Telugu Library
Wednesday, February 11, 2026
Shuka Maharshi Came To Parikshith Place - శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట
శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట
అనుక్షణం అంతర్ముఖంగా పరబ్రహ్మ స్వరూపాన్ని చూచి పరవశించిన హృదయంతో బాహ్యప్రపంచాన్ని మరచినవాడు, తామరపైన గండుతుమ్మెదలవలె ముద్దులు మూటగట్టే మొగంపై ముంగురులు ముసురుకొన్నవాడు, గీతగీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరింపక దిగంబరుడై తిరిగేవాడు, ఇతడు సర్వసంగపరిత్యాగియైన యోగి అని చాటుతున్నట్లు పరిహాసాలు పలికే బాలురు వెంట వచ్చేవాడును, సహజసుందరములైన కాళ్లు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజములు, ఉరము, కంఠము, ముఖము, నొసలు, వీనులు, కన్నులు, ముక్కు చెక్కిళ్లు, తల కలిగిన ఒక అవధూత అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు.
ఇవ్వలేదని లోకులపై కోపించి ఎగ్గులు పలుకడు. కావలెనని ఏ కోరికలను కోరడు. జనసమూహంలో చేరడు. వ్యర్థమైన సంభాషణలను చేయడు. అంతేకాదు వ్యర్థమైన ప్రపంచ విషయాలలో ప్రవేశింపడు. దైవవశమున తనకు కలిగిన దానితో సంతృప్తి చెంది, ఏమీ తెలియని అమాయకునివలె సామాన్యంగా కనిపిస్తాడు.
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
అనుక్షణం అంతర్ముఖంగా పరబ్రహ్మ స్వరూపాన్ని చూచి పరవశించిన హృదయంతో బాహ్యప్రపంచాన్ని మరచినవాడు, తామరపైన గండుతుమ్మెదలవలె ముద్దులు మూటగట్టే మొగంపై ముంగురులు ముసురుకొన్నవాడు, గీతగీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరింపక దిగంబరుడై తిరిగేవాడు, ఇతడు సర్వసంగపరిత్యాగియైన యోగి అని చాటుతున్నట్లు పరిహాసాలు పలికే బాలురు వెంట వచ్చేవాడును, సహజసుందరములైన కాళ్లు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజములు, ఉరము, కంఠము, ముఖము, నొసలు, వీనులు, కన్నులు, ముక్కు చెక్కిళ్లు, తల కలిగిన ఒక అవధూత అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు.
ఇవ్వలేదని లోకులపై కోపించి ఎగ్గులు పలుకడు. కావలెనని ఏ కోరికలను కోరడు. జనసమూహంలో చేరడు. వ్యర్థమైన సంభాషణలను చేయడు. అంతేకాదు వ్యర్థమైన ప్రపంచ విషయాలలో ప్రవేశింపడు. దైవవశమున తనకు కలిగిన దానితో సంతృప్తి చెంది, ఏమీ తెలియని అమాయకునివలె సామాన్యంగా కనిపిస్తాడు.
ఆ మహాత్ముని పదునారేండ్ల నవయౌవనం, ఆ సుందరమందగమనం, ఆ గుణవిశేషాలు, ఆ విలాసం, ఆ నేర్పులు చూచి ముక్తియే ముచ్చటపడి మోహింపగా, ఇక ఇతర కాంతల విషయం చెప్పవలసిన దేమున్నది?
వెఱ్ఱితనం లేక పూర్తిగా విజ్ఞానమూర్తియై బ్రహ్మజ్ఞానస్ఫూర్తితో తిరిగే శుకమహర్షిని వెఱ్ఱివాడని భావించి, అతనివెంట వెఱ్ఱియెత్తినట్లు స్త్రీలు, బాలకులు వెంటనంటి వస్తున్నారు.
ఈ విధంగా వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అక్కడికి రాగా ఆ మహానుభావుని మహత్త్యం తెలిసిన మునివర్యులందరూ తమ తమ ఆసనాలనుండి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చినారు. పాండవపొత్త్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగీశ్వరునికి అతిథి సత్కారాలుచేసి, సాగిలబడి మ్రొక్కి పూజలు గావించినాడు. గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగు లీను పున్నమనాటి చంద్రునివలె అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య శుకయోగీంద్రుడు విరాజిల్లినాడు.
కురుకుల శ్రేష్ఠుడైన పరీక్షిత్తు భయభక్తులతో మరల నెన్నుదురునేల తాకేట్లు నమస్కారంచేసి చేతులు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు. "మహానుభావా! వివేకమే ఆభరణమైనవాడా! దివ్యములైన భాషణములు కలవాడా! నా అదృష్టమెటువంటిదో కాని నీవు పావనమూర్తివి, పుణ్యకీర్తివి సరియైన సమయానికి నీ విప్పుడు విజయం చేసినావు.
అవధూతలలో శ్రేష్ఠుడా! నీ ఆగమనంవల్ల ధన్యుణ్ణి అయినాను. నీ సందర్శనంవల్ల నా జన్మ తరించింది. నీవంటి బ్రహ్మజ్ఞాని పావననామం ఉచ్చరించిన మాత్రాన చేసిన పాపాలన్నీ భస్మీపటలమౌతాయి. ఇక నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకొని, నిన్ను స్పృశించి, నీ సేవ చేసుకునే మహాభాగ్యం లభించిన నావంటి వానికి మోక్షం సంప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంటుంది?
భగవంతుడైన వాసుదేవునివలన లోకకంటకులైన నిశాచరులు నశించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన మా మహాపాపాలు మొత్తం రూపు మాసిపోతాయి.
ఏ మహానుభావుడు ప్రియమైన మఱదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను నాల్గు సముద్రముల తీర రేఖలు గల విశాలమైన ఈ ధరణీచక్రానికి చక్రవర్తులను గావించెనో, ఆ మహామహుడు, లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికి రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని ఆదరాభిమానాలతో కాపాడే రక్షకుడు ఆయన తప్ప అన్యులు ఎవ్వరున్నారు? ఆ సర్వసద్గుణ సంపన్నుని, కారుణ్యపయోనిధిని భక్తితో వేడుకొంటున్నాను.
వెఱ్ఱితనం లేక పూర్తిగా విజ్ఞానమూర్తియై బ్రహ్మజ్ఞానస్ఫూర్తితో తిరిగే శుకమహర్షిని వెఱ్ఱివాడని భావించి, అతనివెంట వెఱ్ఱియెత్తినట్లు స్త్రీలు, బాలకులు వెంటనంటి వస్తున్నారు.
ఈ విధంగా వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అక్కడికి రాగా ఆ మహానుభావుని మహత్త్యం తెలిసిన మునివర్యులందరూ తమ తమ ఆసనాలనుండి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చినారు. పాండవపొత్త్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగీశ్వరునికి అతిథి సత్కారాలుచేసి, సాగిలబడి మ్రొక్కి పూజలు గావించినాడు. గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగు లీను పున్నమనాటి చంద్రునివలె అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య శుకయోగీంద్రుడు విరాజిల్లినాడు.
కురుకుల శ్రేష్ఠుడైన పరీక్షిత్తు భయభక్తులతో మరల నెన్నుదురునేల తాకేట్లు నమస్కారంచేసి చేతులు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు. "మహానుభావా! వివేకమే ఆభరణమైనవాడా! దివ్యములైన భాషణములు కలవాడా! నా అదృష్టమెటువంటిదో కాని నీవు పావనమూర్తివి, పుణ్యకీర్తివి సరియైన సమయానికి నీ విప్పుడు విజయం చేసినావు.
అవధూతలలో శ్రేష్ఠుడా! నీ ఆగమనంవల్ల ధన్యుణ్ణి అయినాను. నీ సందర్శనంవల్ల నా జన్మ తరించింది. నీవంటి బ్రహ్మజ్ఞాని పావననామం ఉచ్చరించిన మాత్రాన చేసిన పాపాలన్నీ భస్మీపటలమౌతాయి. ఇక నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకొని, నిన్ను స్పృశించి, నీ సేవ చేసుకునే మహాభాగ్యం లభించిన నావంటి వానికి మోక్షం సంప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంటుంది?
భగవంతుడైన వాసుదేవునివలన లోకకంటకులైన నిశాచరులు నశించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన మా మహాపాపాలు మొత్తం రూపు మాసిపోతాయి.
ఏ మహానుభావుడు ప్రియమైన మఱదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను నాల్గు సముద్రముల తీర రేఖలు గల విశాలమైన ఈ ధరణీచక్రానికి చక్రవర్తులను గావించెనో, ఆ మహామహుడు, లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికి రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని ఆదరాభిమానాలతో కాపాడే రక్షకుడు ఆయన తప్ప అన్యులు ఎవ్వరున్నారు? ఆ సర్వసద్గుణ సంపన్నుని, కారుణ్యపయోనిధిని భక్తితో వేడుకొంటున్నాను.
అయ్యా! నీవు అవధూతలలో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గతి కలవాడవు. నీ దర్శనం వ్యర్థం కాదు. నా అభిమతం తప్పక ముమ్మాటికి ఫలించి తీరుతుంది. ఈనాడో రేపో ఈ దేహాన్ని త్యజించటానికి సంసిద్ధంగా ఉన్న జీవికి సంసారబంధాలు సమసి మోక్షం ప్రాప్తించటానికి, చింతింపవలసింది, జపింపవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవలందింపవలసింది ఏమేమి కలవో దయదలచి విశదీకరించండి అని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు, యోగీశ్వరుడవు, నీకు తెలియందేముంది? గోవును పాలు పిదికేంత సేపు తప్ప అంతకంటె ఎక్కువసేపు ఎక్కడగాని ఉండవు. దయగల తండ్రీ! మోక్షమార్గాన్ని నాకు తెలియజెప్పు.
ఈ విధంగా పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నించినాడు.
తామర రేకులవంటి కన్నులు కలవాడా! రాజాధిరాజుల కిరీటాలలో చెక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా! భువిలోని జనులకు కల్పవృక్షము అయినవాడా! నిరంతర విశ్వకల్యాణ భావనకలవాడా, నిత్యధర్మచింతన కలవాడా!
సాటిలేని కల్యాణ గుణాలే పుష్పమాల అయినవాడా! చంపబడుతున్న వైరి వీరులు కలవాడా! లోక జన వినుత విహారా! సీతామానసచోరా, రాక్షసమేఘాలకు సమీరమైనవాడా, దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడా, కఠిన పాపాత్ములకు కఠోరమైనవాడా! సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా!
ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ప్రాప్తించిన అద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం. అందులో నైమిశారణ్య వర్ణన, శౌనకాదిమునుల సంప్రశ్నము, సూతుని నారాయణ కథాసూచన, వ్యాసుల వారి విచారం. నారదాగమనం, ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపదీ పుత్రశోకం, అర్జునుడు అశ్వత్థామను బంధించి తేవడం, అశ్వత్థామ గర్వపరిహారం. భీష్మ నిర్యాణం, ధర్మరాజు పట్టాభిషేకం, శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుని అశ్వత్ధామయొక్క అస్ర జ్వాలలనుండి శ్రీకృష్ణుడు కాపాడటం, పరీక్షిత్తు జననం, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిష్మమణం, నారదుడు ధర్మరాజుకు చేసిన కాలసూచన, శ్రీ కృష్ణనిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు దిగ్విజయం, కలి గర్వభంజనం, ధరణీధర్శదేవుల సముద్ధరణం, పరీక్షిత్తుకు శృంగి శాపం, గంగాతీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం, శ్రీ శుకసందర్శనం, మోక్షమార్గాన్ని పరీక్షిత్తు అభ్యర్థించడం అనే కథలతో కూడిన ప్రథమస్మంధం సమాప్తం.
ఈ విధంగా పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నించినాడు.
తామర రేకులవంటి కన్నులు కలవాడా! రాజాధిరాజుల కిరీటాలలో చెక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా! భువిలోని జనులకు కల్పవృక్షము అయినవాడా! నిరంతర విశ్వకల్యాణ భావనకలవాడా, నిత్యధర్మచింతన కలవాడా!
సాటిలేని కల్యాణ గుణాలే పుష్పమాల అయినవాడా! చంపబడుతున్న వైరి వీరులు కలవాడా! లోక జన వినుత విహారా! సీతామానసచోరా, రాక్షసమేఘాలకు సమీరమైనవాడా, దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడా, కఠిన పాపాత్ములకు కఠోరమైనవాడా! సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా!
ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ప్రాప్తించిన అద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం. అందులో నైమిశారణ్య వర్ణన, శౌనకాదిమునుల సంప్రశ్నము, సూతుని నారాయణ కథాసూచన, వ్యాసుల వారి విచారం. నారదాగమనం, ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపదీ పుత్రశోకం, అర్జునుడు అశ్వత్థామను బంధించి తేవడం, అశ్వత్థామ గర్వపరిహారం. భీష్మ నిర్యాణం, ధర్మరాజు పట్టాభిషేకం, శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుని అశ్వత్ధామయొక్క అస్ర జ్వాలలనుండి శ్రీకృష్ణుడు కాపాడటం, పరీక్షిత్తు జననం, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిష్మమణం, నారదుడు ధర్మరాజుకు చేసిన కాలసూచన, శ్రీ కృష్ణనిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు దిగ్విజయం, కలి గర్వభంజనం, ధరణీధర్శదేవుల సముద్ధరణం, పరీక్షిత్తుకు శృంగి శాపం, గంగాతీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం, శ్రీ శుకసందర్శనం, మోక్షమార్గాన్ని పరీక్షిత్తు అభ్యర్థించడం అనే కథలతో కూడిన ప్రథమస్మంధం సమాప్తం.
శ్రీ కృష్ణార్పణమస్తు
Parikshit Prepared For Prayopavesam - పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట
పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట
నేను వేటకై అడవికి ఎందుకుపోవాలి? ఆ మహాముని నిశ్చల ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు చచ్చినపామును తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపాకార్యాలు ఎందుకు చేశాను? ఇది కలి ప్రభావమే. దైవసంకల్పాన్ని ఎవరూ దాటలేరు. ఇది తప్పదు. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరవలసిందే.
తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా ప్రాణాలు పోయినా పోనిమ్ము. ఈ సామ్రాజ్యం, ఇందలి భోగభాగ్యాలు ఇప్పుడే నశించినా నశించనీ. మెరుపుతీగెవంటి బ్రతుకు శాశ్వతమని యెంచి, నివారించటానికి సాధ్యంకాని ఆ మునిసత్తముని పుత్రుని నేను ఏమని తిరిగి శపించగలను?
నేను మహారాజును గదా! అని అహంకారంతో వారి తపోవనాన్ని ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేయగా కొడుకు నన్ను చనిపోవునట్లు శపింపక ఊరక నోరు మూసికొని కూర్చుంటాడా? నిజానికి ఆ బాలుని తప్పు ఏమున్నది?
గోవులకు బ్రాహ్మణులకు, దేవతలకు కారణం లేకుండా దుస్సాహసంతో కీడు కలిగించే దుష్టబుద్ధిని ఏ విధంగా పుట్టకుండ నివారిస్తాను? అని తనలో తాను విశేషంగా తర్కించుకొన్నాడు.
శ్రీకృష్ణభగవానుని పాదపద్మములపై భక్తి ప్రపత్తులు గల పరీక్షిత్తు కామక్రోధాదులైన అంతశ్శత్రువులను జయించినవాడు కావటంవలన కరుణామయుడై తనను శపించిన శృంగిపై ఆగ్రహింపలేదు. శపించు శక్తి సామర్థ్యములుండియు పరమశాంతచిత్తుడు అయినాడు.
మునికుమారుడు శృంగి రాజును శపించిన వార్తను విని తక్షకుడు సమయానికై ఎదురుచూస్తున్నాడు. పరీక్షిత్తు తనకు ఏడవనాడు తక్షకుని దారుణవిషాగ్నిజ్వాలలవల్ల మరణం తప్పదని నిర్ణయించుకొనినాడు. భూలోకభోగాలు, స్వర్గలోకసౌఖ్యాలు పూర్తిగా విడువదగినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించినాడు. నిరాహారదీక్షను సాగించటానికి నిశ్చయించుకొన్నాడు.
తులసీదళాలతో విరాజిల్లే శ్రీమహావిష్ణుపాదపద్మాల పుప్పొడితో కలిసి మిక్కిలి ప్రకాశంతో ప్రవహిస్తూ దిక్పాలకులకు సకలసౌభాగ్యసంపదలు కలిగించి, సమస్తదోషాలను కడిగివేసే గంగానదీతీరంలో ప్రాయోపవేశంతో ప్రాణాలు విడవడానికి ప్రభువు సంకల్పించాడు.
ఆ రాజసత్తముడైన పరీక్షిత్తు తన చిత్తమును గోవిందుని పాదములందు నిలిపి, సర్వసంగ పరిత్యాగియై లోపల ఎట్టి వికారాలూ లేకుండా మౌనంతో ఉండినాడు.
ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆనందాన్ని పొందిన హృదయపద్మం కలవాడై, విష్ణుపాదాలనుండి పుట్టిన గంగ గట్టున ప్రాయోపవిష్టుడై ఉన్నాడన్న సంగతి విన్నవారై, సకలలోక పవిత్రులై, మహోదార చరిత్రులై, తీర్థములకు తీర్ధత్వమును ప్రసాదించే సర్వసమర్దులైన, అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, అరుణుడు మొదలగు కాండర్షులు ఇంకను వివిధ గోత్రాలలో పుట్టిన మహర్షులు శిష్యులతో ప్రశిష్యులతో కలిసి అచ్చటికి విచ్చేసినారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా అక్కడికి వచ్చిన మునీంద్రులకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులిచ్చి, అర్చించి, సాష్టాంగ నమస్మారాలు చేసి, సుఖాసీనులను గావించినాడు.
ఆ మహారాజు ఆనందబాష్పాలు పొంగిపారలగా, మరల ఆ మునీశ్వరులముందు చేతులు మోడ్చి ఈ విధంగా విన్నవించుకొన్నాడు.
దయానిధులైన తపోధనులారా! నేను ఓర్పును కోల్పోయి, కోపాన్ని ఆపుకోలేక చచ్చిన పామును తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన క్రూరచిత్తుణ్ణి, మదించినవాడను, మహాపాపిని మీరు పాపాలనే గడ్డిని దహించే అగ్నిహోత్రులు, ఉత్తములు, సంయమిసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహారమయ్యే దారిని నిర్ణయించి చెప్పండి.
మహీసురులారా! మహనీయులైన మహర్షుల పాదధూళి లేశమైనను మహీపతుల పాపాలను పారద్రోలి పవిత్రులను చేస్తుంది. మీ పాదరేణువులు తగిలినంతనే నా పాపం పటాపంచలయింది. నేను కృతార్థుడ నయ్యాను. ఇప్పుడు నేనేమి చేస్తే వెంటనే నాకు ముక్తి లభిస్తుందో దయచేసి తెలపండి.
మిక్కిలి భయంకరమైన సంసారబంధంలో చిక్కుకొన్న చీకాకుతో, విసిగి వేసారి, త్వరగా శరీరం విడిచే దారి వెదకుతున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైనది.
అతిశయించిన అహంకారపు నడవడితో సంసారంలో మునిగి ఉన్ననాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపం అనే మిషతో సంసారబంధ ముక్తిని ప్రసాదించినాడు.
తక్షక విషాగ్నికి నా దేహమును తప్పక అప్పగిస్తాను. ఇందులో సందేహంలేదు. ఈశ్వర సంకల్పం నేడు జరిగి తీరుతుంది. రాబోయే అనేక జన్మలలో శ్రీకృష్ణుని(హరి) చింతనయందు ఆసక్తి, శ్రీకృష్ణుని స్తోత్ర వాఙ్మయ శ్రవణాభిలాష, శ్రీకృష్ణచరణ కమలసేవకలిగి ఉండేట్లు మీరు అనుగ్రహించండి.
మీరు నా శ్రేయస్సును కాంక్షించండి. ఆ గోవిందుని మీది గీతాలు పాడండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. ఏడుదినాలలో నాకు కైవల్యప్రాప్తి కలిగించండి.
అమ్మా! గంగమ్మా! నీ అలలు ఎంత అందంగా ఉన్నాయి తల్లీ! నిన్ను దర్శించిన వారిని దయతో దారి తెలిపి మోక్షానికి చేరుస్తావని విన్నాను. కదలిపైకి లేచి రావమ్మా! నీ రూపంతో ఎదురుగా వచ్చి సాక్షాత్కరింపవమ్మా!
ఆ విధంగా రాబోయే జన్మలలో తనకు భగవద్భక్తి సౌజన్యాలు ప్రాప్తించుగాక అని ప్రార్ధించినాడు. అప్పుడు తన తనయుడైన జనమేజయుని రప్పించి రాజ్యభారం అతనికి అప్పగించినాడు. గంగానదీ దక్షిణ తీరంలో తూర్పువైపు దర్భల కొనలు ఉండేట్లుగా ఆసనం వేయించి, దానిపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. తన చిత్తాన్ని సంసారబంధాల నుంచి మరలించి పరమేశ్వరాయత్తం కావించినాడు. ఇలా భాగవతోత్తముడైన పాండవపౌత్త్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న సమయంలో.
దేవతలు ఆకాశంనుండి పూలవానలు కురిపించినారు. అంతేకాదు ఎంతో పొగడుతూ, గుణగణాలుగానం చేస్తూ, దుందుభులు మ్రోగించినారు.
ఆ సందర్భమున సభలో కూర్చున్న మహర్షులు ఆ రాజర్షితో ఇట్లు పలికినారు.
రాజశ్రేష్ఠ! నీ చరిత్ర చిత్రమైనది మీ పితామహులు మహాతపస్సంపన్నులు, వారు వాసుదేవుని నిత్య సాన్నిధ్యాన్ని వాంఛించి, నానా రాజకిరీట రత్నప్రభారాజితో రాజిల్లే రాజపీఠాన్ని విడిచి మహాత్యాగ విరాజితులైనారు. వారెంతో ఉన్నతులు అనుకొంటిమి కాని నిరంతర నారాయణ నామ పారాయణుడవైన నీవు వారికంటె మహోన్నతుడవు.
మహీపాలా! నీవు మనుష్యదేహాన్ని వదలి, శోకం, వ్యసనం, రజోగుణంలేని పుణ్యలోకాన్ని చేరేంతవరకు, మేము ఎక్కడికి పోము. నీ మాటలు వింటూ నీ దివ్యప్రభావాన్ని తిలకిస్తూ ఇక్కడనే ఉంటాము.
అని యిట్లు నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధురగంభీరాలైన మంచిమాటలు విని, ముల్లోకములకు అవతల గల సత్యలోకంలో ఆకృతులు దాల్చి వెలుగు వేదములవలె విరాజిల్లు మహర్షులకు మహారాజు నమస్కరించి విష్ణుకథలు లీలలు వినే ఆసక్తితో ఇట్లు అన్నాడు.
తండ్రులారా! వేదవాక్యాలు బాగా పరిశీలించి ఏడు దినాలలో ఏ విధంగా ముక్తి పొందవచ్చునో తెలపండి. గురుతరమైన ఈ సంసార క్రీడనుండి ఎల్లా విడివడాలో ఆలోచించి ఆదుకొనండి.
(మా తండ్రులారా!) మీరు ఆర్యులు, ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞానపారీణులు, ఆత్మ తేజోవిరాజిత విజ్ఞానులు, ఆత్మతత్త్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, మనస్సులో దాచబడిన సకలార్థ సమూహం కలవారు. మీరు తపశ్శక్తిచేత అన్నింటిని స్పష్టంగా చూడగలవారు. ఏడు దినాలలో మోక్షం ప్రాప్తించే ఉపాయాన్ని బాగా విచారణ చేసి నాకు తెలపండి.
అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తర మివ్వడానికి మహర్షులందరు సమాలోచనలు జరుపుతున్నారు. ఆ సందర్భంలో ధైవయోగం వలన
నేను వేటకై అడవికి ఎందుకుపోవాలి? ఆ మహాముని నిశ్చల ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు చచ్చినపామును తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపాకార్యాలు ఎందుకు చేశాను? ఇది కలి ప్రభావమే. దైవసంకల్పాన్ని ఎవరూ దాటలేరు. ఇది తప్పదు. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరవలసిందే.
తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా ప్రాణాలు పోయినా పోనిమ్ము. ఈ సామ్రాజ్యం, ఇందలి భోగభాగ్యాలు ఇప్పుడే నశించినా నశించనీ. మెరుపుతీగెవంటి బ్రతుకు శాశ్వతమని యెంచి, నివారించటానికి సాధ్యంకాని ఆ మునిసత్తముని పుత్రుని నేను ఏమని తిరిగి శపించగలను?
నేను మహారాజును గదా! అని అహంకారంతో వారి తపోవనాన్ని ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేయగా కొడుకు నన్ను చనిపోవునట్లు శపింపక ఊరక నోరు మూసికొని కూర్చుంటాడా? నిజానికి ఆ బాలుని తప్పు ఏమున్నది?
గోవులకు బ్రాహ్మణులకు, దేవతలకు కారణం లేకుండా దుస్సాహసంతో కీడు కలిగించే దుష్టబుద్ధిని ఏ విధంగా పుట్టకుండ నివారిస్తాను? అని తనలో తాను విశేషంగా తర్కించుకొన్నాడు.
శ్రీకృష్ణభగవానుని పాదపద్మములపై భక్తి ప్రపత్తులు గల పరీక్షిత్తు కామక్రోధాదులైన అంతశ్శత్రువులను జయించినవాడు కావటంవలన కరుణామయుడై తనను శపించిన శృంగిపై ఆగ్రహింపలేదు. శపించు శక్తి సామర్థ్యములుండియు పరమశాంతచిత్తుడు అయినాడు.
మునికుమారుడు శృంగి రాజును శపించిన వార్తను విని తక్షకుడు సమయానికై ఎదురుచూస్తున్నాడు. పరీక్షిత్తు తనకు ఏడవనాడు తక్షకుని దారుణవిషాగ్నిజ్వాలలవల్ల మరణం తప్పదని నిర్ణయించుకొనినాడు. భూలోకభోగాలు, స్వర్గలోకసౌఖ్యాలు పూర్తిగా విడువదగినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించినాడు. నిరాహారదీక్షను సాగించటానికి నిశ్చయించుకొన్నాడు.
తులసీదళాలతో విరాజిల్లే శ్రీమహావిష్ణుపాదపద్మాల పుప్పొడితో కలిసి మిక్కిలి ప్రకాశంతో ప్రవహిస్తూ దిక్పాలకులకు సకలసౌభాగ్యసంపదలు కలిగించి, సమస్తదోషాలను కడిగివేసే గంగానదీతీరంలో ప్రాయోపవేశంతో ప్రాణాలు విడవడానికి ప్రభువు సంకల్పించాడు.
ఆ రాజసత్తముడైన పరీక్షిత్తు తన చిత్తమును గోవిందుని పాదములందు నిలిపి, సర్వసంగ పరిత్యాగియై లోపల ఎట్టి వికారాలూ లేకుండా మౌనంతో ఉండినాడు.
ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆనందాన్ని పొందిన హృదయపద్మం కలవాడై, విష్ణుపాదాలనుండి పుట్టిన గంగ గట్టున ప్రాయోపవిష్టుడై ఉన్నాడన్న సంగతి విన్నవారై, సకలలోక పవిత్రులై, మహోదార చరిత్రులై, తీర్థములకు తీర్ధత్వమును ప్రసాదించే సర్వసమర్దులైన, అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, అరుణుడు మొదలగు కాండర్షులు ఇంకను వివిధ గోత్రాలలో పుట్టిన మహర్షులు శిష్యులతో ప్రశిష్యులతో కలిసి అచ్చటికి విచ్చేసినారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా అక్కడికి వచ్చిన మునీంద్రులకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులిచ్చి, అర్చించి, సాష్టాంగ నమస్మారాలు చేసి, సుఖాసీనులను గావించినాడు.
ఆ మహారాజు ఆనందబాష్పాలు పొంగిపారలగా, మరల ఆ మునీశ్వరులముందు చేతులు మోడ్చి ఈ విధంగా విన్నవించుకొన్నాడు.
దయానిధులైన తపోధనులారా! నేను ఓర్పును కోల్పోయి, కోపాన్ని ఆపుకోలేక చచ్చిన పామును తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన క్రూరచిత్తుణ్ణి, మదించినవాడను, మహాపాపిని మీరు పాపాలనే గడ్డిని దహించే అగ్నిహోత్రులు, ఉత్తములు, సంయమిసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహారమయ్యే దారిని నిర్ణయించి చెప్పండి.
మహీసురులారా! మహనీయులైన మహర్షుల పాదధూళి లేశమైనను మహీపతుల పాపాలను పారద్రోలి పవిత్రులను చేస్తుంది. మీ పాదరేణువులు తగిలినంతనే నా పాపం పటాపంచలయింది. నేను కృతార్థుడ నయ్యాను. ఇప్పుడు నేనేమి చేస్తే వెంటనే నాకు ముక్తి లభిస్తుందో దయచేసి తెలపండి.
మిక్కిలి భయంకరమైన సంసారబంధంలో చిక్కుకొన్న చీకాకుతో, విసిగి వేసారి, త్వరగా శరీరం విడిచే దారి వెదకుతున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైనది.
అతిశయించిన అహంకారపు నడవడితో సంసారంలో మునిగి ఉన్ననాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపం అనే మిషతో సంసారబంధ ముక్తిని ప్రసాదించినాడు.
తక్షక విషాగ్నికి నా దేహమును తప్పక అప్పగిస్తాను. ఇందులో సందేహంలేదు. ఈశ్వర సంకల్పం నేడు జరిగి తీరుతుంది. రాబోయే అనేక జన్మలలో శ్రీకృష్ణుని(హరి) చింతనయందు ఆసక్తి, శ్రీకృష్ణుని స్తోత్ర వాఙ్మయ శ్రవణాభిలాష, శ్రీకృష్ణచరణ కమలసేవకలిగి ఉండేట్లు మీరు అనుగ్రహించండి.
మీరు నా శ్రేయస్సును కాంక్షించండి. ఆ గోవిందుని మీది గీతాలు పాడండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. ఏడుదినాలలో నాకు కైవల్యప్రాప్తి కలిగించండి.
అమ్మా! గంగమ్మా! నీ అలలు ఎంత అందంగా ఉన్నాయి తల్లీ! నిన్ను దర్శించిన వారిని దయతో దారి తెలిపి మోక్షానికి చేరుస్తావని విన్నాను. కదలిపైకి లేచి రావమ్మా! నీ రూపంతో ఎదురుగా వచ్చి సాక్షాత్కరింపవమ్మా!
ఆ విధంగా రాబోయే జన్మలలో తనకు భగవద్భక్తి సౌజన్యాలు ప్రాప్తించుగాక అని ప్రార్ధించినాడు. అప్పుడు తన తనయుడైన జనమేజయుని రప్పించి రాజ్యభారం అతనికి అప్పగించినాడు. గంగానదీ దక్షిణ తీరంలో తూర్పువైపు దర్భల కొనలు ఉండేట్లుగా ఆసనం వేయించి, దానిపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. తన చిత్తాన్ని సంసారబంధాల నుంచి మరలించి పరమేశ్వరాయత్తం కావించినాడు. ఇలా భాగవతోత్తముడైన పాండవపౌత్త్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న సమయంలో.
దేవతలు ఆకాశంనుండి పూలవానలు కురిపించినారు. అంతేకాదు ఎంతో పొగడుతూ, గుణగణాలుగానం చేస్తూ, దుందుభులు మ్రోగించినారు.
ఆ సందర్భమున సభలో కూర్చున్న మహర్షులు ఆ రాజర్షితో ఇట్లు పలికినారు.
రాజశ్రేష్ఠ! నీ చరిత్ర చిత్రమైనది మీ పితామహులు మహాతపస్సంపన్నులు, వారు వాసుదేవుని నిత్య సాన్నిధ్యాన్ని వాంఛించి, నానా రాజకిరీట రత్నప్రభారాజితో రాజిల్లే రాజపీఠాన్ని విడిచి మహాత్యాగ విరాజితులైనారు. వారెంతో ఉన్నతులు అనుకొంటిమి కాని నిరంతర నారాయణ నామ పారాయణుడవైన నీవు వారికంటె మహోన్నతుడవు.
మహీపాలా! నీవు మనుష్యదేహాన్ని వదలి, శోకం, వ్యసనం, రజోగుణంలేని పుణ్యలోకాన్ని చేరేంతవరకు, మేము ఎక్కడికి పోము. నీ మాటలు వింటూ నీ దివ్యప్రభావాన్ని తిలకిస్తూ ఇక్కడనే ఉంటాము.
అని యిట్లు నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధురగంభీరాలైన మంచిమాటలు విని, ముల్లోకములకు అవతల గల సత్యలోకంలో ఆకృతులు దాల్చి వెలుగు వేదములవలె విరాజిల్లు మహర్షులకు మహారాజు నమస్కరించి విష్ణుకథలు లీలలు వినే ఆసక్తితో ఇట్లు అన్నాడు.
తండ్రులారా! వేదవాక్యాలు బాగా పరిశీలించి ఏడు దినాలలో ఏ విధంగా ముక్తి పొందవచ్చునో తెలపండి. గురుతరమైన ఈ సంసార క్రీడనుండి ఎల్లా విడివడాలో ఆలోచించి ఆదుకొనండి.
(మా తండ్రులారా!) మీరు ఆర్యులు, ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞానపారీణులు, ఆత్మ తేజోవిరాజిత విజ్ఞానులు, ఆత్మతత్త్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, మనస్సులో దాచబడిన సకలార్థ సమూహం కలవారు. మీరు తపశ్శక్తిచేత అన్నింటిని స్పష్టంగా చూడగలవారు. ఏడు దినాలలో మోక్షం ప్రాప్తించే ఉపాయాన్ని బాగా విచారణ చేసి నాకు తెలపండి.
అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తర మివ్వడానికి మహర్షులందరు సమాలోచనలు జరుపుతున్నారు. ఆ సందర్భంలో ధైవయోగం వలన
Shringi Rishi maharshi Curses King Parikshit - శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట
శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట
తండ్రీ! భటులు, ఏనుగులు, రథాలు, గుఱ్ఱాలు గల సేనతో రాజ్యాన్ని ఏలే రాజొకడు వచ్చి, నీటికోసమై తహతహపడి, మంచి చెడ్డ ఆలోచింపక నీ తండ్రిమెడలో పామును వేసివెళ్లినాడు.
ఆ మాటలు విని, ముని కుమారులతో ఆడుతున్న శృంగి, కొమ్ములతో రూపం దాల్చినట్లు విజృంభించి, రోషావేశంతో అదరిపడుతూ ఇట్లన్నాడు "ఈ రాజులు బలి పెట్టిన పిండాలు తిని బలిసిన కాకులు. ద్వారాల కడ కాచుకొని ఉన్న కుక్కలు! దాసులైన ఈ క్షత్రియులమని అనుకొనేవారిని భూసురోత్తములు తమ గృహరక్షకులుగా ఎట్లు నియమించినారు? ద్వారపాలకులుగా మాత్రమే ఉండదగినవారు వంట యింటిలో ప్రవేశించి వండిన అన్నం తినటానికి ఎలా అర్హులౌతారు? వారు చేసే ద్రోహకార్యాలకు యజమాని ఎందుకు బాధ్యుడౌతాడు?
మాతండ్రి తనను నిందింపలేదు. ఆశ్రమవాసులతోనే గాని శత్రువులతో కూడలేదు. కందమూలాలు తిని, నిశ్చల సమాధిలో అంతర్దృష్టిని విడువక నిరంతరం తన ఇష్టదైవాన్ని తప్ప అన్య ప్రపంచాన్ని చూడకుండ తానేమో, తన లోకమేమో అన్నట్లున్న ఆయనపై ఆ రాచవాడు అరాజకంగా పామును మెడలో చుట్టడం ఎందుకు?
రాజుల కడకు మేము హిరణ్యదానాలు గ్రహించటానికి పోలేదు. ధనములు తేలేదు. ఆశీర్వాదములని చెప్పి మోసంచేసి వారి ద్వారాల కడ నిలిచి విసిగించలేదు. ఇండ్లపై కూడ ఆసక్తిని వీడి ఆడవులలో పడి ఉన్నాము. అట్టియెడ బ్రహ్మర్షి అయిన మా తండ్రిమెడలో పామును వేయటం తగునా?
ప్రాజ్య సామ్రాజ్యాన్ని ఏలే సమ్రాట్టులు తమ్ము ప్రజలు పొగడగా పంచభక్ష్యపరమాన్నాలు భుజింపవచ్చు. విలువగల వలువలు ధరించవచ్చు. అంతేకాని అడవులలో ఇడుమలుపడే బడుగు (తాపసుల) జడదారుల మెడలో చచ్చిన పామును చుడతారా?
భగవంతుడు శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన అనంతరం సమర్థుడైన శాసకుడు లేకపోవటం వలన దుర్మార్గులు చెలరేగి నిరపరాధులైన సాధువులను బాధిస్తున్నారు.
బాలకులారా! నే నిప్పుడే ఆ రాజుకు శాపం పెడతాను అని మునిబాలకుడైన శృంగి ముల్లోకాలను ఏలే వారికే అదరుపాటు కలిగేట్లుగా వడివడిగా వెడలినాడు.
కౌశికి నదికి రోషంతో వెళ్లి, నీళ్లు చేతిలోకి తీసికొన్నాడు.
లేశమైన సంకోచం లేకుండ చచ్చిన పామును తీసికొని వచ్చి మా తండ్రి భుజంపై పడవేసి దురహంకారంతో కన్ను మిన్ను కానని ఆ రాజు హరిహరులు అడ్డుపడినా నేటికి ఏడవ దినం తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమయిపోతాడు.
అని శమీక మునీంద్రుని కొడుకు పరీక్షిన్మహారాజును శపించి ఆశ్రమం చేరి ధ్యాన నిమగ్నుడైన తండ్రిని చూచినాడు. అప్పుడు ఆయన మెడలో ఆ చచ్చినపాము వ్రేలాడుతూనే ఉన్నది.
అయ్యో! తండ్రీ! ఈ సందర్భంలో నీ మెడలో చచ్చిన పామును పడవేసిన ఆ దొరగారిని ఏమి చేస్తాను? రాజులకు స్నేహధర్మాలు లేవు సుమా!
ఓ తాపసులారా! ఎవరో రాజు వేటకైవచ్చి నిరపరాధియైన నా తండ్రిమీద నిష్కారణంగా నిర్దయుడై ఈ చచ్చిన పామును మెడలో పడవెసి వెళ్ళినాడు. భయంకరమైన సర్పం మరలా బ్రతుకుతుందో ఏమో! క్రూరమైన కోరలతో కాటు వేస్తుందో ఏమో! మీకు నమస్కరిస్తున్నాను. రండి, ఈ పామును తీసి పారవేయండి. మా తండ్రిని కాపాడండి.
అట్లు పలుకుతూ భయంతో ఆ పామును తొలగించే నేర్పు లేక బిగరగా కొడుకు ఏడ్చినాడు. ఆ కుమారుని ఆక్రందన ధ్వని విని, శమీక మహాముని తన సమాధి చాలించి మెల్లగా కన్నులు తెరచినాడు. భుజంపై వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి, కొడుకును జూచి
నాయనా! మనం ఎవరికీ ఏ కీడు చేసినవారము కాము. లోకులందరినీ సమానంగా ఆదరిస్తాము. నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సర్పం నా మెడకు ఎలా వచ్చింది?
అనీ ప్రశ్నించినాడు. అప్పుడు కుమారుడు శృంగి, రాజు వచ్చి పాము వేయటం, తాను ఆ రాజును శపించటం తెలిపినాడు. వెంటనే శమీకుడు తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్మహారాజని తెలుసుకొని, కొడుకు చేసిన పనికి బాధపడి ఇట్లన్నాడు.
కుమారా! ఇంతటి కఠోర శాపాన్ని పెట్టటానికి అంతటి గొప్ప కీడు ఆ మహారాజు ఏమీ చేయలేదు. తక్షక విషాగ్ని జ్వాలలపాలు కమ్మని ఆ ధరణీనాథుని అయ్యయ్యో! ఎందుకు శపించినావు?
సమర్థుడవైన బ్రహ్మచారీ! పాపము! పరీక్షిత్తు తన తల్లి గర్భమునందే దహింపబడి, శ్రీకృష్ణుని అనుగ్రహంతో బతికి బయటపడినాడు. ఇప్పుడు పరాక్రమంతో ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజును శపించవచ్చునా?
బాలకా! ప్రభువైన కృష్ణుడు లేకపోవటంచేత లోకము పుష్టిని కోల్పోయి ఏపు చెడినది. ప్రజలు కాపరిలేని గొర్రెలవలె కడగండ్లకు లోనైనారు. దొంగలు, దుండగులు విచ్చలవిడిగా చెలరేగినారు. ఇట్టి స్థితిలో మహారాజు అందరిని సమదృష్టితో ఎంతో సమర్థంగా పాలిస్తున్నాడు. ఏదో జరిగిన చిన్న తప్పిదానికి అయ్యో! రాజును ఎందుకు శపించినావు?
కుమారా! నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణింపగా ఆ రాజ్యంలో అరాచకం హద్దులు మీరుతుంది. బలం కలవాడు బలంలేని వానిపైబడి అతని సర్వస్వాన్నీ అపహరిస్తాడు. జారులు, చోరులు ఎచ్చట చూచినా బారులు తీరి విచ్చలవిడిగా విహరిస్తారు. ప్రజల్లో పరస్పర కలహాలు పెరిగిపోతాయి. వైదికములైన వర్ణాశ్రమములు, ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ధర్మం నశించిపోగా అర్ధ కామాలపై ఆసక్తి పెరుగుతుంది. చివరకు రాజ్యమంతటా కోతుల్లో, కుక్కల్లోవలె వర్ణసంకరం ఏర్పడుతుంది.
ఆ రాజు పవిత్రమైన భారత వంశంలో పుట్టినవాడు. పరమ భాగవతుడుగా పేరు కెక్కినవాడు, అశ్వమేధం చేసినవాడు, సదాచార సంపన్నుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకులాలంకారుడు అంతటి మహారాజు దప్పిక చెంది నీటికోసం మన తపోవనానికి విచ్చేయగా ఎంతో ఆదరంతో అతిథిసత్కారాలు చేయక ఊరక పంపటం ఉచితం కాదు. సత్కారం చేయకపోగా శపించటం యేమి న్యాయం? ఇది ధర్మమా?
ఓ పరమేశ్వరా! శ్రీకృష్ణా! హరీ! మా పిల్లవాడు బుద్ధిచాపల్యంతో నిరపరాధియైన పరీక్షిన్మహారాజునకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. వీడు చేసిన దోషాన్ని తొలగించుము తండ్రీ!
కుమారా! పరమభక్తులైనవారు కొట్టినా, తిట్టినా శాంతంతో సహిస్తారే కాని ప్రతీకారం చేయటానికి సమ్మతింపరు. ఆ మహారాజు నీకు కించిత్తుకూడా కీడు చేయడు.
సాధుస్వభావంగల సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి క్రుంగిపోరు. మహనీయుల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహింపవు.
అని ఈ విధంగా శమీక మహాముని తన కుమారుడు గావించిన తిరుగులేని శాపరూపమైన పాపానికి మిక్కిలి తాపం చెందినాడు. వెంటనే తన శిష్యుడైన ఒక మునిపుత్రుని పిలిచి జరిగిన వృత్తాంతమంతా మహారాజుకు తెలిపి రమ్మని పంపినాడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మునిశిష్యునివలన శమీక మహామునికుమారుని శాపవృత్తాంతం విని, కామ క్రోధాది విషయజాలంలో తగుల్కొన్న తనకు తక్షకుని విషజ్వలనజ్వాలలు వైరాగ్యానికి మూలమైనవని భావించి, హస్తినాపురి చేరి ఒంటరిగా ఉండినాడు.
తండ్రీ! భటులు, ఏనుగులు, రథాలు, గుఱ్ఱాలు గల సేనతో రాజ్యాన్ని ఏలే రాజొకడు వచ్చి, నీటికోసమై తహతహపడి, మంచి చెడ్డ ఆలోచింపక నీ తండ్రిమెడలో పామును వేసివెళ్లినాడు.
ఆ మాటలు విని, ముని కుమారులతో ఆడుతున్న శృంగి, కొమ్ములతో రూపం దాల్చినట్లు విజృంభించి, రోషావేశంతో అదరిపడుతూ ఇట్లన్నాడు "ఈ రాజులు బలి పెట్టిన పిండాలు తిని బలిసిన కాకులు. ద్వారాల కడ కాచుకొని ఉన్న కుక్కలు! దాసులైన ఈ క్షత్రియులమని అనుకొనేవారిని భూసురోత్తములు తమ గృహరక్షకులుగా ఎట్లు నియమించినారు? ద్వారపాలకులుగా మాత్రమే ఉండదగినవారు వంట యింటిలో ప్రవేశించి వండిన అన్నం తినటానికి ఎలా అర్హులౌతారు? వారు చేసే ద్రోహకార్యాలకు యజమాని ఎందుకు బాధ్యుడౌతాడు?
మాతండ్రి తనను నిందింపలేదు. ఆశ్రమవాసులతోనే గాని శత్రువులతో కూడలేదు. కందమూలాలు తిని, నిశ్చల సమాధిలో అంతర్దృష్టిని విడువక నిరంతరం తన ఇష్టదైవాన్ని తప్ప అన్య ప్రపంచాన్ని చూడకుండ తానేమో, తన లోకమేమో అన్నట్లున్న ఆయనపై ఆ రాచవాడు అరాజకంగా పామును మెడలో చుట్టడం ఎందుకు?
రాజుల కడకు మేము హిరణ్యదానాలు గ్రహించటానికి పోలేదు. ధనములు తేలేదు. ఆశీర్వాదములని చెప్పి మోసంచేసి వారి ద్వారాల కడ నిలిచి విసిగించలేదు. ఇండ్లపై కూడ ఆసక్తిని వీడి ఆడవులలో పడి ఉన్నాము. అట్టియెడ బ్రహ్మర్షి అయిన మా తండ్రిమెడలో పామును వేయటం తగునా?
ప్రాజ్య సామ్రాజ్యాన్ని ఏలే సమ్రాట్టులు తమ్ము ప్రజలు పొగడగా పంచభక్ష్యపరమాన్నాలు భుజింపవచ్చు. విలువగల వలువలు ధరించవచ్చు. అంతేకాని అడవులలో ఇడుమలుపడే బడుగు (తాపసుల) జడదారుల మెడలో చచ్చిన పామును చుడతారా?
భగవంతుడు శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన అనంతరం సమర్థుడైన శాసకుడు లేకపోవటం వలన దుర్మార్గులు చెలరేగి నిరపరాధులైన సాధువులను బాధిస్తున్నారు.
బాలకులారా! నే నిప్పుడే ఆ రాజుకు శాపం పెడతాను అని మునిబాలకుడైన శృంగి ముల్లోకాలను ఏలే వారికే అదరుపాటు కలిగేట్లుగా వడివడిగా వెడలినాడు.
కౌశికి నదికి రోషంతో వెళ్లి, నీళ్లు చేతిలోకి తీసికొన్నాడు.
లేశమైన సంకోచం లేకుండ చచ్చిన పామును తీసికొని వచ్చి మా తండ్రి భుజంపై పడవేసి దురహంకారంతో కన్ను మిన్ను కానని ఆ రాజు హరిహరులు అడ్డుపడినా నేటికి ఏడవ దినం తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమయిపోతాడు.
అని శమీక మునీంద్రుని కొడుకు పరీక్షిన్మహారాజును శపించి ఆశ్రమం చేరి ధ్యాన నిమగ్నుడైన తండ్రిని చూచినాడు. అప్పుడు ఆయన మెడలో ఆ చచ్చినపాము వ్రేలాడుతూనే ఉన్నది.
అయ్యో! తండ్రీ! ఈ సందర్భంలో నీ మెడలో చచ్చిన పామును పడవేసిన ఆ దొరగారిని ఏమి చేస్తాను? రాజులకు స్నేహధర్మాలు లేవు సుమా!
ఓ తాపసులారా! ఎవరో రాజు వేటకైవచ్చి నిరపరాధియైన నా తండ్రిమీద నిష్కారణంగా నిర్దయుడై ఈ చచ్చిన పామును మెడలో పడవెసి వెళ్ళినాడు. భయంకరమైన సర్పం మరలా బ్రతుకుతుందో ఏమో! క్రూరమైన కోరలతో కాటు వేస్తుందో ఏమో! మీకు నమస్కరిస్తున్నాను. రండి, ఈ పామును తీసి పారవేయండి. మా తండ్రిని కాపాడండి.
అట్లు పలుకుతూ భయంతో ఆ పామును తొలగించే నేర్పు లేక బిగరగా కొడుకు ఏడ్చినాడు. ఆ కుమారుని ఆక్రందన ధ్వని విని, శమీక మహాముని తన సమాధి చాలించి మెల్లగా కన్నులు తెరచినాడు. భుజంపై వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి, కొడుకును జూచి
నాయనా! మనం ఎవరికీ ఏ కీడు చేసినవారము కాము. లోకులందరినీ సమానంగా ఆదరిస్తాము. నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సర్పం నా మెడకు ఎలా వచ్చింది?
అనీ ప్రశ్నించినాడు. అప్పుడు కుమారుడు శృంగి, రాజు వచ్చి పాము వేయటం, తాను ఆ రాజును శపించటం తెలిపినాడు. వెంటనే శమీకుడు తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్మహారాజని తెలుసుకొని, కొడుకు చేసిన పనికి బాధపడి ఇట్లన్నాడు.
కుమారా! ఇంతటి కఠోర శాపాన్ని పెట్టటానికి అంతటి గొప్ప కీడు ఆ మహారాజు ఏమీ చేయలేదు. తక్షక విషాగ్ని జ్వాలలపాలు కమ్మని ఆ ధరణీనాథుని అయ్యయ్యో! ఎందుకు శపించినావు?
సమర్థుడవైన బ్రహ్మచారీ! పాపము! పరీక్షిత్తు తన తల్లి గర్భమునందే దహింపబడి, శ్రీకృష్ణుని అనుగ్రహంతో బతికి బయటపడినాడు. ఇప్పుడు పరాక్రమంతో ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజును శపించవచ్చునా?
బాలకా! ప్రభువైన కృష్ణుడు లేకపోవటంచేత లోకము పుష్టిని కోల్పోయి ఏపు చెడినది. ప్రజలు కాపరిలేని గొర్రెలవలె కడగండ్లకు లోనైనారు. దొంగలు, దుండగులు విచ్చలవిడిగా చెలరేగినారు. ఇట్టి స్థితిలో మహారాజు అందరిని సమదృష్టితో ఎంతో సమర్థంగా పాలిస్తున్నాడు. ఏదో జరిగిన చిన్న తప్పిదానికి అయ్యో! రాజును ఎందుకు శపించినావు?
కుమారా! నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణింపగా ఆ రాజ్యంలో అరాచకం హద్దులు మీరుతుంది. బలం కలవాడు బలంలేని వానిపైబడి అతని సర్వస్వాన్నీ అపహరిస్తాడు. జారులు, చోరులు ఎచ్చట చూచినా బారులు తీరి విచ్చలవిడిగా విహరిస్తారు. ప్రజల్లో పరస్పర కలహాలు పెరిగిపోతాయి. వైదికములైన వర్ణాశ్రమములు, ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ధర్మం నశించిపోగా అర్ధ కామాలపై ఆసక్తి పెరుగుతుంది. చివరకు రాజ్యమంతటా కోతుల్లో, కుక్కల్లోవలె వర్ణసంకరం ఏర్పడుతుంది.
ఆ రాజు పవిత్రమైన భారత వంశంలో పుట్టినవాడు. పరమ భాగవతుడుగా పేరు కెక్కినవాడు, అశ్వమేధం చేసినవాడు, సదాచార సంపన్నుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకులాలంకారుడు అంతటి మహారాజు దప్పిక చెంది నీటికోసం మన తపోవనానికి విచ్చేయగా ఎంతో ఆదరంతో అతిథిసత్కారాలు చేయక ఊరక పంపటం ఉచితం కాదు. సత్కారం చేయకపోగా శపించటం యేమి న్యాయం? ఇది ధర్మమా?
ఓ పరమేశ్వరా! శ్రీకృష్ణా! హరీ! మా పిల్లవాడు బుద్ధిచాపల్యంతో నిరపరాధియైన పరీక్షిన్మహారాజునకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. వీడు చేసిన దోషాన్ని తొలగించుము తండ్రీ!
కుమారా! పరమభక్తులైనవారు కొట్టినా, తిట్టినా శాంతంతో సహిస్తారే కాని ప్రతీకారం చేయటానికి సమ్మతింపరు. ఆ మహారాజు నీకు కించిత్తుకూడా కీడు చేయడు.
సాధుస్వభావంగల సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి క్రుంగిపోరు. మహనీయుల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహింపవు.
అని ఈ విధంగా శమీక మహాముని తన కుమారుడు గావించిన తిరుగులేని శాపరూపమైన పాపానికి మిక్కిలి తాపం చెందినాడు. వెంటనే తన శిష్యుడైన ఒక మునిపుత్రుని పిలిచి జరిగిన వృత్తాంతమంతా మహారాజుకు తెలిపి రమ్మని పంపినాడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మునిశిష్యునివలన శమీక మహామునికుమారుని శాపవృత్తాంతం విని, కామ క్రోధాది విషయజాలంలో తగుల్కొన్న తనకు తక్షకుని విషజ్వలనజ్వాలలు వైరాగ్యానికి మూలమైనవని భావించి, హస్తినాపురి చేరి ఒంటరిగా ఉండినాడు.
Parikshit Dropped Dead Snake On Shameeka Maharshi - పరిక్షితుండు వేటాడి శమకునిపై మృతసర్పము నెత్తివైచుట
పరిక్షితుండు వేటాడి శమకునిపై మృతసర్పము నెత్తివైచుట
ఆ నరేంద్రుడు సింహపరాక్రమంతో వేటగాళ్లు మెచ్చేట్లు చంద్రమండలంలోని మృగాన్నితప్ప అరణ్యంలోని అన్ని మృగాలనూ వేటాడి చంపాడు.
ఈ విధంగా రాజు వేటపైన గాటమైన ఆసక్తితో మృగాల వెంటబడి తరుముతూ పరుగులతో తిరిగి తిరిగి, ఆకలిదప్పికల వలన అలసిపోయినాడు. అప్పు డతడు చల్లని నీటికోసం వెదకి వెదకి విసిగి వేసారి, చివరకు ఒక తపోవనం చేరినాడు.
అచ్చట పరీక్షిత్తు కన్నులు మూసికొని, ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసే శమీక మహామునిని చూచినాడు. ఆ ముని పొడవైన జడలతో జింకచర్మం ధరించి పంచేంద్రియాలను నిగ్రహించి, ప్రాణం, మనస్సు, బుద్దిని స్వాధీనపరచుకొని, జాగ్రత్, స్వప్న సుషుప్తులు అనెడి అవస్థలుదాటి నాల్దవదియైన సమాధి అవస్థలో ఏకాగ్రచిత్తుడై బ్రహ్మానుసంధానస్థితిలో ఎట్టి వికారాలు లేనివాడై ఉన్నాడు.
అప్పుడు పరీక్షిత్తు నెమ్మదిగా ఆ మునిని సమీపించి, దవడలు ఎండి, నాలుక తడి ఆరిపోగా, హీనమైన కంఠస్వరంతో నట్టుపడుతున్న పలుకులతో మెల్లమెల్లగా ఇట్లన్నాడు.
ఓ పుణ్యాత్ముడా! మహాప్రజ్ఞాధురీణుడా! మాకు వెంటనే నీరు తెచ్చియిమ్ము. ఈ సమయంలో వేటాడలేక భరింపరాని దాహం కలిగింది. తోడుగా పరివారము చెంతలేరు. వారు దూరంగా ఉన్నారు.
ఆ శమీకముని మాటాడలేదు. ఆ ముని కన్నులు మూసికొని సమాధిలో, బాహ్యేంద్రియజ్ఞానంలేక పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడని పరీక్షిత్తు తెలుసుకోలేకపోయాడు.
ఈ బ్రాహ్మణుడు అహంకారంతో కన్నులు మూసికొని ఉన్నాడు. ఉలుకడు పలుకడు. పోనీ రండి అని చేతి సైగలైన చేయడు. త్రాగుటకు మంచినీళ్లు ఇవ్వడు. మహారాజును గదా మర్యాదగా నాకు ఏవైనా పండ్లు తెచ్చి పెట్టడు. తపస్సుయొక్క ప్రభావంతో ఇంతగా కన్నులు మూసికొనిపోయే సంపదలు ఒనగూడినవా?
దప్పికతో నోరెండి ఇంటిముంగిటికి వచ్చి నీరడిగిన అతిథికి చల్లని నీరు తెచ్చి ఇవ్వటం ఎంతటివారికైనా అవశ్య కర్తవ్యం. కాని ఈ మౌని నాకు నీరిచ్చి దప్పిక తీర్చడేమి?
ఆ విధంగా పరీక్షిత్తు వేటలో మిక్కిలి అలసి గొంతెండి అంతులేని రోషంతో లోలోపల కుమిలిపోతూ, కోపాన్ని ఆపుకోలేక, మహర్షి తిరస్కారాన్ని భరింపనివాడై వింటికొప్పుతో ఒక చచ్చిన పామును అదేపనిగా తీసికొనివచ్చి ఆ బ్రహ్మర్షి మూపుపై పడవేసినాడు.
శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట
ఆ నరేంద్రుడు సింహపరాక్రమంతో వేటగాళ్లు మెచ్చేట్లు చంద్రమండలంలోని మృగాన్నితప్ప అరణ్యంలోని అన్ని మృగాలనూ వేటాడి చంపాడు.
ఈ విధంగా రాజు వేటపైన గాటమైన ఆసక్తితో మృగాల వెంటబడి తరుముతూ పరుగులతో తిరిగి తిరిగి, ఆకలిదప్పికల వలన అలసిపోయినాడు. అప్పు డతడు చల్లని నీటికోసం వెదకి వెదకి విసిగి వేసారి, చివరకు ఒక తపోవనం చేరినాడు.
అచ్చట పరీక్షిత్తు కన్నులు మూసికొని, ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసే శమీక మహామునిని చూచినాడు. ఆ ముని పొడవైన జడలతో జింకచర్మం ధరించి పంచేంద్రియాలను నిగ్రహించి, ప్రాణం, మనస్సు, బుద్దిని స్వాధీనపరచుకొని, జాగ్రత్, స్వప్న సుషుప్తులు అనెడి అవస్థలుదాటి నాల్దవదియైన సమాధి అవస్థలో ఏకాగ్రచిత్తుడై బ్రహ్మానుసంధానస్థితిలో ఎట్టి వికారాలు లేనివాడై ఉన్నాడు.
అప్పుడు పరీక్షిత్తు నెమ్మదిగా ఆ మునిని సమీపించి, దవడలు ఎండి, నాలుక తడి ఆరిపోగా, హీనమైన కంఠస్వరంతో నట్టుపడుతున్న పలుకులతో మెల్లమెల్లగా ఇట్లన్నాడు.
ఓ పుణ్యాత్ముడా! మహాప్రజ్ఞాధురీణుడా! మాకు వెంటనే నీరు తెచ్చియిమ్ము. ఈ సమయంలో వేటాడలేక భరింపరాని దాహం కలిగింది. తోడుగా పరివారము చెంతలేరు. వారు దూరంగా ఉన్నారు.
ఆ శమీకముని మాటాడలేదు. ఆ ముని కన్నులు మూసికొని సమాధిలో, బాహ్యేంద్రియజ్ఞానంలేక పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడని పరీక్షిత్తు తెలుసుకోలేకపోయాడు.
ఈ బ్రాహ్మణుడు అహంకారంతో కన్నులు మూసికొని ఉన్నాడు. ఉలుకడు పలుకడు. పోనీ రండి అని చేతి సైగలైన చేయడు. త్రాగుటకు మంచినీళ్లు ఇవ్వడు. మహారాజును గదా మర్యాదగా నాకు ఏవైనా పండ్లు తెచ్చి పెట్టడు. తపస్సుయొక్క ప్రభావంతో ఇంతగా కన్నులు మూసికొనిపోయే సంపదలు ఒనగూడినవా?
దప్పికతో నోరెండి ఇంటిముంగిటికి వచ్చి నీరడిగిన అతిథికి చల్లని నీరు తెచ్చి ఇవ్వటం ఎంతటివారికైనా అవశ్య కర్తవ్యం. కాని ఈ మౌని నాకు నీరిచ్చి దప్పిక తీర్చడేమి?
ఆ విధంగా పరీక్షిత్తు వేటలో మిక్కిలి అలసి గొంతెండి అంతులేని రోషంతో లోలోపల కుమిలిపోతూ, కోపాన్ని ఆపుకోలేక, మహర్షి తిరస్కారాన్ని భరింపనివాడై వింటికొప్పుతో ఒక చచ్చిన పామును అదేపనిగా తీసికొనివచ్చి ఆ బ్రహ్మర్షి మూపుపై పడవేసినాడు.
శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట
Tuesday, February 10, 2026
Parikshit Controlled And Restricted Kali - పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనము సేయుట
పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనము సేయుట
ఈ విధంగా పరీక్షిత్తు భూదేవిని ధర్శదేవతను ఓదార్చినాడు. మహారథుడు, అర్జునుని మనుమడు ఐన ఆ మహావీరుడు తొలకరి మెఅపు తీగెవలె తళతళ మెరుస్తూ, కన్నులకు మిరుమిట్లుగొలిపే తన ఖడ్గాన్ని చివాలున భీతి కలిగించేట్లు జళిపించి చంపుటకై పూనుకొన్నాడు. ఆ మహారాజును చూచి, కలి వెంటనే తన రాజ చిహ్నాలనన్నిటిని విడిచి, వడలిన వదనంతో భయకంపితుడై ఆ రాజు పాదముల పై శిరస్సునుంచి నమస్మారంచేసి.
ఓ రాజోత్తమా! భయంతో నా దేహమంతా వణకుతున్నది. నన్ను చంపకు. నీ శరణుజొచ్చిన నన్ను కాపాడు మని వేడుకొన్నాడు. పరీక్షిత్తు కలిపురుషుని చంపక నవ్వుతూ ఈ విధంగా అన్నాడు.
ఓరీ! దుర్మార్గుడా! నిర్మల కీర్తిగల అర్జునుని మనుమడు ఓడినవారిని, ధైర్యం వీడి, భయంతో కంపించేవారిని చంపటానికి ఇష్టపడడు. కావున నీవు నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో!
పరమ పాపాత్ముడవైన నీవు పాపాలకు బాంధవుడివి. అట్టి నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజవేషధారివైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కాలుష్యం, దౌర్భాగ్యం మొదలైన ధర్మవ్యతిరేక లక్షణాలు అన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. సత్యానికి, ధర్మానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్తదేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తున్నారు. సమస్త చరాచర ప్రపంచంలో, లోపల వెలువల అంతట నిండియున్న వాయువువలె సర్వాంతర్యామియైన ఆ స్వామివారికి సర్వశుభాలు కలిగిస్తూ, వారి మనోరథాలు తీరుస్తున్నాడు. కనుక నీవు ఈ ప్రదేశంలో ఉండటానికి వీలులేదు అని యమునివలె కత్తిని పైకెత్తగా అపుడు కలి చక్రవర్తితో ఇలా పలికినాడు.
జగత్ప్రభూ! ధగధగమనే కాంతులతో మెరుస్తున్న నీ కరవాలాన్ని చూచి నా గుండెలు పగులుతున్నాయి. చిత్తం తత్తరపడుతుంది. ఇప్పుడు నే నెక్కడికి పోగలను? ఎక్కడ ఉండగలను? నీవే ఆలోచించు.
ఓ రాజేంద్రా! అటు ఇటు ఎటు చూచినా అంతట ధనుస్సు ధరించిన నీ రూపమే కన్పిస్తుంది. మరి నే నెచ్చట తలదాచుకోవాలో నీవే ఆనతిమ్ము అని అలమటిస్తూన్న కలిపురుషుని అభ్యర్థనను ఆలకించి ఆ పరీక్షిత్తు అతనికి జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ అనే నాలుగు స్థానాలు ఇచ్చినాడు. అతడు ఇంకను అర్థించగా అయిదవ స్థానంగా సువర్ణాన్ని అనుగ్రహించినాడు. ఆ సువర్ణం కారణంగా అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే మఱి ఐదు స్థానాలు కలికికి కలిసి వచ్చాయి. ఈ స్థానాలు తప్ప మఱి యే ఇతర స్థలాలను స్పృశింపరాదని కలిని పరీక్షిత్తు గట్టిగా కట్టడి చేసినాడు. ఈ విధంగా ఆ మహారాజు కలి పురుషుని నిగ్రహించి, అంతకుమునుపు పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలను ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించినాడు.
కలిదర్పమును అణచిన సింహపరాక్రముడైన ఆ రాజసింహుడు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవ సామ్రాజ్య లక్ష్మిని గౌరవ పూర్వకంగా కలతలను పూర్తిగా అణచి పరిపాలించినాడు.
ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహంవల్ల అశ్వత్థామ బాణాగ్ని జ్వాలలనుండి బ్రతికి బయటపడి, ఎద్దురూపంలోనున్న ధర్శదేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు, మునిశాపకారణంగా తక్షకుని విషాగ్ని జ్వాలల వలన తప్పక మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకొని, సర్వసంగ పరిత్యాగియై శుకయోగీంద్రుని ఆశ్రయంతో పరిపూర్ణ పరమార్ధాన్ని గ్రహించి, చివరగా గంగానది ఒడ్డున తన శరీరాన్ని విడిచినాడు అని చెప్పి సూతుడు శౌనకునితో ఇంకా ఇట్లన్నాడు.
పవిత్రుడా! పాపరహితుడా! హరిలీలలు తెలుసుకొనేవారు, హరిపాద స్మరణ చేసేవారు, నిరంతరం హరిచరిత్రలు ఆలకించేవారు వారి మరణ సమయంలోకూడా ఎట్టి భ్రాంతిని, తొట్రుపాటును పొందరు.
(శౌనక మహర్షీ!) భృగువంశ్రేష్ఠా! పుణ్యచరిత్రుడైన వాసుదేవుడు తన అవతారం ముగించిన తరువాత లోకమంతటా విజ్బంభించిన కలి అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు కాలంలో తన ప్రభావం చూపక ఎంతో అణగిమణగి ఉండినాడు.
ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ గల విశాల భూమండలాన్ని చక్రవర్తియై ఆ అభీమన్యుపుత్త్రుడు ఏకచ్చత్రంగా పరిపాలన గావించినాడు.
ఈ కలియుగంలోని విశేషమేమంటే పాపాలు చేస్తేనే వాటి ఫలితాలు కలుగుతాయి. ఇక పుణ్యాల విషయమా? చేయాలని అనుకొంటే చాలు. వెంటనే అవి ఫలితం ఇస్తాయి. కనుకనే అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు కలి విజ్బంభణను అణచి, ఇక కలివల్ల ప్రమాదం కలుగదని నిశ్చయించుకొని అతనిని ప్రాణాలతో విడిచి పెట్టినాడు. తుమ్మెద నెమ్మదిగా నేర్పుతో పూలలోని తేనెను మాత్రమే ఉల్లాసంతో ఆస్వాదించి, విరుల కెటువంటి చేటు కలిగింపక వదలివేస్తుంది కదా!
అంతేకాక పొంచిపైకి దూకే తోడేలువలె ప్రమత్తులు, చంచల చిత్తులు ఐన మానవులను మాత్రమే కలి పురుషుడు బాధిస్తాడు. ధీరులకు కలివలన భయం కలుగదని తలచిన ఆ మహారాజు కలిని రూపుమాపక వదలిపెట్టినాడని చెప్పగా విని శౌనకాది మహర్షులు సూతుని కొనియాడుతూ ఇట్లన్నారు.
పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు మరణస్వభావం గల మాకు అమృతమయమైన విష్ణు వినిర్మలయశోవ్యాప్తికి చెందిన లీలావిశేషాలు వినిపించినావు. మహాభారమైన యజ్ఞకార్యాలు ప్రారంభించి క్రమ్ముకొన్న హోమాల పొగలతో పొగిలే మాచే గోవింద చరణారవింద మధురమకరందమును తనివితీర త్రాగించినావు. మేము ధన్యులమైనాము. స్వర్గమే కాదు అపవర్గం కూడ భాగవతులైన భక్తుల సాంగత్య భాగ్యఫలంలో సహస్రాంశానికైనా సాటిరాదు సుమా! ప్రాకృతగుణాతీతుడైన శ్రీమన్నారాయణుని గుణవిశేషాలు పరమేశ్వర బ్రహ్మాదులు కూడ తెలియలేరు. అట్టి భగవంతుని గూర్చి వీనులవిందుగా వినడానికి ఇచ్చగింపని వెఱ్ఱివాడు ఎక్కడైనా ఉంటాడా?
ఆనందనందనునికి చేసే వందనాలు అతని గురించి చేసే సంకీర్తనలు సంపత్కరాలు. పాపాలను, సంతాపాలను పూర్తిగా హరించేవి. అవి దివ్యకాంతులీనెడి దివ్వెలై కటికచీకట్లను పోగొట్టేవి. పాషండులకు పొందరానివి.
వాసుదేవుని పాదసేవలు పావనత్వమును ప్రసాదించేవి. దురితములనే తీగెలను ఖండించేవి. నిత్య కల్యాణ ప్రాభవంతో చైతన్యం కలవి, శ్రీదేవీ సేవలను ఆమోదించేవి.
పుణ్యాత్ముడా! పరమభాగవతోత్తముడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్నరేంద్రుడు శుకమహర్షి సూక్తులతో వినిర్మల బుద్ధియై మిక్కిలి తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఏ విధంగా పొందినాడు?
మహానుభావా! అత్యద్భుత యోగ విద్యాసముపేతము, విష్ణు కథాపరిపూతము, పరమపుణ్యము, సమస్త కల్యాణగుణ గణగణనీయము, భక్తజనులకు అపేక్షితము అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవత కథను మాకు వినిపింపుమని అడుగుతున్న మహర్షులతో సూతుడిలా చెప్పినాడు.
అయ్యా! పెద్దలైన మీవంటివారు అడగటమూ, కమలాక్షుడైన విష్ణుని కథలు చెప్పగలగడమూ అనేది నాకు మహభాగ్యం. పెద్దలచే సమ్మాన్యమైన నా జన్మ ధన్యమైంది. నా జీవితం సఫలం.
తక్కువకులంలో జన్మించినవాడైనా, శ్రీమన్నారాయణుని విశిష్ట కథలను వినిపిస్తే ఉన్నత కులగౌరవాన్ని పొందుతాడు.
ఏ దేవదేవుని గుణగణాలు గణించటానికి నాలుకలు చాలక నలువ(బ్రహ్మ) మొదలగు దేవతలు 'అనంతుడు' అని అనుచున్నారో, తనను కోరు తక్కిన ముక్కోటి దేవతలను కాదని శ్రీదేవి ఎవని పాదధూళిని పరిగ్రహించిందో, బ్రహ్మదేవుడు ఎవని పాదపద్మాలు కడిగిన పవిత్రజలాన్ని అఖిల జగత్తుకు అనుగ్రహించినాడో, 'భగవంతుడు' అనే పరమపవిత్ర శబ్దానికి అర్ధస్వరూపమై ఎవడు అతిశయించి విరాజిల్లుతున్నాడో, ఏ మహాత్ముని ప్రాపుగాంచి మహామునులు సర్వసంగ పరిత్యాగులై 'పరమహంస' పదాన్ని అందుకొని మరలిరాకున్నారో ఆ వాసుదేవుని దివ్యగాథలు పరిపూర్ణంగా గ్రహించటానికి ఎవరికి సాధ్యమౌతుంది?
మునివర్యులారా! పక్షి తన శక్తికొలది ఎంత పైకి ఎగిరినప్పటికి ఆకాశం అంతు కనుగొనలేదు. అట్లే వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినంత మేరకు తప్ప సమగ్రంగా వివరించి చెప్ప గల సమర్దుండెవడు? నా మనస్సుకు అందినంతవరకు మీకు తప్పక వివరిస్తాను. ఆలకించండి.
హస్తినాపురరాజేంద్రుడైన పరీక్షిత్తు ఒకనాడు వింటిని చేతబట్టి అడవులలో ఏనుగులు మొదలైన జంతువులు తప్పించుకొని పోనీయకుండ పరాక్రమంతో వెంటనంటి వేటాడసాగినాడు.
పెద్ద పెద్ద గోతులు త్రవ్వి, జంతువులను అందులో పడేటట్లు తోలి వలలు, ఉచ్చులు మొదలైనవి పన్ని వాటిలో చిక్కుకొన్న మృగాలను సమీపించి చంపవలెననే ఉత్సాహము, మృగాలను వెంటబడి వేటాడేటట్లు చేయగా.
ఆ మహారాజు ఎంతో నైపుణ్యంతో, అడవి పందులను, అడవి ఎద్దులను, తోడేళ్లను, పెద్ద పులులను, సివంగులను, ఖడ్గ మృగాలను, కేసరి మృగాలను (అడవి గొఱ్ఱెలను) సింహాలను, ఏనుగులను, శరభాలను, సవర మృగాలను, కోండ చిలువలు మొదలైన వాటిని పడగొట్టినాడు.
ఈ విధంగా పరీక్షిత్తు భూదేవిని ధర్శదేవతను ఓదార్చినాడు. మహారథుడు, అర్జునుని మనుమడు ఐన ఆ మహావీరుడు తొలకరి మెఅపు తీగెవలె తళతళ మెరుస్తూ, కన్నులకు మిరుమిట్లుగొలిపే తన ఖడ్గాన్ని చివాలున భీతి కలిగించేట్లు జళిపించి చంపుటకై పూనుకొన్నాడు. ఆ మహారాజును చూచి, కలి వెంటనే తన రాజ చిహ్నాలనన్నిటిని విడిచి, వడలిన వదనంతో భయకంపితుడై ఆ రాజు పాదముల పై శిరస్సునుంచి నమస్మారంచేసి.
ఓ రాజోత్తమా! భయంతో నా దేహమంతా వణకుతున్నది. నన్ను చంపకు. నీ శరణుజొచ్చిన నన్ను కాపాడు మని వేడుకొన్నాడు. పరీక్షిత్తు కలిపురుషుని చంపక నవ్వుతూ ఈ విధంగా అన్నాడు.
ఓరీ! దుర్మార్గుడా! నిర్మల కీర్తిగల అర్జునుని మనుమడు ఓడినవారిని, ధైర్యం వీడి, భయంతో కంపించేవారిని చంపటానికి ఇష్టపడడు. కావున నీవు నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో!
పరమ పాపాత్ముడవైన నీవు పాపాలకు బాంధవుడివి. అట్టి నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజవేషధారివైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కాలుష్యం, దౌర్భాగ్యం మొదలైన ధర్మవ్యతిరేక లక్షణాలు అన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. సత్యానికి, ధర్మానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్తదేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తున్నారు. సమస్త చరాచర ప్రపంచంలో, లోపల వెలువల అంతట నిండియున్న వాయువువలె సర్వాంతర్యామియైన ఆ స్వామివారికి సర్వశుభాలు కలిగిస్తూ, వారి మనోరథాలు తీరుస్తున్నాడు. కనుక నీవు ఈ ప్రదేశంలో ఉండటానికి వీలులేదు అని యమునివలె కత్తిని పైకెత్తగా అపుడు కలి చక్రవర్తితో ఇలా పలికినాడు.
జగత్ప్రభూ! ధగధగమనే కాంతులతో మెరుస్తున్న నీ కరవాలాన్ని చూచి నా గుండెలు పగులుతున్నాయి. చిత్తం తత్తరపడుతుంది. ఇప్పుడు నే నెక్కడికి పోగలను? ఎక్కడ ఉండగలను? నీవే ఆలోచించు.
ఓ రాజేంద్రా! అటు ఇటు ఎటు చూచినా అంతట ధనుస్సు ధరించిన నీ రూపమే కన్పిస్తుంది. మరి నే నెచ్చట తలదాచుకోవాలో నీవే ఆనతిమ్ము అని అలమటిస్తూన్న కలిపురుషుని అభ్యర్థనను ఆలకించి ఆ పరీక్షిత్తు అతనికి జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ అనే నాలుగు స్థానాలు ఇచ్చినాడు. అతడు ఇంకను అర్థించగా అయిదవ స్థానంగా సువర్ణాన్ని అనుగ్రహించినాడు. ఆ సువర్ణం కారణంగా అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే మఱి ఐదు స్థానాలు కలికికి కలిసి వచ్చాయి. ఈ స్థానాలు తప్ప మఱి యే ఇతర స్థలాలను స్పృశింపరాదని కలిని పరీక్షిత్తు గట్టిగా కట్టడి చేసినాడు. ఈ విధంగా ఆ మహారాజు కలి పురుషుని నిగ్రహించి, అంతకుమునుపు పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలను ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించినాడు.
కలిదర్పమును అణచిన సింహపరాక్రముడైన ఆ రాజసింహుడు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవ సామ్రాజ్య లక్ష్మిని గౌరవ పూర్వకంగా కలతలను పూర్తిగా అణచి పరిపాలించినాడు.
ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహంవల్ల అశ్వత్థామ బాణాగ్ని జ్వాలలనుండి బ్రతికి బయటపడి, ఎద్దురూపంలోనున్న ధర్శదేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు, మునిశాపకారణంగా తక్షకుని విషాగ్ని జ్వాలల వలన తప్పక మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకొని, సర్వసంగ పరిత్యాగియై శుకయోగీంద్రుని ఆశ్రయంతో పరిపూర్ణ పరమార్ధాన్ని గ్రహించి, చివరగా గంగానది ఒడ్డున తన శరీరాన్ని విడిచినాడు అని చెప్పి సూతుడు శౌనకునితో ఇంకా ఇట్లన్నాడు.
పవిత్రుడా! పాపరహితుడా! హరిలీలలు తెలుసుకొనేవారు, హరిపాద స్మరణ చేసేవారు, నిరంతరం హరిచరిత్రలు ఆలకించేవారు వారి మరణ సమయంలోకూడా ఎట్టి భ్రాంతిని, తొట్రుపాటును పొందరు.
(శౌనక మహర్షీ!) భృగువంశ్రేష్ఠా! పుణ్యచరిత్రుడైన వాసుదేవుడు తన అవతారం ముగించిన తరువాత లోకమంతటా విజ్బంభించిన కలి అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు కాలంలో తన ప్రభావం చూపక ఎంతో అణగిమణగి ఉండినాడు.
ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ గల విశాల భూమండలాన్ని చక్రవర్తియై ఆ అభీమన్యుపుత్త్రుడు ఏకచ్చత్రంగా పరిపాలన గావించినాడు.
ఈ కలియుగంలోని విశేషమేమంటే పాపాలు చేస్తేనే వాటి ఫలితాలు కలుగుతాయి. ఇక పుణ్యాల విషయమా? చేయాలని అనుకొంటే చాలు. వెంటనే అవి ఫలితం ఇస్తాయి. కనుకనే అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు కలి విజ్బంభణను అణచి, ఇక కలివల్ల ప్రమాదం కలుగదని నిశ్చయించుకొని అతనిని ప్రాణాలతో విడిచి పెట్టినాడు. తుమ్మెద నెమ్మదిగా నేర్పుతో పూలలోని తేనెను మాత్రమే ఉల్లాసంతో ఆస్వాదించి, విరుల కెటువంటి చేటు కలిగింపక వదలివేస్తుంది కదా!
అంతేకాక పొంచిపైకి దూకే తోడేలువలె ప్రమత్తులు, చంచల చిత్తులు ఐన మానవులను మాత్రమే కలి పురుషుడు బాధిస్తాడు. ధీరులకు కలివలన భయం కలుగదని తలచిన ఆ మహారాజు కలిని రూపుమాపక వదలిపెట్టినాడని చెప్పగా విని శౌనకాది మహర్షులు సూతుని కొనియాడుతూ ఇట్లన్నారు.
పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు మరణస్వభావం గల మాకు అమృతమయమైన విష్ణు వినిర్మలయశోవ్యాప్తికి చెందిన లీలావిశేషాలు వినిపించినావు. మహాభారమైన యజ్ఞకార్యాలు ప్రారంభించి క్రమ్ముకొన్న హోమాల పొగలతో పొగిలే మాచే గోవింద చరణారవింద మధురమకరందమును తనివితీర త్రాగించినావు. మేము ధన్యులమైనాము. స్వర్గమే కాదు అపవర్గం కూడ భాగవతులైన భక్తుల సాంగత్య భాగ్యఫలంలో సహస్రాంశానికైనా సాటిరాదు సుమా! ప్రాకృతగుణాతీతుడైన శ్రీమన్నారాయణుని గుణవిశేషాలు పరమేశ్వర బ్రహ్మాదులు కూడ తెలియలేరు. అట్టి భగవంతుని గూర్చి వీనులవిందుగా వినడానికి ఇచ్చగింపని వెఱ్ఱివాడు ఎక్కడైనా ఉంటాడా?
ఆనందనందనునికి చేసే వందనాలు అతని గురించి చేసే సంకీర్తనలు సంపత్కరాలు. పాపాలను, సంతాపాలను పూర్తిగా హరించేవి. అవి దివ్యకాంతులీనెడి దివ్వెలై కటికచీకట్లను పోగొట్టేవి. పాషండులకు పొందరానివి.
వాసుదేవుని పాదసేవలు పావనత్వమును ప్రసాదించేవి. దురితములనే తీగెలను ఖండించేవి. నిత్య కల్యాణ ప్రాభవంతో చైతన్యం కలవి, శ్రీదేవీ సేవలను ఆమోదించేవి.
పుణ్యాత్ముడా! పరమభాగవతోత్తముడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్నరేంద్రుడు శుకమహర్షి సూక్తులతో వినిర్మల బుద్ధియై మిక్కిలి తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఏ విధంగా పొందినాడు?
మహానుభావా! అత్యద్భుత యోగ విద్యాసముపేతము, విష్ణు కథాపరిపూతము, పరమపుణ్యము, సమస్త కల్యాణగుణ గణగణనీయము, భక్తజనులకు అపేక్షితము అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవత కథను మాకు వినిపింపుమని అడుగుతున్న మహర్షులతో సూతుడిలా చెప్పినాడు.
అయ్యా! పెద్దలైన మీవంటివారు అడగటమూ, కమలాక్షుడైన విష్ణుని కథలు చెప్పగలగడమూ అనేది నాకు మహభాగ్యం. పెద్దలచే సమ్మాన్యమైన నా జన్మ ధన్యమైంది. నా జీవితం సఫలం.
తక్కువకులంలో జన్మించినవాడైనా, శ్రీమన్నారాయణుని విశిష్ట కథలను వినిపిస్తే ఉన్నత కులగౌరవాన్ని పొందుతాడు.
ఏ దేవదేవుని గుణగణాలు గణించటానికి నాలుకలు చాలక నలువ(బ్రహ్మ) మొదలగు దేవతలు 'అనంతుడు' అని అనుచున్నారో, తనను కోరు తక్కిన ముక్కోటి దేవతలను కాదని శ్రీదేవి ఎవని పాదధూళిని పరిగ్రహించిందో, బ్రహ్మదేవుడు ఎవని పాదపద్మాలు కడిగిన పవిత్రజలాన్ని అఖిల జగత్తుకు అనుగ్రహించినాడో, 'భగవంతుడు' అనే పరమపవిత్ర శబ్దానికి అర్ధస్వరూపమై ఎవడు అతిశయించి విరాజిల్లుతున్నాడో, ఏ మహాత్ముని ప్రాపుగాంచి మహామునులు సర్వసంగ పరిత్యాగులై 'పరమహంస' పదాన్ని అందుకొని మరలిరాకున్నారో ఆ వాసుదేవుని దివ్యగాథలు పరిపూర్ణంగా గ్రహించటానికి ఎవరికి సాధ్యమౌతుంది?
మునివర్యులారా! పక్షి తన శక్తికొలది ఎంత పైకి ఎగిరినప్పటికి ఆకాశం అంతు కనుగొనలేదు. అట్లే వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినంత మేరకు తప్ప సమగ్రంగా వివరించి చెప్ప గల సమర్దుండెవడు? నా మనస్సుకు అందినంతవరకు మీకు తప్పక వివరిస్తాను. ఆలకించండి.
హస్తినాపురరాజేంద్రుడైన పరీక్షిత్తు ఒకనాడు వింటిని చేతబట్టి అడవులలో ఏనుగులు మొదలైన జంతువులు తప్పించుకొని పోనీయకుండ పరాక్రమంతో వెంటనంటి వేటాడసాగినాడు.
పెద్ద పెద్ద గోతులు త్రవ్వి, జంతువులను అందులో పడేటట్లు తోలి వలలు, ఉచ్చులు మొదలైనవి పన్ని వాటిలో చిక్కుకొన్న మృగాలను సమీపించి చంపవలెననే ఉత్సాహము, మృగాలను వెంటబడి వేటాడేటట్లు చేయగా.
ఆ మహారాజు ఎంతో నైపుణ్యంతో, అడవి పందులను, అడవి ఎద్దులను, తోడేళ్లను, పెద్ద పులులను, సివంగులను, ఖడ్గ మృగాలను, కేసరి మృగాలను (అడవి గొఱ్ఱెలను) సింహాలను, ఏనుగులను, శరభాలను, సవర మృగాలను, కోండ చిలువలు మొదలైన వాటిని పడగొట్టినాడు.
Kali Purusha Hits Dharma Devatha - కలిపురుషు౦డు ధర్మదేవతను దన్నుట
కలిపురుషు౦డు ధర్మదేవతను దన్నుట
కైలాస పర్వతంవలె తెల్లగా గంభీరంగా ఎత్తుగా ఉన్న శ్రేష్ఠమైన వృషభాన్ని, కాలునివలె క్రోధం కలవాడు, కఠోరచిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి, బలిష్ఠమైన పిక్కలతో వడివడిగా నడిచేవాడు ఐన ఒక శూద్రుడు కటిక రాక్షసునివలె కనికరం లేకుండా త్వరత్వరగా వచ్చి కాలితో తన్నినాడు. పిడుగుపాటువంటి ఆ తన్నుకు ఆ ఎద్దు నేలమీద కూలబడింది. మూత్ర విసర్జన చేసింది.
వాడు అంతటితో ఊరకుండలేదు.
ఒడలెల్ల గడగడ వడకుతూ కన్నుల వెంబడి ఏకధారగా కన్నీరు కారుస్తూ ఉన్నదానిని, గొంతెత్తి గట్టిగా "అంబా అని అరచే దానినీ, జంపుగా పెరిగిన లేత పచ్చికను మేయటానికి నాలుక చాచిన దానినీ, చెదరిన గుండె కలదానినీ, లేగదూడ లేక ఒంటరిగా ఉన్నదానినీ, పొంగిపొరలి వచ్చే ఏడ్పు కలదానినీ చెమటనీటితో నిండిన దేహం కలదీ భయోపేత అయినదీ ఐన ఆ గోమాతను ఆ పాపాత్ముడు పైకెగిరి వడిగా తన్నినాడు.
ఈ విధంగా ఆ ఎద్దును ఆవును రెండింటిని తన ఎదుటనే కాలితో తన్నుచున్న రాజలాంఛనాలు గల కంటకుడైన శూద్రుని చూచి, కాంచన రథారూఢుడై ఉన్న పరీక్షిన్నరేంద్రుడు విల్లెక్కుపెట్టి మేఘ గంభీర వాక్కులతో ఈ విధంగా అన్నాడు.
దుర్మతీ! ఎవడవురా నీవు? నిన్ను కొమ్ములతో పొడిచిందా? నిన్నెదుర్కొన్నదా? ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను అన్యాయంగా ఎందుకు తన్నినావు? నా భుజాదండంతో సంరక్షింపబడే ఈ భూమండలంలో ఎప్పుడు ఎవ్వరు ఎట్టి నేరాలు చేయరాదని నీకు తెలియదా? మోసపు వేషాన్ని ధరించి ఇప్పుడు ఇక్కడ రాజువలె రాజసం ఒలకబోస్తున్నావు? నిన్ను కఠినంగా శిక్షిస్తాను.
గాండీవాన్ని ధరించిన అర్జునుడు, చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచివెళ్లగానే, నీవు మదంచే ఉన్మత్తుడవై దండింప తగని సాధువులను దండిస్తున్నావు. నీవే దండనార్హుడవు, నీకిప్పుడు ప్రచండమైన రాజదండన తప్పదు.
అని పలికి పరీక్షిన్మహారాజు ఎద్దునుచూచి ఈ విధంగా అన్నాడు.
ఈ వృషభరూపంలో ఉన్న శ్రేష్ఠుడవైన ధర్మదేవా! కురువంశ క్షత్రియుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ భూమండలంలోని ప్రజలు నీ కన్నులనుండి జాలువారే కన్నీటి ధారలు తప్ప అధర్మ బాధితులైన మరి యే ఇతర జీవుల కన్నీటిధారలు ఇంతవరకు చూచి ఎరుగరు. ఇదిగో చూడు. ఇప్పుడే ఈ దుర్మార్గుణ్ణి పటిష్ఠమైన నా పరాక్రమంతో చీల్చి చెండాడుతాను.
ఓ ధర్మస్వరూపా! నీవు దిగులు పడవద్దు. నా బాణపరంపరలతో ఈ పాపాత్ముని రూపుమాపుతున్నాను. నిన్ను ఇప్పుడే ఈ భూమిపై నాలుగుపాదాలతో నడిపిస్తాను సుమీ!
నీవు నీ నోటికి రుచించే పచ్చిగడ్డిని అడవులలో మేసి, అక్కడనే నదుల్లో స్వచ్చమైన నీరు త్రాగి స్వేచ్చగా జీవిస్తుండగా ఏ పాపాత్ముడు నీ పాదాలు ఈ విధంగా విరుగగొట్టినాడో వాడు ఖేచరుడయినా, భూచరుడైనా నింగిపైకి పారినా, నేలలోకి దూరినా ఆ దుష్టుని మణికంకణ మండితములైన రెండుచేతులనూ ఇప్పుడే ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తాను.
అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణియగు భూదేవితో ఈ విధంగా అన్నాడు.
అమ్మా! కల్యాణదాయినివైన ఓ భూదేవీ! అనంతవైభవాలు గల శ్రీకృష్ణస్వామి ఈ లోకాన్ని వదలి వెళ్లినాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు తల్లీ! మనసులో దిగులు పడవద్దు. భయాన్ని వీడు. నా బాణాలతో వాని నిప్పుడే నేలకూల్చివేస్తాను చూడు తల్లీ!
తల్లీ! నిరపరాధులైన సాధువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించి తీరవలెను. అలా శిక్షింపక ఉపేక్షిస్తే ఆ రాజాధముని ఆయుస్సు, ఐశ్వర్యం స్వర్గసుఖంతో కూడ సర్వమూ వ్యర్థం. అది ముమ్మాటికి యథార్థం.
సాధ్వీమణివైన ఓ పృథ్వీమాతా! బ్రహ్మదేవుడు దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రభువులను సృష్టించెనని ప్రాచీనులైన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కావున రాజునైన నాకు ఆర్తరక్షణ అనేది పరమధర్శం.
ఇట్లు పలికిన ధర్మనందనుని మనుమడగు పరీక్షిత్తుకు ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవుడు ఈ విధంగా అన్నాడు.
రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్నరేంద్రా! నీవు దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టినవాడవు. ఎంతో అదృష్టవంతుడవు. మీ పూర్వులింతటి ధర్మస్వరూపులగుట వలననే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తికి ఎంతో సంతోషించి, దూతయై రాయబారం నిర్వహించినాడు.
"రాజా! మేము ఇతర ప్రాణులను బాధపెట్టము. మా వలన ఏ ప్రాణికిగాని ఎట్టి ఆపద కలుగదు. నానావిధ వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీంద్రులు ఆత్మయే సుఖదుఃఖ కారకుడగు ప్రభువని అంటారు. దైవజ్ఞులు గ్రహాలకు, దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మ ప్రాధాన్యాన్ని అంగీకరిస్తున్నారు. స్వభావమే ప్రధానమన్న లోకాయతికులు ప్రకృతికే ప్రాధాన్యమంటారు. కాని ఇందెవ్వరికి కూడా సుఖం దుఃఖం కలిగిందని, మరి ఎవరో కీడు చేసినారని తలంచుట పొరపాటు. బుద్ధికి మనస్సుకు అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సర్వమూ నిర్వహింపబడుతుంది” అని పలికిన ధర్మదేవతతో ధర్మరాజు మనుమడైన పరీక్షిత్తు ఈ విధంగా అన్నాడు.
ఎద్దు రూపంలో ఉన్న ఓ ధర్మజ్ఞుడా! నీవు ధర్మమూర్తివి. నీవు పలికే తీరు పరమధర్మం. పాపాత్ముడు చేసే పాపాన్ని తెలుపుటకు కూడా నీవు ఇష్టపడవు. పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాపఫలం తప్పక అంటుకొంటుందని పెద్దలు చెపుతారు.
వాక్కుకు, మనస్సుకు అతీతమైన దైవమాయవలన జీవులకు చంపదగినవాడు, చంపేవాడు అనే వీరిద్దరి స్వరూపం అంత సులువుగా తెలియదగింది కాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంలో నీకు తపము, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండినవని చెపుతారు. త్రేతాయుగంలో ఆ నాల్లింటిలో ఒకటి నశించింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించినవి. ఇప్పుడు కలియుగంలో మూడుపాదాలు భగ్నమైనవి. సత్యం ఒక్కటే మిగిలి ఉన్నది. దానిని కూడా కలియుగం చివరలో అధర్మం ఆక్రమించి శిక్షించటానికి కాచుకొని ఉన్నది. ఇదిగో ఇటు చూడు.
ధర్మాన్ని తెలిసిన ఓ ధర్శదేవా! శ్రీకృష్ణుడు అవతరించి భూభారాన్ని తొలగించినాడు. ఆయన దివ్యపాదస్పర్శతో భూదేవి ఎంతో సంతోషించి, పులకింతలతో మైమరచిపోయింది. ఇప్పుడు అట్టి పాదస్పర్శకు దూరమై పాపాత్ములు తనపై క్రూరంగా పెత్తనం చూపిస్తారేమోనని భీతిచెంది కన్నీరు కారుస్తున్న భూమాతను చూచినావా!
కైలాస పర్వతంవలె తెల్లగా గంభీరంగా ఎత్తుగా ఉన్న శ్రేష్ఠమైన వృషభాన్ని, కాలునివలె క్రోధం కలవాడు, కఠోరచిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి, బలిష్ఠమైన పిక్కలతో వడివడిగా నడిచేవాడు ఐన ఒక శూద్రుడు కటిక రాక్షసునివలె కనికరం లేకుండా త్వరత్వరగా వచ్చి కాలితో తన్నినాడు. పిడుగుపాటువంటి ఆ తన్నుకు ఆ ఎద్దు నేలమీద కూలబడింది. మూత్ర విసర్జన చేసింది.
వాడు అంతటితో ఊరకుండలేదు.
ఒడలెల్ల గడగడ వడకుతూ కన్నుల వెంబడి ఏకధారగా కన్నీరు కారుస్తూ ఉన్నదానిని, గొంతెత్తి గట్టిగా "అంబా అని అరచే దానినీ, జంపుగా పెరిగిన లేత పచ్చికను మేయటానికి నాలుక చాచిన దానినీ, చెదరిన గుండె కలదానినీ, లేగదూడ లేక ఒంటరిగా ఉన్నదానినీ, పొంగిపొరలి వచ్చే ఏడ్పు కలదానినీ చెమటనీటితో నిండిన దేహం కలదీ భయోపేత అయినదీ ఐన ఆ గోమాతను ఆ పాపాత్ముడు పైకెగిరి వడిగా తన్నినాడు.
ఈ విధంగా ఆ ఎద్దును ఆవును రెండింటిని తన ఎదుటనే కాలితో తన్నుచున్న రాజలాంఛనాలు గల కంటకుడైన శూద్రుని చూచి, కాంచన రథారూఢుడై ఉన్న పరీక్షిన్నరేంద్రుడు విల్లెక్కుపెట్టి మేఘ గంభీర వాక్కులతో ఈ విధంగా అన్నాడు.
దుర్మతీ! ఎవడవురా నీవు? నిన్ను కొమ్ములతో పొడిచిందా? నిన్నెదుర్కొన్నదా? ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను అన్యాయంగా ఎందుకు తన్నినావు? నా భుజాదండంతో సంరక్షింపబడే ఈ భూమండలంలో ఎప్పుడు ఎవ్వరు ఎట్టి నేరాలు చేయరాదని నీకు తెలియదా? మోసపు వేషాన్ని ధరించి ఇప్పుడు ఇక్కడ రాజువలె రాజసం ఒలకబోస్తున్నావు? నిన్ను కఠినంగా శిక్షిస్తాను.
గాండీవాన్ని ధరించిన అర్జునుడు, చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచివెళ్లగానే, నీవు మదంచే ఉన్మత్తుడవై దండింప తగని సాధువులను దండిస్తున్నావు. నీవే దండనార్హుడవు, నీకిప్పుడు ప్రచండమైన రాజదండన తప్పదు.
అని పలికి పరీక్షిన్మహారాజు ఎద్దునుచూచి ఈ విధంగా అన్నాడు.
ఈ వృషభరూపంలో ఉన్న శ్రేష్ఠుడవైన ధర్మదేవా! కురువంశ క్షత్రియుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ భూమండలంలోని ప్రజలు నీ కన్నులనుండి జాలువారే కన్నీటి ధారలు తప్ప అధర్మ బాధితులైన మరి యే ఇతర జీవుల కన్నీటిధారలు ఇంతవరకు చూచి ఎరుగరు. ఇదిగో చూడు. ఇప్పుడే ఈ దుర్మార్గుణ్ణి పటిష్ఠమైన నా పరాక్రమంతో చీల్చి చెండాడుతాను.
ఓ ధర్మస్వరూపా! నీవు దిగులు పడవద్దు. నా బాణపరంపరలతో ఈ పాపాత్ముని రూపుమాపుతున్నాను. నిన్ను ఇప్పుడే ఈ భూమిపై నాలుగుపాదాలతో నడిపిస్తాను సుమీ!
నీవు నీ నోటికి రుచించే పచ్చిగడ్డిని అడవులలో మేసి, అక్కడనే నదుల్లో స్వచ్చమైన నీరు త్రాగి స్వేచ్చగా జీవిస్తుండగా ఏ పాపాత్ముడు నీ పాదాలు ఈ విధంగా విరుగగొట్టినాడో వాడు ఖేచరుడయినా, భూచరుడైనా నింగిపైకి పారినా, నేలలోకి దూరినా ఆ దుష్టుని మణికంకణ మండితములైన రెండుచేతులనూ ఇప్పుడే ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తాను.
అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణియగు భూదేవితో ఈ విధంగా అన్నాడు.
అమ్మా! కల్యాణదాయినివైన ఓ భూదేవీ! అనంతవైభవాలు గల శ్రీకృష్ణస్వామి ఈ లోకాన్ని వదలి వెళ్లినాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు తల్లీ! మనసులో దిగులు పడవద్దు. భయాన్ని వీడు. నా బాణాలతో వాని నిప్పుడే నేలకూల్చివేస్తాను చూడు తల్లీ!
తల్లీ! నిరపరాధులైన సాధువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించి తీరవలెను. అలా శిక్షింపక ఉపేక్షిస్తే ఆ రాజాధముని ఆయుస్సు, ఐశ్వర్యం స్వర్గసుఖంతో కూడ సర్వమూ వ్యర్థం. అది ముమ్మాటికి యథార్థం.
సాధ్వీమణివైన ఓ పృథ్వీమాతా! బ్రహ్మదేవుడు దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రభువులను సృష్టించెనని ప్రాచీనులైన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కావున రాజునైన నాకు ఆర్తరక్షణ అనేది పరమధర్శం.
ఇట్లు పలికిన ధర్మనందనుని మనుమడగు పరీక్షిత్తుకు ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవుడు ఈ విధంగా అన్నాడు.
రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్నరేంద్రా! నీవు దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టినవాడవు. ఎంతో అదృష్టవంతుడవు. మీ పూర్వులింతటి ధర్మస్వరూపులగుట వలననే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తికి ఎంతో సంతోషించి, దూతయై రాయబారం నిర్వహించినాడు.
"రాజా! మేము ఇతర ప్రాణులను బాధపెట్టము. మా వలన ఏ ప్రాణికిగాని ఎట్టి ఆపద కలుగదు. నానావిధ వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీంద్రులు ఆత్మయే సుఖదుఃఖ కారకుడగు ప్రభువని అంటారు. దైవజ్ఞులు గ్రహాలకు, దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మ ప్రాధాన్యాన్ని అంగీకరిస్తున్నారు. స్వభావమే ప్రధానమన్న లోకాయతికులు ప్రకృతికే ప్రాధాన్యమంటారు. కాని ఇందెవ్వరికి కూడా సుఖం దుఃఖం కలిగిందని, మరి ఎవరో కీడు చేసినారని తలంచుట పొరపాటు. బుద్ధికి మనస్సుకు అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సర్వమూ నిర్వహింపబడుతుంది” అని పలికిన ధర్మదేవతతో ధర్మరాజు మనుమడైన పరీక్షిత్తు ఈ విధంగా అన్నాడు.
ఎద్దు రూపంలో ఉన్న ఓ ధర్మజ్ఞుడా! నీవు ధర్మమూర్తివి. నీవు పలికే తీరు పరమధర్మం. పాపాత్ముడు చేసే పాపాన్ని తెలుపుటకు కూడా నీవు ఇష్టపడవు. పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాపఫలం తప్పక అంటుకొంటుందని పెద్దలు చెపుతారు.
వాక్కుకు, మనస్సుకు అతీతమైన దైవమాయవలన జీవులకు చంపదగినవాడు, చంపేవాడు అనే వీరిద్దరి స్వరూపం అంత సులువుగా తెలియదగింది కాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంలో నీకు తపము, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండినవని చెపుతారు. త్రేతాయుగంలో ఆ నాల్లింటిలో ఒకటి నశించింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించినవి. ఇప్పుడు కలియుగంలో మూడుపాదాలు భగ్నమైనవి. సత్యం ఒక్కటే మిగిలి ఉన్నది. దానిని కూడా కలియుగం చివరలో అధర్మం ఆక్రమించి శిక్షించటానికి కాచుకొని ఉన్నది. ఇదిగో ఇటు చూడు.
ధర్మాన్ని తెలిసిన ఓ ధర్శదేవా! శ్రీకృష్ణుడు అవతరించి భూభారాన్ని తొలగించినాడు. ఆయన దివ్యపాదస్పర్శతో భూదేవి ఎంతో సంతోషించి, పులకింతలతో మైమరచిపోయింది. ఇప్పుడు అట్టి పాదస్పర్శకు దూరమై పాపాత్ములు తనపై క్రూరంగా పెత్తనం చూపిస్తారేమోనని భీతిచెంది కన్నీరు కారుస్తున్న భూమాతను చూచినావా!
Subscribe to:
Comments (Atom)
Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...