శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - భార్యావిక్రయం
అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టులనెను: ఓ మహారాజా! నీ ధర్మము నీవు పాలింపుము. దిగులు పడకుము. సత్యమును ధర్మమును మీఱినవాడు ప్రేతవలె విడువదగిన వాడు. ఓ పురుషవర్యా! సత్యమును నిలుపుకొనజాలడో వాని నిత్య్యాగ్ని హోత్రము-అధ్యయనము-దానాదిక్రియలు అన్నియును వ్యర్థములే. ధర్మశాస్త్రములం దీ సత్యమహిమ మెంతగనో వర్ఱింపబడినది.
అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టులనెను: ఓ మహారాజా! నీ ధర్మము నీవు పాలింపుము. దిగులు పడకుము. సత్యమును ధర్మమును మీఱినవాడు ప్రేతవలె విడువదగిన వాడు. ఓ పురుషవర్యా! సత్యమును నిలుపుకొనజాలడో వాని నిత్య్యాగ్ని హోత్రము-అధ్యయనము-దానాదిక్రియలు అన్నియును వ్యర్థములే. ధర్మశాస్త్రములం దీ సత్యమహిమ మెంతగనో వర్ఱింపబడినది.
ఇది పుణ్యాత్ముల నుద్ధరించును. పావులనణగ ద్రొక్కును. యయాతి మహారాజు నూఱశ్వ మేధ ములు-రాజసూయము-నొనర్చెను. కాని యొక్కసారి పల్కిన యసత్యము నకు స్వర్గభ్రష్టుడయ్యెను.
రాజిట్లనెను: ఓ గజగామినీ! ఈ మన పుత్రుడు వంశము నిల్పువాడు గదా! కనుక నీవు చెప్పదలచు కొన్నది స్పష్టముగ జెప్పుము.
భార్య యిట్లనెను: రాజా! స్త్రీ పురుషుల దాంపత్యము పుత్రులు గల్గుటకే కదా! మన కా కోర్కి దీరినది. కనుక నన్నె వరికైననమ్మి మునికి దక్షిణయిమ్ము. సత్యము నిలువబెట్టుము. ఈ మాటలు వినగానే రాజు మూర్ఛితుడై కొంత తడవునకు తెప్పరిల్లెను. పిమ్మట కడు వగచి యిట్లనెను.
భార్య యిట్లనెను: రాజా! స్త్రీ పురుషుల దాంపత్యము పుత్రులు గల్గుటకే కదా! మన కా కోర్కి దీరినది. కనుక నన్నె వరికైననమ్మి మునికి దక్షిణయిమ్ము. సత్యము నిలువబెట్టుము. ఈ మాటలు వినగానే రాజు మూర్ఛితుడై కొంత తడవునకు తెప్పరిల్లెను. పిమ్మట కడు వగచి యిట్లనెను.
ఓ కల్యాణీ! నీవు పల్కిన పల్కులవలన నాకు తీరని దుఃఖము గల్గుచున్నది. ఇక నీ మందహాసపూర్వక సంభాషణముల నీ పాపి మరచిపోవలసినదేనా! ఓ భామినీ! పవిత్రమగు చిరునగవు దానా! నీ వింతటిమాట యెటులు పల్కితివి. అక్కట ! ఇంతటి వనరానిమాట వినవలసివచ్చెనే! అని పలికెను.
రాజునకు తన భార్యనే యమ్ముకొనుట అను మాటకు గుండె చెదరెను. పిమ్మట అతడు దుఃఖితుడై మూర్చపోయెను. నేలపై మూర్ఛితుడై పడియున్న రాజునుగని రాణివాపోవుచు దీనముగ నిట్లనుకొనెను : హామహామహీపతీ! నీవే దైవపు చెడుతలంపుతో నిట్టిదుఃస్థితికి గురియైతివి.
రాజభవనములో పరుండవలసిన నీ విపు డీ కటికినేలపై పడియుంటివా! హా కటా! ఏ నా పతి మునుపు విప్రులకు కోట్లధనము దాన మిచ్చెనో యా భూపతియే నేడు నైలపై పడియున్నాడే ! అక్కటా! చెడు దైవమా ! ఈ రాజు నీకు మును పేమి కీడొనరించెనో కదా! ఇంద్రోపేంద్రులబోలు రాజేంద్రు డిట్టి దీనదశలో నిన్ని యిక్కట్టుల పాలయ్యెను.
అని పలికి తన పతి దుఃఖమోహమును సహింపజాలక రాణియును బాధపడి మూర్ఛితురాలై పడిపోయెను. ఇట్లు వారిర్వురును మూర్ఛితు లగుటగని రోహితుడు అమ్మా! అన్నము; నాయనా! అన్నమని పేరాకట నకనకలాడెను. అమ్మా! ఆకలిమంట యెక్కువైనది. నాలుకపిడచ గట్టుచున్నది. పట్టెడన్నము పెట్టుమమ్మా అనెను.
ఇంతలో యమునివలె క్రోధముతో మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన ధనము యాచించుట కేగుదెంచెను. మునిని చూడగనే హరిశ్చంద్రుడు మూర్ఛితుడై నేల కొఱగెను. అపుడు రాజు మొగముపై నీరు చల్లి
ముని రాజున కిట్లనెను: ఓయి రాజేంద్రా! లేలెమ్ము. నీ వీయవలసిన దక్షిణ యిమ్ము. అప్పున్నవానికి క్షణక్షణమును దుఃఖములు పెరుగుచునే యుండును. చల్లని నీటి తాకుడునకు రాజూరటజెంది తెలివొంది విశ్వామిత్రునితో నేదియో పలుకబోయెను. అంతలో రాజు మరల మోహవశుడై పడిపోయెను.
అదిగాంచి ముని రాజు నూరార్చి తీవ్రకోపముతో నతని కిట్లనెను: నీవు సత్యము నిలుపు కొనదలచినచో నా దక్షిణ నాకిమ్ము. సూర్యుడు సత్యమువలననే వెల్గుచున్నాడు. ఈ భూమి సత్యబలమున స్థిరముగ నున్నది. స్వర్గమును సత్యముపై నాధారపడియుండును. సత్యము పరమధర్మమని పేర్కొనబడును. వేయి అశ్వమేధముల ఫలము కంటె సత్యఫలము గొప్పది. రెంటిని తులలో తూచుము. అపుడు నూఱశ్వమేధములకంటె సత్యమువైపు మొగ్గుండును నీ కిట్టి వట్టిమాటలతో నేమి పని?
రాజా! నా కీయవలసిన దక్షిణ యీనాటి ప్రొద్దు గ్రుంకు లోపల నీయనిచో నిన్ను తప్పక శపించి వేయగలను. అని పలికి ముని వెళ్ళిపోయెను. నిఱుపేదయగు రాజు ముని పరుషములకు దుఃఖితుడై భయాతురుడై యేమి తోచక చింతించుచుండెను. అంతలోనే వేదవిదుడగు నొక విప్రుడు పెక్కురు బ్రాహ్మణులు వెంటరాగ తన గృహము వెడలి యచటి కేతెంచెను. వచ్చిన బ్రాహ్మణుని గాంచి రాణి రాజుతో ధర్మార్థములుగల మాటలతో నిటుపలికెను.
బ్రాహ్మణుడు మూడు వర్ణములు వారికిని తండ్రివంటివా డందురు. కనుక తండ్రి ద్రవ్యమును తనయుడు తప్పక తీసికొనవచ్చును. ఇతని నిపుడు మనము యాచించుట మంచిదని తలంతును.
బ్రాహ్మణుడు మూడు వర్ణములు వారికిని తండ్రివంటివా డందురు. కనుక తండ్రి ద్రవ్యమును తనయుడు తప్పక తీసికొనవచ్చును. ఇతని నిపుడు మనము యాచించుట మంచిదని తలంతును.
రాజిట్లనెను : ఓ ముదితా! నేను క్షత్రియుడను. ఇతని ముందు చేయి చాపను. విప్రులు యాచింపవచ్చును. కాని క్షత్రియులు యాచింపరాదు. ఎల్ల వర్ణముల వారికి విప్రుడు గురుడు. నిత్యము పూజనీయుడు. కనుక నట్టి గురువు నెవడును యాచింపరాదు. ఈ పని క్షత్రియులకు మొదలే తగదు. క్షత్రియులకు యజనము. అధ్యయనము. దానము శరణార్థుల కభయమిచ్చుట. ప్రజలను చక్కగ పాలిచుట అనునవి విధింపబడినవి. ఒకని ముందు దీనముగ దేహి యనుట రాజులకు దగని పని.
ఓ దేవీ! నా హృదయమున నిత్య మిచ్చెదనను మాటయే నిలిచి యుండుత. నేనెక్కడి నుండి యైన ద్రవ్యము దెచ్చి మునికీయగలను. భార్య యిట్లనెను. కాల మొకనిని సమస్థితిలో మఱొకనిని విషమ స్థితిలో పడవేయును. ఒకనికి సమ్మానము వేరొకని కవమానము గల్గించును. ఒకనిని దాతగ నింకొకని బిచ్చగానిగ చేయును. అంతటి పండిత మునియే నిన్ను తీవ్ర కోపముతో రాజ్య సుఖములకు దూరము చేసెను. ఈ కాలము చేత లెంత చిత్రములో చూడుము. రాజిట్లనెను. వాడి కత్తితో నా నాల్కను రెండుగ చీల్చినప్పటికిని నేను క్షత్రియా భిమానము కోల్పోయి దేహియని యాచింపను. ఓ కల్యాణీ! నేను క్షత్రియుడను. నేనొకని నెంత మాత్రమును యాచింపను. నా చెమటోడ్చి పొందిన ధనమే యీయగలను.
భార్య యిట్లనెను: ఓ మహారాజా! ఒకనిని యాచించుటకు నీ మన సొప్పుకొనుట లేదు గదా! నేను నీ కింద్రాది దేవతల వలన న్యాయముగ నీయబడితిని గదా! కనుక నీ చేత శాసింపబడుటకు రక్షింపబడుటకు తగుదును. ఓ మహాద్యుతీ : నన్నమ్మి యా వచ్చిన ధనమును ముని కిమ్ము. అను నామె మాటలు విని హరిశ్చంద్ర రాజు హా! ఎంతటి కష్టముదాపురించెనే! యని యెంతయో దురపిల్లెను.
రాణి మరల రాజుతో నిట్లనెను: నా మాట వినుము. విప్ర శాపాగ్మి కాహుతియై నీచత్వమేల పొందెదవు? నీవు నన్నొక జూదమునకుగాని త్రాగుడునుకగాని రాజ్యమునకుగాని భోగలకు గాని యమ్ముటలేదు. గురున కీయవలసిన ధనము కొఱకు నన్నమ్ముము. నీ సత్యత్రము సఫల మొనరింపుము.
వ్యాసుడిట్లనెను: రాజపత్ని తన్నమ్ముమని మాటిమాటికి ప్రేరేపించగ
వ్యాసుడిట్లనెను: రాజపత్ని తన్నమ్ముమని మాటిమాటికి ప్రేరేపించగ
హరిశ్చంద్రుడామె కిట్లనెను: కల్యాణీ: నిన్ను దయమాలి యమ్మివేతునా! నీ కిట్టి బెట్టిదమైన మాట యిష్టమైనచో నేను సైతము మహాక్రూరులకు సాధ్యము గాని కఠినమైన పని చేయగలను. అని పలికి రాజు శోకాతురుడై తన భార్యను వెంటగొని నగరు లోని రాజ వీథిలో నిలువబడెను.
కన్నీరు తొడిబడ తడపడు నుడులతో రాజిట్లనెను: ఓ పౌరులారా! మీరందఱు నా మాట నాలింపుడు. మీలో నెవనికైన దాసి కావల సినచోచెప్పుడు. నా ప్రాణప్రియ నమ్మగలను. నేను చెప్పినంతకు కొనుడు. నీ వెవరవు? నీ భార్యనేల యమ్ముచున్నావని పండితు లడిగిరి.
రాజిట్లనెను: నీ వెవరవని నన్నేల యడిగెదరు. నేనొక క్రూరుడను. పశువును. నేను రాక్షసుడను. కఠినాత్ముడను. అందుచే నింత పాపము చేయుచున్నాను. అను రాజు మాటలు విని విశ్వామిత్రుడు వెంటనే విప్ర రూపమున వచ్చెను. ముని ముదుసలి విప్రురూపమునవచ్చి
హరిశ్చంద్రునితో నిట్లు పలికెను: ఆదాసిని నాకిమ్ము. నేనుకొని నీకు వలసిన ధన మీయగలను. నాయొద్ద ధనము మూలుగుచున్నది. నాభార్య కడు సుకుమారి. ఇంటి పనులొక్కతెయే చేసుకొనలేకున్నది. కనుక నీమెను నా కమ్ముము. నేనీ దాసిని తీసికొందును. నీ కెంత ధన మీయవలయును. అని విప్రుడు హరిశ్చంద్ర నరపతితో బలకెను. అపుడు రాజు హృదయము దుఃఖముతో వ్రయ్యలయ్యెను. రాజునకు నోట మాట రాలేదు.
విప్రుడిట్లనెను: నీ భార్య యొక్క వయస్సు - రూపు - శీలము - పని యన్నిట తగినవి. నీ భార్యకు తగిన ధనము తీసికొనుము. నాకు నీ బార్యనిమ్ము. ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషులకు నిర్ణయింపబడిన వెల తెల్పుదు వినుము. ముప్పది రెండు లక్షణములు గల్గి-శీలగుణములు దక్షత గల యాడుది కోటి సువర్ణములు వెల చేయును. పురుషుడొక యర్బదము వెల చేయును. అను మాటలు విని హరిశ్చంద్ర రాజు మహాశోకములో నేమియు బలుకకుండెను.
పిదప విప్రుడు రాజు ముందొక వస్త్రముపై ధనముంచి రాణి తల వెండ్రుకలు పట్టిలాగెను.
రాణి యిట్లనెను: ఓ విప్రా! వదలు - వదలుము. నా కొడుకు మొగమొకసారి చూడనిమ్ము. మరల నా కొడుకు దర్శనమగునో కాదో! ఆమె రాకుమారునితో నిట్లనెను. ఓ రాజపుత్రా! నీ తల్లి యిపుడొక దాసియైనది. నీవు నన్ను తాకకుము. నిన్ను తాకుటకును నేను తగను. పిదప తన తల్లిని ముని లాగుచుండుట జూచి బాలుడు వెంటనే అమ్మాయని కన్నుల నీరు నింపుకొని యేడ్చుచు తల్లిని జేరెను. బాలుడు తన తల్లి చీర చెఱగు పట్టుకొని లాగుచు నేడ్చుచుండుటగని విప్రుడతనిని కోపముతో కొట్టెను. అయినను బాలుడు తన పట్టిన పట్టు వదలక అమ్మాయని బావురుమని యేడ్చెను.
విప్రునితో రాణి యిట్లనెను: బాలుని సైతముకొని నాకు సంతోషము గల్గించుము. నేను నా బాలుడు లేనిచో నీ పనులు చక్కగ చేయజాలను. కనుక నీ నిర్మాగ్యురాలి పట్లదయ బూని యితనిని కొనుము.
రాజుతో బ్రాహ్మణుడిట్లనెను: ఇదిగో! ఈ ధనము తీసికొని బాలుని కూడ నాకిమ్ము. ధర్మశాస్త్రవిధులు స్త్రీ పురుషులకు వేర్వేరుగ వెలలు గట్టిరి. పండితులు స్త్రీల గుణములను బట్టి కొందఱికు నూఱు-వేయి-లక్షమఱి కొందఱికి కోటి వెల నిర్ణయించిరి. ఒక యువతి ముప్పదిరెండు శుభ లక్షణములు నేర్పుగల్గియుండవలెను. ఆమె కోటి బంగారు ముద్రల విలువ చేయును. ఇక పురుషుని వెల అర్బుదము.
సూతుడిట్లనెను: విప్రుడు వస్త్రముపై పురుషుని వెల యంద ధనముంచెను. అతడు బాలుని తీసికొని యతని తల్లితో బంధించెను. ఇట్లు విప్రుడు ప్రమోదముతో వారిని తీసికొని తన యింటి కేగెను. రాణి వెళ్ళుటకు పూర్వము తన భర్తకు ప్రదక్షిణ మొనరించి యతని ముందు మోకరిల్లి కన్నీరు జలజలరాల దీన ముగ నిట్లు పలికెను.
నేను పూర్వము చేసిన దానము గాని హోమముగాని బ్రాహ్మణ సంత్పరణముగాని యున్నచో దాని పుణ్యమున హరిశ్చంద్రుడు నాకు మరల భర్త యగుత. తనకు ప్రాణముల కన్న ప్రియురాలగు భార్య యట్లు తల పాదాలపై పడుట చూచి రాజు వ్యాకులచిత్తుడై అక్కట! యెంత కష్టము వచ్చెనే! యని వాపోయెను.
ఒక చెట్టు నీడ చెట్టు నెన్నడును వీడదు. మఱి సత్యశీల గుణముల గల యీమె యెట్లు వియోగము చెందును. ఇట్లు భార్యతో రాగానుబంధము గల మాటలాడి పిదప
రాజు తన కొడుకునుద్దేశించి యిట్లనెను : నీవు నన్ను వదిలి యెట కేగుదువు? ఇక నాకేది దిక్కు! నా దుఃఖము బాపు వాడెవడు! ఓ బ్రాహ్మణుడా! నాకు రాజ్యము వదిలనపుడు గాని వన వాసమున గాని దుఃఖము గలుగలేదు. కాని యీ పుత్త్ర వియోగమున నాకు మిక్కిలి దుఃఖము గల్గుచున్నది. లోకమున సద్బావము గల భర్త యున్నచో నతని భర్యకు సుఖము గల్గును.
ఓ కల్యాణీ! ఇక్ష్వాకు వంశజాతుడు సకల రాజ్య సుఖములకు తగినవాడు దుఃఖార్తుడునైన నా వంటి రాజుచే దుఃఖితురాలవైతివి. ఇట్టి నన్ను పతిగ బొంది నీవు వేరొకనికి దాసి వైతివి. ఇట్లు నేనెంతయో శోకసాగరమున మునిగితిని. దేవి : నాకు పురాణకథలు వినిపించి నన్నుద్ధరించు వాడెవడు? అని రాజు పలికి చూచుచుండగనే విప్రుడామెను బెత్తాలతో గొట్టెను. అట్లు కొట్టుచు విప్రు డామెను కొనిపోసాగెను.
అట్లు తన భార్యాపుత్రులు కొనిపోబడుట రాజు చూచెను. రాజు దుఃఖార్తితో వేడి నిట్టూర్పులు నిగుడించుచు భోరున నేడ్చెను. నా భార్యను వాయువు గాని సూర్యుడు గాని చంద్రుడు గాని ఇతరులు గాని చూడజాలరు. అట్టి చూడబడని నా భార్యనేడొకనికి దాసియయ్యెనే! అకట! ఈ సుకుమారుడు సూర్యవంశజుడు-మెత్తని చేతి వ్రేళ్ళుగలాడు-ఇట్టి బాలుడమ్ముడు పోయెనే! నేనెంత దుర్మతిని. వ్యర్థుడను: ఓ ప్రియురాలా: ఓ కుమారకా! అనార్యుడనగు నా వలన మీ కెం దుర్గతి వచ్చెనే! దైవము వలన నింతటి దుర్దశ బొందియును నేను చావకున్నానే అని రాజు విలపించుచుండగనే విప్రుడు అదృశ్యుడయ్యెను.
ఇట్లువిప్రుడు పొడవైన చెట్లు మేడలు దాని వారినిగొని త్వరగవెళ్ళెను. అంతలో మహాతపుడగు విశ్వామిత్రుడచటి కేతెంచెను. అతడు క్రూరమైన చూపులతో నిష్టురముగ శిష్యులను వెంటగొని వచ్చెను.
విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! మున్ను నీవు రాజసూయ దక్షిణ యిత్తునని మాటయిచ్చితివి. ఓ మహానుభావా! నీవు సత్యవంతుడవైనచో దక్షిణ యిమ్ము.
హరిశ్చంద్రు డిట్లనెను: రాజర్షీ! నీకు నమస్కారము ఈ దక్షిణ స్వీకరింపుము. అనఘా మునుపు నేను రాజ సూయ యాగమునకు దక్షిణ యిత్తునంటిని. విశ్వామిత్రు డిట్లనెను. ఈ దక్షిణగ నిచ్చు ధన మెచట లభించెను. రాజేంద్రా ! నీ వెట్లు ధనము గడించితివో నాకు తెల్పుము.
హరిశ్చంద్రు డిట్లనెను: రాజర్షీ! నీకు నమస్కారము ఈ దక్షిణ స్వీకరింపుము. అనఘా మునుపు నేను రాజ సూయ యాగమునకు దక్షిణ యిత్తునంటిని. విశ్వామిత్రు డిట్లనెను. ఈ దక్షిణగ నిచ్చు ధన మెచట లభించెను. రాజేంద్రా ! నీ వెట్లు ధనము గడించితివో నాకు తెల్పుము.
రాజిట్లనెను: అనఘా! మహానుభావా! దానిని గూర్చి చెప్పుటేల! సువ్రతా! విప్రా! దానిని వినిన కొలది శోకమే పెల్లుబుకుచుండును. ఋషి యిట్లనెను. నేను న్యాయార్జితమైన ధనమే గ్రహింతునుగాని అన్యాయార్జితమును గ్రహింపను. రాజా! ఈ ధనమెట్లు వచ్చెనో నిజము తెలుపుము.
రాజిట్లనెను: నా భార్యను కోటి సువర్ణముల కమ్మితిమి. నా రోహితుడను కొడు కర్బదమున కమ్ముడుపోయెను. విప్రా ! నీవీ పదునొకండు కొట్ల సువర్ణము గ్రహింపుము. సూతుడిట్లనెను. భార్యాపుత్రుల నమ్మి సంపాదించిన ధనము స్వల్పమైనది. అని ముని పలుకగనే రాజుమఱల శోక సంతప్తు డయ్యెను.
ముని కోపించి యిట్లనెను: ఇది రాజసూయ యజ్ఞమునకు దక్షిణ గాదు. ఇంక కొంత సంపాదింపుము. దానివలన దక్షిణ పూర్తిగా గలదు. ఓరీ! క్షత్రియాధమా! ఈ నీ ధనము దక్షిణకు సరిపోవువని తలతువేని వెంటనే నా తపోబలము చూతువుగానిలే. నా నిర్మల తపోవీర్యము-బ్రాహ్మణ ప్రభావము-అధ్యయన బలము-నాశక్తి చూతు గానిలే!
రాజిట్లనెను: ఓ భగవానుడా! నీ కింకను ధన మీయగలను. కొంతకాల మోపిక పట్టుము. ఇపుడే నా భార్యాపుత్రుల నమ్మితిని గదా!
విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! దినము లోని నాల్గవ భాగము మాత్రకు నేనెదురు చూడవలసియున్నది. అది గడచిన పిదప నీతో బలుకవలసిన పని నాకు లేదు.