Wednesday, August 12, 2026

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ - తృణప్రాయుం

రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి, భయకంపితయై దీనస్వురంతో.

నీ 
నస్సు మార్చుకుని నీ నారీజనం మీద నిలుపుకో. పాపికి సత్ఫలితాలు దొరకవు. అలానే నీకు నేను అందను.

నా పుట్టినిల్లు, మెట్టినిల్లు పర
పవిత్రమయినవి నేను యీ అకార్యం చెయ్యను, అంటూ ముఖం ప్రక్కకు త్రిప్పి;

సజ్జనధర్మాన్నీ, వారి నియమాలనూ విస్మరించకు. నేను పతివ్రతా ధర్మశీలను, పరస్త్రీని, అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు.

నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు; వారి రక్షణ నీకెంత ముఖ్యమో నా రక్షణ నా బర్త కంత ప్రదానం.

కట్టుకున్న భార్యతో తృప్తిపడని వానిని చపలచిత్తునిగా, ఇంద్రియ నిగ్రహంలేని వానిగా బావించి పరాభవిస్తారు, పరస్త్రీలు.

ఈ లంకానగరంలో సత్పురుషులే లేరా! ఉన్నా వారి మాట నీ చెవి కెక్కడంలేదా! సదాచారవిరుద్ధంగా నీ బుద్ధి యింతటి విపరీతానికి ఒడిగట్టిందేం! ఆత్మజ్ఞానశూన్యుడై, దురాచారపరుడైన రాజువల్ల రాజ్యం సర్వనాశనమవుతుందని ఎరుగవా!

సర్వసంపదలతో అలరారే ఈ లంకానగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరదృష్టి లేకుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను బలిగొన్నరోజున సర్వభూతకోటీ సంతోషిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలకు తలవంచిన వారందరూ నిన్ను ఆడిపోసుకునే రోజు రాకపోదు. ఆనాడు దైవం తమను అనుగ్రహించి నిన్ను కడతేర్చిందని సంతోషిసారు.

నీ సిరి సంపదలు నన్ను వంచించవు, సూర్యుని వీడని కాంతిలా రాముని వెన్నంటి నేనుంటాను. సర్వలోకనాధుడయిన శ్రీరామచంద్రుని భుజసీమ ఆధారంగా శయనించె నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞానియైన విప్రునికి లభించే వేదవిద్యవలె నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం
నుండి నన్ను ఉద్ధరించి రాముని దగ్గరకు పంపు.

నీకు జీవితంమీద ఆశవుంటే నేను చెప్పినట్లు చెయ్యి. రామునితో స్నేహం చేసుకో. ఆయన ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు ఇంద్రియ దౌర్బల్యాలకు లొంగకు. నన్ను నా భర్త దగ్గరకు పంపితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా నీ మరణం తథ్యం.

ఇంద్రుని వజ్రాయుధాన్ని తప్పించుకోవచ్చు.
పాశాన్ని వదిలించుకోవచ్చు.
కాని రామబాణానికి తిరుగులేదు.

అగ్నిశిఖలు జిమ్మే 
హాసర్పముఖాలవలె, రా, లక్ష్మణుల నిశితబాణాలు యిక్కడపడక తప్పదు. ఈ నగరంనిండా రాబందులు చేరి నీ రాక్షసజనాన్ని పీక్కుతింటాయి. రాగరుత్మంతుడు రాక్షస సర్పాలను తనవాడిగోళ్ళ బాణాలతో చీల్చి చెండాడుతాడు.

రాక్షసలక్ష్మిని మూడడుగుల వామనుడు హరించినట్లు శత్రునాశన సమర్థుడయిన రాముడు ఈ రాక్షసశక్తిని నశింపజేసి నన్ను తీసుకువెడతాడు.

జనస్థానంలో నీ రాక్షసబలాన్ని అయన సర్వనాశనం చేసినప్పుడు ఎదుర్కోలేని అసముర్ధుడవు; వారు ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావుకనక యీపని చెయ్యగలిగావు.

వారి కంటబడితే పెద్దపులులముందు కుక్కలా అయేవాడవు. వృత్రాసురుడు ఇంద్రుని నిగ్రహించలేనట్లే నువ్వు రా
లక్ష్మణులను ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవిరిచేసేటట్లు రామలక్ష్మణులు నిన్ను ప్రాణహీనుని చేస్తారు.

కుబేరనిలయుంలో దాగినా, వరుణాలయంలో శరణుపొందినా, పిడుగుపడిన చెట్టువలె నీకు శ్రీరామబాణంతో చావు తప్పదు, అంటున్నది సీత.

అకామాం కామయానస్య
శరీర ముపతప్యతే
ఇచ్చంతీం కామయానస్య
ప్రీతి ర్భవతి శోభనా

రావణుని క్రోధం

Ravana Pranayam - రావణ ప్రణయం

రామాయణం సుందరకాండ ఇరువదవ సర్గ- రావణ ప్రణయం

తాపసిలా ఉన్న ఆ పతివ్రతను చూసి రావణుడు మధుర వాక్యాలతో తన ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు:

ఓ సుందరీ! ఎందు కింత భయం? ఆ భయంతో నీ సౌందర్యం అంతా దాచుకుంటావు దేనికి. సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని నేను అర్థిస్తున్నాను. నన్ను ఆదరంతో ప్రేమించు.

ఇక్కడ మీ మానవ ప్రాణి లేదు. వీరెవరూ కామరూపశక్తికలవారు కారు. నీలానే మాకు కూడా ధర్మభీతి చాలా ఉంది.

పరస్త్రీలను బలాత్కరించడం, అపహరించడం, వారితో భోగించడం - యిది రాక్షసజాతి ధర్మం. ఈ ధర్మనిర్వహణలో నెను అప్రమత్తంగా ఉంటాను. మరొక్క మాట,

నీ మనస్సు నన్ను కోరేవరకూ నేను నిన్ను ముట్టను. మదన తాపం నా మనస్సును ఎంత వేధించినా నీకు అంగీకారం అయే వరకూ నేను నిన్నేం చెయ్యను, అని నమ్ము. ఎందుకీ దుఃఖం. సుఖంగా నన్ను ప్రేమించు.

కటిక నేలమీద, మలిన వస్త్రంతో, ఏకవేణితో, నిష్కారణంగా ఉపవాసాలతో, ఎందుకు దీర్ఘాలోచనతో కాలం గడుపుతావు.

హాయిగా నా మాట విని, నన్ను అంగీకరించు.

రత్నాభరణాలు, సుగంధ, సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, రకరకాల పానీయాలు, గీత, నృత్యగోష్ఠులు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు.

నదీ ప్రవాహం వెనుదిరిగిరానట్లే యౌవనం కూడా మళ్ళీరాదు.

నిన్ను చూస్తుంటే, ఆ సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా అనిపిస్తున్నది. పితామహుడయిన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం. నీది.

నీ శరీరంలోని అణువణువూ అత్యంత మనోహరమై నా కన్నులకు బంధం వేస్తున్నది.

నా మాటవిని నన్ను భర్తగా గ్రహించు. నా రాణివాసానికి పట్టమహిషిగా ఉండదగిన దానవు.

దిగ్విజయయాత్రలో నేను తెచ్చిన రత్న మాణిక్యరాసులతో నా రాజ్యమూ నేనూ నీ అధీనంలో ఉంటాము.

సర్వనగరశోభితమయిన ఈ భూమండలం అంతా మీ తండ్రి జనకుడికి దానం చేయమన్నా చేస్తాను.

ఈ భువనభవనంలో నన్నెదిరించి నిలువగల విరుడులేడు. సురాసురులలో నాకు శత్రువై బ్రతికే అర్హత కలవాడు లేడు.

ఈ ఆకారం విడిచి స్వేచ్చగా సర్వాలంకారభూషితవై యధేచ్చగా నాతోకూడి పానక్రీడలు సాగించు. నీ చిత్తం వచ్చినట్లు ధన, కనక, భూదానాలు చెయ్యి.

నా సంపదలు, నా యశస్సు చూశావుకదా! ఇటువంటి భోగాలు విడిచి నారబట్టలతో తిరిగే రాముడికోసం బాధపడతా వెందుకు!

వానికి - సంపదలేదు. విజయకాంక్ష లేదు. వనవాసం, కటికనేల మీద శయనం; అన్నిటినీ మించి అసలామనిషి బ్రతికివున్నాడో లేడో తెలియదు. కారుమేఘాల వెనుకనున్న చంద్రకాంతిని చూడలేనట్టే నిన్ను రాముడు చూడడానికి కూడా శక్యం కాదిప్పుడు.

ఇంద్రహస్తగతమయిన కీర్తి హిరణ్యకశిపుడికి అందుతుందా! అలానే నా చేజిక్కిన నిన్ను రాము డందుకోలేడు.

ఓ చారునేత్రా! గరుత్మంతుడు వాడీగోళ్ళతో పామును పట్టినట్లు నీ అందంతో నన్ను హరిస్తున్నావు.

ఈ దశలో నిన్ను చూస్తూంటే నా మనస్సు వికలమై నా అనుగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నది.

సర్వగుణ లక్షణాలతో శోభించే నా అంతఃపుర స్త్రీలందరికీ నువ్వు యాజమాన్యం వహించు.

దేవలోకంలో అప్సరసలు లక్ష్మీదేవిని ఆరాధించే రీతిలో నా నారీజనం నిన్ను పూజిస్తారు.

నా సంపద కుబేరుని సంపదకు మించినది. అదంతా నీకు ధారబోస్తాను.

తపో బల పరాక్రమాలలో, యశస్తేజస్సులలో సంపదలో రాముడు నా గోటీకి పోలడు.

ఓ లలనా! హాయిగా ఆసవపానం చెయ్యి, స్వేచ్చా విహారంతో క్రీడాభోగాలనుభవించు. ఈ రాజ్యశ్రీ అంతా నీది. నీతోపాటు నీ బంధు కోటి కంతకూ యీభోగాలు అనుభవించే అదృష్టం కలిగించు.

వికసించి సువాసనలీనే పూలతోటలలో, సముద్రతీరవనాలలో హాయిగా సర్వాలంకారభూషితవై నాతో సుఖంగా అనుభవించు, అన్నాడు రావణుడు.

తృణప్రాయుం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tuesday, August 11, 2026

Janakidevi - జానకీదేవి

రామాయణం సుందరకాండ పందొమ్మిదవ సర్గ - జానకీదేవి

ఉత్తమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన సంపన్నుడూ, సర్వాలంకారభూషితుడూ అయిన రావణుని చూస్తూనే పెనుగాలిలో అరటిమొక్కలా కంపిస్తూ, కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చుంది.

విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది.

వ్రతనియమంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ యిల్లాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది.

ధూళి ధూసరిత దేహంతో బురదనిండిన తామర తూడులా ఉంది.

తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన ఆడత్రాచులా ఉంది. దూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది.

ఆచార కులశీల సంపన్నయై ప్రభవించి అనాచారపీడితయైనట్లుంది.

శిదిలమయే కీర్తిలా
అవమానిత శ్రద్ధవలె
క్షీణప్రజ్ఞలా, నెరవేరని ఆశలా
శూన్యమయిన భవిష్యత్తులా

ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద సమయంలో మండే దిగంతంలా, దొంగిలింపబడిన పూజాద్రవ్యంలా, 

నలగదొక్కిన తామరతూడులా 
సర్వశూరులూ కూలిన సేనలా
చీకటి చుట్టుముట్టిన వెలుగులా
ఎండిన నదిలా
తుడిచిన వేదికలా
ఆరిన అగ్నిలా,
రాహువు నోట చంద్రునిలా

ఆకులూ, పూవులూ పెల్లగించిన ఏనుగు తొండంతో చెల్లాచెదరయిన మృణాళనాళంవలె

కృష్ణపక్షపు రాత్రిలా
ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా
గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగులా,
మేఘాలు లేనిచోట వనంలా

ఉపవాస దుఃఖంతో కృశించి, దీనురాలై, అల్పాహారంతో, తపోధనంతో తన భర్తవల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలిబంధంతో ప్రార్థిస్తున్నట్టుంది.

పవిత్ర చరిత్ర కల ఆ ధవళాయతనేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు.

రావణ ప్రణయం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Ravanapravesam - రావణప్రవేశం

రామాయణం సుందరకాండ పద్దెనిమిదవ సర్గ - రావణప్రవేశం

తెల తెల వార నున్నది. ఆ సముయంలో

యజ్ఞకార్య నిర్వహణ సమర్ధులయిన వేదవేత్తల వేదపఠనం వినిపించింది. దానిని అనుసరిస్తూ మంగళవాద్య ధ్వనులు వస్తున్నాయి. అప్పుడు నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్య దిగాడు. జారిన ఆభరణాలూ, వస్త్రాలూ విడిచి, నూతనవస్త్రాభరణాలంకృతుడై
అశోకవనానికి బయలుదేరాడు.

మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి వస్తున్నాడు.

దేవేంద్రుని వెన్నంటివచ్చే అప్పరసల వలె నూరుగురు గంధర్వ భామినులు ఆయన వెనుక బయలుదేరారు.

కొందరి చేతులలో బంగారు కాగడాలు, కొందరి హస్తాలలో తెల్టని వింజామరలు, మరికొందరి కరాలలో తాళవృంతాలు. బంగారు కుండలలో పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపీఠాలతో, ఖడ్గపాణులై కొందరు.

రత్నమయ పాత్రలో ఆసవం నింపి ఒకతె.
చంద్రకాంతు లీనే వెండిగొడుగుతో మరొకతె.
అందరూ నిద్రమత్తుతో అలసిన కనులవారే.

వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపులవలె ఉన్నారు. చెదరిన కేశపాశాలు, అస్తవ్యస్తమయిన హారనూపురాలు, జారిన మంచి గంధపు పూతలు, చిరుచెమటలు నిండిన వదనాలు.

అందరూ రావణ ప్రియభామలే; ఎంతో గౌరవంతో, కామంతో సేవించేవారే.

ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు,

వస్తూన్న వనితామణుల అందెల రవళులు, వడ్డాణపు గంటల ధ్వనులు హనుమంతుని చెవిని పడ్డాయి.

సువాసనభరితమయిన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాగడాల కాంతులలో వన ప్రవేశద్వారం చేరాడు రావణుడు. మదనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాలనయనుడైన రావణుడు ఇక్షుశరాసనం చేతిలో లేని మన్మథుని వలె ఉన్నాడు.

అమృతమథన సమయంలో పుట్టిన నురుగువలె ఉన్న ఉత్తరీయం ఆయన భుజకీర్తులలో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తున్నాడు.

ఆయన ముందుకు వస్తూంటే హనుమంతుడు ఆకుల గుబురులలో చేరాడు.

రావణ ప్రియకాంతలు కనిపించారు.

అలంకార శోభితుడై, శంకుకర్ణకాంతితో అలరారే విశ్రవస నందనుడైన రావణుని చూచాడు, హనుమంతుడు.

నక్షత్ర మధ్యంలో చంద్రునివలె ఉన్నాడు, రావణుడు.

బాగా పరిశీలించి-

ఓహో! అంతఃపురంలో హంసతూలికా తల్పంమీద నిద్రిస్తున్న దీయనేనా! అనుకున్నాడు.

ఆ తేజస్సును చూచి ఒక్కమారు ఎగిరి గంతువేశాడు. మళ్ళీ గుబురులలో దాగి చూస్తున్నాడు.

పరమ సుందరాంగి అయిన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు.


జానకీదేవి

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rakshaseeganam - రాక్షసీగణం

రామాయణం సుందరకాండ పదిహేడవ సర్గ - రాక్షసీగణం

నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు కలువపూగుత్తివంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు. నిర్మల ప్రభలతో చల్లగా సోకుతూ హనుమంతునికి తోడుపడుతున్నాడు. ఆ సమయంలో శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది.

చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలవైపు ఆయన దృష్టి మరలింది. వారిలో-

ఒకే కన్ను కలది.
ఒకే చెవి గలది.
ఒకదానికి చెవులులేవు.
మరొకతెకు మేక చెవులు.
ఒకదాని ముక్కు శిరసువైపు తిరిగి ఉంది.

ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలు. కేశాలే లేనిది, కంబళీజుట్టు, వ్రేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు. పెదవులు, బుగ్గలు. అంతేకాదు ఒకతెకు మోకాళ్ళుకూడా వ్రేలాడుతున్నాయి.

పొట్టిది, బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్జుది, వికటంగా ఉండేది, వంగిన ముఖం, పచ్చని కళ్ళు, వికృత ముఖం. ఇంకా చూస్తూన్నాడు-

కొందరు పచ్చరంగు, మరి కొందరు నల్లరంగు. కలహ ప్రీతితో కొందరు, క్రోధస్వభావంతో కొందరు, ఇనుప శూలాలూ, ముధ్గరాలూ ధరించి కొందరు.

పంది ముఖాలు, లేడి తలకాయలు, పులిశీర్షాలు, నక్క మొహాలు, దున్నపోతు రూపాలు. ఏనుగు పాదాలు, గుర్రపు డెక్కకాళ్ళు, లొట్టిపిట్ట కొళ్ళు, లోపలకుపోయిన తలకాయలతో కొందరు. గాడిద, గుర్రం, ఆవు, ఏనుగు, సింహాల చెవులతో కొందరు.

ముక్కలేనివారు, అడ్డ ముక్కులవారు, పెద్ద ముక్కులు, కుంభకుచాలు, కుండ కడుపులు, అందరూ క్రోధంతోనే ఉన్నారు.

సురాపానం, మాంస భోజనం, నిరంతరం అదేపని వారికి. అటువంటి వారి మధ్య సీతాదేవి.

పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది.

ఏ అలంకారమూలేకున్నా భర్తృవాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది.

సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది.

శరత్కాల మేఘం వెనుక చంద్రకళలా, తీగలులేని వీణలా, ధూళి నిండిన తామరతూడులా వుంది. పాతివ్రత్యమే రక్షగా వుంది.

దుఃఖాల రాశిలా వుంది.

సీతాదర్శనంతో ఆయన మనస్సు క్లేశరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు, హనుమంతుడు.

రావణప్రవేశం

Aalochana - ఆలోచన

రామాయణం సుందరకాండ పదహారవ సర్గ - ఆలోచన

చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటివానికి పూజ్యుడూ, గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి క్లేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమయినదో!

ఈవిడకు రామ లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతగా కలతపడడంలేదు. వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా!

కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే ఈమెకు అయన, ఆయనకు ఈవిడ తగినవారు.

ఈ విశాలాక్షికోసం వాలిని నేలకూల్చాడు రాముడు.

రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు.

విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు నంతటివాడు.

భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జనస్థానంలో నామ రూపాలు లేకుండా పోయింది; యీవిడకోసం.

సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపింది యీవిడ కోసమే.

నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే ఈ యిల్లాలి వల్ల కాదా!

ఈవిడ కోసం రా
చంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యంలేదు.

ఈ జనకరాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్మపరుడైన జనకుని పుత్రిక, పతివ్రతా శిరో
ణి.

విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ సమధూళినుండి బైెటపడ్డ దీవిడ.

పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని తెచ్చిపెట్టిన పెద్దకోడలు.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని.

అటువంటి నారీమతల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాజ భోగాలూ విడిచి భర్తృవాల్లభ్యంతో అరణ్యక్లేశా లనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు.

కందమూలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తునది.

శీలసంపన్నయైన యీవిడకోసం రాము డెదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితేచాలు భూ మండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి.

ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవు. అయినా యీవిడ జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది.

ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని చూస్తున్నట్టులేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు.

ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నా మనస్సు చింతా
యి మవుతున్నది.

రా
 లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన యీ భూజాత యీ వికృతాకార జన మధ్యంలో ఉన్నది.

మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. ప్రియుడు దూరమయిన చక్రవాకిలా దీనంగా ఉంది.

పూలబరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపొరల అడ్డంలేని శీతకిరణుడు కూడా యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు.

రాక్షసీగణం

Ashadha Amavasya - ఆషాఢ అమావాస్య

ఆషాఢ అమావాస్య

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా తెలంగాణ ప్రాంతంలో చుక్కల అమావాస్య, తమిళనాట ఆడి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయి, శ్రావణ మాసానికి నాంది పలుకుతుంది.

ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) మనసాదేవిని అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. సర్ప భయం ఉండదు. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. 

అజ్ఞానంతో మనసాదేవిని నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు.

గంగ లో అమావాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది.

గ్రీష్మ రుతువు అంటే జ్యేష్ట, ఆషాఢ మాసాలలో అయోధ్యా పూరీ యాత్ర చేయాలి పంచ క్రోశ యాత్రలో కని పించే రామేశ్వరమే ఇది.

పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, గృహ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోవడానికి ఈ అమావాస్య ఎంతో విశిష్టమైనది.

ఆషాఢ అమావాస్య మరియు ఆ రోజు కూష్మాండ దీపం (గుమ్మడికాయ దీపం) వెలిగించడం వెనుక ఉన్న విశిష్టత, లాభాలు మరియు వెలిగించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

కూష్మాండ (గుమ్మడికాయ) దీపం వెలిగించడం వల్ల లాభాలు:
ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య సమయంలో బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి.

దిష్టి మరియు నరదృష్టి నివారణ: ఇంట్లోని ప్రతికూల శక్తి, నరదృష్టి, కంటిదృష్టి తొలగిపోతాయి.

గ్రహదోష నివారణ: శని దోషాలు, రాహు - కేతు దోషాలు ఉన్నవారికి ఇది శ్రేష్ఠమైన పరిహారం.

పితృదేవతల శాంతి: పితృ దోషాల ప్రభావం తగ్గి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.

గుమ్మడికాయ దీపం వెలిగించడానికి కావలసిన సామగ్రి?
చిన్న బూడిద గుమ్మడికాయ, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, వత్తులు,రాతి ఉప్పు మరియు బియ్యం.

వెలిగించే విధానం:
సిద్ధం చేయడం:
బూడిద గుమ్మడికాయను నిలువుగా లేదా అడ్డంగా సగానికి కోయాలి. అందులోని విత్తనాలు, గుజ్జును కొద్దిగా తొలగించి రెండు ప్రమిదల లాగా తయారు చేయాలి.

అలంకరణ: ఆ గుమ్మడికాయ ప్రమిదలకు బయట వైపు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.

స్థాపన: నేరుగా నేలపై పెట్టకుండా, ఒక పళ్లెంలో కొంత రాతి ఉప్పు, దానిపై కొద్దిగా బియ్యం పోసి, దానిపైన ఈ గుమ్మడికాయ ప్రమిదలను ఉంచాలి.

దీపారాధన: అందులో నువ్వుల నూనె (లేదా ఆవు నెయ్యి) పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.

దీపం వెలిగించి ఏమి చేయాలి?ఎక్కడ వెలిగించాలి?:
ఈ దీపాన్ని ఇంట్లోని పూజా మందిరంలో కంటే ఇంటి ప్రధాన ద్వారం బయట (సింహద్వారం వద్ద) లేదా ఇంటి ఈశాన్యం/దక్షిణ దిశలో వెలిగించడం శ్రేష్టం. లేదా గుడిలో (శివాలయం/దుర్గాదేవి ఆలయం) వెలిగించవచ్చు. 108 సార్లు ఓం నమః శివాయ జపం చేయాలి.

మరుసటి రోజు:
మరుసటి రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను, ఉప్పు - బియ్యాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో వేయాలి/పారవేయాలి (ఇంట్లో వంటకు ఉపయోగించకూడదు).

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ -  తృణప్రాయుం రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి,...