బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట
వశిష్ఠుడు దిలిపునితో మరల ఇట్లు వివరించెను. రాజా! ఒకప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు వాదములాడుచుండిరి. ఆ వాద మెట్టిదనిన
ఒకనాడు బ్రహ్మదేవుడును పరమేశ్వరుడును 'నేను ఆధికడను' అని ఒకరు, కాదు 'నేనే సర్వాధికుడను' అని మరి ఒకరు తగవులాడుకొనిరి. పద్నాలుగు లోకాలకు అధివతిని నేను అని సాంబశివుడనగా "ఓ మహేశా! నీవు అధిపతి వెట్లగుదువు? ఆ పద్నాలుగు లోకాల జీవరాసులు పుట్టించిన సృష్టికర్తను నేను. గనుక నీ కంటే నేనే గొప్పవాడను". అని బ్రహ్మ వధించెను. వడ ప్రతి వాదములు పెద్దవయ్యేను. అటుల వెయ్యేండ్లవరకు కొనసాగించినందున సృష్టి కార్యక్రమములు స్థంభించిపోవుచున్నావని విష్ణువు విశ్వరూపముతో ప్రత్యక్షమయ్యెను.
బ్రహ్మ, ఈశ్వరుడు ఆ విరాటరూపమును తిలకించినారు, అందు సమస్తలోకములు ఇమిడి యున్నవి. సప్తసముద్రాలు ఘర్జించుచున్నవి. ఆ విశ్వరూపుని చెవులలో ఒక వైపు బ్రహ్మ, మరొక వైపు ఈశ్వరుడు కనబడిరి. ఇది అంతయు బ్రహ్మ, మహేశ్వరులు చూచి గంధ పుష్ప అక్షతలతో పూజించిరి. ఆ విశ్వరూపుని ఆ విశ్వవ్యాప్తుని, విరాట స్వరూపుని ఆధ్యంతములను ఎవరు తెలిసికొని వచ్చెదరో వారే అధికులని నిశ్చయించి బయలుదేరినారు. అట్లు వారు వెయ్యేండ్లు తిరిగినారేగాని ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకొనలేక విసిగిపోయి మరల యధాస్థానమునకు వచ్చి ఇట్లు వాపోయినారు.
వెయ్యేండ్లు రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి అలసిపోయినా మే గాని ఈ విరాటరూపుని ఆద్యంతములు తెలుసుకొన లేక పోయాము. గాన మనమెవరమూ అధికులము కాము. ఈ సృష్టి కంతకు మూల కారకుడు మహా విష్ణువే. ఇతడే సృష్టికర్త ఇతడే లయకారుడు, ఇతడే సర్వాంతర్యామి. తన కుక్షి యందిడుకొని కాపాడు కళ్యాణధాముడు ఇతడే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, సర్వలోకాలను ఏకైకనాధుడు అట్టి మహానుభావుడగు నారాయణుడే అధికుడుగాని మనమెవ్వరమూ అధికులము కాజాలము. అని నిశ్చయించుకొని విష్ణుమూర్తిని స్తోత్రం చేయగా తన విరాట స్వరూపాన్ని వదలి యధరూపముతో "ఓ అన్నలారా! మీరిద్దరునూ ఎంతో కాలమునుండి కలహించుచున్న విషయము గురించి మీకు జ్ఞానోదయము కలుగుటకు నేనీ విశ్వరూపమును మీకు చూపదలచి ఇట్లు చేసితిని. నాయొక్క రూపమునకు అది అంతమును కనుగొనలేక నిశ్చేష్టులయి మీ కలహాన్ని ఆపుచేసితిరి. సమస్త భూమండలానికి, సమస్త ప్రాణికోటికి, సమస్త దేవతలకు సృష్టికర్తను నేనేయని గ్రహించి స్తుతించిరి. మీ రెండులకి కలహించుకొంటిరో చెప్పెదను వినుడు.
మీరిరువురు రజోగుణ తమోగుణములకు కట్టుబడి యుండుటచే మీకీ అహాంభావం కలిగినది. సత్త్వము, రాజము, తమము అను మూడు గుణములు కలవు. ఈ మూడు గుణాలుగలవాడే
గొప్పవాడు. అతడు తేజోవంతుడగును. ఈ సృష్టికి పూర్వం ఈవిశ్వమంతా చీకటిగా వుండేది. పంచభూతాలు సృష్టింవబడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకు ఉపక్రమించినాను. ఒక బంగారుగోళమును చేసి దానికి అవయవస్ఫుటం కలిగించి మూడు రూపములుగా చేసితిని. ఆ మూడు రూపములే మీరు నేనున్నూ, మనముగ్గురం సృష్టి స్థితిలయములకు ముఖ్యకారకుల
మైనాము. సృష్టిని చేయువాడు బ్రహ్మగాను, పోషించువాడుగా నేను నాశనం చేయువాడు శివుడుగాను. ఏర్పడితిమి. గనుక మనం త్రిమూర్తులము. నేనే మీరు మీరే నేను. నాకు పూజలు చేసిన మీకు చెందును, మీకు పూజలు చేసిన నేను పొందుదును. గనుక మిరిరువురకునూ భేదమేలేదు. మొదటలేని భేదము ఇప్పుడెందులకు కలిగినది? మీకున్న రజోగుణ, తమోగుణ ప్రభావముల వలనే అహాంకార పూరితులై ఇట్లు ప్రవర్తించినారు గాన శాంతింపుడు.
బ్రహ్మదేవా! సమస్తప్రాణులను సృష్టించుచున్న సృష్టికర్తవు నీవు, వేదమునకు స్ధానభూతుడవు నీవు. స్వశక్తి చేత యోగమునుపొంది నా నాభికమలమునందు జన్మించినావు. గనుక నీకునూ నాకు భేదము లేదు. అని శ్రీమహావిష్ణువు బ్రహ్మను వారించెను.
తరువాత శివునివైపు తిరిగి “ఓ సాంబశివా! నీవు సమస్తలోకములకు ఆధార కర్తవు. దేవతలచే సదా పూజింపబడువాడవు. పరమానంద స్వరూపుడవు. శరణాగతరక్షకుడవు. బ్రహ్మజ్ఞానివి, ప్రళయ కాల
రుద్రుడవు. ఓంకార స్వరూపుడవు. పరమేశ్వరుడవు. నీ ఘనతను తెలుసుకొనగోరి నారదుడొకనాడు నా వద్దకువచ్చి శంకరుని మహాత్మ్యమును వివరింపమని కోరగా నాతనికి నీచరిత్రమును తెలిపితిని. అప్పటి నుండి నారదుడు నిన్ను అనేక విధములుగా స్తోత్రము చేయుచున్నాడు.
నారదునివలన సమస్త లోకాలకు నీ మహిమ వెల్లడయినది.
నీవు పరబ్రహ్మవు ఈ ప్రపంచమంతయు నీ రూపమే. నావలెనే నీవునూ అంతటా వ్యాపించి యున్నావు. నీకును నాకును భేదమేలేదు. కోటిసూర్యప్రకాశితుడవు. మేరుపర్వత నివాసుడవు సర్వప్రవంచాన్ని నీరౌద్రరూపంచే నాశనము చేయగలవాడవు. నీ కోపాగ్నికి ముల్లోకములు గడగడ వణికిపోవును, నీవు శక్తి స్వరూపుడవు అనంతుడవు ఆది దేవుడవు, ఆత్మస్వరూపుడవు, భక్తులు నిన్ను 'శివ శివ' యని ప్రార్ధించినంత మాత్రమున వారి కష్టములు పోగొట్టువాడవు. అట్టినీవు ఇంత పంతము పూనుట న్యాయమా? నేనే నీవు, నీవే నేను అందువలననే శివకేశవులని మనలను భక్తులు వూజించుచున్నారు. నీవు నిర్వికల్ప నిరాడంబరుడవు, త్రినేత్రుడవు, సదా ధ్యాన స్వరూపుడవు. భక్తులు నిన్ను ధ్యానింతురు భక్తులకు నీవు ధానము చేయుదువు. పార్వతీదేవిని నీ అర్ధశరీరములో నిల్పుకొన్నవాడవు, నందివావానారూఢుడవు పరాత్పరుడవు గాన నీవును నాతో సమానుడవే అని ఈశ్వరునికి విష్ణుమూర్తి తెలిపెను.
ఈ విధంగా బ్రహ్మకు ఈశ్వరునికి వారి వాదనల సారాంశమును తెలియపరచి, ఇద్దరికి సఖ్యత కుదిర్చెను. అంత బ్రహ్మయు మహేశ్వరుడును జగదాధారుడయిన శ్రీమహావిష్ణువును స్తోత్రము చేయగా శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సహితముగా అంతర్దానమయ్యెను.