నారదా! బొట్టు పెట్టుకోవడమయ్యాక చెయ్యవలసింది సంధ్యోపాసన, ఇక దాన్నిగురించి చెబుతాను ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతస్సంధ్యనూ, సూర్యుడు ఆకాశంలో నట్టనడిమికి చేరుకోగానే మధ్యాహ్న సంధ్యనూ, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయంసంధ్యనూ ఉపాసించాలి.
మళ్ళీ వీటిలో అంతర్భేదాలున్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతస్సంధ్య ఉత్తమం. నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమం. సూర్యుడు ఉదయించేశాక చేసే ప్రాతస్సంధ్య అధమం. ఇలాగే - సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయంసంధ్య - ఉత్తమం. అస్తమించాక చేసేది మధ్యమం. చుక్కలు పాడిచాక చేసే సాయంసంధ్య - అధమం. విప్రుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లివేరు. వేదాలే శాఖలు. ధర్మకార్యాలు ఆకులు.
కనక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలూ లేవు, ఆకులూ లేవు. అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యనివాడు జీవచ్చవం. మరుజన్మలో కుక్కగా పుడతాడు. అందుచేత నిత్యమూ సంధ్యోపాసన చెయ్యాలి. ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు.
సూర్యోదయానికీ అస్తమయానికీ ముందుండే మూడు ఘటికలూ సంధ్యాకాలం. ఆ సమయంలోనే సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితుల్లో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చతుర్థార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే నూటయెనిమిదిసార్లు గాయత్రిని జపించి సంధ్యవార్చాలి.
ఏ సంధ్యను ఆతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరవాత తత్కాలీన సంధ్యావందనం చెయ్యాలి. ఇంటిలో చేసుకుంటే అది సాధారణసంధ్య. గోశాలలో చేస్తే అది మధ్యమం. నదీతీరానగానీ దేవాలయంలోగానీ చేసుకుంటే అది ఉత్తమ సంధ్య.
ఏ సంధ్యను ఆతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరవాత తత్కాలీన సంధ్యావందనం చెయ్యాలి. ఇంటిలో చేసుకుంటే అది సాధారణసంధ్య. గోశాలలో చేస్తే అది మధ్యమం. నదీతీరానగానీ దేవాలయంలోగానీ చేసుకుంటే అది ఉత్తమ సంధ్య.
సంధ్యావందనమంటే దేవీ ఉపాసన కనక దేవీ సన్నిధిలోనే ముప్పాద్దులా చెయ్యాలి. అనంతఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించిన దైవం లేదు. హరహరి ఉపాసనలు నిత్యవిధులు కావు. సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు.
ఇది శ్రుతిచోదితం. సర్వవేదసారం. బ్రహ్మాదిదేవతలు కూడా సంధ్యాసమయంలో వేదస్వరూపిణి గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి. కనక గాయత్రీదేవి అంటే వేదోపావ్య అని తెలుసుకో. అందుచేత శాక్తులా శైవులా వైష్టవులా అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే.
ముందుగా కేశవాదినామాలతో ఆచమించి ప్రాణాయామం చెయ్యాలి. కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న- అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ - అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరి - శ్రీకృష్ణ అనేవి చతుర్వింశతి నామాలు.
ముందుగా కేశవాదినామాలతో ఆచమించి ప్రాణాయామం చెయ్యాలి. కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న- అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ - అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరి - శ్రీకృష్ణ అనేవి చతుర్వింశతి నామాలు.
వీటికి ప్రతినామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి. చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి మూడు నామాలతోనూ జలం ముమ్మారు పుచ్చుకోవాలి, (ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా.) అటుపైని ఓం గోవిందాయనమః ఓం విష్ణవే నమః - ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండింటితో చేతులు కడుక్కోవాలి.
తరవాత రెండింటితో పాదాలు కడుక్కోవాలి. ఆపైని రెండింటితో శిరస్సున జల్లుకోవాలి (మార్జనం). అటు తరువాత మూడింటితో పాణి - పాద - శిరస్పంప్రోక్షణలు చేసుకోవాలి. తక్కిన సంకర్షణాది ద్వాదశనామాలను ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలనూ స్పృశించాలి. కుడిచేత్తో త్రాగాలి. ఎడమచేత్తో తాకాలి - స్పృశించాలి. అప్పటికిగానీ నీళ్ళు పరిశుద్ది పొందినట్టు కాదు. అటుపైనే ఆచమనం.
కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి, మినప గింజంత నీరు చొప్పున ముమ్మారు (విడివిడిగా పోసుకుని) పుచ్చుకోవాలి. అంటే త్రాగాలి. ఆంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ఠ కనిష్ఠికలను సాచి, నడిమి మూడువేళ్ళనూ పాముపడగలాగా ముందుకి తెచ్చి, అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి (అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధిపాందిన) ఎడమచేతితో నీళ్ళు పోనుకుని ఓం కేశవాయ స్వాహా అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన రెండు నామాలతోనూ మరో రెండుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తిఅయినట్టు.
ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రీమంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక పూరక కుంభకాలని మూడు అంశాలున్నాయి. దక్షిణ నాసారంధ్రంనుంచి రేచకం, వామవాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకమంటే గాలిని లోపలికి పీల్చుకోవడం. కుంభకమంటే పీల్చిన గాలిని ఊపిరి తిత్తుల్లో నిలుపుకోవడం. రేచకమంటే ఆ గాలిని విడవడం.
కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి, మినప గింజంత నీరు చొప్పున ముమ్మారు (విడివిడిగా పోసుకుని) పుచ్చుకోవాలి. అంటే త్రాగాలి. ఆంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ఠ కనిష్ఠికలను సాచి, నడిమి మూడువేళ్ళనూ పాముపడగలాగా ముందుకి తెచ్చి, అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి (అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధిపాందిన) ఎడమచేతితో నీళ్ళు పోనుకుని ఓం కేశవాయ స్వాహా అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన రెండు నామాలతోనూ మరో రెండుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తిఅయినట్టు.
ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రీమంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక పూరక కుంభకాలని మూడు అంశాలున్నాయి. దక్షిణ నాసారంధ్రంనుంచి రేచకం, వామవాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకమంటే గాలిని లోపలికి పీల్చుకోవడం. కుంభకమంటే పీల్చిన గాలిని ఊపిరి తిత్తుల్లో నిలుపుకోవడం. రేచకమంటే ఆ గాలిని విడవడం.
(ఇవి మూడూ సమానకాల వ్యవధానంతో జరగాలి. పీల్చినంతసేపు నిలపాలి. నిలిపినంతసేపు విడవాలి. అంతసేపు ఆగాలి. మళ్ళీ అలాగే అంత సేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు. దీన్ని తజ్ఞుల దగ్గర తర్ఫీదు పాందడం అవసరం)
పూరక సమయంలో కుడిముక్కు పుటాన్ని బొటనవేలితో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కునుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమివేలూ చూపుడు వేలూ వదిలేసి మిగిలిన చిటికెనవేలూ దాని ప్రక్కనే ఉండే అనామికతో (ఉంగరంవేలు) ఎడమ ముక్కుపుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడిముక్కు నుంచి గాలి వదలాలి.
పూరక - కుంభక - రేచకాలు మూడు కలిసి ఒక ప్రాణాయామమని యోగులూ యోగశాస్త్రాలూ చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పలదళశ్యాముడూ చతుర్భుజమహాత్ముడూ అయిన శ్రీహరిని నాభిమధ్యంలో ప్రతిష్టించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడూ ప్రజాపతీ జగన్నాథుడూ చతుర్వదనుడూ అయిన పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధస్పటిక సంకాశుడూ పాపనాశకుడూ నిర్మలుడూ శంకరుడూ అయిన మహేశ్వరుణ్ణి ఫాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణుసాయుజ్యం. కుంభకంలో బ్రహ్మగతి. రేచకంలో ఈశ్వర ప్రాప్తి,
నారదా! పౌరాణాచమనాద్యమూ శ్రౌతాచమనాద్యమూ అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారుపడకు. కేశవనామాలతో ఆచమిస్తే ఆది పౌరాణికాచమనం. గాయత్రీ మంత్రంతో ఆచమిస్తే అది శ్రాతాచమనం. ప్రణవసహితంగా వ్యాహృతిత్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి.
పూరక - కుంభక - రేచకాలు మూడు కలిసి ఒక ప్రాణాయామమని యోగులూ యోగశాస్త్రాలూ చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పలదళశ్యాముడూ చతుర్భుజమహాత్ముడూ అయిన శ్రీహరిని నాభిమధ్యంలో ప్రతిష్టించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడూ ప్రజాపతీ జగన్నాథుడూ చతుర్వదనుడూ అయిన పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధస్పటిక సంకాశుడూ పాపనాశకుడూ నిర్మలుడూ శంకరుడూ అయిన మహేశ్వరుణ్ణి ఫాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణుసాయుజ్యం. కుంభకంలో బ్రహ్మగతి. రేచకంలో ఈశ్వర ప్రాప్తి,
నారదా! పౌరాణాచమనాద్యమూ శ్రౌతాచమనాద్యమూ అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారుపడకు. కేశవనామాలతో ఆచమిస్తే ఆది పౌరాణికాచమనం. గాయత్రీ మంత్రంతో ఆచమిస్తే అది శ్రాతాచమనం. ప్రణవసహితంగా వ్యాహృతిత్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి.
ప్రాణాయామసమయంలో గృవాస్థులూ వానప్రస్థులూ నాసాగ్రాన్ని అయిదు వేళ్ళతోనూ ముయ్యాలనీ, బ్రహ్మచారులూ సన్యాసులూ అంగుష్ఠ కనిష్ఠికానామికలతో ముయ్యాలనీ ఒక నియమం. ఆపోహిష్ఠాదిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. ఋగంతంలోగాని పాదాంతంలోగానీ ఈ సంప్రోక్షణలు (మార్జనలు) చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సరపాపం నశించిపోతుంది.
అటు పైని మళ్ళీ ఆచమించి సూర్యశ్చేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాశన చెయ్యాలి. దీనితో ఆంతరంగపాపాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు దక్షిణహస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కుకి దగ్గరగా తెచ్చుకుని వామకుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి, ఋతమిత్యాది మంత్రంగానీ ద్రుపదా ఇత్యాదిమంత్రంగానీ పఠిస్తూ దక్షిణశ్వాసమార్గం గుండా (కుడిముక్కు) ఆ పాపపురుషుణ్ణి చేతినీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్ళను చూడకుండా ఎడమవైపు రాతిమీదకు విసిరికొట్టాలి. నా శరీరం నిష్పాపమయ్యింది అని భావించాలి.
అప్పుడు లేచినిలబడి, కాళ్ళు దగ్గరగా పెట్టుకుని దోసిటిలోకి నీళ్ళు తీసుకుని సూర్యుణ్ణి చూస్తూ గాయత్రిజపిస్తూ ముమ్మారు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ప్రాతస్సాయం సంధ్యలో ఇలా మూడుసార్లూ, మధ్యాహ్న సంధ్యలో ఒక్కసారి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రాతస్సంధ్యలో కొంచెం ముందుకి వొంగి, మధ్యాహ్నసంధ్యలో నిట్టనిటారుగా నిల్చునీ, సాయం సంధ్యలో కూర్చునీ ఇవ్వాలి.
ఇది అయ్యాక అసావాదిత్య మంత్రంతో ప్రదక్షిణం చెయ్యాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణమేమిటంటే -
మందేహులని మహారాక్షసులున్నారు. మూడుకోట్ల మంది. మహావీరులూ మహాఘోరులూ కృతఘ్నులూ దారుణులూ. వీళ్ళంతా కలిసి సూర్యుణ్ణి తినివెయ్యాలని చూస్తుంటారు. కనక దేవతలూ ఋషులూ తపోధనులూ మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచి పెడతారు.
ఆ మంత్రజలాలు వజ్రాలై ఆ రాక్షసుల్ని దహించివేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యమూ సంధ్యను ఉపాసించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్రకర్తవ్యం. ఉచ్చారణమాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగమంత్ర సారమేమిటంటే - నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్తుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును.
ఓ వరదాయినీ! గాయత్రీదేవీ! బ్రహ్మరూపిణీ! రమ్ము రారమ్ము. జపానుష్ఠాన సిద్ధికోసం నా హృదయంలో ప్రవేశించు - అని ప్రార్థించి శుభ్రప్రదేశంలో శుభ్రపీఠంమీద కూర్చుని గాయత్రీమహామంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి “పునరాగమనంకోసం సుఖంగా వెళ్ళిరా" అని వీడ్కోలు పలకాలి.
ఖేచరీ ముద్ర