చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం
దంపతుల మధ్య పరస్పర అనురాగం దైవదత్తమైన మహాభాగ్యం. అది ఎప్పుడు క్షీణించినా, అది ఒకరి స్వంత ప్రారబ్ధం లేదా పూర్వపాపం కారణంగా కలి ప్రభావం పనిచేస్తోందనడానికి సూచన. పరిణతి చెందిన వ్యక్తి దీని కోసం ఎవరినీ నిందించడు. దీనికి పరిహారం 'అశూన్య శయన వ్రతం'.
ప్రతి చాతుర్మాస మాసంలో కృష్ణ పక్ష ద్వితీయ నాడు ఒక రోజు పూజ చేయండి. వీలైతే సాయంత్రం చంద్రోదయ సమయంలో చేయండి. ఇది కుదరదు అని అనుకుంటే ఉదయమే పూజ చేయండి. సాయంత్రం సాధారణ 'పూజ' చేసినా సరిపోతుంది. స్వామివారి కోసం ఒక చిన్న కొత్త పడకను సిద్ధం చేయండి. ఆ పడకపై స్వామివారి ప్రతిమతో పాటు లక్ష్మీదేవిని కూడా ఉంచండి.
సాధ్యమైతే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజను చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే, వారిలో ఎవరైనా తమ తమ ఇళ్లలో చేసుకోవచ్చు. ఈ పూజ కేవలం పరస్పర అపార్థాలతో బాధపడే దంపతుల కోసం మాత్రమే ఉద్దేశించినది కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి దంపతులు ఈ పూజను చేయవచ్చు.
అశున్య శయన వ్రతంలో విష్ణు శయనోత్సవం ప్రధానమైనది. ఈ వ్రతం సందర్భంగా, విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో (16 రకాల పూజా కార్యక్రమాలతో) పూజిస్తారు.
Telugu Library
Wednesday, July 29, 2026
Acts of charity without Dakshina - దక్షిణ లేని దానధర్మాలా
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దక్షిణ లేని దానధర్మాలా?
నారదా! దానధర్మాలుగానీ యజ్ఞయాగాదులుగానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి. తక్షణం ఫలం లభిస్తుంది. అని వేదం చెబుతోంది. అజ్ఞానంవల్లగానీ ఆటంకంవల్లగానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తంసేపు ఆలస్యమైతే రెండురెట్టు, ఒక రాత్రి గడిస్తే మూడుకోట్ల రెట్లూ, మూడు రాత్రులు గడిస్తే శతకోటిరెట్లూ, ఏడురోజులు గడిస్తే దానికి రెండు రెట్లూ, నెల గడిస్తే లక్షరెట్లూ, సంవత్సరం ఆలస్యమైతే మూడుకోట్లరెట్లూ అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్పలమవుతుంది. బ్రాహ్మణుల సామ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింక జీవితంలో ఏ సత్కర్మకూ అతడు అర్హుడు కాడు. దరిద్రుడూ వ్యాధిగ్రస్తుడూ అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటినుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధతర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు, అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు.
దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడూ, ప్రతిగ్రహీతనుంచి తిరిగి యాచించి తీసేనుకున్నవాడూ ఇద్దరూ తాడు తెగిన తప్పేలాల్లాగా నరకకూపంలో పడిపోతారు.
బ్రాహ్మణుడు అడిగినా దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాకనరకానికి పోతాడు. లక్ష సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలూ అనుభవిస్తాడు. అటుపైని దరిద్రుడుగా వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో ఇటూ అటూ ఎడుతరాలవారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది.
నారదా! విన్నావుకదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏవైనా సందేహాలూ సత్కథలూ కావాలంటే అడుగు. చెబుతాను అని ముగించాడు నారాయణమహర్షి నారదుడు వెంటనే అందుకున్నాడు.
మహర్షీ! దక్షిణతో ప్రసక్తిలేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే అయినా నువ్వు తీర్చాల్సిందే.
నారదా! దానధర్మాలుగానీ యజ్ఞయాగాదులుగానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి. తక్షణం ఫలం లభిస్తుంది. అని వేదం చెబుతోంది. అజ్ఞానంవల్లగానీ ఆటంకంవల్లగానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తంసేపు ఆలస్యమైతే రెండురెట్టు, ఒక రాత్రి గడిస్తే మూడుకోట్ల రెట్లూ, మూడు రాత్రులు గడిస్తే శతకోటిరెట్లూ, ఏడురోజులు గడిస్తే దానికి రెండు రెట్లూ, నెల గడిస్తే లక్షరెట్లూ, సంవత్సరం ఆలస్యమైతే మూడుకోట్లరెట్లూ అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్పలమవుతుంది. బ్రాహ్మణుల సామ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింక జీవితంలో ఏ సత్కర్మకూ అతడు అర్హుడు కాడు. దరిద్రుడూ వ్యాధిగ్రస్తుడూ అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటినుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధతర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు, అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు.
దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడూ, ప్రతిగ్రహీతనుంచి తిరిగి యాచించి తీసేనుకున్నవాడూ ఇద్దరూ తాడు తెగిన తప్పేలాల్లాగా నరకకూపంలో పడిపోతారు.
బ్రాహ్మణుడు అడిగినా దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాకనరకానికి పోతాడు. లక్ష సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలూ అనుభవిస్తాడు. అటుపైని దరిద్రుడుగా వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో ఇటూ అటూ ఎడుతరాలవారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది.
నారదా! విన్నావుకదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏవైనా సందేహాలూ సత్కథలూ కావాలంటే అడుగు. చెబుతాను అని ముగించాడు నారాయణమహర్షి నారదుడు వెంటనే అందుకున్నాడు.
మహర్షీ! దక్షిణతో ప్రసక్తిలేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే అయినా నువ్వు తీర్చాల్సిందే.
నారదా! దక్షిణలేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలమూ ఫలితమూను. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశాడు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చినదానం, అపరిశుద్దుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్బన - ఇలాంటి కర్మలనన్నింటినీ బలి అనుభవిస్తాడు.
దక్షిణాదేవిపూజ
The Story of Dakshinadevi - దక్షిణాదేవి వృత్తాంతం
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దక్షిణాదేవి వృత్తాంతం
నారదా! ఇప్పుడింక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అదికూడా శ్రద్ధగా వినేసెయ్. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూపయౌవన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి. చక్కని పలువరుస కలిగిన సుందరీమణి(సుదతి). కమలలోచన. అవయవాల పాందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండులాంటి పెదవి, యౌవనమధ్యస్థ(శ్యామ), లేడిచూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు. కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వరసోత్సుక, కృష్ణప్రియభామిని.
ఒకనాడు ఈ సుశీల ఒక పాదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలిసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అధరం వొణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతోంది. తిట్టలేదు. కొట్టలేదు. చుర్రున చూసి గిర్రున తిరిగి విసవిసా నడచుకుంటూ వెళ్ళిపోయింది.
శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీజనం మూడులక్షల కోట్లమంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి. తమ నాథుడు. తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలపిస్తూ వెంటబడ్డారు.
పారిపోతున్న కృష్ణుడినీ వెంటబడిన సుశీలనూ చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈరోజునుంచీ సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది - అనేసింది.
ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చారు రాధమ్మను శరణువేడారు. కృష్ణుణ్ణి రప్పించమనీ కోపం ఉపసంహరించుకోమనీ పాదాలుపట్టి ప్రార్థించారు.
రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటీ కోటియుగాలై బరువుగా సాగుతోంది.
హేకృష్ణ! ప్రాణనాథా! ప్రాణేశా! చేరరావయ్యా! ప్రాణాధిక ప్రియా! ప్రాణాధిష్ఠానదేవతా! దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సొభాగ్యంవల్లన కదా స్త్రీలకు గౌరవమూ గర్వమూ పెరిగేది! అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పత్తిని సేవించాలి. కులస్త్రీలకు మగడే బంధువు. ప్రాణాధిదేవత. సకల సంపత్స్వరూపుడు. మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు. సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్నీ అవమానాన్నీ తొలగించేవాడూ మగడే. సంసారంలో సారం మగడే స్వామి మగడే. బంధువుల్లోకల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటివచ్చె బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనక భర్త, పాలిస్తాడు కనక పతి. శరీరానికి అధిపతి కనక స్వామి, కోరికలు తీరుస్తాడు కనక కాంతుడు. సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనక బంధువు. ప్రీతి కలిగిస్తాడు కనక ప్రియుడు. ఐశ్వర్యం కలిగిస్తాడు కనక ఈశ్వరుడు. ప్రాణాలకు ప్రభువు కనక ప్రాణేశ్వరుడు. రతి సుఖం పంచుతాడు కనక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువుకు మరొకడు లేడు. ఉండడు. మగడి శుక్లంవల్ల జన్మిస్తాడు కనక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు వందమంది బిడ్డలకన్నా మగడే ప్రియుడు. అతడిమీద ప్రేమ అంత అధికం.
అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకలతీర్థాలలోనూ స్నానాలు చేసినఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వతపస్సులూ వ్రతాలూ దానాలూ ఉపవాసాలూ గురు విప్ర వేదసేవలూ చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం - ఇవన్ని కలిపినా పతిపాదసేవా ఫలంలో పదహారవవంతుకి సరితూగవు. గురువుకన్నా విప్రుడికన్నా ఇంద్రుడికన్నా దేవుడికన్నా మగడే గొప్పవాడు. ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపగోపీజనాలకూ అసంఖ్యాక బ్రహ్మాండాలకూ వాటిలో ఉన్న జీవరాశులకూ విశ్వాది సమస్తగోళాలకూ అధినాయికను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణపరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీస్వభావం అటువంటిది. ఎంతటివారికైనా దురతిక్రమంకదా !
రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపించింది. నాథా! నాథా! అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకంనుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సుచేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది.
ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్ఠలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యిందిగానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పాందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ శరీరంలో దక్షిణాంసంనుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరుపెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలుచేసి స్తుతించాడు.
కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటిచంద్రులకాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగసముద్భవ. కమలాసన పూజిత(బ్రహ్మార్చిత), వహ్నిశిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరుస, మాలతీపుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందరవేషం. సుస్నాత(తలంటుపోసుకుంది), మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరిబొట్టు, చందనపు చుక్క, పాపట సిందూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తయిన వక్షస్థలం. కామదేవుడికి ఆధారదేవతలాగా ఉంది. కామబాణపీడిత.
నారదా! ఇప్పుడింక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అదికూడా శ్రద్ధగా వినేసెయ్. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూపయౌవన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి. చక్కని పలువరుస కలిగిన సుందరీమణి(సుదతి). కమలలోచన. అవయవాల పాందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండులాంటి పెదవి, యౌవనమధ్యస్థ(శ్యామ), లేడిచూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు. కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వరసోత్సుక, కృష్ణప్రియభామిని.
ఒకనాడు ఈ సుశీల ఒక పాదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలిసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అధరం వొణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతోంది. తిట్టలేదు. కొట్టలేదు. చుర్రున చూసి గిర్రున తిరిగి విసవిసా నడచుకుంటూ వెళ్ళిపోయింది.
శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీజనం మూడులక్షల కోట్లమంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి. తమ నాథుడు. తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలపిస్తూ వెంటబడ్డారు.
పారిపోతున్న కృష్ణుడినీ వెంటబడిన సుశీలనూ చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈరోజునుంచీ సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది - అనేసింది.
ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చారు రాధమ్మను శరణువేడారు. కృష్ణుణ్ణి రప్పించమనీ కోపం ఉపసంహరించుకోమనీ పాదాలుపట్టి ప్రార్థించారు.
రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటీ కోటియుగాలై బరువుగా సాగుతోంది.
హేకృష్ణ! ప్రాణనాథా! ప్రాణేశా! చేరరావయ్యా! ప్రాణాధిక ప్రియా! ప్రాణాధిష్ఠానదేవతా! దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సొభాగ్యంవల్లన కదా స్త్రీలకు గౌరవమూ గర్వమూ పెరిగేది! అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పత్తిని సేవించాలి. కులస్త్రీలకు మగడే బంధువు. ప్రాణాధిదేవత. సకల సంపత్స్వరూపుడు. మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు. సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్నీ అవమానాన్నీ తొలగించేవాడూ మగడే. సంసారంలో సారం మగడే స్వామి మగడే. బంధువుల్లోకల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటివచ్చె బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనక భర్త, పాలిస్తాడు కనక పతి. శరీరానికి అధిపతి కనక స్వామి, కోరికలు తీరుస్తాడు కనక కాంతుడు. సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనక బంధువు. ప్రీతి కలిగిస్తాడు కనక ప్రియుడు. ఐశ్వర్యం కలిగిస్తాడు కనక ఈశ్వరుడు. ప్రాణాలకు ప్రభువు కనక ప్రాణేశ్వరుడు. రతి సుఖం పంచుతాడు కనక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువుకు మరొకడు లేడు. ఉండడు. మగడి శుక్లంవల్ల జన్మిస్తాడు కనక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు వందమంది బిడ్డలకన్నా మగడే ప్రియుడు. అతడిమీద ప్రేమ అంత అధికం.
అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకలతీర్థాలలోనూ స్నానాలు చేసినఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వతపస్సులూ వ్రతాలూ దానాలూ ఉపవాసాలూ గురు విప్ర వేదసేవలూ చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం - ఇవన్ని కలిపినా పతిపాదసేవా ఫలంలో పదహారవవంతుకి సరితూగవు. గురువుకన్నా విప్రుడికన్నా ఇంద్రుడికన్నా దేవుడికన్నా మగడే గొప్పవాడు. ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపగోపీజనాలకూ అసంఖ్యాక బ్రహ్మాండాలకూ వాటిలో ఉన్న జీవరాశులకూ విశ్వాది సమస్తగోళాలకూ అధినాయికను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణపరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీస్వభావం అటువంటిది. ఎంతటివారికైనా దురతిక్రమంకదా !
రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపించింది. నాథా! నాథా! అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకంనుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సుచేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది.
ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్ఠలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యిందిగానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పాందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ శరీరంలో దక్షిణాంసంనుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరుపెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలుచేసి స్తుతించాడు.
కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటిచంద్రులకాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగసముద్భవ. కమలాసన పూజిత(బ్రహ్మార్చిత), వహ్నిశిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరుస, మాలతీపుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందరవేషం. సుస్నాత(తలంటుపోసుకుంది), మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరిబొట్టు, చందనపు చుక్క, పాపట సిందూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తయిన వక్షస్థలం. కామదేవుడికి ఆధారదేవతలాగా ఉంది. కామబాణపీడిత.
ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్చిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. నూరేళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయ్యింది. పన్నెండేళ్ళు మోసింది. సర్వయజ్ఞకర్మలకూ ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మఫలాలను అందిస్తుంటాడని వేదాలూ వేదవేత్తలూ చెప్పేమాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకూ నెలవులకూ వారు వెళ్ళారు.
దక్షిణ లేని దానధర్మాలా
The Story of Svadha - స్వధా వృత్తాంతం
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వధా వృత్తాంతం
నారదా! ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్నఫలాన్ని వృద్ధిపాందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలూ శ్రాద్దాన్నమూ ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణపర్యంతమైన స్నానమూ, దేవపూజనపర్యంతమైన శ్రాద్దమూ త్రిసంధ్యాంతమైన ఆహ్నికమూ వేదవిహిత కర్మలు, ముప్పాద్దులా శ్రాద్ధతర్పణాలు చెయ్యాలి. బలిప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞ (వేదపఠన) చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే. ఏ కర్మాచరణకూ అర్హుడు కాడు.
బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యమూ తర్పణాలు విడిచి పెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారుగానీ ఎక్కడ ఏలోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడంలేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు.
చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయౌవన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేతచంపకంలాగా నిగనిగలాడుతోంది. రత్నభూషలు ధగధగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతిశక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. అవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు. తృప్తి చెందారు.
అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్దాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటినుంచీ విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు ఆందనారంభించాయి. వారు ఆకలిదప్పులు తీరి ఆనందించారు.
దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగ ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం. మృతప్రాయం.
శరదృతువులో కృష్ణత్రయోదశినాడుగానీ మాఘమాసంలోగాని శ్రాద్దసమయాలలోగానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా శ్రాద్దాన్నం (పిండం) పెట్టినా అది పితృదేవతలకు అందదు. కర్తకు ఫలం దక్కదు.
బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థితయౌవనామ్ ।
పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్దానాం ఫలదాం భజే ॥
ఇది స్వధాధ్యానశ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలోగానీ మంగళకలశంలోగానీ స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా - అనే మూలమంత్రంతో పూజచేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతాలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు.
పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజజీవనరూపిణీ ।
శ్రాద్దాధిష్ఠాతృదేవీ చ శ్రాద్దాదీనాం ఫలప్రదా ॥
నిత్యా త్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ।
ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ ॥
ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా ।
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ॥
కర్మపూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాః ॥
స్వధాదేవీ! నువ్వు పితృదేవతలకు ప్రాణసమానవు. బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్ఠాన దేవతవు, శ్రాద్ధతర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రతా! సృష్టివేళ నువ్వు
ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠులకోసం నువ్వూ స్వాహాదక్తిణలూ ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడంకోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు.
ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించినవారికి సర్వవాంఛలూ నెరవేరతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నానఫలం దక్కుతుంది. సర్వపాపాలూ తొలగిపోతాయి. వాజపేయఫలం లభిస్తుంది. స్వధా స్వధా స్వధా అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ - బలి - తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధఫలం దక్కుతుంది. ముప్పొద్దులా స్వధా స్వధా స్వధా అని మూడేసిసార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్రప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్రపఠనంవల్ల సకల తీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యం తప్పక లభిస్తుంది - అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్యరాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు.
దక్షిణాదేవి వృత్తాంతం
నారదా! ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్నఫలాన్ని వృద్ధిపాందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలూ శ్రాద్దాన్నమూ ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణపర్యంతమైన స్నానమూ, దేవపూజనపర్యంతమైన శ్రాద్దమూ త్రిసంధ్యాంతమైన ఆహ్నికమూ వేదవిహిత కర్మలు, ముప్పాద్దులా శ్రాద్ధతర్పణాలు చెయ్యాలి. బలిప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞ (వేదపఠన) చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే. ఏ కర్మాచరణకూ అర్హుడు కాడు.
బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యమూ తర్పణాలు విడిచి పెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారుగానీ ఎక్కడ ఏలోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడంలేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు.
చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయౌవన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేతచంపకంలాగా నిగనిగలాడుతోంది. రత్నభూషలు ధగధగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతిశక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. అవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు. తృప్తి చెందారు.
అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్దాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటినుంచీ విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు ఆందనారంభించాయి. వారు ఆకలిదప్పులు తీరి ఆనందించారు.
దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగ ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం. మృతప్రాయం.
శరదృతువులో కృష్ణత్రయోదశినాడుగానీ మాఘమాసంలోగాని శ్రాద్దసమయాలలోగానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా శ్రాద్దాన్నం (పిండం) పెట్టినా అది పితృదేవతలకు అందదు. కర్తకు ఫలం దక్కదు.
బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థితయౌవనామ్ ।
పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్దానాం ఫలదాం భజే ॥
ఇది స్వధాధ్యానశ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలోగానీ మంగళకలశంలోగానీ స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా - అనే మూలమంత్రంతో పూజచేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతాలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు.
పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజజీవనరూపిణీ ।
శ్రాద్దాధిష్ఠాతృదేవీ చ శ్రాద్దాదీనాం ఫలప్రదా ॥
నిత్యా త్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ।
ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ ॥
ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా ।
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ॥
కర్మపూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాః ॥
స్వధాదేవీ! నువ్వు పితృదేవతలకు ప్రాణసమానవు. బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్ఠాన దేవతవు, శ్రాద్ధతర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రతా! సృష్టివేళ నువ్వు
ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠులకోసం నువ్వూ స్వాహాదక్తిణలూ ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడంకోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు.
ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించినవారికి సర్వవాంఛలూ నెరవేరతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నానఫలం దక్కుతుంది. సర్వపాపాలూ తొలగిపోతాయి. వాజపేయఫలం లభిస్తుంది. స్వధా స్వధా స్వధా అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ - బలి - తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధఫలం దక్కుతుంది. ముప్పొద్దులా స్వధా స్వధా స్వధా అని మూడేసిసార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్రప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్రపఠనంవల్ల సకల తీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యం తప్పక లభిస్తుంది - అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్యరాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు.
The Lakshmi Puja and Lakshmi Stavam Performed by Indra - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం
నారదా! ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ ధ్యానం స్తోత్రం సవివరంగా చెబుతాను. తెలుసుకో - అని నారాయణమహర్షి కథను కొనసాగించాడు.
ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీరసముద్రతీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ దినేశ వహ్ని విష్ణు శివ పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాదులతో పూజించాడు. పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా వినయవినమితగాత్రుడై భక్తిప్రపత్తులతో ఆర్చించాడు. మునీంద్రులూ దేవతలూ బ్రాహ్మణులూ బృహస్పతి హరి హరుడు అందరూ ఎట్టఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాతపుష్పం తెచ్చి దానిమీద చందనం జల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం ఆది.
వెయ్యిరేకుల తామరపువ్వు దుద్దుమీద కూర్చునే తల్లిని, కోటి శరత్పూర్ణిమలనాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయిగొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఊపాసిన్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిరయౌవతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరియై సర్వసంపదలనూ ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను.
ఇలా స్తుతించి షోడశోపచారాలూ మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్యసింహాసనం సమర్పించి, పుష్పచందనదూర్యాది సంయుతంగా గంగోదకాలనూ శంఖతీర్థాలనూ అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి, ఆమలకీఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేహసౌందర్యవర్థకంగా సమర్పించి, విలువైన పట్టుచీరలు పెట్టి, రత్నాభరణాలు ఇచ్చి, పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపచేసి, జగచ్చక్షూరూపమూ తిమిరాపహమూ దీపాన్ని చూపించి, ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి, షడ్రసోపేతమూ అత్యంతరుచికరమూ నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నమూ పాయసమూ స్వస్తికమూ పక్వఫలాలూ కామధేనువిచ్చిన పాలూ పెరుగూ వెన్న నెయ్యి, చెరకు బెల్లం, గోధుమరవ్వతో బెల్లమూ పాలూ నెయ్యీ కలిపి వండిన (మిష్టాన్నం) ప్రసాదం - నివేదన చేశాడు.
శీతల వాయువులను విరజిమ్మే విసినకర్రనూ, కర్పూర సువాసితమై జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్నీ, సువాసితమూ సుశీతమూ పానీయాన్నీ, ఆచమనియాన్నీ మరో పట్టువస్త్ర యుగ్మాన్నీ, మరో రత్నభూషణాన్నీ, అన్ని ఋతువులలోనూ వాడిపోకండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్యపుష్పమాలికనూ, గంధాన్నీ శుద్దోదకాన్నీ, రత్ననిర్మిత - పుష్పచందనచర్చిత - వస్త్ర భూషిత మనోహర తల్పాన్నీ, భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవతా! ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో అపూర్వమూ దుర్లభమూ దేవభూషార్హమూ భోగార్హమూ అయిన ప్రతిద్రవ్యాన్నీ నీకు కానుకగా పూజావస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు.
ఇలా షోడశోపచారాలూ చేసి మహాలక్ష్మీమూలమంత్రాన్ని పదిలక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షంలాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీమాయా కామవాణీ బీజాక్షరపూర్వకంగా కమలావాసిన్యై స్వాహా, ఇది వేదోక్త మంత్రరాజం. కుబేరుడు దక్షుడు సావర్ణి మనువు మంగళుడు సప్తద్వీపాధిపతులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కేదారనృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహసిద్ధులు పొందారు.
మంత్రం సిద్దించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్యవిమానం మీద వరదాభయహస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తద్వీపాలకూ వ్యాపిస్తున్నాయి. రత్న భూషణాల ధగధగలలో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది. భకానుగ్రహకాతర, మెడలో రత్నమాల కోటిచంద్రసమప్రభంగా మెరుస్తోంది,
పురందురుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తనువు పులకించింది. బ్రహ్మదేవు డుపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి నారాయణికి కృష్ణప్రియకు మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు పద్మాస్యకు పద్మాసనకు పద్మినికి వందనం. వైష్ణవికి సర్వసంపత్స్వరూపిణికి సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి హర్షదాత్రికి కృష్ణవక్షఃస్థితకు కృష్టేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభాస్వరూపకు సంపదధిష్ఠానదేవతకు మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు బుద్దిదాయికి శిరసువంచి అయిదు పదిచేస్తున్నాను.
నమః కమలవాసిన్యై నారాయణ్యై నమోనమః ।
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః ॥
వైకుంఠంలో మహాలక్ష్మివి. క్షీరసాగరంలో మాయాలక్ష్మివి. అమరావతిలో స్వర్గలక్ష్మివి. మహారాజులకు రాజ్యలక్ష్మివి. ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో సురభిగా(కామధేనువు) ఆవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి. దేవమాత అదితివి నువ్వే. కమలవు, కమలాలయవు. హవిర్దానసమయంలో నువ్వు స్వాహాదేవివి. కవ్యదానంలో స్వధాదేవివి. నువ్వు విష్ణురూపవు, సర్వాధార వసుంధరవు, శుద్ధసత్త్వస్వరూపవు, నారాయణపరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్యప్రదాయినివి. పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారమూ భస్మప్రాయమూ ఆయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి. సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థకామమోక్షాలకు కారణరూపిణివి. శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలుకుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వుమాత్రం అందరికీ అన్నివేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు.
తల్లిలేని శిశువుల్ని కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వులేని వాడిని కాపాడేందుకు ఇంక ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నాపట్లకూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యిజారిపోయింది. ఓ సనాతనీ! దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వూ నీ అనుగ్రహమూ నావెంట లేనంతవరకూ నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వసంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్నీ జ్ఞానాన్నీ నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్నీ ప్రభావాన్నీ రాజ్యాధికారాన్నీ పరాక్రమాన్నీ ఐశ్వర్యాన్నీ జయాన్నీ మళ్ళీ నాకు అందించు.
శౌనకాది మహామునులారా! మహాలక్ష్మీ ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి. నారాయణమహర్షిని వేనోళ్ళ కొనియాడాడు.
నారాయణమహర్షీ! నువ్వు సాక్షాత్తూ నారాయణుడివి. రూప గుణ తేజో యశః కాంతులలో సమానుడివి. జ్ఞానులలో యోగులలో సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో తపస్వులలో మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని ఆద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే ఆది వినిపించు. వేదపురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు.
నారదా! అటువంటివి చాలా ఉన్నాయి. ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు. అదే చెబుతాను.
మహర్షీ! హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారుగదా! వారి చరిత్ర ఇంతవరకూ నేను వినలేదు. నీనోటినుంచి వినాలని ఉంది.
స్వాహా వృత్తాంతం
నారదా! ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ ధ్యానం స్తోత్రం సవివరంగా చెబుతాను. తెలుసుకో - అని నారాయణమహర్షి కథను కొనసాగించాడు.
ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీరసముద్రతీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ దినేశ వహ్ని విష్ణు శివ పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాదులతో పూజించాడు. పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా వినయవినమితగాత్రుడై భక్తిప్రపత్తులతో ఆర్చించాడు. మునీంద్రులూ దేవతలూ బ్రాహ్మణులూ బృహస్పతి హరి హరుడు అందరూ ఎట్టఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాతపుష్పం తెచ్చి దానిమీద చందనం జల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం ఆది.
వెయ్యిరేకుల తామరపువ్వు దుద్దుమీద కూర్చునే తల్లిని, కోటి శరత్పూర్ణిమలనాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయిగొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఊపాసిన్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిరయౌవతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరియై సర్వసంపదలనూ ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను.
ఇలా స్తుతించి షోడశోపచారాలూ మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్యసింహాసనం సమర్పించి, పుష్పచందనదూర్యాది సంయుతంగా గంగోదకాలనూ శంఖతీర్థాలనూ అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి, ఆమలకీఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేహసౌందర్యవర్థకంగా సమర్పించి, విలువైన పట్టుచీరలు పెట్టి, రత్నాభరణాలు ఇచ్చి, పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపచేసి, జగచ్చక్షూరూపమూ తిమిరాపహమూ దీపాన్ని చూపించి, ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి, షడ్రసోపేతమూ అత్యంతరుచికరమూ నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నమూ పాయసమూ స్వస్తికమూ పక్వఫలాలూ కామధేనువిచ్చిన పాలూ పెరుగూ వెన్న నెయ్యి, చెరకు బెల్లం, గోధుమరవ్వతో బెల్లమూ పాలూ నెయ్యీ కలిపి వండిన (మిష్టాన్నం) ప్రసాదం - నివేదన చేశాడు.
శీతల వాయువులను విరజిమ్మే విసినకర్రనూ, కర్పూర సువాసితమై జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్నీ, సువాసితమూ సుశీతమూ పానీయాన్నీ, ఆచమనియాన్నీ మరో పట్టువస్త్ర యుగ్మాన్నీ, మరో రత్నభూషణాన్నీ, అన్ని ఋతువులలోనూ వాడిపోకండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్యపుష్పమాలికనూ, గంధాన్నీ శుద్దోదకాన్నీ, రత్ననిర్మిత - పుష్పచందనచర్చిత - వస్త్ర భూషిత మనోహర తల్పాన్నీ, భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవతా! ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో అపూర్వమూ దుర్లభమూ దేవభూషార్హమూ భోగార్హమూ అయిన ప్రతిద్రవ్యాన్నీ నీకు కానుకగా పూజావస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు.
ఇలా షోడశోపచారాలూ చేసి మహాలక్ష్మీమూలమంత్రాన్ని పదిలక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షంలాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీమాయా కామవాణీ బీజాక్షరపూర్వకంగా కమలావాసిన్యై స్వాహా, ఇది వేదోక్త మంత్రరాజం. కుబేరుడు దక్షుడు సావర్ణి మనువు మంగళుడు సప్తద్వీపాధిపతులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కేదారనృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహసిద్ధులు పొందారు.
మంత్రం సిద్దించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్యవిమానం మీద వరదాభయహస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తద్వీపాలకూ వ్యాపిస్తున్నాయి. రత్న భూషణాల ధగధగలలో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది. భకానుగ్రహకాతర, మెడలో రత్నమాల కోటిచంద్రసమప్రభంగా మెరుస్తోంది,
పురందురుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తనువు పులకించింది. బ్రహ్మదేవు డుపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి నారాయణికి కృష్ణప్రియకు మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు పద్మాస్యకు పద్మాసనకు పద్మినికి వందనం. వైష్ణవికి సర్వసంపత్స్వరూపిణికి సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి హర్షదాత్రికి కృష్ణవక్షఃస్థితకు కృష్టేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభాస్వరూపకు సంపదధిష్ఠానదేవతకు మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు బుద్దిదాయికి శిరసువంచి అయిదు పదిచేస్తున్నాను.
నమః కమలవాసిన్యై నారాయణ్యై నమోనమః ।
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః ॥
పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥
సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః ।
హరిభక్తి ప్రదాత్య్రై చ హర్షదాత్య్రై నమోనమః ॥
కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః ।
చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభవే ॥
సంపత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః ।
నమో బుద్దిస్వరూపాయై బుద్దిదాయ్యై నమోనమః ॥
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥
సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః ।
హరిభక్తి ప్రదాత్య్రై చ హర్షదాత్య్రై నమోనమః ॥
కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః ।
చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభవే ॥
సంపత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః ।
నమో బుద్దిస్వరూపాయై బుద్దిదాయ్యై నమోనమః ॥
వైకుంఠంలో మహాలక్ష్మివి. క్షీరసాగరంలో మాయాలక్ష్మివి. అమరావతిలో స్వర్గలక్ష్మివి. మహారాజులకు రాజ్యలక్ష్మివి. ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో సురభిగా(కామధేనువు) ఆవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి. దేవమాత అదితివి నువ్వే. కమలవు, కమలాలయవు. హవిర్దానసమయంలో నువ్వు స్వాహాదేవివి. కవ్యదానంలో స్వధాదేవివి. నువ్వు విష్ణురూపవు, సర్వాధార వసుంధరవు, శుద్ధసత్త్వస్వరూపవు, నారాయణపరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్యప్రదాయినివి. పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారమూ భస్మప్రాయమూ ఆయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి. సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థకామమోక్షాలకు కారణరూపిణివి. శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలుకుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వుమాత్రం అందరికీ అన్నివేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు.
తల్లిలేని శిశువుల్ని కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వులేని వాడిని కాపాడేందుకు ఇంక ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నాపట్లకూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యిజారిపోయింది. ఓ సనాతనీ! దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వూ నీ అనుగ్రహమూ నావెంట లేనంతవరకూ నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వసంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్నీ జ్ఞానాన్నీ నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్నీ ప్రభావాన్నీ రాజ్యాధికారాన్నీ పరాక్రమాన్నీ ఐశ్వర్యాన్నీ జయాన్నీ మళ్ళీ నాకు అందించు.
దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవలా విలపించాడు. బ్రహ్మేశాన శేషధర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షానా దేవతల పక్షానా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు.
మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది. దేవతలకు అభీప్సితవరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులూ ఇంద్రాదిదేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమతమ లోకాలకు వెళ్ళారు.
నారదా! పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని త్రిసంధ్యలలోనూ పఠించేవారు కుబేరులవుతారు. రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. అయిదు లక్షలసార్లు భక్తితో పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అటుపైని మరొక్కనెల సిద్దసోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడూ మహాసుఖి అవుతాడు.
మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది. దేవతలకు అభీప్సితవరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులూ ఇంద్రాదిదేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమతమ లోకాలకు వెళ్ళారు.
నారదా! పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని త్రిసంధ్యలలోనూ పఠించేవారు కుబేరులవుతారు. రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. అయిదు లక్షలసార్లు భక్తితో పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అటుపైని మరొక్కనెల సిద్దసోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడూ మహాసుఖి అవుతాడు.
శౌనకాది మహామునులారా! మహాలక్ష్మీ ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి. నారాయణమహర్షిని వేనోళ్ళ కొనియాడాడు.
నారాయణమహర్షీ! నువ్వు సాక్షాత్తూ నారాయణుడివి. రూప గుణ తేజో యశః కాంతులలో సమానుడివి. జ్ఞానులలో యోగులలో సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో తపస్వులలో మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని ఆద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే ఆది వినిపించు. వేదపురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు.
నారదా! అటువంటివి చాలా ఉన్నాయి. ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు. అదే చెబుతాను.
మహర్షీ! హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారుగదా! వారి చరిత్ర ఇంతవరకూ నేను వినలేదు. నీనోటినుంచి వినాలని ఉంది.
Tuesday, July 28, 2026
Grishneshwar Jyotirlinga, Verul Village, Chhatrapati Sambhajinagar (Aurangabad) District, Maharashtra - ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిదైన, అత్యంత పవిత్రమైన శివక్షేత్రం. ఇది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలోని వెరుల్ గ్రామంలో, ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ అనికూడా పిలుస్తారు. ఘర్నేశ్వర అనే పదానికి "కరుణ ప్రభువు" అని అర్ధం. శైవ సంప్రదాయంలో ఈ జ్యోతిర్లింగ దర్శనం ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఇది పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ). ఈ ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ఔరంగాబాద్ నగరం వాయవ్య దిశ నుండి 30 కి.మీ (19 మైళ్లు) దూరంలో ఉంది. ముంబై నగరానికి తూర్పు- ఈశాన్యంగా 300 కి.మీ(190 మైళ్లు ) దూరంలో ఉంది.
చరిత్ర
13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానుల చేత ధ్వంసం చేయబడింది. అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది. ఇది హిందువుల ముఖ్యమైన, పుణ్యక్షేత్రం. దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమం.
ఘృష్ణేశ్వర్ ఆలయం నిర్మాణం, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో వేరుల్కు చెందిన మలోజీ భోసలే (ఛత్రపతి శివాజీ తాత), తరువాత 18 వ శతాబ్దంలో రాణి అహిల్యబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది.
రోడ్డు మార్గం: ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ప్రైవేట్, సొంత వాహనాల్లో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు. వేరూల్ గ్రామం నుంచి ఔరంగాబాద్కు బస్సులు నడుస్తుంటాయి.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిదైన, అత్యంత పవిత్రమైన శివక్షేత్రం. ఇది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలోని వెరుల్ గ్రామంలో, ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ అనికూడా పిలుస్తారు. ఘర్నేశ్వర అనే పదానికి "కరుణ ప్రభువు" అని అర్ధం. శైవ సంప్రదాయంలో ఈ జ్యోతిర్లింగ దర్శనం ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఇది పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ). ఈ ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ఔరంగాబాద్ నగరం వాయవ్య దిశ నుండి 30 కి.మీ (19 మైళ్లు) దూరంలో ఉంది. ముంబై నగరానికి తూర్పు- ఈశాన్యంగా 300 కి.మీ(190 మైళ్లు ) దూరంలో ఉంది.
చరిత్ర
13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానుల చేత ధ్వంసం చేయబడింది. అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది. ఇది హిందువుల ముఖ్యమైన, పుణ్యక్షేత్రం. దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమం.
ఘృష్ణేశ్వర్ ఆలయం నిర్మాణం, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో వేరుల్కు చెందిన మలోజీ భోసలే (ఛత్రపతి శివాజీ తాత), తరువాత 18 వ శతాబ్దంలో రాణి అహిల్యబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది.
వారణాసి లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గయ లోని విష్ణు ఆలయం, సోమనాథ్ ఆలయాల వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నిటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహిల్యబాయి హోల్కర్కు దక్కింది.
ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో 240 అడుగులు పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశవతారాలు 24 స్తంభాలపై పెద్దవరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది.
ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్బాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుకలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠంచబడింది. కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది. ఈ ఆలయంలో ఇతర దేవతా శిల్పాలు ఉన్నాయి.
జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.
"ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే"
ఈ ప్రాంతంలో ఏల్ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్. అదే వేరూల్గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు.
జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.
"ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే"
ఈ ప్రాంతంలో ఏల్ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్. అదే వేరూల్గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు.
ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి.
రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్ఠిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.
పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ పురాణ కథ:
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది.
పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ పురాణ కథ:
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది.
వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ, ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ "ఇదంతా పరమేశ్వరుని లీల" అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది.
అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుష్మేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుష్మేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.
అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది.
అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది.
పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది.
సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు
ఆలయ విశిష్టత:
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి.
ఆలయ విశిష్టత:
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి.
ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి. 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి దృఢంగా, సుందరంగా నిలిచి ఉంది.
మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి. 24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.
రోడ్డు మార్గం: ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ప్రైవేట్, సొంత వాహనాల్లో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు. వేరూల్ గ్రామం నుంచి ఔరంగాబాద్కు బస్సులు నడుస్తుంటాయి.
రైలు మార్గం: ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడి సమీప రైల్వే స్టేషన్.
వాయు మార్గం: దిల్లీ, ముంబయి నుంచి ఔరంగాబాద్కు విమానాలను నడుపుతున్నారు.
Trimbakeshwar Temple, Trimbak (Nashik), Maharashtra - త్రయంబకేశ్వరాలయం, త్రయంబక్ (నాసిక్), మహారాష్ట్ర
త్రయంబకేశ్వరాలయం, త్రయంబక్ (నాసిక్), మహారాష్ట్ర
త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావుసాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్త కుంట (పవిత్రమైన చెరువు), భారతదేశం ద్వీపకల్పలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కొండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు.
పురాణ ఇతిహాసం, చరిత్ర
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన శివుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
పురాణ కథనం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యతో కలిసి నివసించేవారు. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు.
గౌతమ మహర్షి ప్రార్థన మేరకు శివుడు ఇక్కడ శాశ్వతంగా నివసించడానికి అంగీకరించి, త్రిమూర్తుల స్వరూపంగా (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) ఈ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు.
త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావుసాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్త కుంట (పవిత్రమైన చెరువు), భారతదేశం ద్వీపకల్పలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కొండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు.
పురాణ ఇతిహాసం, చరిత్ర
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన శివుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
పురాణ కథనం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యతో కలిసి నివసించేవారు. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు.
అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది.
గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది.
ప్రత్యేకతలు త్రిమూర్తి స్వరూపం: లింగం లోపల చిన్న గుంటలు ఉండి బ్రహ్మ, విష్ణు, శివుల రూపాలను సూచిస్తాయి.
ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.
ఈ ఆలయం హేమంత్పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చాతురస్రా కారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.
రోడ్డుమార్గం: నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.
ఈ ఆలయం హేమంత్పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చాతురస్రా కారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.
రోడ్డుమార్గం: నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి.
రైలు మార్గం: నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆలయానికి సుమారు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వాయుమార్గం: దేవాలయానికి నాసిక్ విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Subscribe to:
Posts (Atom)
chaturmasa dvitiya ashoonya sayana vratam - చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం
చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం దంపతుల మధ్య పరస్పర అనురాగం దైవదత్తమైన మహాభాగ్యం. అది ఎప్పుడు క్షీణించినా, అది ఒకరి స్వంత ప్రారబ్ధం లేదా ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...