాతి వారిస్థితికి ఆశ్చర్యపడి 'మీరు ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం చేసి ఉంటారు. కాబట్టి ఈ స్తంభనం కలిగింది. అని అంటుండగా కుమార్తె తండ్రితో ఇట్లా అంది.
తండ్రీ! ఈ పుట్ట దగ్గర ఆడుకుంటూ ఇందులోని రెండు వెలుగుల్ని చూచి ముల్లుతో పొడవగా నెత్తురు కారింది. ఎందుకు జరిగిందో తెలుసుకో.
(సుకన్య తానుచేసిన పనిని దాచుకోలేదు. తండ్రితో తెలిపింది. తప్పిదానికి దండన అనుభవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తూ ఉంది.)
అని కుమార్తె చెప్పగా శర్యాతి భయపడి ఆమెను వెంటబెట్టుకొని పుట్టదగ్గరకు వచ్చి అందులో తపస్సు చేస్తున్న చ్యవనుని చూచి, తన నేర్పరితనంతో అతనిని ప్రసన్నునిగా చేసుకొని, ఆ మునిఅభిప్రాయం తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేసి ఎట్లో తుదకు ప్రమాదం తప్పించుకొని మునివద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. తరువాత
పిమ్మట ఆ సుకన్యక మిక్కిలికోపిష్ఠుడైన భర్త చ్యవనుని చేరి, మెచ్చుకొనేటట్లు పనులు చేస్తూ కొన్నేండ్లు కాపురం చేసింది.
(సుకన్యది చాల విచిత్రపరిస్థితి. తాను తెలియక అపరాధం చేసింది. తండ్రిఆజ్ఞచే చ్యవనుణ్ణి భర్తగా పొందింది. భర్త మహాకోపిష్ఠి అతడు మెచ్చేటట్లు పనులు చేయడం చాలా కష్టం. తాను రాజకుమార్తె. కాని ఆమె అతని మెప్పును పొందింది అనటంలో ఆమె వ్యక్తిత్వ ఉదాత్తతను కవి ఆవిష్కరించాడు.)
అట్లుండగా ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులయిన అశ్వినీ దేవతలు వచ్చారు. వారిని గౌరవించి చ్యవనుడు తన ముసలి తనాన్ని చూపించి ఇట్లన్నాడు. మీకు యజ్ఞభాగంగా లేని సోమపానాన్ని నేను కల్పించి ఇస్తాను. సోమపానసమయంలో పానపాత్రను మీకు అందిస్తాను. ప్రత్యుపకారంగా నా ముసలితనాన్ని పోగొట్టండి అని ఇంకా ఇలా అన్నాడు.
దేవేంద్ర వైద్యులారా! అందమైన ప్రాయంతో, జవరాండ్రను కరగించే శరీర సౌందర్యాన్ని శుభకరంగా నాకు అనుగ్రహించండి మిమ్మల్ని దీవిస్తాను.
అలా అన్న చ్యవనునితో అశ్వినీదేవతలు సంతోషించి సిద్ధులచేత నిర్మింపబడిన ఈ మడుగులో మునుగుమని చెప్పి
ముసలి ముని అయిన చ్యవనుణ్ణి అశ్వినీదేవతలు పూనికతో ఎత్తుకొని పోయి, ఆ మడుగులో మునిగి లేచారు. స్త్రీ జనాన్ని ఆకర్షించే సౌందర్యవంతులు, అదృష్టవంతులుగా మారారు. తామరపూల హారాలతో, బంగారు చెవిపోగులతో, మంచి బట్టలతో, సూర్యునివలె కాంతిగలిగి ఒకే విధంగా ఉన్న ఆ ముగ్గురినీ చూచి అమాయకురాలైన సుకన్య వారిలో తన భర్తను కనిపెట్టలేకపోయింది. పతివ్రత అయిన ఆమె తన భర్తను తెలుసుకోవాలని 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తను చూపించండి' అంటూ అశ్వినీదేవతలకు మొక్కింది.
అశ్వినీదేవతలు పతివ్రతయైన సుకన్యక సత్యశీలానికి మెచ్చి, యౌవనరూపంతో ఉన్న చ్యవనుని చూపించి, ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని విమానమెక్కి దేవతల నగరమైన అమరావతికి వెళ్ళారు. పిమ్మట
శర్యాతి యాగం చేయటానికి, కూతుర్నీ అల్లుణ్ణీ ఆహ్వానించి తీసుకెళ్ళే ఉద్దేశంతో చ్యవనమహర్షి ఆశ్రమానికి వచ్చాడు. తన కుమార్తె ప్రక్కన సూర్యతేజస్సుతో ప్రకాశించే పురుషుణ్ణి చూచి తనలో 'వీడెవడో ఈమె భర్తకాదు, ఆశ్చర్యం!' అనుకొని కూతురిమాట, ఆమె చేసే గౌరవాలు ఇష్టపడక, ఆశీర్వదించటానికి అసహ్యపడి ఇట్లన్నాడు. చ్యవనమహర్షి గొప్పవాడు, మునిజనాల్లో శ్రేష్ఠుడు, లోకంచేత కీర్తింపబడేవాడు, ఎక్కడకు వెళ్ళాడు? ఆయన ఎలా మోసగించబడ్దాడు? నీ పక్కనున్న వీడెవడు?
అమ్మాయీ! నీకీపని న్యాయమేనా? ధర్మమేనా? శీలవంతుల లక్షణమేనా? సత్కులంలో పుట్టి గర్వించి సంతోషం కోసం జగత్తుచే పూజింపబడేవాడు, పుణ్యాత్ముడు, తపస్వి, సాధ్విమనసుకు నచ్చేవాడు అయిన భర్తను వదలి, విటుణ్ణి పొందడం న్యాయమా? అభిమానం పాటించనక్కరలేదా? తండ్రిని, భర్తను నరకానికి తోసేశావు కదా!
అమ్మాయీ! మగడు ప్రాయపువాడైతే కొంతవరకైనా భార్యను కాపాడుకోగలడు. ముసలిముని ప్రయత్నపూర్వకంగానైనా భార్యను అదుపులో ఉంచగలడా? ఎక్కడైనా పడుచు పిల్లను ముసలివానికి కట్టబెట్ట కూడదు.
పరమపతివ్రతాలలామ అయిన ఆ సుకన్యక చిరునవ్వు చెక్కిళ్లపై తొణికిసలాడుతుండగా తండ్రితో ఇలా అంది.
'ఓ తండ్రీ! ఇతడు నీ అల్లుడైన భార్గవుడేకాని విటుడు కాదు. సంతోషంతో నీవు కూడ ఈయనతో చుట్టరికాన్ని పాటించుము' అని తండ్రికి జరిగినదంతా చెప్పింది.
శర్వాతి సంతోషంతో కూతురిని చేరదీసి ఆదరంతో 'సౌభాగ్యవతివి కమ్మ'ని దీవించాడు. అప్పుడు చ్యవనుడు భార్యతో పాటు వెళ్ళి 'మామకు యాగం చేయించి, ఒక పాత్రలో సోమరసాన్ని పోసి' తన తపశ్శక్తితో అశ్వినీ దేవతలకిచ్చాడు. దాన్ని చూచి
(1. మాంగల్యం 2. పసుపు కుంకుమ 3. గాజులు 4. చెవ్వాకు 5. మెట్టెలు. ఈ అయిదు వస్తువులు ముత్తైదువ మాత్రమే ధరిస్తుంది. అందుకనే ఆమెను అయిదువ అంటారు.)
దేవేంద్రుడు కోపంతో మునిపైకి వజ్రాయుధమెత్తగా ఆశ్చర్యకరంగా ముని దాన్ని అతని భుజం మీదే కదలకుండా నిలబెట్టాడు.
ఈ విధంగా అశ్వనీ దేవతలు దేవతావైద్యులైకూడా సోమభాగం లేనివారైనా, చ్యవన మహర్షి ప్రభావంవల్ల యజ్ఞభాగం పొందగలిగి వెళ్ళారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్హుడు, భూరిషేణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో
వారిలో ఆనర్హుడికి రైవతుడు పుట్టాడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి, ఆనర్తము మొదలైన దేశాలను పెంపుతో పాలించాడు. అతడు కకుద్మివంటి శ్రేష్ఠులైన వందమంది కొడుకుల్ని కన్నాడు. కీర్తిమంతుడైన రైవతుడు తన కుమార్తె రేవతిని బ్రహ్మకు చూపించి తగిన వరుణ్ణి అడగాలనుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మకొలువులో గంధర్వులు కిన్నరులు ఆడుతూ పాడుతూ ఉండడంవల్ల దర్శించే సమయంకోసం ఒక్కక్షణంపాటు నిలబడ్డాడు.
అంతట దర్శించే సమయం కలుగగా, బ్రహ్మకు నమస్కరించి రైవతుడు రేవతిని చూపించి ఇట్లా అన్నాడు.
అమాయకురాలు, అందకత్తె, ప్రాయంలో ఉన్న ఈ మంచి మనస్సున్న అమ్మాయికి భర్తఎవడో? సెలవివ్వండి అన్నాడు రైవతుడు. బ్రహ్మ మనోదృష్టితో పరికించి పక పక నవ్వి ఇలా అన్నాడు.
'ఓ రాజా! ఈమె కోసం మనసులో భావించిన వాళ్ళందరూ కాలంతోపాటు చెల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళకొడుకులు, మనుమలు ఎవ్వరూ లేరు; గతించారు. భూమిమీద వాళ్ల గోత్రాలపేర్లు కూడ వినబడవు. నీవు వచ్చిన ఈ లోపలే ఇరవై ఏడు పర్యాయాలు నాలుగుయుగాలు వరుసగా గడచిపోయాయి. కాబట్టి నీవిపుడే భూలోకానికి వెళ్లు. దేవదేవుడు సర్వభూతాత్మకుడు అయిన నారాయణుడు భూభారాన్ని పోగొట్టడానికి తన అంశతో బలరాముడుగా అవతరించాడు. నీవు ఈ కన్యారత్నాన్ని ఆయన కివ్వు' అని అన్నాడు.
(బ్రహ్మలోకంలో ఒక్క క్షణకాలం - భూలోకంలో ఇరవైఏడు మహాయుగాలు గడచిన దానితో సమానం)
ఇట్లా ఆనతియ్యగా బ్రహ్మకు రైవతుడు నమస్కరించి భూలోకానికి వచ్చాడు. ఆయన తనసోదరులు, స్వజనులులేని తన నగరానికి వచ్చాడు. బలదేవుని చూచి రేవతీకన్యను అయనకిచ్చి పెళ్ళిచేసి నారాయణుని ఆశ్రమముండే బదరికావనానికి నియమబద్ధమైన తపస్సు చేయటం కోసం వెళ్ళాడు.
ఓ రాజా! నభగుడనే మనువుకు బుద్ధిమంతుడైన నాభాగుడు జన్మించాడు. అతని సోదరులు యజమానులుగా జీవించడంకోసం నాభాగుని ఆస్తిని పంచుకొన్నారు.
బ్రహ్మచారియైన నాభాగుడు తనసోదరులను తండ్రిఆస్తిలో భాగమడిగాడు. వారు తండ్రి చెప్పేపద్ధతిలో ఇస్తామన్నారు. నాభాగుడు తండ్రి దగ్గరకు వెళ్ళి సంపదను భాగాలు చేయమన్నాడు. అపుడు తండ్రి “ఇక్కడ దగ్గరలో అంగిరసులు సత్త్రయాగం చేస్తున్నారు. వారు గొప్పజ్ఞానులే అయినా ఆరవరోజు యాగంలో చేయవలసిన కర్మకాండ మనసుకు రాక మూఢులవుతారు. అపుడు నీవు వారిదగ్గరకువెళ్ళి వైశ్యదేవసూక్తాలను రెండింటిని చెప్తే కవి అని అందరూ అంటారు. యాగం పూర్తియై వారు స్వర్గానికి వెళ్తూ యాగంలో మిగిలిన సంపదనంతా నీకిస్తారు” అని చెప్పాడు. నాభాగుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పినట్లు చేశాడు. అంగిరసులు యాగంలో మిగిలిన ధనాన్ని నాభాగునికిచ్చి స్వర్గానికి వెళ్ళారు. అపుడు
అంగిరసులిచ్చే బంగారం నాభాగునికి శుభప్రదంగా చేరే సమయంలో, పొడగరి, నల్లనివాడు అయిన ఒకడు రాజును ఆపి ముందు నిలబడి దాన్ని తీసుకొన్నాడు.
నాభాగుడు వాణ్ణి చూచి మునులు ఇవ్వడంవల్ల అది తనకు చెందవలసిన ధనమని చెప్పాడు. అప్పుడు ఆ మహాపురుషుడు “మీ తండ్రి చెప్పిన రీతిగా చేయడమే తగి ఉంటుంది” అన్నాడు. నాభాగుడు తండ్రిని అడగ్గా అతడు “పూర్వం ఋషులు యజ్ఞశాలలో మిగిలినధనం శివునకే చెందుతుందని తీర్మానించారు. కాబట్టి ఈ ధనానికి ఆ దేవుడే అర్హుడు. అని చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునికి నమస్కరించి ఓ దేవా! ఈ ధనం నీకే చెందుతుందని మా తండ్రి చెప్పాడు. నేను దోషం చేశాను. మన్నించండి అన్నాడు. ఆ దేవుడు తండ్రితీర్పునకు, కొడుకునిజాయితికి మెచ్చుకొని నీవు నిజమే పలికావు. కాబట్టి యాగంలో మిగిలిన ద్రవ్యం నీకే ఇస్తున్నాను అని నాభాగునికి ఆత్మదర్శనాన్ని సనాతన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అంతర్ధానం చెందాడు.
లోకంలో నాభాగుని కథను ఉదయం సాయంత్రం వేళలలో చిత్తశుద్ధితో స్మరించినంతనే నరుడు పండితుడవుతాడు, మంత్రజ్ఞుడవుతాడు. మోక్షాన్ని పొందుతాడు.
అట్టి నాభాగునికి అంబరీషుడు జన్మించాడు. ఆతనిపట్ల లోకంలో ఎదురులేని బ్రాహ్మణశాపం వ్యర్థమైపోయింది. అని శుకుడు చెప్పగా “ఏ కారణంచేత జవదాటరాని బ్రాహ్మణదండన అతణ్ణి ఏమీ చేయలేక పోయింది?” అని రాజు అడిగాడు. అప్పుడు శుకుడు రాజుతో ఇలా అన్నాడు.
(నాభాగుని ఉదాత్త వృత్తాంతం చెప్పడం వెనుక ఉన్న కారణం మహాభక్త శిఖామణియైన అంబరీషుని భక్తితత్త్వానికి వేదిక నిర్మించటమే.)
ఓ మహారాజా! ఈ మనువువంశాన్నిగురించి చక్కగా వివరించి చెప్పటానికి లక్షసంవత్సరాలైనా సరిపోదు. కాని అంత సమయం తీసుకోకుండా త్వరగా నాకు తెలిసినంతవరకు నీకు వివరిస్తాను. విను.
భగవానుడు ఎక్కువ తక్కువ పొడవులకు అతీతమైనవాడు అంటే రూపరహితుడు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా నాశనమైనా విశ్వరూపుడు కావడంచేత తానొక్కడే ఆశ్చర్యకరంగా మిగులుతాడు.
ఓ పరీక్షిన్మహారాజా! కల్పాంతంలో నిల్చిన ఆ దివ్యపురుషునినాభినుండి బంగారుకమలం ఉద్భవించింది. ఆ కమలంలో స్వయంభువై బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మమనసునుండి మరీచి జన్మించాడు. అతనికి కశ్యపుడు, కశ్యపునికి దక్షునికూతురైన అదితికి సూర్యుడు, అతనికీ సంజ్ఞకు మనువైన శ్రాద్ధదేవుడు, ఆ మనువుకు శ్రద్ధకు శుభకీర్తి కలిగిన పదిమందికుమారులు కలిగారు.
శ్రాద్ధదేవుడనే మనువుకు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి అనే పదిమంది కొడుకులు కలిగారు. వీరు జన్మించటానికి పూర్వం మనువు కొడుకులు లేనివాడై యజ్ఞదేవతలైన మిత్రావరుణులను గూర్చి
మనువు సంతానంకోసం యజ్ఞాన్ని చేస్తుండగా, అతనిభార్య హోతతో 'నాకు యజ్ఞఫలంగా కుమార్తె కలిగేటట్లు యజ్ఞాన్ని చేయి అని పల్కి' భక్తితో క్షీరవ్రతాన్ని చేసింది. ఆమె చెప్పినట్లుగా అధ్వర్యుడు హోతతో 'ఆమెకోరినట్లే చెప్పి వేల్చు' అని అన్నాడు. అతడు హవిస్సును చేబూని 'కూతురు కలుగుగాక' అని సంకల్పం చెప్తూ వేల్చాడు. హోత వ్యతిరేక చేష్టవల్ల 'ఇల' అనే స్త్రీ పుట్టింది. దానిని చూచి మనువు తీవ్రమనస్తాపం పొంది, అయ్యో! పుత్రసంతానం మంచిది కదా కూతురెందుకని అనుకొంటూ వసిష్ఠునిదగ్ధరకు పరుగుతీశాడు.
పైన చెప్పబడినట్లు తన అసంతృప్తిని తనలోనే అణచుకొని, వసిష్ఠునిదగ్గరకు వెళ్ళి ఆయనతో ఇలా మొర పెట్టుకొన్నాడు.
అయ్యా! కొడుకులు కలగాలని నేను ఈ యజ్ఞాన్ని మీ అనుజ్ఞతో చేస్తే ఈ కుమార్తె ఎందుకు కలిగింది? మీ బోటి వారిశక్తికి హద్దు ఉండదుగదా!
“అదీగాక మీరు బ్రహ్మవాదులు. మంత్రవాదులు. పాపం అంటకుండా చూచేవారు. కాని జరిగింది మాత్రం వేరుగా ఉంది” అని అన్నాడు. అపుడు మా ముత్తాతయైన వసిష్ఠుడు అకార్యంవల్ల జరిగినవిషయాన్ని గ్రహించి, మనువుతో ఇలా అన్నాడు.
ఓ రాజా! హోత మోసం చేయడంవల్ల యాగఉద్దేశానికి వ్యతిరేకంగా కూతురు కలిగింది. అయినా నీవు మెచ్చుకొనేటట్లు నీకు కొడుకును ప్రసాదిస్తాను. నా కౌశలాన్ని బలాన్ని చూడు.
(యజమాని చేసే యాగఉద్దేశానికి అనుకూలంగా హోత వషట్కారం చెప్పాలి. తద్విరుద్ధంగా చెప్పడం కల్లతనమే. కాని ఒకసారి పుట్టిన ఆడశిశువును మగవాడుగా మార్చడం అద్భుతమైన విషయమే. దాన్ని సాధించటానికి నేర్పు, శక్తి కావాలి. అదే జరిగితే రాజు మెచ్చుకోకుండా ఎట్లుంటాడు? అలామారిన కొడుకు 'ప్రియాత్మజుడు' కాకుండా ఎట్లుంటాడు? అనే విషయాలు ద్యోతక మవుతాయి.
రాజుతో పైవిధంగా పలికి భగవానుడైన వసిష్ఠమహర్షి కీర్తియందాసక్తితో మనువుకుమార్తె పురుషత్వంకోసం ఏకాగ్రతతో ఆదిపురుషుడైన విష్ణువును స్తుతించగా, ఆ స్వామి మెచ్చుకొని, ఆ మహర్షి కోరిన వరాన్ని ప్రసాదించాడు. ఆ కారణంచేత ఇలా పుత్రిక సుద్యుమ్నుడనే పేరుతో కొడుకై రాజ్యపాలనం చేస్తూవుండగా
(లోకంలో సంతానం భగవన్నిర్ణయం. అసంతృప్తడైన మనువు మహర్షికి తన దుఃఖాన్ని చెప్పుకొన్నాడు. కాని కొడుకును ప్రసాదించమని అడగలేదు. కాని అద్భుతంగా వసిష్ఠుడు కూతురిని కొడుకుగా చేశాడు. కారణం కీర్తితత్పరత అని కవే చెప్పాడు. గహనమైన విషయం సాధించటంవల్ల కలిగే కీర్తియా? లేక లోకకల్యాణకారకమైన కీర్తియా? రెండోది సరైందని భావించాలి.)
సుద్యుమ్నుడనే ఆ రాజు ఒకరోజు కొందరు మంత్రులు వెంటరాగా, మేలుజాతి గుర్రాన్నెక్కి సొగసైన వింటిని, వాడియైన బాణాలను ధరించి, దట్టమైన అరణ్యాల వెంబడి పెద్దమృగాలను వేటాడుతూ మేరుపర్వతసమీపంలోని కుమారవనాన్ని ప్రవేశించాడు. అక్కడ పార్వతీపరమేశ్వరులు ఎప్పుడూ ఏకాంతవిహారం చేస్తుంటారు. ఆ వనంలో ప్రవేశించగానే రాజు స్త్రీ అయ్యాడు. అతని సేవకులుకూడా స్త్రీలుగా మారారు. ఆ రాజుగుర్రంసైతం ఆడుగుర్రంగా మారింది.
ఈ విధంగా ఆ వనప్రవేశంచేత పురుషత్వం కోల్పోయి, స్త్రీలై పరస్పరం ముఖాలు చూచుకొని దుఃఖీంచారు అని చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
'రాజు, ఆయన అనుచరులు ఆ వనంలో ప్రవేశించినంతనే స్త్రీలయ్యారని అన్నావు. ఏ కారణంచేత వాళ్లు స్త్రీలయ్యారు? లోకంలో ఇటువంటి దేశాన్ని గూర్చి ఎప్పుడూ వినలేదు. నా కుతూహలం తీరేటట్లు వివరించండి.
ఈ ఆశ్చర్యకరమైన విషయంతో బాటు మరొక విషయంకూడా.
పౌరుషవంతుడైన మానవుడు స్త్రీత్వం కోల్పోయి, మగవాడు కావడం బాగుండవచ్చుగాని; పేరుప్రతిష్ఠలకు భంగం కలిగేట్టుగా పురుషత్వం కోల్పోయి స్త్రీ కావడం బాగుంటుందా?
పై విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకమహర్షి ఇట్లన్నాడు.
చీకట్లను పారదోల గలిగిన తేజోవంతులైన కొందరు మునులు పరమేశ్వరుణ్ణి సందర్శించే కోరికతో, ఆ వనంలో ప్రవేశించారు. భర్తతొడలపై కూర్చున్న పార్వతీదేవి వారిని చూచి, సిగ్గుతో వస్త్రం ధరించింది. వారు 'పార్వతీ పరమేశ్వరులు ఏకాంతవిహారంలో ఉన్నారు. ఇది దర్శన సమయం కాదని' నరనారాయణులున్న బదరికావనానికి వెళ్లారు.
పై సన్నివేశకారణంగా పరమాత్ముడైన ఈశ్వరుడు పార్వతీదేవి వినోదాలకోసం ఇట్లా కట్టడిచేశాడు.
'ఈ ప్రదేశంలో ప్రవేశించేవాడు స్త్రీ అగుగాక' అన్న ఆ ఈశ్వరుని మాటచేత సుద్యుమ్నుడు స్త్రీగా మారి, ఆ అడవులలో తిరిగిన చోటే తిరుగుతూ ఉండినాడు.
ఈ విధంగా చెలికత్తెలతో స్త్రీరూపం పొందిన సుద్యుమ్నుడు రాజకుమార్తె హోయలతో స్త్రీ సొందర్యాన్ని వెదజల్లుతూ దైవయోగంచేత చంద్రునికొడుకు మహిమాన్వితుడైన బుధుని ఆశ్రమంలో తిరుగాడుతుండగా
(సుద్యుమ్నుడు ప్రథమంగా స్త్రీ. వసిష్ఠ మహర్షి తపశ్శక్తిచేత పురుషుడు. బుధునిఆశ్రమంలో తిరగడం దైవయోగం. రాచకూతురు చూపులతో స్త్రీభావాల్ని నెరపడం ప్రేరకం. ఇన్ని విషయాలు ఒక్కచోట చేర్చబడ్డాయి.)
పద్మదళనేత్ర అయిన ఆ స్త్రీ చంద్రునికొడుకైన బుధుణ్ణి చూచింది. అపుడే అతను కూడ ఆమెను చూచాడు. సరిగ్గా అదే సమయంలో దొంగవాడైన మన్మథుడు తొందరగా తన చిగురుటాకు కత్తిని తీసి, పరుగెత్తి వారిని కొట్టాడు.
ఈ విధంగా మన్మథుని బిగువైన చిగురాకు ఆయుధం తాకిడికి వారిరువురు రతివినోదాలలో మునిగారు. దాని ఫలితంగా వారికి పురూరవుడనే కొడుకు పుట్టాడు. ఈ విధంగా
మనువు కుమారుడైన సుద్యుమ్నుడు మరొకరికి ఆలుకావడంచేత కొడుకును గని, ఆ జీవితానికి విసిగి, దుఃఖంతో చింతిస్తూ గురువైన వసిష్ఠుణ్ణి తలచుకొన్నాడు. అలా తలచుకోగానే ఆ మహర్షి కూడా వచ్చాడు.
వసిష్ఠుడు ఆవిధంగా అక్కడికి వచ్చి సుద్యుమ్నుడు పురుషుడు కావటంకోసం పరమేశ్వరుణ్ణి సేవించగా ఈశ్వరుడు ఆతని శ్రమకు మెచ్చి ఇట్లన్నాడు.
తాను పూర్వం అన్నమాట వ్యర్థం కాకుండా, ఆ ముని సంతోషించేటట్లు శివుడు 'ఈ సుద్యుమ్నుడు ఒక నెలపురుషుడుగాను, మరో నెల స్త్రీ గాను ఉంటాడు. ఈ మార్పులతో జీవిస్తూ, రాజ్యాన్ని పాలిస్తాడు. వెళ్లు అనగా వసిష్ఠుడు సుద్యుమ్నుని దగ్గరకు వచ్చాడు. ఆ విధంగానే సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలిస్తూ
(పూర్వం విష్ణువు ఇచ్చిన వరానికి, ఇప్పుడు తాను(శివుడు) ఇచ్చిన శాపానికి భంగంరాకుండునట్లు సుద్యుమ్నుడు ఒకనెల పురుషుడుగా, మరోనెల స్త్రీగా ఉండునట్టూ, రాజ్యపాలన స్తంభించకుండా ఉండేటట్లు అనుగ్రహించాడు శివుడు.)
ఓ రాజా! గురువుదయవల్ల అతడు ఆ విధంగా స్త్రీత్వం పొంది, మరల పురుషుడవుతూ, ప్రజలు ఆనందిస్తుండగా భుజబలంతో భూమిని పాలించాడు.
ఆ సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగి ధర్మానురక్తులై ఉత్తరదిక్కులోని భూములకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు వృద్దుడయినందువల్ల, పురూరవునికి రాజ్యమిచ్చి, ప్రతిష్ఠానపురాన్ని విడిచి, వానప్రస్థానికి వెళ్ళాడు. ఆ విధంగా
ఈ విధంగా కొడుకు సుద్యుమ్నుడు అరణ్యాలకు పోగా, వైవస్వతమనువు సంతానంకోసం దుఃఖిస్తూ యమునానదీ తీరంలో విష్ణువునుగూర్చి నూరేండ్లు తపస్సు చేశాడు. అపుడు హరి అతనికి ఇక్ష్యాకుడు మొదలైన పదిమందికొడుకులను అనుగ్రహించాడు. వారిలో పృషధ్రుడనేవాడు గురువు ఆజ్ఞమేరకు ధర్మాల్ని పాటిస్తూ ఆవులమందను కాచేవాడు. ఒకరోజు అర్ధరాత్రి దట్టమైన మేఘాలు కమ్ముకొని జడివాన కురవసాగింది. అతడు ఆవులన్నింటిని ఒకచోట చేర్చి, క్రూరమృగాల బారిన పడకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాడు.
కమ్ముకొన్న చీకట్లో ఒక పెద్దపులి మెల్లగా ఒదిగి ఒదిగి ఉన్నట్లుండి పైకెగిరి ఆకస్మికంగా మందలోని ఒక ఆవును అది భయంతో అరుస్తూ ఉండగా పట్టుకొనింది.
పెద్దపులి గాలి సోకి గుంపుగా ఉన్న ఆవులన్నీ బెదరి లేచి ఒక్కసారిగా అంబా అని అరుస్తూ చెల్లాచెదరుగా పరుగుతీశాయి.
పృషధ్రుడు ఆ చీకట్లో కనబడక కత్తిని చేతపూని పెద్దపులి అనుకొని ఒక పుల్లావు తలను నరికి, తెగలేదనుకొని మళ్లీ తెగవేసి దారిలో ఖడ్గరక్తాన్ని చేతితో తుడుస్తూ, దగ్గరికి చేరి, తల తెగిపడిన ఆవును చూశాడు.
తల నరుకబడిన ఆవును చూచి దుఃఖీతుడైన పృషధ్రుని కులగురువు వసిష్ఠుడు చూచి కోపంతో ఈ నేరంచేత నీవు రాచరికానికి దూరమై శూద్రుడవవుతావు అని శపించాడు. అతడు కూడ చేతులు జోడించి గురుదయతో, అనుమతితో
సర్వాత్మకుడైన హరియందును, ఇతరునియందును భక్తితాత్పర్యాలను ప్రదర్శించాడు. ఊర్ధ్వరేతస్కుడై, ప్రాణులకు ఇష్టుడై, ఇంద్రియప్రవృత్తికి దూరుడై, విషయసాంగత్యంమాని, ప్రశాంతుడై దేనినీ స్వీకరించక, తానై దేనినీ కోరక, లభించినదానితో బ్రతుకుతూ, ఆత్మావలోకనంతో కృతార్థుడై మందునివలె, గ్రుడ్డివలె, చెవిటివలె నేల నాలుగు చెరగుల తిరిగి చివరకు అడవులకు వెళ్ళి కార్చిచ్చులో పడి పరబ్రహ్మంలో లీనమయ్యడు.
(పులిగా భావించి గోహత్య చెయ్యడంతోను, వసిష్ఠుని శాపంవల్ల వైరాగ్యం చెందిన పృషద్రుడు నిర్లిప్తుడై జీవిస్తూ, చివరకు శాపఫలం పొందకుండానే మోక్షం పొందడం అనేది చాల విశేషం. ఎలాంటి కర్మపరిపాకాలనైనా సాధనలవల్ల పోగొట్టుకోవచ్చు.)
మనువుకొడుకుల్లో చివరివాడైన కవి ఇంటినీ, రాజ్యాన్నీ వదలి చుట్టాలతో అడవికి పోయి, భగవంతుడైన హరిని పవిత్రమైన మనసుతో ధ్యానించి మోక్షాన్ని పొందాడు.
కరూశుడనే మనువు కొడుకువల్ల కారూశులనే రాజులు కలిగారు. వారు ధర్మప్రియులు, బ్రాహ్మణప్రియులై ఉత్తర దిక్కులోని భూములకు రక్షకులైనారు. దృష్టునివల్ల ధార్ష్టమనే వంశం కలిగి బ్రహ్మజ్ఞానసంపన్నతతో భూతలంలో ప్రసిద్ధి పొందింది. నృగుని వంశంలో సుమతి, అతనికి భూతజ్యోతి, అతనికి వసువు, అతనికి ప్రతీతుడు, అతనికి ఓఘవంతుడు కలిగారు. ఓఘవంతుని కుమార్తె ఓఘవతిని సుదర్శనుడు వివాహమాడాడు. నరిష్యంతుడనే మనువు కొడుక్కి చిత్రసేనుడు, ఆ రాజుకు దక్షుడు, ఆ పుణ్యాత్మునికి మీఢ్వాంసుడు, ఆ సజ్జనునికి శర్వుడు, ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు, ఆ రాజుకు వీతిహోత్రుడు, ఆ బుద్ధిమంతునికి సత్యవ్రతుడు, ఆ మహానుభావునికి ఉరుశ్రవుడు, ఆ వీరునికి దేవదత్తుడు, ఆ పండితునికి అగ్నివేశుడు జన్మించారు. అగ్నివేశుడు కానీనుడనే ప్రసిద్ధితో జాతకర్ణుడనే మహర్షిగా వెలిశాడు. అతని పేరు మీద 'ఆగ్నివేశ్యాయన' మనే బ్రాహ్మణవంశం ఏర్పడింది.
(ఈ వచనంలో కరూశుడు, ధృష్టుడు, నృగుడు, నరిష్యంతుడు అనే మనువుకుమారుల వంశాలు చెప్పబడ్డాయి. నరిష్యంతునివంశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి విశేషణం చెప్పబడింది. అంటే ఆ వంశం అన్ని ఉత్తమగుణాలతో విరాజిల్లిందనుకోవాలి.)
ఓ రాజశ్రేష్ఠుడా! నరిష్యంతుని వంశాన్ని గూర్చి నీకు చెప్పాను. ఇప్పుడు దిష్టుని వంశాన్ని గురించి స్పష్టంగా చెప్తాను. గ్రహించు.
దిష్టుని కొడుకు నాభాగుడనేవాడు కర్మవశాత్తు వైశ్యత్వాన్ని పొందాడు. ఆ నాభాగునికి హలంధనుడు కలిగాడు. అతనికి వత్సప్రీతి. అతనికి ప్రాంశువు, అతనికి ప్రమితి, అతనికి ఖమిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతడికి వివింశతి, అతనికి రంభుడు, అతనికి ధర్మాత్ముడైన ఖనినేత్రుడు, అతనికి కరంధనుడు, అతనికి అవిక్షిత్తు, అతనికి మరుత్తుడు జన్మించారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతడి చరిత్ర విను.
ఓ రాజా! ఆ మరుత్తుని యాగానికి అంగిరసునికొడుకు మహాయోగియైన సంవర్తుడు నిర్వహణ వహించాడు. దానిని పరివేష్టించినవారు మరుత్తులు. విశ్వేదేవతలు సదస్యులు. అతడు అధికదక్షిణలతో బ్రాహ్మణ సమూహాన్ని తృప్తిపరచాడు. దేవేంద్రుడు సోమపానంచేత తృప్తుడై, యాగద్రవ్యాల్ని సువర్ణమయం చేశాడు. ఈ విధంగా ఆ మరుత్తుడు చేసినట్లు ధైర్యం, త్యాగం, తెగింపు కలిగి యాగం చేసినవారిని సర్వలోకాల్లో ఎక్కడా చూడము.
యజ్ఞకార్యం చేత ప్రసిద్ధి పొందిన ఆ మరుత్తుకు దముడనేవాడు, అతనికి రాజవర్ధనుడు. అతనికి సుధృతి, అతనికి సౌదృతేయుడు, అతనికి కేవలుడు, అతనికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, అతనికి బంధుడు, అతనికి తృణబిందుడు అనే వాళ్లు కలిగారు. అపుడు
అప్పరస స్త్రీయైన అలంబుస తృణబిందుణ్ణి చూచి ఇష్టపడి చివరకు మన్మథ బాణాలమంటలచేత మోహావేశంతో సమీపించి అతణ్ణి పొందింది.
ఆ దంపతులకు ఇలబిల అనే కూతురు పుట్టింది. ఆమెను విశ్రవసుడు భార్యగా పొందగా, ఐలబిలుడనే పేరుగల కుబేరుడు పుట్టాడు. అంతేగాక ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధూమకేతుడనబడే ముగ్గురుకొడుకులు కలిగారు. వీరిలో విశాలుడు వంశాభివృద్ధికరుడై వైశాలి అనే నగరాన్ని నిర్మించాడు. ఈయనకు హేమచంద్రుడు, అతనికి ధూమ్రాక్షుడు, అతనికి సహదేవుడు, ఆ బలశాలికి కృశాశ్వుడు, అతనికి సోమదత్తుడు జన్మించారు. ఆ సోమదత్తుడు
దేవేంద్రుడు ప్రశంసించేటట్లు ఆ సోమదత్తుడు అశ్వమేధయాగం చేసి సద్గతికి వెళ్లాడు. అతని కొడుకు సుమతికి జనమేజయుడనే కొడుకు కలిగాడు.
పై చెప్పబడిన వారంతా వైశాలురు అనే పేరుతో ప్రసిద్ధిపొంది, తృణబిందుని కీర్తిని వ్యాపింపజేసి రాజ్యపాలన చేశారు మరియు
బ్రహ్మతత్పరుడైన మనువుకు శర్యాతి అనే రాజు జన్మించాడు. అతడు అంగిరసుని యజ్ఞంలో రెండవనాడు చేయవలసిన కర్మకాండను ఏర్పరచాడు. అతని కుమార్తె సుకన్య ఒకరోజు తండ్రితోపాటు అరణ్యానికి వెళ్ళింది. అక్కడ చ్యవనమహర్షి ఆశ్రమానికి వెళ్ళి చెలికత్తెలతో పూలూపండ్లు కోయటానికి తిరుగుతూ ఒక పుట్టలో వెలుగుతున్నరెండుజ్యోతులను చూచి, దైవఘటన చేత చాపల్యంతో తెలివి తక్కువగా వాటిని మిణుగురుపురుగుల జంట అనుకొని పదునైన ముల్లుతో గుచ్చింది.
(తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే! తెలియక అగ్గిని తాకితే కాలకమానదు.)
ఓ రాజా! పుట్టలో ఉన్న ఆ జ్యోతుల్ని ముల్గుతో గుచ్చగా ఆ పుట్టరంధ్రాలనుండి రక్తం కారింది. ఆ వెంటనే అక్కడనున్న రాజభటులందరికి మలమూత్రాలు స్తంభించిపోయాయి.
ఆ రాజభటుల్ని చూచి రాజర్షియైన శర్యాతి వారిస్థితికి ఆశ్చర్యపడి 'మీరు ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం చేసి ఉంటారు. కాబట్టి ఈ స్తంభనం కలిగింది. అని అంటుండగా కుమార్తె తండ్రితో ఇట్లా అంది.
తండ్రీ! ఈ పుట్ట దగ్గర ఆడుకుంటూ ఇందులోని రెండు వెలుగుల్ని చూచి ముల్లుతో పొడవగా నెత్తురు కారింది. ఎందుకు జరిగిందో తెలుసుకో.
(సుకన్య తానుచేసిన పనిని దాచుకోలేదు. తండ్రితో తెలిపింది. తప్పిదానికి దండన అనుభవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తూ ఉంది.)
అని కుమార్తె చెప్పగా శర్యాతి భయపడి ఆమెను వెంటబెట్టుకొని పుట్టదగ్గరకు వచ్చి అందులో తపస్సు చేస్తున్న చ్యవనుని చూచి, తన నేర్పరితనంతో అతనిని ప్రసన్నునిగా చేసుకొని, ఆ మునిఅభిప్రాయం తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేసి ఎట్లో తుదకు ప్రమాదం తప్పించుకొని మునివద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. తరువాత
పిమ్మట ఆ సుకన్యక మిక్కిలికోపిష్ఠుడైన భర్త చ్యవనుని చేరి, మెచ్చుకొనేటట్లు పనులు చేస్తూ కొన్నేండ్లు కాపురం చేసింది.
(సుకన్యది చాల విచిత్రపరిస్థితి. తాను తెలియక అపరాధం చేసింది. తండ్రిఆజ్ఞచే చ్యవనుణ్ణి భర్తగా పొందింది. భర్త మహాకోపిష్ఠి అతడు మెచ్చేటట్లు పనులు చేయడం చాలా కష్టం. తాను రాజకుమార్తె. కాని ఆమె అతని మెప్పును పొందింది అనటంలో ఆమె వ్యక్తిత్వ ఉదాత్తతను కవి ఆవిష్కరించాడు.)
అట్లుండగా ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులయిన అశ్వినీ దేవతలు వచ్చారు. వారిని గౌరవించి చ్యవనుడు తన ముసలి తనాన్ని చూపించి ఇట్లన్నాడు. మీకు యజ్ఞభాగంగా లేని సోమపానాన్ని నేను కల్పించి ఇస్తాను. సోమపానసమయంలో పానపాత్రను మీకు అందిస్తాను. ప్రత్యుపకారంగా నా ముసలితనాన్ని పోగొట్టండి అని ఇంకా ఇలా అన్నాడు.
దేవేంద్ర వైద్యులారా! అందమైన ప్రాయంతో, జవరాండ్రను కరగించే శరీర సౌందర్యాన్ని శుభకరంగా నాకు అనుగ్రహించండి మిమ్మల్ని దీవిస్తాను.
అలా అన్న చ్యవనునితో అశ్వినీదేవతలు సంతోషించి సిద్ధులచేత నిర్మింపబడిన ఈ మడుగులో మునుగుమని చెప్పి
ముసలి ముని అయిన చ్యవనుణ్ణి అశ్వినీదేవతలు పూనికతో ఎత్తుకొని పోయి, ఆ మడుగులో మునిగి లేచారు. స్త్రీ జనాన్ని ఆకర్షించే సౌందర్యవంతులు, అదృష్టవంతులుగా మారారు. తామరపూల హారాలతో, బంగారు చెవిపోగులతో, మంచి బట్టలతో, సూర్యునివలె కాంతిగలిగి ఒకే విధంగా ఉన్న ఆ ముగ్గురినీ చూచి అమాయకురాలైన సుకన్య వారిలో తన భర్తను కనిపెట్టలేకపోయింది. పతివ్రత అయిన ఆమె తన భర్తను తెలుసుకోవాలని 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తను చూపించండి' అంటూ అశ్వినీదేవతలకు మొక్కింది.
అశ్వినీదేవతలు పతివ్రతయైన సుకన్యక సత్యశీలానికి మెచ్చి, యౌవనరూపంతో ఉన్న చ్యవనుని చూపించి, ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని విమానమెక్కి దేవతల నగరమైన అమరావతికి వెళ్ళారు. పిమ్మట
శర్యాతి యాగం చేయటానికి, కూతుర్నీ అల్లుణ్ణీ ఆహ్వానించి తీసుకెళ్ళే ఉద్దేశంతో చ్యవనమహర్షి ఆశ్రమానికి వచ్చాడు. తన కుమార్తె ప్రక్కన సూర్యతేజస్సుతో ప్రకాశించే పురుషుణ్ణి చూచి తనలో 'వీడెవడో ఈమె భర్తకాదు, ఆశ్చర్యం!' అనుకొని కూతురిమాట, ఆమె చేసే గౌరవాలు ఇష్టపడక, ఆశీర్వదించటానికి అసహ్యపడి ఇట్లన్నాడు. చ్యవనమహర్షి గొప్పవాడు, మునిజనాల్లో శ్రేష్ఠుడు, లోకంచేత కీర్తింపబడేవాడు, ఎక్కడకు వెళ్ళాడు? ఆయన ఎలా మోసగించబడ్దాడు? నీ పక్కనున్న వీడెవడు?
అమ్మాయీ! నీకీపని న్యాయమేనా? ధర్మమేనా? శీలవంతుల లక్షణమేనా? సత్కులంలో పుట్టి గర్వించి సంతోషం కోసం జగత్తుచే పూజింపబడేవాడు, పుణ్యాత్ముడు, తపస్వి, సాధ్విమనసుకు నచ్చేవాడు అయిన భర్తను వదలి, విటుణ్ణి పొందడం న్యాయమా? అభిమానం పాటించనక్కరలేదా? తండ్రిని, భర్తను నరకానికి తోసేశావు కదా!
అమ్మాయీ! మగడు ప్రాయపువాడైతే కొంతవరకైనా భార్యను కాపాడుకోగలడు. ముసలిముని ప్రయత్నపూర్వకంగానైనా భార్యను అదుపులో ఉంచగలడా? ఎక్కడైనా పడుచు పిల్లను ముసలివానికి కట్టబెట్ట కూడదు.
పరమపతివ్రతాలలామ అయిన ఆ సుకన్యక చిరునవ్వు చెక్కిళ్లపై తొణికిసలాడుతుండగా తండ్రితో ఇలా అంది.
'ఓ తండ్రీ! ఇతడు నీ అల్లుడైన భార్గవుడేకాని విటుడు కాదు. సంతోషంతో నీవు కూడ ఈయనతో చుట్టరికాన్ని పాటించుము' అని తండ్రికి జరిగినదంతా చెప్పింది.
శర్వాతి సంతోషంతో కూతురిని చేరదీసి ఆదరంతో 'సౌభాగ్యవతివి కమ్మ'ని దీవించాడు. అప్పుడు చ్యవనుడు భార్యతో పాటు వెళ్ళి 'మామకు యాగం చేయించి, ఒక పాత్రలో సోమరసాన్ని పోసి' తన తపశ్శక్తితో అశ్వినీ దేవతలకిచ్చాడు. దాన్ని చూచి
(1. మాంగల్యం 2. పసుపు కుంకుమ 3. గాజులు 4. చెవ్వాకు 5. మెట్టెలు. ఈ అయిదు వస్తువులు ముత్తైదువ మాత్రమే ధరిస్తుంది. అందుకనే ఆమెను అయిదువ అంటారు.)
దేవేంద్రుడు కోపంతో మునిపైకి వజ్రాయుధమెత్తగా ఆశ్చర్యకరంగా ముని దాన్ని అతని భుజం మీదే కదలకుండా నిలబెట్టాడు.
ఈ విధంగా అశ్వనీ దేవతలు దేవతావైద్యులైకూడా సోమభాగం లేనివారైనా, చ్యవన మహర్షి ప్రభావంవల్ల యజ్ఞభాగం పొందగలిగి వెళ్ళారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్హుడు, భూరిషేణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో
వారిలో ఆనర్హుడికి రైవతుడు పుట్టాడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి, ఆనర్తము మొదలైన దేశాలను పెంపుతో పాలించాడు. అతడు కకుద్మివంటి శ్రేష్ఠులైన వందమంది కొడుకుల్ని కన్నాడు. కీర్తిమంతుడైన రైవతుడు తన కుమార్తె రేవతిని బ్రహ్మకు చూపించి తగిన వరుణ్ణి అడగాలనుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మకొలువులో గంధర్వులు కిన్నరులు ఆడుతూ పాడుతూ ఉండడంవల్ల దర్శించే సమయంకోసం ఒక్కక్షణంపాటు నిలబడ్డాడు.
అంతట దర్శించే సమయం కలుగగా, బ్రహ్మకు నమస్కరించి రైవతుడు రేవతిని చూపించి ఇట్లా అన్నాడు.
అమాయకురాలు, అందకత్తె, ప్రాయంలో ఉన్న ఈ మంచి మనస్సున్న అమ్మాయికి భర్తఎవడో? సెలవివ్వండి అన్నాడు రైవతుడు. బ్రహ్మ మనోదృష్టితో పరికించి పక పక నవ్వి ఇలా అన్నాడు.
'ఓ రాజా! ఈమె కోసం మనసులో భావించిన వాళ్ళందరూ కాలంతోపాటు చెల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళకొడుకులు, మనుమలు ఎవ్వరూ లేరు; గతించారు. భూమిమీద వాళ్ల గోత్రాలపేర్లు కూడ వినబడవు. నీవు వచ్చిన ఈ లోపలే ఇరవై ఏడు పర్యాయాలు నాలుగుయుగాలు వరుసగా గడచిపోయాయి. కాబట్టి నీవిపుడే భూలోకానికి వెళ్లు. దేవదేవుడు సర్వభూతాత్మకుడు అయిన నారాయణుడు భూభారాన్ని పోగొట్టడానికి తన అంశతో బలరాముడుగా అవతరించాడు. నీవు ఈ కన్యారత్నాన్ని ఆయన కివ్వు' అని అన్నాడు.
(బ్రహ్మలోకంలో ఒక్క క్షణకాలం - భూలోకంలో ఇరవైఏడు మహాయుగాలు గడచిన దానితో సమానం)
ఇట్లా ఆనతియ్యగా బ్రహ్మకు రైవతుడు నమస్కరించి భూలోకానికి వచ్చాడు. ఆయన తనసోదరులు, స్వజనులులేని తన నగరానికి వచ్చాడు. బలదేవుని చూచి రేవతీకన్యను అయనకిచ్చి పెళ్ళిచేసి నారాయణుని ఆశ్రమముండే బదరికావనానికి నియమబద్ధమైన తపస్సు చేయటం కోసం వెళ్ళాడు.
ఓ రాజా! నభగుడనే మనువుకు బుద్ధిమంతుడైన నాభాగుడు జన్మించాడు. అతని సోదరులు యజమానులుగా జీవించడంకోసం నాభాగుని ఆస్తిని పంచుకొన్నారు.
బ్రహ్మచారియైన నాభాగుడు తనసోదరులను తండ్రిఆస్తిలో భాగమడిగాడు. వారు తండ్రి చెప్పేపద్ధతిలో ఇస్తామన్నారు. నాభాగుడు తండ్రి దగ్గరకు వెళ్ళి సంపదను భాగాలు చేయమన్నాడు. అపుడు తండ్రి “ఇక్కడ దగ్గరలో అంగిరసులు సత్త్రయాగం చేస్తున్నారు. వారు గొప్పజ్ఞానులే అయినా ఆరవరోజు యాగంలో చేయవలసిన కర్మకాండ మనసుకు రాక మూఢులవుతారు. అపుడు నీవు వారిదగ్గరకువెళ్ళి వైశ్యదేవసూక్తాలను రెండింటిని చెప్తే కవి అని అందరూ అంటారు. యాగం పూర్తియై వారు స్వర్గానికి వెళ్తూ యాగంలో మిగిలిన సంపదనంతా నీకిస్తారు” అని చెప్పాడు. నాభాగుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పినట్లు చేశాడు. అంగిరసులు యాగంలో మిగిలిన ధనాన్ని నాభాగునికిచ్చి స్వర్గానికి వెళ్ళారు. అపుడు
అంగిరసులిచ్చే బంగారం నాభాగునికి శుభప్రదంగా చేరే సమయంలో, పొడగరి, నల్లనివాడు అయిన ఒకడు రాజును ఆపి ముందు నిలబడి దాన్ని తీసుకొన్నాడు.
నాభాగుడు వాణ్ణి చూచి మునులు ఇవ్వడంవల్ల అది తనకు చెందవలసిన ధనమని చెప్పాడు. అప్పుడు ఆ మహాపురుషుడు “మీ తండ్రి చెప్పిన రీతిగా చేయడమే తగి ఉంటుంది” అన్నాడు. నాభాగుడు తండ్రిని అడగ్గా అతడు “పూర్వం ఋషులు యజ్ఞశాలలో మిగిలినధనం శివునకే చెందుతుందని తీర్మానించారు. కాబట్టి ఈ ధనానికి ఆ దేవుడే అర్హుడు. అని చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునికి నమస్కరించి ఓ దేవా! ఈ ధనం నీకే చెందుతుందని మా తండ్రి చెప్పాడు. నేను దోషం చేశాను. మన్నించండి అన్నాడు. ఆ దేవుడు తండ్రితీర్పునకు, కొడుకునిజాయితికి మెచ్చుకొని నీవు నిజమే పలికావు. కాబట్టి యాగంలో మిగిలిన ద్రవ్యం నీకే ఇస్తున్నాను అని నాభాగునికి ఆత్మదర్శనాన్ని సనాతన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అంతర్ధానం చెందాడు.
లోకంలో నాభాగుని కథను ఉదయం సాయంత్రం వేళలలో చిత్తశుద్ధితో స్మరించినంతనే నరుడు పండితుడవుతాడు, మంత్రజ్ఞుడవుతాడు. మోక్షాన్ని పొందుతాడు.
అట్టి నాభాగునికి అంబరీషుడు జన్మించాడు. ఆతనిపట్ల లోకంలో ఎదురులేని బ్రాహ్మణశాపం వ్యర్థమైపోయింది. అని శుకుడు చెప్పగా “ఏ కారణంచేత జవదాటరాని బ్రాహ్మణదండన అతణ్ణి ఏమీ చేయలేక పోయింది?” అని రాజు అడిగాడు. అప్పుడు శుకుడు రాజుతో ఇలా అన్నాడు.
(నాభాగుని ఉదాత్త వృత్తాంతం చెప్పడం వెనుక ఉన్న కారణం మహాభక్త శిఖామణియైన అంబరీషుని భక్తితత్త్వానికి వేదిక నిర్మించటమే.)
Sree Maha Bhagavathamu Part 9 - శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీరస్తు శీమహాభాగవతము నవమస్కంధము
శ్రీరాజిత! మునిపూజిత!, వారిధిగర్వాతిరేకవారణబాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల, సారయశస్సాంద్ర! రామచంద్రనరేంద్రా!
శ్రీరామచంద్రుడనే ఓ రాజా! సీతా సంయుతుడవై మునులచేత పూజింపబడేవాడా! సేతుబంధనానికి పూర్వం సముద్రాతిశయగర్వాన్ని నివారించిన బాణాలు కలవాడా! పండితుల్ని రక్షించినవాడా! మిక్కిలి ప్రకాశమానమైన, నిండైన కీర్తి కలవాడా!
(ఈ స్కంధంలో సూర్యవంశక్షత్రియుల చరిత్రలున్నాయి. సూర్యవంశంలో ప్రసిద్ధుడైన శ్రీరామచంద్రుని చరిత్రం కూడా ఉంది. ఆ శ్రీరాముని గుణగణాలను ఈ పద్యం సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది.)
నైమిశారణ్యంలో భాగవతశ్రవణం చేయాలన్న కోరికతో చేరిన మునులు ఉన్నతగుణవంతులు. వారిని చూచి సర్వపురాణాలనూ విశదీకరించడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు.
ఆ రీతిగా ప్రాయోపవేశం చేసి ముక్తిమార్గం చూపుమని అడిగిన పరీక్షిన్మహారాజు నుద్దేశించి యోగివర్యుడైన శుకుడు ఈ విధంగా చెప్పాడు.
ఓ శుకమహార్షీ! మీరు చెప్పగా ఇంతకు మునుపు ఆరుగురు మనువులయొక్క వృత్తాంతాలు విన్నాను. ఆయా మన్వంతరాల్లో శ్రీ మహావిష్ణువు లీలల్ని తెలుసుకొన్నాను. ద్రవిళదేశాధిపతి అయిన సత్యవ్రతుడనే రాజు పూర్వసృష్టి అంతంలో విష్ణువును సేవించి జ్డానియై వైవస్వతుడనే పేరుతో సూర్యునికి జన్మించి మనువయ్యాడు. అతనికి ఇక్ష్వాకుడు మొదలుకొని పదమంది కొడుకులు ఉన్నారంటారుగదా! నా యందు దయతో ఆ వంశం ఏ విధంగా నడిచింది?, ఆ వంశస్థుల్లో చనిన, చనుతున్న, చనెడు వారిని అనగా ఆ వంశం యొక్క భూత, వర్తమాన. భవిష్యత్ స్థితిని గూర్చి చెప్పండి.
(1. మనువుల పుట్టుకను గూర్చి పూర్వస్కంధంలో వివరంగా చెప్పబడింది. (8-1-6). ఈ కల్పంలో ఆరుగురు మనువుల యొక్క వృత్తాంతాలు వివరింపబడ్డాయి. ప్రస్తుత కథా సందర్భం ఏడవమనువు వైవస్వతుని కాలానికి సంబంధించింది. పోయిన కల్పాంతంలో జరిగిన మీనావతారాంశమిది. ఆ సత్యవ్రతుడే వైవస్వతునిగా ఏడవ మనువైనాడు. ఇతనికి సంబంధించిన వృత్తాంతం ఈ నవమస్కంధప్రారంభంలో చెప్పబడింది.
2. సత్యవ్రతుడు పూర్వజన్మలో ద్రవిళదేశాధిపతి. ఈ కల్పంలో వివస్వంతుడు అనబడే సూర్యునికి శ్రాద్ధదేవుడిగా జన్మించి, శ్రీహరి కృపావశంచేత ఏడవ మనువైనాడు. ఇక్కడనుండి సూర్యవంశపు రాజుల ప్రస్థానం ప్రారంభమవుతుంది.)
ఓ మహార్షీ! సూర్యవంశంలో జన్మించిన రాజుల కీర్తిప్రతిష్టలు నేడు చెవులార వినాలని కుతూహలం కలుగుతోంది. వరుసగా వాటిని గూర్చి వివరించండి. ఈ లోకంలో పుణ్యాత్ముల కీర్తిని గూర్చి వినడం పుణ్యదాయకమే కదా!
మనువుల వర్తనాలు, సూర్యవంశరాజుల చరిత్ర విపులంగా చెప్పుమని పరీక్షిన్మహారాజు కోరగా, పరాశరమహర్షి మనుమడైన శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు.
ఓ శుకమహార్షీ! మీరు చెప్పగా ఇంతకు మునుపు ఆరుగురు మనువులయొక్క వృత్తాంతాలు విన్నాను. ఆయా మన్వంతరాల్లో శ్రీ మహావిష్ణువు లీలల్ని తెలుసుకొన్నాను. ద్రవిళదేశాధిపతి అయిన సత్యవ్రతుడనే రాజు పూర్వసృష్టి అంతంలో విష్ణువును సేవించి జ్డానియై వైవస్వతుడనే పేరుతో సూర్యునికి జన్మించి మనువయ్యాడు. అతనికి ఇక్ష్వాకుడు మొదలుకొని పదమంది కొడుకులు ఉన్నారంటారుగదా! నా యందు దయతో ఆ వంశం ఏ విధంగా నడిచింది?, ఆ వంశస్థుల్లో చనిన, చనుతున్న, చనెడు వారిని అనగా ఆ వంశం యొక్క భూత, వర్తమాన. భవిష్యత్ స్థితిని గూర్చి చెప్పండి.
(1. మనువుల పుట్టుకను గూర్చి పూర్వస్కంధంలో వివరంగా చెప్పబడింది. (8-1-6). ఈ కల్పంలో ఆరుగురు మనువుల యొక్క వృత్తాంతాలు వివరింపబడ్డాయి. ప్రస్తుత కథా సందర్భం ఏడవమనువు వైవస్వతుని కాలానికి సంబంధించింది. పోయిన కల్పాంతంలో జరిగిన మీనావతారాంశమిది. ఆ సత్యవ్రతుడే వైవస్వతునిగా ఏడవ మనువైనాడు. ఇతనికి సంబంధించిన వృత్తాంతం ఈ నవమస్కంధప్రారంభంలో చెప్పబడింది.
2. సత్యవ్రతుడు పూర్వజన్మలో ద్రవిళదేశాధిపతి. ఈ కల్పంలో వివస్వంతుడు అనబడే సూర్యునికి శ్రాద్ధదేవుడిగా జన్మించి, శ్రీహరి కృపావశంచేత ఏడవ మనువైనాడు. ఇక్కడనుండి సూర్యవంశపు రాజుల ప్రస్థానం ప్రారంభమవుతుంది.)
ఓ మహార్షీ! సూర్యవంశంలో జన్మించిన రాజుల కీర్తిప్రతిష్టలు నేడు చెవులార వినాలని కుతూహలం కలుగుతోంది. వరుసగా వాటిని గూర్చి వివరించండి. ఈ లోకంలో పుణ్యాత్ముల కీర్తిని గూర్చి వినడం పుణ్యదాయకమే కదా!
మనువుల వర్తనాలు, సూర్యవంశరాజుల చరిత్ర విపులంగా చెప్పుమని పరీక్షిన్మహారాజు కోరగా, పరాశరమహర్షి మనుమడైన శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు.
శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
The Pralayam (great deluge or dissolution) in the Matsya Avatar Started - మత్స్యావతార ప్రళయకాల ప్రారంభం
మత్స్యావతార ప్రళయకాల ప్రారంభం
అటు పిమ్మట ప్రళయం సమీపించింది.
మెరుపులతోకూడిన మేఘాలు ఎడతెరపిలేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు దాటి పొంగిపొరలి దేశాలను ముంచివేసినాయి.
ఓ రాజా! బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమైనది. ఆకాశంలో ఎగసిపడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకలభూతరాశులు కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమైనాయి.
(ప్రళయం ఐదువిధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆధిభౌతికం, నిత్యం, నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అని కూడా కొందరు చెప్తారు. జలప్రళయం(ఉప్పెన), అగ్నిప్రళయం(దహనం), పృథివీప్రళయం(భూకంపం), వాయుప్రళయం (వాయుగుండం), ఆకాశప్రళయం(కుంభవృష్టి) అనే పాంచభౌతిక ప్రళయాలూ ఉన్నాయి.)
ఓ రాజా! బ్రహ్మదేవుడు విశ్రాంతిలేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి సృష్టించి అలసిపోయినాడు. ఆయన నడుమూ వీపూ బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి రెప్పలుమూసుకొని చెయ్యి తలగడగా ఉంచుకొని గురకలు పెడుతూ కలలుకంటూ నిద్రపోయినాడు.
బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రించినాడు. ఆయన నోళ్ల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. ఆతని దరిచేరటానికి ఇతరులకు సాధ్యమా?(సాధ్యంకాదు.)
(హయగ్రీవుడు అనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. సర్వవిద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుకూడా హయగ్రీవుడే. ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను బ్రహ్మదగ్గరనుండి దొంగిలించినవాడు.)
వేదాలను చేజిక్కించుకొన్న రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోకి ప్రవేశించినాడు.
ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, ఓషధులూ విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు కర్తవ్యా లయినాయి. ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన
విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలూ పెద్ద మీసాలూ పొట్టితోకా బంగారు కాంతులీను మేనూ, అందమైన మచ్చలూ చక్కనిమొగమూ ఒక కొమ్మూ మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది.
ఆ విధంగా విష్ణుమూర్తి లక్షఆమడల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించినాడు.
మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంతో ప్రళయ జలాలలో వేదాలను వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్లలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగితేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపలగుంపును మింగుతాడు. ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి చిమ్ము (ఉమ్ము)తాడు. ఇలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదలిస్తూ, మేనిపొడలు మెరపిస్తూ, కన్నులకాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరచుకుంటూ, తళతళలాడుతూ సముద్రగర్భంలో విహరించినాడు.
సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ అక్కడకు వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు.
సత్యవ్రతరాజు ఓడపై పెక్కు ఓషధులను విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతోపాటు నావపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు.
సత్యవ్రతుడు ఒక పెద్దపామును తాడుగాచేసి ఆ ఓడను మహామత్స్యంకొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడసాగాడు.
ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానంవల్ల కొందరు భ్రాంతితో తిరుగుతుంటారు. మునుగుతూ కల్లోలపడుతూ పెక్కుదారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్నిపొంది సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించేనీవు మమ్ములను రక్షించు.
ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి దుర్బుద్ధికలవానికి తండ్రివి నీవే. కనుక కనులున్నవాడు కనులులేనివానికి దారిచూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు.
శ్రీహరీ! అగ్నితో చేరడంవల్ల బంగారానికి రంగు / మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది.
లక్ష్మీరమణా! నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశభాగంవల్ల దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీకు మెప్పుకలిగిస్తే లభించనిభాగ్యం ఏముంటుంది?
దయాసముద్రుడా! పనికిమాలినవానిని గొప్పవాడనుకొనిపోతే అతడు పనికిమాలిన మార్గాన్నే చూపిస్తాడు. ఆ దారిలో వెళ్లినవాడు చెడిపోతాడు. నిన్ను నమ్మి మంచిదారిని నడవగలిగితే సందేహంలేని మంచి స్థానాన్ని పొందుతాడు.
నారాయణా! నీవు చెలికానిగా చుట్టంగా జ్ఞానస్వరూపునిగా మానవుల మనస్సులలో మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువువై కోరికలు నెరవేరుస్తావు. అలాంటి నిన్ను ఆదరించక లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు తీస్తుంది. అదృష్టం లేనివాడు బంగారు రాశి దొరకినా దక్కించుకోలేడు కదా!
కర్మఫలానికి కట్టుబడి సముద్రంలో మునిగి కూరుకపోయిన లోకం ఏ మహానుభావుని చేత ఎప్పటికప్పుడు మేలుకొంటుందో అలాంటి మహానుభావుడవు నీవు. మాకు గురుడవయ్యావు.
ఓ సర్వేశ్వరా! మా విజ్ఞాపము వినవయ్యా. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి తీసుకొని వెళ్లుమని దేవదేవా! నిన్ను వేడుకొంటున్నాను.
ఈ విధంగా సత్యవ్రతుని ప్రార్ధనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగశాస్త్రాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతోపాటు సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల ఏడవమనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు.
ప్రళయసముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్యస్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరిపించినాడు. దౌడలు చక్కచేసికొన్నాడు. మీసాలు కదలించినాడు. పిడికిటిపోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు.
ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురుచూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువశక్తితో నిద్రిస్తున్న సరస్వతిలేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెదకొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మాదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవలించి నిదుర నుండి మేల్మొన్నాడు. కొద్దిగా నీలిగినాడు, ఒత్తిగిలినాడు, ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకొన్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు.
భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మాదేవునికి దయతో అప్పగించినాడు.
విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుంచి బయటపడినాడు. మనువు అయినాడు. విష్ణువును పూజించక ఎక్కడైనా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందా? (ప్రాప్తించదు.)
రాజర్షి అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్రగాథను విన్నవారు బంధాలనుంచి విముక్తిని పొందుతారు.
ఓ రాజా! ప్రతిదినం మత్స్యావతార కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఆతని కోర్కెలూ నెరవేరుతాయి. ఇది సత్యం సుమా!
(పై రెండు పద్యాలలో మత్స్యావతార కథకు 'ఫలశ్రుతి' చెప్పబడినది.)
ప్రళయకాల సముద్రంలో మేనుమరచి నిద్రించిన బ్రహ్మాదేవుని ముఖాలనుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసునిచంపి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసి, అన్నింటికి మూలమై, మత్స్యావతారంతో సాగరాన మునుగుతూ తేలుతూ సంచారం చేసి ప్రకాశించే విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.
ఈ విధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పినాడు.
శ్రీరామా! నీవు రాజేంద్రుడవు. దైత్యులు-దానవులు అనబడే రాక్షసులు అనే అరణ్యాలను దహించినవాడవు. రాజులు, రాజులలో ఉన్నతులు కూడా నిన్ను గౌరవించినారు. చంద్రధారిఅయిన శివునిచేత పూజించబడినవాడా! సద్గుణసంపన్నా! రఘువంశలలామా రామా!
(దితి తనూజులు దైత్యులు. దనువు తనూజులు దానవులు)
రక్కసులను తెగటార్చినవాడా! వేల్పులకు మేలుచేయువాడా! (దుష్టులచే బరువెక్కిన) భూమిభారాన్ని తొలగించువాడా! పుణ్యాత్ములను కాపాడువాడా! నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్చమైన గొప్ప కీర్తకలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
అటు పిమ్మట ప్రళయం సమీపించింది.
మెరుపులతోకూడిన మేఘాలు ఎడతెరపిలేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు దాటి పొంగిపొరలి దేశాలను ముంచివేసినాయి.
ఓ రాజా! బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమైనది. ఆకాశంలో ఎగసిపడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకలభూతరాశులు కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమైనాయి.
(ప్రళయం ఐదువిధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆధిభౌతికం, నిత్యం, నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అని కూడా కొందరు చెప్తారు. జలప్రళయం(ఉప్పెన), అగ్నిప్రళయం(దహనం), పృథివీప్రళయం(భూకంపం), వాయుప్రళయం (వాయుగుండం), ఆకాశప్రళయం(కుంభవృష్టి) అనే పాంచభౌతిక ప్రళయాలూ ఉన్నాయి.)
ఓ రాజా! బ్రహ్మదేవుడు విశ్రాంతిలేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి సృష్టించి అలసిపోయినాడు. ఆయన నడుమూ వీపూ బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి రెప్పలుమూసుకొని చెయ్యి తలగడగా ఉంచుకొని గురకలు పెడుతూ కలలుకంటూ నిద్రపోయినాడు.
బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రించినాడు. ఆయన నోళ్ల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. ఆతని దరిచేరటానికి ఇతరులకు సాధ్యమా?(సాధ్యంకాదు.)
(హయగ్రీవుడు అనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. సర్వవిద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుకూడా హయగ్రీవుడే. ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను బ్రహ్మదగ్గరనుండి దొంగిలించినవాడు.)
వేదాలను చేజిక్కించుకొన్న రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోకి ప్రవేశించినాడు.
ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, ఓషధులూ విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు కర్తవ్యా లయినాయి. ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన
విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలూ పెద్ద మీసాలూ పొట్టితోకా బంగారు కాంతులీను మేనూ, అందమైన మచ్చలూ చక్కనిమొగమూ ఒక కొమ్మూ మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది.
ఆ విధంగా విష్ణుమూర్తి లక్షఆమడల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించినాడు.
మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంతో ప్రళయ జలాలలో వేదాలను వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్లలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగితేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపలగుంపును మింగుతాడు. ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి చిమ్ము (ఉమ్ము)తాడు. ఇలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదలిస్తూ, మేనిపొడలు మెరపిస్తూ, కన్నులకాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరచుకుంటూ, తళతళలాడుతూ సముద్రగర్భంలో విహరించినాడు.
సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ అక్కడకు వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు.
సత్యవ్రతరాజు ఓడపై పెక్కు ఓషధులను విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతోపాటు నావపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు.
సత్యవ్రతుడు ఒక పెద్దపామును తాడుగాచేసి ఆ ఓడను మహామత్స్యంకొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడసాగాడు.
ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానంవల్ల కొందరు భ్రాంతితో తిరుగుతుంటారు. మునుగుతూ కల్లోలపడుతూ పెక్కుదారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్నిపొంది సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించేనీవు మమ్ములను రక్షించు.
ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి దుర్బుద్ధికలవానికి తండ్రివి నీవే. కనుక కనులున్నవాడు కనులులేనివానికి దారిచూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు.
శ్రీహరీ! అగ్నితో చేరడంవల్ల బంగారానికి రంగు / మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది.
లక్ష్మీరమణా! నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశభాగంవల్ల దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీకు మెప్పుకలిగిస్తే లభించనిభాగ్యం ఏముంటుంది?
దయాసముద్రుడా! పనికిమాలినవానిని గొప్పవాడనుకొనిపోతే అతడు పనికిమాలిన మార్గాన్నే చూపిస్తాడు. ఆ దారిలో వెళ్లినవాడు చెడిపోతాడు. నిన్ను నమ్మి మంచిదారిని నడవగలిగితే సందేహంలేని మంచి స్థానాన్ని పొందుతాడు.
నారాయణా! నీవు చెలికానిగా చుట్టంగా జ్ఞానస్వరూపునిగా మానవుల మనస్సులలో మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువువై కోరికలు నెరవేరుస్తావు. అలాంటి నిన్ను ఆదరించక లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు తీస్తుంది. అదృష్టం లేనివాడు బంగారు రాశి దొరకినా దక్కించుకోలేడు కదా!
కర్మఫలానికి కట్టుబడి సముద్రంలో మునిగి కూరుకపోయిన లోకం ఏ మహానుభావుని చేత ఎప్పటికప్పుడు మేలుకొంటుందో అలాంటి మహానుభావుడవు నీవు. మాకు గురుడవయ్యావు.
ఓ సర్వేశ్వరా! మా విజ్ఞాపము వినవయ్యా. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి తీసుకొని వెళ్లుమని దేవదేవా! నిన్ను వేడుకొంటున్నాను.
ఈ విధంగా సత్యవ్రతుని ప్రార్ధనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగశాస్త్రాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతోపాటు సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల ఏడవమనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు.
ప్రళయసముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్యస్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరిపించినాడు. దౌడలు చక్కచేసికొన్నాడు. మీసాలు కదలించినాడు. పిడికిటిపోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు.
ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురుచూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువశక్తితో నిద్రిస్తున్న సరస్వతిలేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెదకొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మాదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవలించి నిదుర నుండి మేల్మొన్నాడు. కొద్దిగా నీలిగినాడు, ఒత్తిగిలినాడు, ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకొన్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు.
భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మాదేవునికి దయతో అప్పగించినాడు.
విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుంచి బయటపడినాడు. మనువు అయినాడు. విష్ణువును పూజించక ఎక్కడైనా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందా? (ప్రాప్తించదు.)
రాజర్షి అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్రగాథను విన్నవారు బంధాలనుంచి విముక్తిని పొందుతారు.
ఓ రాజా! ప్రతిదినం మత్స్యావతార కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఆతని కోర్కెలూ నెరవేరుతాయి. ఇది సత్యం సుమా!
(పై రెండు పద్యాలలో మత్స్యావతార కథకు 'ఫలశ్రుతి' చెప్పబడినది.)
ప్రళయకాల సముద్రంలో మేనుమరచి నిద్రించిన బ్రహ్మాదేవుని ముఖాలనుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసునిచంపి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసి, అన్నింటికి మూలమై, మత్స్యావతారంతో సాగరాన మునుగుతూ తేలుతూ సంచారం చేసి ప్రకాశించే విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.
ఈ విధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పినాడు.
శ్రీరామా! నీవు రాజేంద్రుడవు. దైత్యులు-దానవులు అనబడే రాక్షసులు అనే అరణ్యాలను దహించినవాడవు. రాజులు, రాజులలో ఉన్నతులు కూడా నిన్ను గౌరవించినారు. చంద్రధారిఅయిన శివునిచేత పూజించబడినవాడా! సద్గుణసంపన్నా! రఘువంశలలామా రామా!
(దితి తనూజులు దైత్యులు. దనువు తనూజులు దానవులు)
రక్కసులను తెగటార్చినవాడా! వేల్పులకు మేలుచేయువాడా! (దుష్టులచే బరువెక్కిన) భూమిభారాన్ని తొలగించువాడా! పుణ్యాత్ములను కాపాడువాడా! నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్చమైన గొప్ప కీర్తకలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
Matsya Avatar Story - మత్స్యావతార కథా ప్రారంభము
మత్స్యావతార కథా ప్రారంభము
పై విధంగా శుకుడు పరీక్షిత్తుకు వామనావతారకథను చెప్పినాడని సూతుడు శౌనకాది మునులకు తెలిపినాడు. అప్పుడు శౌనకాది మునులు సూతునితో ఇలా అన్నారు.
పుణ్యాత్మా! పూర్వం విష్ణువు మత్స్యావతారం ధరించిన విషయం వినాలని మాకు కుతూహలంగా ఉంది. భగవంతుడు కర్మకు కట్టుబడినవానివలె లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపరూపాన్ని ఎందుకు ధరించాడు? ఎక్కడుండి ఏమి చేశాడు? మొదటిదైన ఆ అవతారానికి కారణమేమిటి? ఆ అవతార అవసరమేమిటి? ఆ విషయాలన్నీ మాకు తెలియజేయ గలిగినవాడవు నీవే. వాటిని గురించి మాకు తెలియజెప్పు. దేవదేవుడైన విష్ణుదేవుని కథ అఖిలలోకాలకూ మంగళాన్ని కలిగించేది కదా! కాబట్టి, ఆ విషయాలను క్రమా న్ననుసరించి విశదంగా తెలుపు.
ఇలా అడిగిన మునులతో సూతుడు ఇట్లా చెపుతున్నాడు. మీరు అడిగినట్లే పరీక్షిత్తురాజు శుకమహర్షిని అడిగినాడు. అందుకు ఆ మహాముని ఇట్లా చెప్పినాడు.
పరీక్షిన్మహారాజా! విను. లోకాలకు అధిపతి, ఈశ్వరుడు అయిన విష్ణుమూర్తి వేదాలనూ బ్రాహ్మణులనూ గోవులనూ దేవతలనూ సజ్జనులనూ ధర్మాన్నీ అర్థాన్నీ కాపాడటం కోసం మాత్రమే అవతారాలు ధరిస్తాడు. వాయువు వలె గొప్పరూపాలలోను అల్ప రూపాలలోనూ చేరి ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఎక్కువ తక్కువలులేని నిర్గుణుడైనప్పటికీ ఎక్కువ తక్కువభావాలు లేక గుణాలకలయికను పొందుతుంటాడు. అలాంటి విష్ణువు మత్స్యావతారం ధరించటంలో ఆశ్చర్యం ఏమీలేదు. పోయిన కల్పం చివర ద్రవిళదేశానికి రాజయిన సత్యవ్రతుడు నీటినిమాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనదిగట్టున విష్ణువును గురించి తపస్సు చేశాడు.
సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనేపేరుగల నదిఒడ్డున హరిసమర్పణంగా జలతర్పణం చేస్తుండగా అతని దోసిలితో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల ఆ రాజుతో ఇలా అన్నది.
దయానిలయుడా! ఈ ఏటిలో దాయాదులను చంపే పాపిష్టి చేపలున్నాయి. అవి చిన్న చేపలనుపట్టి మింగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టేటిలో తోయటం న్యాయం కాదు.
పుణ్యాత్ముడా! ఇక మీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీకుండా నా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను?
దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలా కాని పక్షంలో ధూర్తులగు వేటకాండ్రయినా పట్టుకొంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా?
చేపపిల్ల మాటలువిని జాలిపడి దయకు నిలయమైనవాడగు సత్యవ్రతుడు, ఆ చేపపిల్లను నెమ్మదిగా కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్లినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది.
'ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటంలేదు. ఇంకొకదానిని తీసుకురా' అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు ఒక నీళ్ళకడవలో దానిని విడిచినాడు.
ఆ చేప క్షణకాలంలోనే మూడుచేతులపొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే పెద్దదై 'నేను తిరగడానికి ఇది చాలదు' అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్లుండే పెద్ద చెరువులో విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. 'చోటుచాలదని చెప్పుకున్నది' చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెనుకడలిలో విడచినాడు. సముద్రంలో చేరిన తర్వాత 'పెద్దమొసళ్లు నన్ను పట్టుకొని చంపి మింగుతాయి. ఇంత కాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు, బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది. అప్పుడు నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు.
పురుషోత్తమా! ఒక్కదినంలోనే నీవు నూరుయోజనాలదూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీ వినీ ఎరుగము. చేపజాతులకు ఇంతటి శరీరం ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకొన్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, పోషించి లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు మహిమతోకూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను.
మేము నీకు పరాయివాళ్లం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్లం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడూ భక్తులు ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించినవారికి ఎప్పటికీ కీడు జరగదు.
“శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్థ్సలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనందస్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేపరూపాన్ని ఎందుకు ధరించినావో చెప్పు”.
ఈ విధంగా సత్యవ్రతమహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు.
ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే ఏడవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. భూలోకాది ముల్లోకాలూ ప్రళయసాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీసమూహాలనూ విత్తనాలరాసులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళయసముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్తర్షులుకూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందుభాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీరకాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.
ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్నివైపులా పెద్ద ఈకలుకలిగిన నారెక్కలను కదలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడి గాలులకు నావ తిరుగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నౌకను కట్టివేసి. నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళయరాత్రి గడిచేవరకు నేను కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మస్వరూపమైన నా మహిమను తెలుసుకో. ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు.
చేపరూపంతో మాధవుడు పలికిన మాటలను తలచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భలశయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయసమయంకోసం ఎదురుచూస్తున్నాడు.
పై విధంగా శుకుడు పరీక్షిత్తుకు వామనావతారకథను చెప్పినాడని సూతుడు శౌనకాది మునులకు తెలిపినాడు. అప్పుడు శౌనకాది మునులు సూతునితో ఇలా అన్నారు.
పుణ్యాత్మా! పూర్వం విష్ణువు మత్స్యావతారం ధరించిన విషయం వినాలని మాకు కుతూహలంగా ఉంది. భగవంతుడు కర్మకు కట్టుబడినవానివలె లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపరూపాన్ని ఎందుకు ధరించాడు? ఎక్కడుండి ఏమి చేశాడు? మొదటిదైన ఆ అవతారానికి కారణమేమిటి? ఆ అవతార అవసరమేమిటి? ఆ విషయాలన్నీ మాకు తెలియజేయ గలిగినవాడవు నీవే. వాటిని గురించి మాకు తెలియజెప్పు. దేవదేవుడైన విష్ణుదేవుని కథ అఖిలలోకాలకూ మంగళాన్ని కలిగించేది కదా! కాబట్టి, ఆ విషయాలను క్రమా న్ననుసరించి విశదంగా తెలుపు.
ఇలా అడిగిన మునులతో సూతుడు ఇట్లా చెపుతున్నాడు. మీరు అడిగినట్లే పరీక్షిత్తురాజు శుకమహర్షిని అడిగినాడు. అందుకు ఆ మహాముని ఇట్లా చెప్పినాడు.
పరీక్షిన్మహారాజా! విను. లోకాలకు అధిపతి, ఈశ్వరుడు అయిన విష్ణుమూర్తి వేదాలనూ బ్రాహ్మణులనూ గోవులనూ దేవతలనూ సజ్జనులనూ ధర్మాన్నీ అర్థాన్నీ కాపాడటం కోసం మాత్రమే అవతారాలు ధరిస్తాడు. వాయువు వలె గొప్పరూపాలలోను అల్ప రూపాలలోనూ చేరి ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఎక్కువ తక్కువలులేని నిర్గుణుడైనప్పటికీ ఎక్కువ తక్కువభావాలు లేక గుణాలకలయికను పొందుతుంటాడు. అలాంటి విష్ణువు మత్స్యావతారం ధరించటంలో ఆశ్చర్యం ఏమీలేదు. పోయిన కల్పం చివర ద్రవిళదేశానికి రాజయిన సత్యవ్రతుడు నీటినిమాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనదిగట్టున విష్ణువును గురించి తపస్సు చేశాడు.
సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనేపేరుగల నదిఒడ్డున హరిసమర్పణంగా జలతర్పణం చేస్తుండగా అతని దోసిలితో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల ఆ రాజుతో ఇలా అన్నది.
దయానిలయుడా! ఈ ఏటిలో దాయాదులను చంపే పాపిష్టి చేపలున్నాయి. అవి చిన్న చేపలనుపట్టి మింగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టేటిలో తోయటం న్యాయం కాదు.
పుణ్యాత్ముడా! ఇక మీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీకుండా నా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను?
దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలా కాని పక్షంలో ధూర్తులగు వేటకాండ్రయినా పట్టుకొంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా?
చేపపిల్ల మాటలువిని జాలిపడి దయకు నిలయమైనవాడగు సత్యవ్రతుడు, ఆ చేపపిల్లను నెమ్మదిగా కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్లినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది.
'ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటంలేదు. ఇంకొకదానిని తీసుకురా' అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు ఒక నీళ్ళకడవలో దానిని విడిచినాడు.
ఆ చేప క్షణకాలంలోనే మూడుచేతులపొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే పెద్దదై 'నేను తిరగడానికి ఇది చాలదు' అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్లుండే పెద్ద చెరువులో విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. 'చోటుచాలదని చెప్పుకున్నది' చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెనుకడలిలో విడచినాడు. సముద్రంలో చేరిన తర్వాత 'పెద్దమొసళ్లు నన్ను పట్టుకొని చంపి మింగుతాయి. ఇంత కాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు, బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది. అప్పుడు నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు.
పురుషోత్తమా! ఒక్కదినంలోనే నీవు నూరుయోజనాలదూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీ వినీ ఎరుగము. చేపజాతులకు ఇంతటి శరీరం ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకొన్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, పోషించి లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు మహిమతోకూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను.
మేము నీకు పరాయివాళ్లం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్లం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడూ భక్తులు ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించినవారికి ఎప్పటికీ కీడు జరగదు.
“శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్థ్సలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనందస్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేపరూపాన్ని ఎందుకు ధరించినావో చెప్పు”.
ఈ విధంగా సత్యవ్రతమహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు.
ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే ఏడవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. భూలోకాది ముల్లోకాలూ ప్రళయసాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీసమూహాలనూ విత్తనాలరాసులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళయసముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్తర్షులుకూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందుభాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీరకాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.
ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్నివైపులా పెద్ద ఈకలుకలిగిన నారెక్కలను కదలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడి గాలులకు నావ తిరుగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నౌకను కట్టివేసి. నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళయరాత్రి గడిచేవరకు నేను కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మస్వరూపమైన నా మహిమను తెలుసుకో. ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు.
చేపరూపంతో మాధవుడు పలికిన మాటలను తలచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భలశయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయసమయంకోసం ఎదురుచూస్తున్నాడు.
Subscribe to:
Comments (Atom)
History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము
సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...