Saturday, March 28, 2026

The Chandra Vansha King Legends - చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది రాజుల చరిత్రను ఇకపై విను.

వేయితలలు గల శ్రీహరి నాభికమలం నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. సుగుణాలలో అతనితో పోల్చదగిన సమర్థుడైన అత్రి ఆ బ్రహ్మకు పుట్టాడు. అత్రి క్రీగంటి చూపులనుండి కలువల చెలికాడు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ ఆజ్ఞతో ఆ చంద్రుడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రసమూహానికి రాజయ్యాడు. చంద్రుడు రాజసూయ యాగాన్నిచేసి, ముల్లోకాలను జయించి, మూర్ఖత్వంతో వెళ్లి, సౌందర్యవతి అయిన బృహస్పతి భార్య తారను ఆమె ఇంటినుండి తనతో తీసికొని వచ్చాడు. దేవగురువు బ్రతిమాలినా అతని భార్య తారను చంద్రుడు విడిచిపెట్టలేదు.

అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం అయింది. బృహస్పతితో విరోధంవల్ల శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి చంద్రుని పక్షంచేరి బృహస్పతిని తరిమాడు. ఈశ్వరుడు తన భూతగణపరివారంతో బృహస్పతిపక్షాన నిలిచాడు. ఇంద్రుడు దేవతాసమూహంతో బృహస్పతికి సాయంగా నిలిచాడు. ఆ సమయంలో బృహస్పతిభార్య తార కారణంగా దేవతలకూ, రాక్షసులకూ వినాశం కలిగించే యుద్ధం జరిగింది. అంతలో బృహస్పతి తండ్రి అంగిరసుడు చెప్పగా బ్రహ్మ చంద్రునిపై కోపించి గర్భవతియైన తారను బృహస్పతికి తిరిగి ఇప్పించాడు. బృహస్పతి తారను చూచి ఇలా అన్నాడు.

ఓ దుష్టురాలా! ఏ మాత్రం సిగ్గు లేకుండా, వెలయాలివలె ధర్మాన్నీ, కీర్తిని మంటగలిపి జారుడైన చంద్రునితో పొందుకోరి గర్భాన్ని తెచ్చుకోవడం నీకు తప్పుగా తోచడం లేదా! ఇప్పుడే ఈ గర్భాన్ని దించుకో. నిన్ను కాల్చేస్తాను అసలు నిన్ను చూచి అభీమానవతులు మెచ్చుకుంటారా?

తారపై ఈ విధంగా బృహస్పతి ఆగ్రహిస్తుండగా, ఆ తారకు బంగరు రంగు గల ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను చూచి మోహాన్ని పొందిన బృహస్పతి 'ఈ బిడ్డ నా బిడ్డ' అని, చంద్రుడు 'ఈ సుతుడు నా సుతుడే' అనీ వాదులాడుకున్నారు అప్పుడు

వారు వాదులాడుకోవడం ఆపు చేయడానికి వచ్చిన మునులు 'ఆ బిడ్డ ఎవరి బిడ్డ' అనే విషయాన్ని నిర్ణయించలేక, దేవతలను అడిగారు. ఈ విషయం ఆ వగలాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదన్నారు దేవతలు.

ఈ మాటలు విని సిగ్గుతో నిలిచిన తారతో అందాల కుమారుడిలా అన్నాడు.

ఇంటి పరువు పోయేలా, బంధువులు తలవంచుకొనేలా, భర్త అసహ్యించుకొనేలా అన్యులవల్ల నన్ను ఎందుకు కన్నావు? తల్లీ! నా తండ్రి చంద్రుడా? బృహస్పతా?

ఇలా అడుగుతూ ఉన్న కొడుకునకు జవాబు చెప్పలేక నిలిచిన తారను బ్రహ్మ ఏకాంతానికి పిలిచి రహస్యంగా ఇలా అన్నాడు.

ఓ కాంతా! నీ సిగ్గు విడిచి ఈ చిన్ని బాలుని తండ్రి దేవగురుడో, చంద్రుడో చెప్పుము. ఎందుకు దాస్తావు? ఈ ఆలోచన నీకే పుట్టిందా? నిట్టూర్పులు విడవడం మాను. సహజంగా కాంతలు కాముకురాండ్రు కదా! మాట చెప్పినంత మాత్రాన నష్టం రాదు. నే నెవ్వరికీ చెప్పను. నిజం చెప్పుము.

అలా మాట్లాడిన బ్రహ్మకు ఎదురు చెప్పలేక తార రహస్యంగా ఈ బిడ్డను చంద్రునివల్ల కన్నాను అని చెప్పగా, ఆ బిడ్డకు బుధుడని పేరుపెట్టి ఆ బాలుని చంద్రునకిచ్చి బ్రహ్మ వెళ్ళిపోయాడు.

బుద్ధిమంతుడైన బుధుడు తన సుతుడుకాగా, చంద్రుడు వృద్ధి పొంది, ఆకాశాన్ని తాకాడు. జ్డానం కలిగిన కొడుకును కన్నతండ్రి ఆనందంతో ఉప్పాంగి ఆకాశాన్ని అందుకోడా?!

ఆ బుధునికి ఇంతకుమునుపు చెప్పినట్లు ఇళా కన్యకవల్ల పురూరవుడు జన్మించాడు. అతడి సౌందర్యాన్నీ శౌర్యాదిగుణాలను ఇంద్రసభలో ఊర్వశి నారదుడివల్ల విన్నది. మిత్రావరుణుల శాపంవల్ల ఆమె మనుష్య స్వరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చింది.

ఊర్వశి తామరలవంటి కన్నులు కలవాడు, సింహం నడుమువంటి నడుము కలవాడు, వెడదఱొమ్ము కలవాడు, మహాభుజుడు, అందమైన చంద్రునివంటి కాంతిమంతమైన మొగము కలవాడు, సుకుమారుడు, పురుషశ్రేష్ఠుడయిన పురూరవుణ్ణి చూచి, మన్మథుడు వేసే పూల బాణాలకు మనసు చిన్నబోగా వివశురాలై నిలిచి ఉన్న సమయంలో

పురూరవుడు ఊర్వశిని చూచి ఇది మన్మథుని బాణమా? మబ్బును వదలిన మెరుపా? మోహినీ దేవతయా? ఆకాశలక్ష్మియా? దీనిచేయి పట్టకుంటే జీవితం ఎందుకు? అనుకుంటూ తామరాకు పై నీటిబొట్టులాగా మన్మథ బాణాలవల్ల చలించిపోయాడు.

ఈ విధంగా రాజపుత్రుడు పురూరవుడు మన్మథ బాణాలకు గురియై, ఎలాగో స్తిమితపడి ఊర్వశితో ఇలా అన్నాడు.

ఓ అబలా! నీవు ఎక్కడనుండి వస్తున్నావు? మనకిద్దరికి ఈడు జోడు సరిపోతుంది. నీకు నేను దక్కాను. మన్మథుని బాణపు దెబ్బలతో నాకు దిక్కు తోచడం లేదు. నేను అసత్యం ఆడటం లేదు. నా శరీరానికి నీ శరీరాన్ని నా చేతికి నీ చేతిని, నా చెక్కిలికి నీ చెక్కిలిని చేర్చి తగినరీతిగా ఆపదలోనున్న నన్ను కాపాడు.

పురూరవుని పలుకులు విని, ప్రాఢురాలైన ఊర్వశి ఇలా అంది.

చంద్రవంశ సంజాత శ్రేష్ఠా! విశేష విలాసాలను కోరే పురూరవా! ఈ రెండు పొట్టేళ్ళు నాకు చాలా ఇష్టమైనవి. వీటిని ఎల్లప్పుడు నీవు రక్షించాలి. నా వద్ద నీ వెప్పుడూ దిగంబరుడవై ఉండకూడదు. నేను భుజించే నేయి నీవు కూడా తినాలి. ఈ అంశాలకు నీవు అంగీకరిస్తే నేను నిన్ను మన్మథ వినోదాలలో ఓలలాడిస్తాను. నీకు అంగీకారమేనా?

ఇలా పల్కిన దేవవేశ్య ఊర్వశి పలుకులకు తన అంగీకారాన్ని పురూరవుడు తెలిపి తన మనసులో (ఇలా అనుకున్నాడు)

ఈమె ఆకారం సుందరం, అనురాగం అనుకూలం, దేవవేశ్య, మన్మథునిచే మనసు చంచలంకాగా నన్నుకామించింది. ఇంతకంటె మేలు ఉంటుందా?

ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి, పురూరవుడు చంద్రముఖి ఊర్వశిని బంగారు మేడలలో, చెట్ల నీడలలో, తోటలలో రత్నాల చావిళ్ళలో, సరస్సులలో పర్వత పార్శ్వాలలో శృంగార క్రీడలలో ముంచి తేల్చాడు.

అలా అన్నిచోట్ల రతిక్రీడాసక్తులైన ఆ ఊర్వశీపురూరవులకు విడదీయరాని అనుబంధం ఏర్పడగా

ఒకప్రక్కకే వా రుభయులు వెళ్ళి, ఒకచోటనే ఉండి, తమ ఇరువురి మనసులలో ఒక విషయాన్నే ఆలోచిస్తూ, ఒక్క నిమిషం కూడా ఒకరి నొకరు వదలక ఊర్వశీ పురూరవులు ఉంటారు.

ఊర్వశీపురూరవుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సత్యశీలత, దాంపత్య ధర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఇద్దరికి మధ్య పైటకొంగు అడ్డమైనా 'ప్రాణాలు వదిలేస్తారా' అన్నంతగా కలిసి ఉండేవారు.

ఈ విధంగా ఊర్వశీ పురూరవులు ఇరువురు ఒకరిపై ఒకరికి ప్రేమ అధికంకాగా పగలనక రేయనక అన్నిచోట్ల విహరిస్తూ ఉండగా, ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నవేళ సభలో ఊర్వశి లేకపోవడంచూచి.

ఇన్నాళ్ళవలె నా సభాంతరములోని వేదిక ఊర్వశి లేకపోవడంచేత వన్నె తగ్గిన పైడిలా తెల్లబోయి ఉంది అంటూ

ఇంద్రుడు గంధర్వులను పంపించగా, వారు అర్ధరాత్రమున చీకటిలో వెళ్ళి, ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్ళను బంధించారు. అవి రెండు మొర పెట్టాయి. ఆ ఆర్తనాదాలను విని శృంగార క్రీడలలో అలసి నిద్రిస్తున్న పురూరవుని ఆలింగనంలో ఉన్న ఊర్వశి ఇలా అంది.

నా బిడ్డలైన పొట్టేళ్ళను దొంగలువచ్చి, అహంకారంతో, మదంతో తీసికొనిపోతున్నారు. ఆ దొంగలకు అడ్డుపడలేక ఈ మగపంద నిద్రలో కళ్ళు మూసికొని నా కౌగిలి వదలకుండా పడి నిద్రపోతున్నాడు అయ్యో!

శత్రువులు దొంగలను పంపితే, వారిపై తన పౌరుషాన్ని చూపలేక, ఆడువారి కౌగిళ్ళలో మగతనాన్ని చూపే మగాడు, పురుషుడుగా ఉండటంకంటె ఆడుదిగా ఉంటే బాగుంటుంది.

తక్కువతనము గలవానికి భార్య కావడంకంటె అధిక గుణసంపన్నుని ఇంటిలో దాసిగా ఉండటం ఆడవారికి మేలు. నీచుణ్జి పొంది ఆడుతనాన్ని హింసించడంకంటె పొందుకోరక ఊరకే ఉండటమే మంచిది.

నీ రాచరికం ఎందుకు? ఒక ఆడుది మొరపెడుతూ ఉంటే, పశువులు ఆతురపడుతూ ఉంటే, ఆడుది పిలుస్తోంది కదా అని లేవవు, దొంగలను దూరంగా తరిమికొట్టవు. శవంలా పడి ఉంటావు.

విని కూడా ఏమీ విననట్లుగా ఉంటావు; యుద్ధభీతి గలవాడిని, మనుజులలో అధముని, ఎల్లప్పుడు నిద్రపోయేవాడిని మందుడు అయిన నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మకంటె వెర్రివాడు ఉంటాడా (ఉండడు అని భావం).

అని ఈ ప్రకారంగా ఆ ఊర్వశి కఠినపు మాటలనే కత్తులు చెవిలో చొప్పించగా, రాజశ్రేష్ఠుడైన పురూరవుడు అంకుశపు పోట్లకు విజ్బంభించే మత్తేభంవలె, బట్టమరచి, దిగంబరుడై, కత్తి చేతబట్టి, ఆ అర్ధరాత్రంలో, దొంగలను నరకి, పొట్టేళ్ళను విడిపించుకొని, తిరిగివచ్చే సమయంలో

దిగంబరంగా ఉన్న పురూరవుణ్ణి ఊర్వశి చూచింది. అనుకున్న మాట ప్రకారంగా ఊర్వశి అతనికి కనపడకుండా వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యం కాగా, పురూరవుడు వెఱ్ఱివాడిలా తనను తాను స్వాధీనపరచుకోలేక మిక్కిలి దుఃఖించి అవస్థ పడ్డాడు.

పురూరవుడు మన్మథుని బాధకు తాళలేక ఊర్వశి కొరకు అన్వేషిస్తూ, సరస్వతీ నదీతీరంలో సఖీజనంతో కూడి ఉన్న ఊర్వశిని చూచి వికసించిన మోముతో ఇలా అన్నాడు.

ఓ ఊర్వశీ ఇలా నన్ను విడచి రావడం నీకు ధర్మమా! సంతోషమా! మనం కొన్ని ఒడంబడికలు చేసికొన్నాము కదా! అవి మేర తప్పటం బాగున్నదా! నిన్ను నేను విడిచినప్పటినుండి నా శరీరం నా స్వాధీనంలో లేదు. ఈ శరీరం భూమిపై పడకపూర్వమే (చనిపోక పూర్వమే) నన్ను దయాదృష్టితో వీక్షించు.

పురూరవుని పలుకులు విని ఊర్వశి ఇలా అన్నది.

స్త్రీలకు ఇంతగా లొంగిపోతావు. నీవసలు మగవాడవేనా? ఇలా మృగంలా దుఃఖించడం నీకు న్యాయమా? మనుష్యరూపంలో ఉన్న పశువును చూచి పశుజాతి “మనకంటె వీళ్ళు అజ్ఞానంగా ఉన్నారే” అనే భావంతో అసపహ్యించుకుంటాయి తప్ప కనీసం ఆహారంగానైనా స్వీకరించవు.

అంతేకాకుండా, వెలయాండ్ర ఆలోచనలు అగ్నిహోత్రాలవలె మంటలెగసిపడుతున్నాా మాటలు తీయని అమృతవర్షంలా ఉంటాయి. సాక్షాత్తుగా మన్మథుడే భర్త అయినా మెచ్చే లక్షణం వీరికి ఉండదు. అంతటి అందగాడైన మన్మథునే మెచ్చని వీరు ఇతరులను ప్రేమిస్తారా? కృతజ్ఞతలేక, క్రూరమైన భావాలు కలిగి తనకు తోడునీడగా ఉండే భర్తనైనా చంపడానికి వెనుకాడరు. ధర్మం లేనివారు, దయలేనివారు, చంచలమైన మానసిక స్థితిగలవారు వీరు. అటువంటి వేశ్యల మాటలు జ్ఞానాన్ని ఉపదేశించే వేదాంతసూక్తా లనుకొన్నావా?

ఓ రాజా! పురూరవా! ఇంకొక సంవత్సరం గడిచాక ఆ తరువాతి రోజు రాత్రి నీవు నా సంగమానికి వచ్చి శుభలక్షణ లక్షితులయిన కుమారులను కంటావు. ఏ మాత్రము నా మాటలను శంకించవద్దు అని ఊర్వశి పలుకగా రాజు పురూరవుడు ఊర్వశిని గర్భవతిగా భావించి మనసులో ఏ మాత్రం సంకోచించక తన పట్టణానికి వెళ్ళాడు.

ఇలా వెళ్ళి తన పట్టణంలో ఒక సంవత్సరం ఉండి, తరువాత ఊర్వశి దగ్గరకు వెళ్ళి ఒక రాత్రి ఆమెవద్ద ఉండగా, ఊర్వశి 'నీవు గంధర్వులను వేడుకో. వారు నన్ను నీకు ఇస్తారు' అని చెప్పగా పురూరవుడు గంధర్వులను ప్రార్ధించగా, గంధర్వులు పురూరవుని పొగడ్తలకు మెచ్చుకొని, ఒక అగ్నిస్థాలిని (కుంపటిని) పురూరవునకు ఇవ్వగా, ఆ అగ్నిస్థాలిని ఊర్వశిగా భావించి దానితో అడవంతా తిరిగి ఒకరోజు అది ఊర్వశి కాదు అగ్నిస్థాలి అని గ్రహించి, దానిని అడవిలో విడిచి, ఇంటికి వెళ్ళి, నిత్యం ఊర్వశినే చింతిస్తూ ఉండగా, త్రేతాయుగం వచ్చింది. ఆ రాజైన పురూరవునకు కర్మానుష్ఠానాన్ని బోధించే మూడు మార్గాలుగా వేదాలు తోచాయి. అంత పురూరవుడు అడవిలోని అగ్నిస్థాలి వద్దకు వెళ్ళి అక్కడ జమ్మిచెట్టు నుండి పుట్టిన రావిచెట్టును చూచి, ఆ రావి కొమ్మలతో అగ్నిని మథించే రెండు కొయ్యలు తయారు చేశాడు. (వాటిని అరణులు అంటారు) అందులో మొదటి అరణిని తానుగా, రెండవ అరణిని ఊర్వశిగా, మధ్యనున్న కాష్ఠాన్ని పుత్రుడుగా భావన చేస్తూ మంత్రజపం చేస్తూ ఆ అరణులను మథిస్తుండగా జాతవేదుడనే పేరుగల అగ్ని పుట్టాడు. ఆ అగ్ని మంత్రారాధన పూర్వక సంస్కారంతో ఆహవనీయాది మూడురూపాలుగా ప్రవర్తిల్లి పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డాడు. పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డ ఆ అగ్ని పురూరవుణ్ణి పుణ్యలోకాలకు పంపుటకు కారణం అవడంచేత

సుగుణాన్వితుడైన పురూరవుడు తన పుత్రునిగా చెప్పబడ్డ అగ్నిచేత అనంతుడు, హరి, వేదమయుడు, లక్ష్మీదేవితో కూడినవానిని గూర్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం తన ప్రియురాలైన ఊర్వశిని చూడడానికి వెళ్ళాలనే కోరికతో చేశాడు.

త్రేతాయుగంలో అగ్ని ఒకే రూపంతో ఉండేవాడు. దైవమైన పురుషోత్తముడు ఒకేరూపంలో ఉండేవాడు. సమస్త భాషాస్వరూపమైన వేదము ఒకటిగానే ఉండేది. నిత్యనూతనంగా ప్రకాశించే ఓంకార ప్రణవాక్షరము ఒక్కటిగా ఉండేది. ఒకే ఒక్క ఆకారంలో ఉన్న పై అంశాలు సామాన్యులకు తేలికగా అవగతం అవడంకోసం పురూరవుడు తన అమితమైన ధీశక్తితో మూడు మూడుగా విభాగం చేశాడు.

ఈ విధంగా వేదవిభాగంచేసి, యాగంచేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వ లోకానికి వెళ్ళాడు, ఆ పురూరవుడు అనే రాజుకు ఊర్వశివల్ల ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే ఆర్గురు కొడుకులు పుట్టారు. ఆ ఆరుగురిలో శ్రుతాయువునకు వసుమంతుడు, సత్యాయువు అనేవానికి ద్రుతంజయుడు, రయుడు అనేవానికి శ్రుతుడు, ఏకుడు అనే ఇద్దరు జన్మించారు. జయునకు అమితుడనేవాడు, విజయుడు అనేవానికి భీముడు జన్మించారు. ఆ భీమునికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, హోత్రకునకు గంగాప్రవాహాన్ని తన నోటిపుక్కిలిలో బంధించిన జహ్నుడు, ఆ జహ్నుడికి పూరుడు, పూరునకు బాలకుడు, ఆ బాలకునికి అజకుడు ఆ అజకునికి కుశుడు, ఆ కుశునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే నలుగురు జన్మించారు. అందులో కుశాంబుడు అనేవానికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేసే సమయంలో

గాధిరాజు కుమార్తె సత్యవతిని ఋచికుడనే బ్రాహ్మణుడు తనకిచ్చి వివాహం చేయుమని అడిగాడు. గాధి ఈ ఋచికుడు తన కుమార్తెకు ఈడు కాడు అనే ఆలోచనతో తెల్లగా సుకుమారంగా ఉండే శరీరాలు, నల్లటి చెవులు గలవేయి గుఱ్ఱలు కన్యాశుల్కంగా ఇస్తే నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఋచికుడు వరుణుని దగ్గరకు వెళ్ళి గాధి కోరినవిధంగా వేయి గుఱ్ఱలను తెచ్చి ఇచ్చాడు. గాధి ఋచికునకు తన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేశాడు.

సత్యవతి, సత్యవతి తల్లి ఇద్దరు ఋచికుని తమకు కొడుకులు కావాలని కోరారు. ఋచికుడు అంగీకరించి బ్రహ్మ మంత్రాలతో, రాజమంత్రాలతో యజ్ఞంచేసి హవ్యాన్ని తయారుచేసి నదీస్నానానికి వెళ్ళాడు.

(పురాణకాలంలో కూడా 'ఉంకువ' (కన్యాశుల్మం) ఇవ్వటం ఉందని తెలుస్తున్నది.)

ఆ ఋచికుడు స్నానానికి వెళ్ళిన సమయంలో సత్యవతి తన తల్లి కోరిన ప్రకారంగా బ్రాహ్మణ మంత్రాలతో యజ్ఞం చేసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికిచ్చి, క్షత్రియ మంత్రాలతో తన తల్లికి తయారు చేయించిన హోమద్రవ్యాన్ని తాను స్వీకరించింది. ఇంతలో ముని వచ్చాడు. ఒకరి చరువును మరొకరు తీసికోవడాన్ని తెలిసికొని భార్య సత్యవతితో ఇలా అన్నాడు.

ఓ చంచలాక్షీ! సత్యవతీ! నీ కొరకు తయారుచేసిన చరువు నీ తల్లికిచ్చి ఆమెకొరకు తయారుచేసిన చరువు నీవు ఎందుకు తీసికొన్నావు? విను. నీకు క్రూరమైన ఆలోచనలుగల కొడుకు, నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడుతారు.

ఋచికుడు తన భార్యను ప్రశ్నించేసరికి సత్యవతి భయపడి, మ్రోక్కి వినయంగా మాట్లాడగా, ఆ మాటలకు ఋచికుడు జాలిపడ్డాడు. నీ కొడుకు సాధువై, నీ మనుమడు క్రూర కర్ముడవుతాడని దయదలచి పలికాడు. సత్యవతికి సాధువైన జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీనదిగా మారి లోకాలను పవిత్రం చేస్తూ ప్రవహించింది. ఆ జమదగ్ని రేణువనే వాని కుమార్తె రేణుకను పెండ్లి చేసుకొని వసుమనాది పుత్రులను కన్నాడు. అందులో

విష్ణుమూర్తి యొక్క అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. అతడు తనచేతి గొడ్డలితో రాజుల శిరములను ఇరువదియొక్క మార్లు నరికాడు.

ఆ మాటలు ఆలకించి పరీక్షిత్తు శుకమహర్షితో ఇట్లన్నాడు.


పరశురాముని చరిత్రము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

Bhavishyadrajetihasa the stories of the kings of the Chandravanshi dynasty - భవిష్యద్రాజేతిహాసము

భవిష్యద్రాజేతిహాసము

'శ్రీ శుకమహర్షి తన తండ్రి వ్యాస భాగనుడు తనకుపదేశించిన భాగవతాన్ని పరీక్షన్మహారాజునకు వినిపిస్తున్నాడు' అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు.

వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు మొదలైన కొడుకులు పదిమంది కలిగారని చెబుతారు కదా! ఇక్ష్వాకువంశం ఎలా ప్రవర్తిల్లింది? ఆ వంశంలో వెనుకటివాళ్లను గూర్చి, ఇప్పటివాళ్లనుగూర్చి, పుట్టబోయే వాళ్ళను గూర్చి దయతో నాకు విశదీకరించు అని పరీక్షిత్తు ప్రార్థించకగా శుకమహర్షి ఇక్ష్వాకు మహారాజునుండి అభిమన్యుని చేతిలో మరణించిన బృహద్బలుడి వరకు వంశచరిత్రను, వారి వంశంలో విశేష చరిత్ర గలవారిని గూర్చి ఇంతవరకు చెప్పాడు. ఇక్ష్వాకువంశంలో బృహద్బలుని తరువాత జన్మించబోయే రాజులను గూర్చి తెలియజేస్తున్నాడు శుకమహర్షి.

ఓ పరీక్షన్మహారాజా! నీ వంశంలో ఇక్ష్వాకుడు మొదలుగా బృహద్బలునివరకు ఉన్న రాజుల చరిత్రను నీకింతవరకు చెప్పాను. ఇక్ష్వాకువంశంలో ఇకపై పుట్టబోయే రాజులనుగూర్చి తెలియజేస్తాను.

ఆ బృహద్బలుడికి బృహద్రణుడు, ఉరుక్షతుడు, వత్సప్రీతుడు, ప్రతివ్యోముడు, భానుడు, సహదేవుడు, బృహదశ్వుడు, భానుమంతుడు, ప్రతీకాశ్వుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, సుతక్షత్రుడు, ఋక్షకుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్వాజి, బర్హి, ధనంజయుడు, రణంజయుడు, సృంజయుడు, శాక్యుడు, శుద్దాదుడు, లాంగలుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, ఋణకుడు, సురథుడు, సుమిత్రుడు క్రమంగా జన్మిస్తారు, సుమిత్రుని తరువాత సూర్యవంశం నశిస్తుంది. వీళ్ళు బృహద్బలుడి నుండి క్రమంగా జన్మించేవారు అని శుకుడు ఇలా అన్నాడు.

ధన్యుడైన ఇక్ష్వాకు పుత్రుడు నిమి యాగం చేయాలనే ఆలోచనతో ఆ యజ్ఞానికి వసిష్ఠుని ఋత్విక్కుగా ఉండి నిర్వహింపుమని కోరాడు. వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞం చేయించడానికి ఇంతకుముందే ఒప్పుకొని ఉన్నాను. అది పూర్తి అయిన తరువాత వస్తాను. ఏ లోటూ ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన నిమి “సంసారం నిలకడలేనిది. కాలయాపనం చేయడం మంచిది కాదు". యజ్ఞం చేద్దామని ఆలోచించి ఇతర ఋత్విక్కులను పిలిచి వారిచే యజ్ఞం చేయించాడు. 
వసిష్ఠుడు ఇంద్రుని యాగం పూర్తి చేయించి వచ్చి తాను లేకుండా యజ్ఞం పూర్తి చేయటాన్ని చూసి సహించలేక ఆయన శిష్యునిపై ఆగ్రహించి 'ఓరీ నేను వచ్చేదాక ఆగలేకపోయావు' అంటూ అతని శరీరం కూలిపోవాలని నిమి చక్రవర్తిని శపించాడు.

ఈ విధంగా వసిష్ఠుడు తనను శపించగా, నిమి కూడా వసిష్ఠుని దేహం కూలిపోవుగాక! అని తిరిగి శపించాడు. ఆ వసిష్ఠుడు ఊర్వశి అనే అప్పరసకు మిత్రావరుణుల వలన జన్మించాడు. శాపాంతకాలంలో బ్రహ్మజ్ఞాని నిమి గురుశాపంవల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిమిదేహాన్ని మునీశ్వరులు సుగంధవస్తువులతో భద్రపరచి, ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం పూర్తి అయిన తరువాత మెచ్చి వచ్చిన దేవతాబృందానికి నిమిదేహాన్ని చూపించి 'ఇతనిని బ్రతికించండి' అని ప్రార్ధించారు. 'నిమి ప్రాణం వచ్చుగాక' అని దేవతలు ఆశీర్వదించారు. కాని నిమి మాత్రం తన శరీరాన్ని పొందడానికి ఇష్టపడక ఇలా అన్నాడు.

మోహంవల్ల కలతపొంది, మమతాహంకారాలకు మూలమై, సుఖదుఃఖాలతో పీడింపబడి, అశాశ్వతమైన ఈ దేహంతో సంసర్గం నాకెందుకు? ఎప్పుడు, ఎవరిచేతికి, ఎలా చిక్కి ప్రాణం కోల్పోతుందో తెలియక భయపడే చేప బ్రతుకులాంటి జీవనాన్ని విజ్ఞులు అంగీకరించరు. కావున నేను పరమేశ్వరుని మనసులో సేవిస్తాను.

నిమి పల్కిన మాటలు విన్న దేవతలు కాదనలేక, శరీరధారులు కళ్ళు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. అంత

మునీశ్వరులు రాజ్యానికి రాజు లేకపోతే అరాజకత్వం వస్తుందని భావించి నిమి శరీరాన్ని మథించగా దానినుండి ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుణ్ణి లోకాలన్నీ జనకుడు అని పిలిచాయి.

నిమిని మధించగా పుట్టినవాడు వైదేహుడని, మథించడంవల్ల పుట్టడంచేత మిథిలుడని పేరు పొందాడు. మిథులుడు నిర్మించడంవల్ల ఆ నగరానికి మిథిలానగరం అని పేరు వచ్చింది. ఆ జనకునకు ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, వానికి సుకేతుడు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రథుడు, వానికి మహావీర్యుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతుడు, వానికి హర్యశ్వుడు, వానికి మరువు, అతనికి ప్రతింధకుడు, వానికి కృతరయుడు, వానికి దేవమీధుడు, వానికి విధృతి, వానికి మహాధృతి, వానికి కీర్తిరాతుడు, వానికి మహారోముడు, వానికి స్వర్ణరోముడు, వానికి హ్రస్వరోముడు, వానికి సీరధ్వజుడు జన్మించారు.

సీరధ్వజుడు యజ్ఞభూమిని దున్నిస్తూ ఉండగా, నాగేటి కర్రుకొనకు తగిలి, సీత లభించింది. ఆమె శుభలక్షణాలు గల దేహం కలిగింది. ఈ కారణంచేత సీరధ్వజుడు అనే ప్రశస్తి కలిగి అతడు ధన్యు డయ్యాడు.

(జనక, వైదేహ, మిథిల, సీరధ్వజ అనే పేర్ల వ్యుత్పత్తిని గుర్తిస్తే జనకచక్రవర్తి జీవిత విశేషాల మౌలిక విషయాలు తెలుసాయి.)

ఆ సీరధ్వజునకు కుశధ్వజుడు, కుశధ్వజునకు ధర్మధ్వజుడు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇరువురు కొడుకులు పుట్టారు. వారిలో కుశధ్వజనికి కేశిధ్వజుడు జన్మించాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరి, మితధ్వజునకు ఖాండిక్యుడు జన్మించాడు. అతడు తండ్రివల్ల యజ్ఞయాగాది కర్మకాండలను గూర్చి తెలిసికొని, కేశిధ్వజునకు భయపడి పారిపోయాడు.

ఖాండిక్యునకు భానుమంతుడు, భానుమంతునకు శతద్యుమ్నుడు, శతద్యుమ్నునకు శుచి, శుచికి సనద్వాజుడు, సనద్వాజునకు ఊర్థ్వకేతుడు, ఊర్థ్వకేతునకు అజుడు, అజునకు కురుజిత్తు, కురుజిత్తుకు అరిష్టనేమి, అరిష్టనేమికి శ్రుతాయువు, శ్రుతాయువుకు పార్శ్వుడు; వానికి చిత్రరథుడు, చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునకు సత్యరథుడు, సత్యరథునకు ఉపగురుడు, ఉపగురునకు అగ్నిదేవుని దయవల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునకు సావనుడు, సావనునకు సువర్చసుడు జన్మించారు. ఈ సువర్చసుడే సుభూషణుడని కీర్తింపబడతాడు. ఆ సుభూషణునకు జయుడు, జయునకు విజయుడు, విజయునకు ధృతుడు, ధృతునకు అనఘుడు, అనఘునకు వీతిహవ్యుడు, వీతిహవ్యునకు ధృతి, ధృతికి బహుళాశ్వుడు, బహుళాశ్వునకు కృతి, కృతికి మహావశి జన్మించారు వీరందఱు మైథిలులు అని పిలువబడతారు. యోగీశ్వరుని దయవల్ల వీరు గృహస్థులై ఉండి కూడా కర్మబంధముక్తులై ఆత్మజ్ఞానంతో, ఎల్లప్పుడు పరబ్రహ్మానుసంధానంతో ఉంటారు అని శుకుడు ఇలా అన్నాడు.

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము



Vontimitta Kodanda Rama Swamy - ఒంటిమిట్ట రామాలయం

ఒంటిమిట్ట రామాలయం

ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది.

ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.

గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.

ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే.

స్థల పురాణం
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశిష్టత
ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు.

ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.

గోపురనిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది.

పూజలు,ఉత్సవాలు
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు.

బ్రహ్మోత్సవాలు
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

ప్రస్తుతం ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములు కు అప్పగించింది

Thursday, March 26, 2026

Sri Sita Rama Kalyanam - శ్రీ సీతారాములోరి కళ్యాణం

శ్రీ సీతారాములోరి కళ్యాణం

రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది.

ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.

ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు వనవాసం, రావణుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములోరి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలా మంది నమ్మకం.

రామాయణం ప్రకారం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

రాముడి జననం:
ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికీ చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు మహారాజు. వీరిలో రఘు మహారాజు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు.

శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముడిని రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తారు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘

అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం.

శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది

నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసిన మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్దం లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబటి, వీటిని శ్రీ ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బటి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరలాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.

పానకం విషువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉషాన్ని తగించి, చలవ చేస్తుంది. జీరశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండలో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.

రామకోటి
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.

సమస్త పాపాలను హరించివేసి, సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది. రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.

శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు ... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు.

జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం.

కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి
రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి? అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్ లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి. సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో సమర్పించండి.

ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. శుచిగా లేని సమయాల్లోను ... మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Sri Sita Ramachandraswamy Temple in Bhadrachalam, Telangana - భద్రాచలం శ్రీ సీతా రామచంద్రాస్వామి దేవస్థానం

భద్రాచలం శ్రీ సీతా రామచంద్రాస్వామి దేవస్థానం

పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం రామ భక్తులకు అత్యంత పవిత్రమైనది.

భద్రాచలం ఆలయ చరిత్ర
భద్రాచలం ఆలయ కథ రామాయణ కాలం నాటి పురాణాలు మరియు భక్తితో నిండి ఉంది. పురాణాల ప్రకారం. శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి తమ 14 సంవత్సరాల వనవాసంలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత భద్రాచలం సమీపంలోని దండకారణ్య అడవిలో గడిపాడు.

ఈ ప్రాంతంలో వారు బస చేసిన సమయంలో, శ్రీరాముడు భద్ర అనే గిరిజన భక్తుడి ఆశ్రమాన్ని సందర్శించి, అతని అచంచలమైన దేవుడి కోసం ఆశీర్వదించాడని నమ్ముతారు. ఈ సంఘటన ఆలయ స్థాపనకు మరియు పట్టణం పేరుకు దారితీసిందని చెబుతారు. భద్రాచలం, అంటే "భద్రుని నివాసం" అని అర్థం.

ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు మరాఠా నిర్మాణ ప్రభావాలతో సహా శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయ సముదాయంలో రామాయణంలోని దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో వివిధ మండపాలు లేదా మందిరాలు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి మరియు భక్తులు దైవిక ఆశీర్వాదం కోసం గుమిగూడారు.

విగ్రహ విశిష్టత (వైకుంఠ రామ రూపం)
ఇక్కడి మూలవిరాట్టు రూపం చాలా ప్రత్యేకం. సాధారణంగా రాముడు రెండు చేతులతో కనిపిస్తాడు, కానీ భద్రాచలంలో చతుర్భుజ రాముడిగా (నాలుగు చేతులతో) దర్శనమిస్తాడు.

కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు (కోదండం).
మరో రెండు చేతుల్లో శంఖం, చక్రం ధరించి ఉంటాడు.

సీతాదేవి స్వామివారి ఎడమ తొడపై కూర్చుని ఉండగా, లక్ష్మణుడు పక్కనే ధనుర్ధారియై కొలువై ఉంటాడు.

భద్రాచలం ఆలయ చరిత్ర కేవలం భక్తి కథ మాత్రమే కాదు, రాముడు మరియు అతని భక్తుల శాశ్వత వారసత్వానికి నిదర్శనం, వారి విశ్వాసం కాలానికి అతీతంగా మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది.

భద్రాచలం చేరుకోవడం ఎలా
విమానం ద్వారా: సమీప విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది, భద్రాచలం నుండి దాదాపు 312 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి, మీరు భద్రాచలం చేరుకోవడానికి బస్సులో వెళ్ళవచ్చు.

రైలు ద్వారా: సమీప రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్, ఇది హైదరాబాద్, చెన్నై మరియు విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి, మీరు భద్రాచలం చేరుకోవడానికి బస్సులో వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం:భద్రాచలం రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది మరియు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల నుండి భద్రాచలం బస్సు సర్వీసులు ఉన్నాయి. మీరు సమీప పట్టణాలు మరియు నగరాల నుండి కూడా భద్రాచలం చేరుకోవచ్చు.

Arasavalli Temple - అరసవల్లి దేవాలయం

అరసవల్లి దేవాలయం

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీకాకుళం టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్స్కు తూర్పున 1 KM దూరంలో ఉన్న అరసవల్లి గ్రామంలో ప్రసిద్ధ సూర్యదేవుని ఆలయం ఉంది. మన దేశంలోని రెండు సూర్యదేవాలయాలలో ఇది పురాతనమైనది మరియు అన్నింటిలో ఒకటి. పద్మపురాణం ప్రకారం, మానవజాతి సంక్షేమం కోసం కశ్యప మహర్షి అరసవల్లిలో సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాబట్టి సూర్యుడు కశ్యపాస గోత్రానికి చెందినవాడు. అతన్ని గ్రహ రాజు అని కూడా పిలుస్తారు. ఆలయంలోని 'స్థలపురాణం' ప్రకారం, దేవేంద్రుడు ఈ ఆలయాన్ని కనుగొన్నాడు.

ఒకసారి దేవేంద్రుడు, ద్వారపాలక నంది మాటలను పట్టించుకోకుండా, శివుడు తన సతీమణితో కలిసి ఉన్న అకాల సమయంలో శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారి దర్శనం కోసం బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించాడు. విధుల నిర్వహణలో ఉన్న ద్వారపాలక నంది చొరబాటుదారుడిని తన్నాడు. ఆ విధంగా దేవీ పరిచారకుడు ఇంద్రుడు తన్నడంతో గాయపడి తెలివితక్కువగా పడిపోయాడు. మరియు ఇంద్రుడు తన అపస్మారక స్థితిలో ఒక దేవాలయాన్ని నిర్మించి సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే నంది వల్ల అతని ఛాతీలో గాయం నుండి ఉపశమనం పొందవచ్చని కలలు కన్నాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, అతను కలలుగన్నది గుర్తుకు వచ్చింది.

శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం:
తన కలని అనుసరించి, అతను పడుకున్న ప్రదేశంలో మూడు సార్లు చేతినిండా భూమిని తీసుకున్నాడు మరియు అక్కడ అతను తన ముగ్గురు భార్యలు ఉష, ఛాయ మరియు పద్మినితో ఈ అందమైన సూర్య భగవానుడి విగ్రహాన్ని కనుగొన్నాడు. విగ్రహాల అడుగుభాగంలో మఠర మరియు పింగళ ద్వారపాలకుల బొమ్మలు ఉన్నాయి మరియు పైకి ఇద్దరు దివ్య సాధువులు, సనక మరియు సనాదనలు 'ఛత్రములు' (ఒక గొడుగు) పట్టుకొని ఉన్నారు. సూర్య భగవానుడు అనురా రధసారధి గీసిన రథంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఈ బొమ్మలన్నీ ఒకే నల్లని చక్కగా పాలిష్ చేసిన గ్రానైట్ రాయితో అద్భుతంగా చెక్కబడ్డాయి.

దేవాలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత
కళింగ రాజ్యాన్ని పాలించిన దేవేంద్ర వర్మ ఈ ఆలయాన్ని నిర్మించి 7వ అర్ధభాగంలో సూర్యభగవానుడి ప్రతిమను ఏర్పాటు చేసి ఉంటాడని ఆలయంలో లభ్యమైన రాతి శాసనాలు కొంత వెలుగునిచ్చాయని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. సెంచరీ. రాతి శాసనాల అనువాదం ఆలయంలో దీపాలను ఏర్పాటు చేశారు.

సూర్య భగవానుని ఆరాధన
వివిధ రంగాలు, సంస్కృతులు మరియు మతాల ప్రజలను కలిసి ప్రజలను ఆకర్షించడం మరియు దేవుడు ఒక్కడేనని మరియు శివుడు మరియు కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని విశ్వసించేలా చేయడం ఈ ఆలయం ప్రత్యేక లక్షణం. ఐదు విగ్రహాలు (ఆలయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రతిష్టించబడిన పంచాయతన) అవి : - 1. ఆదిత్య 2. అంబిక 3. విష్ణువు 4. గణేశుడు 5. మహేశ్వరుడు, అన్ని విశ్వాసాలను సూచిస్తాయి. చివరగా ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు, త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల స్వరూపులుగా పురాణాలు చెబుతున్న ప్రధానమైన సూర్య భగవానుడికి వెళ్లి పూజిస్తారు.

పుష్కరిణి
సూర్యభగవానుడు అతని కోరికను మన్నించి అదృశ్యమయ్యాడు. ఇంద్రుడు తన 'వజ్రాయుధ'తో తవ్వి ఒక చెరువును ఏర్పరచాడు, దీనిని ఇంద్రపుష్కరిణి అని పిలుస్తారు. నేటికీ భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి పూజలు చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం పొందవచ్చని భావిస్తారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి గుడి వైపు తిరిగి కళ్లు తెరిచి ఏం చూస్తారు! వారి ముందు సూర్య భగవానుడి విగ్రహం దాని గొప్ప శోభతో మరియు బంగారు రంగు అంగవస్త్రాన్ని ధరించింది. అరుదైన వజ్రాలు పొదిగిన కిరీటం, కరుణతో నిండిన 'అభయ ముద్ర' విశాలమైన కళ్ళు ఉన్న చేతులు, చెవిపోగులు, వజ్రాలు పొదిగిన సమాధి మరియు కానీ మనోహరమైన ముఖం. అతని దర్శనం ప్రపంచంలోని అన్ని కోరికల నెరవేర్పుకు హామీ ఇస్తుంది. ఈ ఆలయాన్ని దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ రూపొందించారు మరియు నిర్మించారు.

అరసవల్లి మహాత్మ్యం
ద్వారపరయుగంలో బలరాముడు నాగావళి నదిని తన పైరుతో పాటు కొనుగోలు చేసి నాగావళి నది ఒడ్డున ఆలయాన్ని ప్రతిష్టించాడు. అది ఉమా మరియు రుద్ర కోటేశ్వరాలయం. దేవదూతలందరూ మరియు వారి సేవకులు నాగావళి ఒడ్డుకు చేరుకుని, స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు, ఏదో ఒకవిధంగా ఆలస్యంగా వచ్చిన రుద్రునికి నమస్కరించారు. అతను వచ్చేసరికి అర్థరాత్రి అయింది. ఆ సమయంలో నందీశ్వరుడు, రుద్రుని మహా వాహనుడు ద్వారం వద్ద జాగారం చేస్తూ ఉన్నాడు. రుద్రుడు మాతా పార్వతితో విశ్రాంతి తీసుకునే సమయం కావడంతో అతను ఇంద్రుడిని లోపలికి వెళ్లనివ్వలేదు.

ఇంద్రుడు ఆలయంలోకి ప్రవేశించాలనే తన డిమాండ్లో మొండిగా ఉన్నాడు, అతని వికృత పట్టుదలకు కోపంతో, నందీశ్వరుడు అతన్ని తీవ్రంగా తన్నడంతో పాటు గాలిలో తూర్పు వైపుకు పంపాడు. బాధాకరమైన స్థితిలో ఇంద్రుడు స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు, అతను తన శరీర నొప్పులు మరియు అలసట నుండి ఉపశమనం కోసం సూర్య భగవానుడికి ప్రార్థన చేసాడు. సూర్య భగవానుడు అతనిని కరుణించాడు మరియు అతని అసంఖ్యాక కిరణాలతో ఇంద్రుడిని తాకాడు మరియు ఇంద్రుడు తన బలాన్ని తిరిగి పొందాడు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందాడు. తన బలాన్ని మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగించిన సూర్య భగవానుడికి అతను కృతజ్ఞతతో ఉన్నాడు. తాను ఎప్పటికీ అక్కడే ఉండడానికి మరియు తన సమయాన్ని గడపడానికి అనుమతించమని అతను సూర్య భగవానుని వేడుకున్నాడు.

Guttikonda Bilam - గుత్తికొండ బిలం

గుత్తికొండ బిలం

గుత్తికొండ బిలం, కొండల నడుమ పకృతిశోభతో బిలం ప్రసిద్ధక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రజావిశ్వాసం. దీనికి దక్షిణకాశి అనే పేరు ఉంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల - నర్సరావుపేట రహదారి పై ఉంది. మాచర్లకు 65 కి.మీ. కారంపూడికి 30 కి.మీ. నర్సరావు పేటకు 30 కి.మీ. దూరంలో ఉంది.

చరిత్ర
గుత్తికొండబిలం (గుహ) పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం. 13వ శతాబ్దంనాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం.సా.శ. 1754వ సంవత్సరంలో స్వయంప్రకాశఅవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడు. పురావస్తువారి అన్వేషణలో అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడ లభించగా, దానిని హైదరాబాదు పురావస్తుశాలలో పదిలపరిచారు. బిలంలో 101 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. కార్తీకమాసంలో జిల్లా నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

బిలం విశేషాలు
ఈ బిలం ప్రకతి సహజ సిద్దంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శిస్తారు. తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు ఎప్పడు ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి.

ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిలమహొత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం, రహస్యాలకు కేంద్రబిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం.

భారతమాత ఆలయం
ఈ బిలం దగ్గర భారతమాత అరుదైన ఆలయం ఉంది. చాగల్లు (నకిరికల్లు) కు చెందిన ఆలపర్తి గోవర్ధనమ్మ 2008లో ఈ ఆలయాన్ని కట్టించింది.

ఉద్యమవేదిక
ఆధ్యాత్మకంగా, పర్యాటక కేంద్రమైన గుత్తికొండ బిలానికి ఉద్యమవేదికగా కూడా పేరుంది.

రోడ్డు మార్గం
ప్రకృతి రమణీయతతో అలరించే ఈ బిలానికి రావాలంటే శ్రమించక తప్పదు. మాచర్ల లేదా నర్సరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి.

The Chandra Vansha King Legends - చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది రాజుల ...