నారాయణమహర్షీ ! నా జన్మ ధన్యమయ్యింది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. పరాప్రకృతి అయిదురూపాలు ధరించిందికదా! వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చెయ్యాలి? లోగడ ఎవరు చేశారు ? ఏ వరాలు పొందారు? సోత్రం ధ్యానం ప్రభావం -
ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి ఆరంభించాడు.
నారదా! దుర్గ - రాధ - లక్ష్మి - సరస్వతి - సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి అయిదు రూపాలు ధరించింది. వీరి పూజావిధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరితం అమృత ప్రాయం - సర్వమంగళప్రదం. వీరు ప్రకృతికి అంశకళలు. సవిస్తరంగా చెబుతాను సావధానుడవై ఆలకించు. వీరితోపాటు కాళి - వనుంధర - గంగ - షష్ఠి - మంగళచండిక - తులసి - మానస - నిద్ర - స్వధా - స్వాహా - దక్షిణాదేవుల చరితలూ చెబుతాను. సంగ్రహంగా కొందరివీ విస్తరంగా కొందరివీ తెలియజేస్తాను. దుర్గా రాధలది విస్తీర్ణమైన చరిత.
బ్రహ్మనందనా! తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతీపూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడుసైతం పండితుడవుతాడు.
కృష్ణాదేవి ముఖంనుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశయై కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్నీ సత్యాన్నీ మృదువుగా ఉపదేశించాడు.
సాధ్వీ! దేవీ! సరస్వతీ! నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజనారాయణుడిని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు. అన్నింటా నాకు తుల్యుడు. కామినీమణుల కామాన్ని గుర్తించగలిగినవాడు తీర్చగలిగినవాడు శతకోటి మన్మథాకారుడు అతడిని సేవించు. అలాకాక నన్నే కాంతుడుగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలూ శక్తిమంతురాలూ రాధ ఉంది. నీకు క్షేమం కాదు. నేనూ కాపాడలేను. ఇతరులకన్నా బలవంతుడుకదా మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుడిని అనీశ్వరుడిని పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుడినే, సర్వశాసకుడినే, కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు. నా ప్రాణాధిష్ఠాన దేవత. అందుచేత రాధను హింసించడమంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాలకన్నా తీపి మరొకటి ఉంటుందా! కాబట్టి ఓ కల్యాణీ! నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. చతుర్భుజుడిని సేవించు. నీకూ నాకూ క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ ఆరిషడ్వర్గవిరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూపగుణాలలో నీకు సరిసమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజనారాయణుడు కూడా మీ ఇద్దరిపట్లా సమానమైన గౌరవాదరాలను చూపిస్తాడు.
సరస్వతీ! నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవమానవజాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమినాడూ, విద్యారంభం(అక్షరాభ్యాసం) లోనూ భక్తిప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంతో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణ్వశాఖోక్త పద్ధతిలో ధ్యానావాహనస్తవాలతో జితేంద్రియులై నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటికను(ప్రతిమ) తయారుచేసి కుండలో (కలశం)గాని పుస్తకంలోగానీ నిక్షేపించి గంధచందనాదులతో అర్చించి. అటుపైని దానిని కవచంగా కంఠసీమలోనో కుడిబుజానికో ధరించినవారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు.
నారదా! ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజను చేశాడు. అటుపైని బ్రహ్మవిష్ణు శివాదులూ అనంతుడూ ధర్ముడూ సనకాదిమునీంద్రులూ సకలదేవతలూ రాజులూ మానవులూ అందరూ చేశారు. ఈనాటికీ సకలలోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది - అని క్షుప్తంగా ముగించాడు నారాయణమహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణ్వశాఖోక్త పద్ధతి ఎమిటో వివరించమని అడిగాడు. పూజాద్రవ్యాలూ నైవేద్యాలూ ధ్యానకవచాదులూ తెలియజెయ్యమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరంగా తెలియజేశాడు.
విరించిసుతా! మాఘశుక్షపంచమినాడుగాని అక్షరాభ్యాసంనాడుగాని తెల్లవారుజామునే లేచి శుచియై సంయతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైని సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచారపూజలు చెయ్యాలి. పాలు పెరుగు వెన్న పేలాలు చిమ్మిలి చెరకు పటికబెల్లం తేనె - ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారుచెయ్యాలి. అటుకులు, వరి అన్నం, ఘృత సైంధవ సమ్మిశ్రితమైన హవిష్యాన్నం, యవగోధూమచూర్ణంలో నెయ్యి పాలూ పంచదారా కలిపి చేసిన ప్రసాదం, అరటిపండ్లు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరినీళ్ళు, బదరీఫలం - ఏవైనాసరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళూ ఫలాలూ నైవేద్యానికి పనికివస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికివస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతనవస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పూవులతో దండకట్టి సమర్పించాలి. వేదసమ్మతమైన సరస్వతీధ్యానం తెలియజేస్తున్నాను. ఇది సకలభ్రమభంజకం. శ్రద్ధగా గ్రహించు -
సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం ।
కోటిచంద్రప్రభాముష్ట పుష్టశ్రీయుక్త విగ్రహాం ॥
వహ్నిశుద్ధాంశుకాధానాం వీణాపుస్తకధారిణీం ।
రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం ॥
సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణుశివాదిభిః ।
వందే భక్త్యా వందితాం చ మునీంద్రమనుమానవైః ॥
ఇలా ధ్యానించి, సమస్తమూ అర్పణచేసి, స్తుతించి, కవచం ధరించి సాష్టాంగనమస్కారం చెయ్యాలి. చేసినవారికి సరస్వతీదేవి కులదైవమై సకలశుభాలూ కలిగిస్తుంది. విద్యారంభంలోగాని, సంవత్సరాదినాడుగానీ, ఏ పంచమిరోజునగానీ ఈ పూజ చెయ్యవచ్చు. ఓం - ఐం - హ్రీం - క్లీం - శ్రీం అనే బీజాక్షారాలతో రెండేసితో కలిసి సరస్వత్యై స్వాహా అనేది వైదికాష్టాక్షరీ మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం.
(ఐం హ్రీం క్లీం = బీజత్రయం = తారత్రయం = సరస్వతీ లక్ష్మీ మాయా బీజాక్షరాలు)
ఈ సరస్వతీ మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగాతీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించాడు. పుష్కరక్షేత్రంలో సూర్యగ్రహణంనాడు భృగుమహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణంరోజున మరీచిమహర్షి వాక్పతికి (బృహస్పతి) అనుగ్రహించాడు. క్షీరసముద్రతీరంలో ఆస్తీకుడికి జరత్కారువూ, మేరుశిఖరంమీద విభాండకుడు ఋష్యశృంగుడికీ, శివుడు కణాదగౌతములకూ, సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్క్యులకూ, ఆదిశేషుడు పాతాళంలో పాణినికీ, భారద్వాజుడికీ, శాకటాయనుడికీ ఉపదేశించారు. నారదా! మూలమంత్రాన్ని నాలుగులక్షలు నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడయినబ్దే.
నారదా! గంధమాదన పర్వతంమిద బ్రహ్మదేవుడు భృగుమహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతీకవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణనూ యథాతథంగా చెబుతున్నాను - ఆలకించు.
భృగుమహర్షి: హే బ్రహ్మన్! బ్రహ్మవిదాంశ్రేష్ఠ! బ్రహ్మజ్ఞానవిశారదా! సర్వజ్ఞా! సర్వజనకా! సర్వేశా! సర్వపూజితా! విశ్వజయావహమైన సరన్వతీకవచాన్ని అనుగ్రహించు.
వత్సా! భృగూ! సర్వవాంఛాప్రదమైన సరస్వతీకవచాన్ని ఉపదేశిన్తున్నాను గ్రహించు. ఇది శ్రుతిసారం, శ్రుతిసుఖం, శ్రుత్యుక్తం, శ్రుతిపూజితం. గోలోకబ్బంచావనంలో రాసక్రీడారతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షసమం. అత్యంతగోపనియం. కనీవినీ ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్యగురువయ్యాడు, బృహస్పతి బుద్దిమంతుడయ్యాడు. దేవగురువు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వాయంభువ మనువు సర్వపూజితుడు అయ్యాడు. దీన్ని పఠించినందువల్లా ధరించినందువల్లా విశేషఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్వ పాణిని శాకటాయన కాత్యాయన ప్రభృతులు దక్షులైన శాస్త్రకర్తలయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు. పురాణాలు రచించగలిగాడు. శాతాతప - సంవర్త - వసిష్ఠ - పరాశర - యాజ్ఞవల్క్య - ఋష్యశృంగ - భరద్వాజ - ఆస్తీక - దేవల - జైగీషవ్య - యయాతి ప్రముఖులు సర్వదా సర్వధా గౌరవమర్యాదలు అందుకున్నారంటే దీని మహిమవల్లనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి. బృహతీ ఛందస్సు. శారదాంబికయే దేవత. సర్వ తత్త్వపరిజ్ఞాన - సర్వార్థసాధన - కవితారచనలయందు దీని వినియోగం. బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు.
భృగుమహర్షీ! ఇది బ్రహ్మ మంత్రౌఘరూపం. బ్రహ్మరూపకం. ఈ సరస్వతీకవచానికే 'విశ్వజయము' అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతంమీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడు నీమీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికిబడితేవారికి ఉపదేశించకూడదుసుమా!
దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. అయిదులక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధకవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్గ్మి మహాకవి త్రైలోక్యవిజయి అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంక స్తోత్రమూ పూజావిధానమూ ధ్యానమూ ఇత్యాదులున్నాయి. వాటినికూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను. ఆలకించు.
నారదా! బ్రహ్మదేవుడు భృగుమహర్షికి ఇలా సరన్వతీకవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అదికూడా నీకు తెలియజేస్తాను. తెలుసుకో.
వాగ్దేవీస్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్తుతి చేశాడు. శాపవిముక్తి పొందాడు. గురుశాపంవల్ల ఆ మహాముని ఆవిద్యుడు అయ్యాడు. (నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు). దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్లబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదవేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహాచెప్పాడు. ఆమాటమీద యాజ్ఞవల్క్యుడు నదిలో స్నానం చేసి శుచియై భక్తితో శిరసువంచి సరస్వతిని స్తుతించాడు.
ఓ వాగ్దేవీ! జగన్మాతా! నన్ను దయజూడు. నా తెలివీ నా చదువూ గురుశాపంవల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుడిని అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. స్మృతిని అనుగ్రహించు. విద్యనూ శక్తినీ కలిగించు. గ్రంథరచనాశక్తిని దయచెయ్యి. ఉత్తమశిష్యుడిని సమకూర్చు. ప్రతిభనూ సభాసత్కారాన్నీ అనుగ్రహించు. గురుశాపంవల్ల కోల్పోయిన విద్యలనన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందిట. నువ్వు బ్రహ్మస్వరూపవు. జ్యోతిస్స్వరూపవు. సనాతనివి. సర్వవిద్యాధిదేవివి. హే వాణి! నమోనమః నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్ఠాత్రివి నువ్వు. నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్ఠాత్రివి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైనా నోరుమెదపలేడు. కాలసంఖ్యా స్వరూపిణీ! నమోనమః. భ్రమసిద్ధాంతరూపవు. స్మృతిశక్తి - జ్ఞానశక్తి - బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభాకల్పనా శక్తులుకూడా నువ్వే.
ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడూ సిద్ధాంతం చెయ్యలేక మూగవోయాడు. ఆప్పుడు అక్కడికి శ్రీకృష్ణపరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు ఆలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు.
ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని ఆనంతుణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలుపడ్డాడు. అంతలోకీ కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతీ! నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనస్సులో ఉన్న భ్రమప్రమాదాలను తొలగించాడు.
వ్యాసుడు ఒకనాడు పురాణసూత్రం తెలియజెప్పమని వాల్మికిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. భ్రమాంధకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మలజ్ఞానాన్నీ పురాణసూత్రాన్నీ వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైని వ్యాసుడు పుష్కరక్షేత్రంలో నూరేళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలనూ ఉపపురాణాలనూ రచించగలిగాడు.
వాణీ ! తత్త్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడుకూడా శివుడు నిన్నే ధ్యానించాడు. ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాఙ్మాతా! నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితోపాటు మరికొందరు శిష్యులుకూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచీ వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు.
పలుకులతల్లి! నీ గుణగణాలను కొనియాడటానికి సహస్రముఖ - పంచముఖ - చతుర్ముఖులే (ఆదిశేషుడు, శివుడు, బ్రహ్మ) చాలరంటే ఎకముఖుణ్ణి మానవమాత్రుణ్ణి నేను ఎలా స్తుతించగలను?
యాజ్ఞవల్క్యుడు భక్తిభావనమ్రుడై శిరసువంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు.
దుఃఖభారంతో రోదించాడు. జ్యోతిస్స్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. 'సుకవీంద్రుడవు కమ్ము' అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది.
నారదా! యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీస్తోత్రాన్ని పఠించినవారు కవీంద్రులవుతారు. సంభాషణచతురులవుతారు. బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడుకానీ బుద్ధిహీనుడుకానీ ఒక సంవత్సరంపాటు ఈ స్తోత్రాన్ని పారాయణచేస్తే ఆతడు పండితుడవుతాడు. కవీంద్రుడవుతాడు. మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికీ నిశ్చయం.
నారదమహర్షి! వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపంవల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది.
పుణ్యరూప పుణ్యతీర్థ స్వరూపిణి పుణ్యాత్ములతో సేవలందుకొన్న తపోరూపిణి. తపఃఫలస్వరూపిణి పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీనదిలో మునిగి మరణించినవారికి వైకుంఠంలో స్థిరనివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజునగానీ ఏ సమయానగానీ తెలిసిగానీ తెలియకగానీ విలాసంగాగానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు అతడి పాపాలు అన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతాడు. హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీమంత్రాన్ని ఈ నదీతీరంలో ఒకనెలపాటు జపించినవాడు మహామూర్ఖుడైనా కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసినవారికి మరింక పునర్జన్మ ఉండదు. గర్భవాసదుఃఖం ఉండదు.
నారదా! నాకు తెలిసినంతమటుకు సరస్వతీగుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలను కుంటున్నావో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు.
గంగా సరస్వతుల కలహం
ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః ।
ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు. ॥
ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహా - ఇతి శ్రోత్రే పాతు నిరంతరమ్ ।
ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా - నేత్రయుగ్మం సదాఽవతు ॥
ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా - నాసాం మే సర్వదాఽవతు ।
ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా - చోష్ఠం సదాఽవతు ॥
ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి - దంతపంక్తిం సదాఽవతు ।
ఓం ఐం మిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు ॥
ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు ।
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా - వక్షః సదాఽవతు ॥
ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా - మే పాతు నాభికామ్ ।
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి - మమ హస్తౌ సదాఽవతు ॥
ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా - పాదయుగ్మం సదాఽవతు ।
ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా - సర్వాంగ సదాఽవతు ॥
ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా - ప్రాచ్యాం సదాఽవతు ।
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా - అగ్నిదిశి రక్షతు ॥
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా ।
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు ॥
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్య్రక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు ।
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం - వారుణోఽవతు ॥
ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు ।
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు ॥
ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఈశాన్యాం సదాఽవతు ।
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు ॥
ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా - అధో మాం సదాఽవతు ।
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు ॥ (4 - 85) భృగుమహర్షీ! ఇది బ్రహ్మ మంత్రౌఘరూపం. బ్రహ్మరూపకం. ఈ సరస్వతీకవచానికే 'విశ్వజయము' అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతంమీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడు నీమీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికిబడితేవారికి ఉపదేశించకూడదుసుమా!
దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. అయిదులక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధకవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్గ్మి మహాకవి త్రైలోక్యవిజయి అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంక స్తోత్రమూ పూజావిధానమూ ధ్యానమూ ఇత్యాదులున్నాయి. వాటినికూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను. ఆలకించు.
నారదా! బ్రహ్మదేవుడు భృగుమహర్షికి ఇలా సరన్వతీకవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అదికూడా నీకు తెలియజేస్తాను. తెలుసుకో.
వాగ్దేవీస్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్తుతి చేశాడు. శాపవిముక్తి పొందాడు. గురుశాపంవల్ల ఆ మహాముని ఆవిద్యుడు అయ్యాడు. (నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు). దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్లబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదవేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహాచెప్పాడు. ఆమాటమీద యాజ్ఞవల్క్యుడు నదిలో స్నానం చేసి శుచియై భక్తితో శిరసువంచి సరస్వతిని స్తుతించాడు.
ఓ వాగ్దేవీ! జగన్మాతా! నన్ను దయజూడు. నా తెలివీ నా చదువూ గురుశాపంవల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుడిని అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. స్మృతిని అనుగ్రహించు. విద్యనూ శక్తినీ కలిగించు. గ్రంథరచనాశక్తిని దయచెయ్యి. ఉత్తమశిష్యుడిని సమకూర్చు. ప్రతిభనూ సభాసత్కారాన్నీ అనుగ్రహించు. గురుశాపంవల్ల కోల్పోయిన విద్యలనన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందిట. నువ్వు బ్రహ్మస్వరూపవు. జ్యోతిస్స్వరూపవు. సనాతనివి. సర్వవిద్యాధిదేవివి. హే వాణి! నమోనమః నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్ఠాత్రివి నువ్వు. నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్ఠాత్రివి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైనా నోరుమెదపలేడు. కాలసంఖ్యా స్వరూపిణీ! నమోనమః. భ్రమసిద్ధాంతరూపవు. స్మృతిశక్తి - జ్ఞానశక్తి - బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభాకల్పనా శక్తులుకూడా నువ్వే.
ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడూ సిద్ధాంతం చెయ్యలేక మూగవోయాడు. ఆప్పుడు అక్కడికి శ్రీకృష్ణపరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు ఆలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు.
ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని ఆనంతుణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలుపడ్డాడు. అంతలోకీ కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతీ! నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనస్సులో ఉన్న భ్రమప్రమాదాలను తొలగించాడు.
వ్యాసుడు ఒకనాడు పురాణసూత్రం తెలియజెప్పమని వాల్మికిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. భ్రమాంధకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మలజ్ఞానాన్నీ పురాణసూత్రాన్నీ వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైని వ్యాసుడు పుష్కరక్షేత్రంలో నూరేళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలనూ ఉపపురాణాలనూ రచించగలిగాడు.
వాణీ ! తత్త్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడుకూడా శివుడు నిన్నే ధ్యానించాడు. ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాఙ్మాతా! నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితోపాటు మరికొందరు శిష్యులుకూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచీ వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు.
పలుకులతల్లి! నీ గుణగణాలను కొనియాడటానికి సహస్రముఖ - పంచముఖ - చతుర్ముఖులే (ఆదిశేషుడు, శివుడు, బ్రహ్మ) చాలరంటే ఎకముఖుణ్ణి మానవమాత్రుణ్ణి నేను ఎలా స్తుతించగలను?
యాజ్ఞవల్క్యుడు భక్తిభావనమ్రుడై శిరసువంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు.
దుఃఖభారంతో రోదించాడు. జ్యోతిస్స్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. 'సుకవీంద్రుడవు కమ్ము' అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది.
నారదా! యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీస్తోత్రాన్ని పఠించినవారు కవీంద్రులవుతారు. సంభాషణచతురులవుతారు. బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడుకానీ బుద్ధిహీనుడుకానీ ఒక సంవత్సరంపాటు ఈ స్తోత్రాన్ని పారాయణచేస్తే ఆతడు పండితుడవుతాడు. కవీంద్రుడవుతాడు. మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికీ నిశ్చయం.
నారదమహర్షి! వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపంవల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది.
పుణ్యరూప పుణ్యతీర్థ స్వరూపిణి పుణ్యాత్ములతో సేవలందుకొన్న తపోరూపిణి. తపఃఫలస్వరూపిణి పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీనదిలో మునిగి మరణించినవారికి వైకుంఠంలో స్థిరనివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజునగానీ ఏ సమయానగానీ తెలిసిగానీ తెలియకగానీ విలాసంగాగానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు అతడి పాపాలు అన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతాడు. హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీమంత్రాన్ని ఈ నదీతీరంలో ఒకనెలపాటు జపించినవాడు మహామూర్ఖుడైనా కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసినవారికి మరింక పునర్జన్మ ఉండదు. గర్భవాసదుఃఖం ఉండదు.
నారదా! నాకు తెలిసినంతమటుకు సరస్వతీగుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలను కుంటున్నావో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు.