నారదముని బ్రహ్మను ఇలా ప్రశ్నించాడు.
ఓ తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. సురలలో పెద్దవు. లోకాలకు సృష్టికర్తవు, ఈ వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే విరాజిల్లుతున్నాయి. వాగర్థమయమైన ఈ విశ్వమంతా నీ అరచేతి ఉసిరికపండువలె నీకు తేటతెల్లమై ఉన్నది. పైగా సరస్వతీదేవి నీకు ఇల్లాలు. ఇదిగో, ఈ నా సందేహం తీర్చు.
సరస్వతీనాథా! ఈ జగత్తుయొక్క సృష్టిని ప్రారంభించడాని కవసరమైన విజ్ఞానాన్ని నీకు ఎవడిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపదకు మూలమేమి? ఈ సృష్టి నిర్మాణానికి హేతువేమి? దీనివల్ల ఒనగూడే ప్రయోజనమేమి? దీని స్వరూపమెట్టిది? సాలెపురుగులాగా విశ్రాంతి లేకుండా ఎల్లప్పుడూ సంసార నిర్మాణక్రమాన్ని కొనసాగిస్తున్నా నీకు శ్రమలేకుండా ఉన్నది. నీ జీవనవిధానం అందరికీ అందేది కాదు.
నా మట్టుకు నేను నీవే ప్రభుడవని భావిస్తున్నాను. నిజానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అంతటికీ ప్రభుడవా? అయితే ఏ ప్రయోజనం ఆశించి నీ వీలోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవసముదాయం ఎక్కడ ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది? ఎక్కడ చివరకు లయమవుతున్నది? నిజం చెప్పు దేవా!
సత్తు (పరమాత్మ) అసత్తు (మాయ)ల కలయిక వల్ల నామరూపగుణాలతో గూడి కనిపించే ఈ జగత్తు నీ హృదయానికి అధీనమైనదే కదా! నీ కంటె అధికులు, నీతో సమానులూ ఎవరూ లేరు. నీ స్థానం మిక్కిలి దొడ్డది. ఇట్టి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తప మొనర్చావు? ఆ దారి ఏదో చెప్పవయ్యా!
పద్మజా! నీకు గూడా ఒక ఏలిక ఉన్నాడంటావా? అట్లైతే ఈ బ్రహ్మాండం ఏ ప్రభుని కటాక్షవిలాసంతో జనిస్తున్నదో, వర్ధిల్లుతున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువును గూర్చి ఆయన స్వరూపమెట్టిదని ముచ్చటించుకోవడానికి వీలవుతుందా?
కమల సంభవా! ఈ విషయం నాకు తెలియపరచు. నా కిది బాగా అర్థమైతే నన్ననుసరించే నా పరివారానికి ఈ సత్యం తెలియజేస్తాను. వాళ్ళు ఇతర మార్గాలను అనుసరించకుండా ఉండునట్లు చేస్తాను.
స్వామీ! జరిగిన, జరుగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమేదీ లేదు. ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పు - అని నారదుడు అడిగాడు. అది విని విప్పారిన ముఖంతో విధాత ఇలా అన్నాడు.
పుత్రా! ఎందరు పండితులు నా వద్దకు రావడం లేదు! వారంతా వైరాగ్యం కలవారే కదా! అయినా వాళ్ళెవరూ నీవలె నన్ను ప్రశ్నించినవారు కారు. నీ మతం నాకు సంతసం కల్గించింది. ఆశ్చర్యం! నా ప్రభుని రహస్యమే నీవడిగావు.
నారదా! విను! నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నాకు నేనై సృష్టించడానికి అవసరమైన తెలివి ఏ మాత్రం లేక నేను తొట్రుపడ్డాను. ఆ స్థితిలో పూర్వం ఈ సకల సృష్టినీ ఆరంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకా ప్రభువు ఎంతో ఉదారంగా ప్రసాదించాడు. ఆ దేవుని ఆనతి లేకుంటే ఈ జగన్నిర్మాణశక్తి నాకెక్కడిది?
కిల్బిషం లేని నారదా! ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవని ప్రకాశంవల్ల సూర్యుడు, చంద్రుడూ, అగ్నీ నక్షత్రాలూ, గ్రహాలు ఇంకా ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశింప చేయబడుతున్నవో, అట్టి దివ్యదీప్తితో విరాజిల్లే పరమేశ్వరునికి నేను సదా ప్రణమిల్లుతున్నాను.
పుత్రా! ఇంకా ఈ విషయం విశదంగా వివరిస్తాను విను. మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచించుకుపోతుంది. దానివల్ల తమ తెలివి కుంఠితం కాగా బుద్ధిహీనులు నన్నే లోకానికంతా ప్రభువుగా భావించి నాకు నమస్కరిస్తూ ఉంటారు. అట్టి మూఢులను చూచి ఇది శ్రీహరి మాయవల్ల జరిగేపని కదా? అనుకొని నాలో నేను నవ్వుకొని వాళ్ళను, ధిక్కరిస్తుంటాను
అంతమాత్రమే కాదు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివి మున్నగు ఐదు భూతాలూ, పుట్టుకకు హేతువులైన కర్మలూ, కర్మ ప్రవృత్తికి కారణమైన కాలమూ, దాని మార్పునకు కారణమైన స్వభావమూ, కర్మఫలం అనుభవించే జీవుడూ అంతా వాసుదేవ స్వరూపులే అని గ్రహించు. ఆ వాసుదేవునికంటె అన్యమైనదేదీ లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడే. వేల్పులందరూ ఆ దేవుని శరీరంనుండి పుట్టినవారే. వేదాలూ, యాగాలూ, తపస్సులూ, యోగాలూ, విజ్ఞానమూ అంతా నారాయణుని ఆరాధనారూపమైనవే. జ్ఞానసాధ్యమైన ఫలం కూడా నారాయణని అధీనంలోనే ఉన్నది. నిర్వికారుడూ, సర్వాంతర్యామీ, సర్వదర్శనుడు అయిన భగవానుని క్రీగంటి చూపువల్లనే నేను జన్మించాను. ఆయన కటాక్షంవల్లనే ప్రేరణ పొంది సృజింపదగిన విశ్వాన్ని సృష్టిస్తున్నాను. గుణరహితుడైన ఈశ్వరునుండి రజస్సత్త్వతమస్సులనే మూడుగుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికీ, స్థితికీ లయానికీ హేతువులవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణ భావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచభూతాలనూ, జ్ఞానరూపులైన బ్రవ్మాదిదేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదాముక్తుడే అయినా మాయతోకూడి ఉండడంవల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రమే గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.
కుమారా! ఆ పరమ్వేరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకూ, నాకూ, నీకూ, మాయకూ, ప్రాణివర్గానికీ ప్రభువు. ఆయనకంటె ఇతరమైనది ఈ జగత్తులో ఏదీ లేనే లేదు.
ఈశ్వరుడు మాయను నియమించేవాడు. ఆయనకు తనమాయవల్ల కాలమూ, జీవాదృష్టమూ, స్వభావం అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టికార్యానికి సహకారకాలుగా స్వీకరించాడు. ఈశ్వరుడధిష్ఠించిన మహత్తత్త్వం కారణంగా కాలంనుండి త్రిగుణాల భేదమూ, స్వభావంనుండి పరిణామమూ, జీవుని అదృష్టరూపమైన కర్మనుండి జన్మమూ సిద్ధించాయి.
రజోగుణంచేతా, సత్త్వగుణంచేతా వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుండే తమోగుణ ప్రధానమై పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదైన అహంకారం సంభవించింది. ఆ అహంకారం మరల వికృతిపొంది ద్రవ్యశక్తియైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియెన సాత్వికమనీ మూడురూపాలుగా పరిణమించింది.
పంచభూతాలకు మూలమైన తామసాహంకారంనుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశంనుండి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశంలోని శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు గాలికున్నాయి. ఆ గాలి శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియపటుత్వానికీ, మనోబలానికీ, శారీరకశక్తికీ హేతువవుతున్నది. వికారంపొందిన వాయువునుండే రూపం, స్పర్శం, శబ్దం-అనే మూడు గుణాలుగల్లిన తేజస్సు జనించింది. ఆ తేజస్సునుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణాలతో గూడిన జలం కలిగింది. జలంనుండి గంధరసరూపస్పర్శశబ్దాలనే అయిదు గుణాలు గల పృథివి పుట్టింది. పై జెప్పినవన్నీ తామసాహంకారం నుండి కల్టినవే.
వికారానికి లోనైన సాత్వికాహంకారంనుండి మనస్సు జనించింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులూ, వాయువూ, సూర్యుడూ, వరుణుడూ, అశ్వినీదేవతలూ, అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడూ, మిత్రుడూ, ప్రజాపతీ అనే పదిమంది దేవతలు ఉద్భవించారు.
తైజసమైన రాజసాహంకారం నుండి శ్రోత్రం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మున్నగు ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పదియింద్రియాల అధిదేవతల వివరమిది - శ్రోత్రేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయువూ, నేత్రేంద్రియానికి సూర్యుడూ, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీ దేవతలూ, వాగింద్రియానికి అగ్నీ హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ది జ్డానం కల్గించే అంతఃకరణంలో ఒక భాగం. ప్రాణం క్రియాహేతువైన అంతఃకరణం.
శ్రోత్రాదులగు దశేంద్రియాలతో గూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్బస్పర్భాదులైన గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒకచోట చేర్చితేగానీ సాధ్యం కాదు గదా! అదే రీతిగా పైన పేర్కొన్న భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు, భగవంతుని శక్తివల్ల ఒకటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ, కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మించబడిన అండం కోటి సంవత్సరాల వరకూ నీళ్ళలోనే ఉండిపోయింది.
అందుమీదట కాలకర్మస్వభావాలకు లోబడనివాడూ, అన్నింటినీ ప్రాణవంతంగా చేయగలవాడూ అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైనదాన్ని ప్రాణసహితంచేశాడు. కాలకర్మస్వభావాలకు ప్రేరకుడైన ఆ దేవుడు మహావరణ జలమధ్యంలో ఉండిన బ్రహ్మాండంలో జీవరూపంతో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతమయ్యేటట్లు చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో వివరిస్తాను విను.
జగత్స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ఒక భవనాన్ని పోలివున్న ఈ బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన చతుర్దశ భువనాలుగా తీర్చిదిద్దాడు.
మేధావీ! ఆ భగవంతుడు పలుపాదాలూ, తొడలూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నొసళ్ళూ, చెవులూ కలిగివుంటాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని నానారూపాలైన అవయవాలలోనే సర్వ ప్రపంచపుటునికినీ ఊహిస్తూ ఉంటారు. మహనీయుడూ, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడూ అయిన ఆ భగవంతుడు యోగుల హృదయాలచే పూజింపదగి ఉన్నాడు.
ఈ పద్నాలుగు లోకాలలో పై ఏడులోకాలు మహావిష్ణువుయొక్క నడుమునుండి పై శరీరమంటారు. అట్లే క్రింది ఏడులోకాలూ నడుమునుండి క్రింది శరీరమంటారు. ఈ ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులమూ, బాహువులనుండి క్షత్రియకులమూ, తొడలనుండి వైశ్యకులమూ, పాదాలనుండి శూద్రకులమూ పుట్టాయని వర్ణిస్తారు.
ఆ మహావిష్ణువుకు కటిస్టలం భూలోకం, నాఖి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలిమునివ్రేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. ఈ కారణంవల్ల ఆ దేవుణ్ణి లోకమయుడని భావిస్తారు.
మరి కొంతమంది ఆయన పాదతలంనుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి సువర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు.
శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం - ఇవి యేడు ఆ దేవుని ఏడు ధాతువులంటారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు- ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు.
వాటిలో రోమాలు ఉష్ణిక్ ఛందస్సనీ, చర్మం ధాత్రీ ఛందస్సనీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువులు అనుష్టుప్ ఛందస్సనీ, శల్యం జగతీ ఛందస్సనీ, మజ్జ 'పంక్తి' ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు.
దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతల కిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, మధురాదులైన ఆరురసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుని రసనేంద్రియమే జన్మస్థానం. అట్లే అన్ని ప్రాణాదులకూ, వాయువుకూ, విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే గంధాలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం.
దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకలనేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ, సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం.
స్పర్శానికీ, గాలికీ, నైగనిగ్యానికీ, ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ, మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్ళూ, లోహాలూ ఆ విశ్వాత్మునికి గోళ్ళు. మబ్బులు ఆయన శిరోజాలు. మెరుపులు సర్వేశుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మున్నగు లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్ల కోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు.
జలాలు, శుక్లం, పర్జన్యుడు, ప్రజాపతి సృష్టి - వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మున్నగు పురుషార్థాలకూ, మనస్సుకు సుఖం కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యమునికీ, మిత్రునికీ, మల విసర్జనానికీ ఆ దేవుని పాయ్వింద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతంలేని ఆ దేవుని పృష్ఠదేశం నివాసం. నదనదీసమూహాలకు ఆ ఈశ్వరుని నాడీసంఘం పుట్టిల్లు, కొండలకు ఆ దేవుని ఎముకలు జన్మస్టానాలు. ప్రకృతికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపారరూపమైన లింగదేహనికి గొప్ప మహిమగల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు,
నారదా! వినుము. శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారుడు మున్నగు కుమారులకూ, ధర్మానికీ, సత్త్వానికీ, బుద్ధితత్త్వానికీ, (విజ్ఞానానికీ) శ్రేష్ఠమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే.
కుమారా? నరులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్దులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరుపులూ, వివిధ వస్తువులూ, నీవూ, శివుడూ, మునులూ, నేనూ, నీళ్లలోనూ, ఆకసంలోనూ, నేలమీదా చరించే వివిధప్రాణులతో గూడిన ఈ విశ్వమంతా విష్ణమయమే. పెక్కు మాటలేల? ఈ బ్రహ్మాండాలన్నీ అతని ఒక్క జేనలో ఇమిడిపోతాయి. బుద్ధిబలంతో ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము. కడచన్నవీ, ఇప్పుడున్నవీ, రానున్నవీ - అగు లోకాలన్నీ శ్రీవిష్ణుదేవునిలోనే ఉన్నాయి.
సూర్యుడు తన మండలంలోనే తానుంటూ లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నాడు. అట్లే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.
అట్టి అనంతశక్తి సంపన్నుడైన విశ్వాత్ముని బొడ్డుతామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని ఆ యజ్ఞాని కవసరమైన పదార్ధాలేవీ నాకు కనిపించలేదు. అప్పుడు మిగుల స్వచ్చమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.
యజ్ఞపశువులూ, యజ్ఞవాటికా, యూపస్తంభమూ, పాత్రలూ, మట్టికుండలూ, మూకుళ్ళూ, యాగకాలమైన వసంత ఋతువూ, నేయి, వడ్లు మున్నగు ఓషధులూ, వివిధాలైన లోహాలూ, నల్గురుహోతలతో నిర్వర్తింపదగిన దర్శపూర్ణమాసాది వైదికకర్మలూ, జ్యోతిష్టోమాదినామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సామ వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, దక్షిణలూ, దేవతా ధ్యానం, దానికి తగిన తంత్రాలు, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణలూ, బోధాయనాదుల కల్పగ్రంథాలలోని కర్మవిధానం, మొదలైన యజ్ఞోపకరణాలూ - ఇవన్నీ పరమేశ్వరుని అంగాలుగా సంకల్పించాను. ఆ మీదట శాస్రోక్త విధి ననుసరించాను.
యజ్ఞమే శరీరమైనవాడూ, యజ్ఞానికి ఫలమిచ్చేవాడూ, యజ్ఞప్రభువూ, యజ్ఞనిర్వాహకుడూ అయిన పరమాత్మను యజ్ఞపురుషుణ్జిగా భావించుకొని ఆ దేవునికే యజ్ఞఫలం సమర్పించాలన్న తలంపుతో మానసయజ్ఞం చేశాను.
అప్పుడు మరీచి మున్నగు ప్రజాపతులు నేను చేసిన మానసయజ్ఞం చూచి, తాము గూడ ఉత్సుకతతో ఆ దేవునికి ప్రీతి కలిగేటట్లు యజ్ఞం నిర్వర్తించారు.
ఆ ఘటనను చూచి స్వాయంభువాది మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుజులూ - వీరంతా వాళ్ళ వాళ్ల కిష్టమైన దేవతలను సేవిస్తూ సాటిలేనివాడూ, యజ్ఞమూర్తీ అయిన లక్ష్మీరమణునికే ఫలం చెందేటట్లు మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.
స్పష్టమైన తంత్రరూపం కలవాడూ, ఇతరులకు వ్యక్తం కానివాడూ, అంతం లేనివాడూ, జన్మ లేనివాడూ, చ్యుతి లేనివాడూ, జగత్ప్రభువూ, అవ్యయుడూ అయిన శ్రీహరి దేవతలచే సేవింపదగినవాడూ, యజ్ఞఫలాలను ప్రసాదించేవాడూ కావడంవల్ల పై జెప్పినవారంతా ఆ దేవుణ్ణి ఉద్దేశించే యజ్ఞాలు చేశారు.
మంగళకరమైన చరిత్ర గల నారదా! పరమేశ్వరుడు నిర్గుణుడు. ఐనా జగన్నిర్మాణం చేయడానికి ఆయన మాయా ప్రభావం వల్ల నేర్పుతో గుణసహితుడవుతున్నాడు. అందువల్లనే ఆయన 'భగవంతుడు' అని చెప్పబడుతున్నాడు.
విశ్వానికి ఆత్మ అయినవాడూ, విశ్వప్రభువూ, విశ్వరూపుడూ, సమస్తానికీ నాయకుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుదేవుడు ఈ విశ్వం తనలో మిక్కిలిగా వెలుగొందుతుండగా తాను విశ్వంలో ప్రకాశిస్తూ ఉంటాడు.
ఆ దేవుని ఆనతి ననుసరించి నేను చరాచర ప్రాణులతో గూడిన ఈ సృష్టిని విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావ సంపన్నుడైన, విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీపతియైన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడూ, మొదటివేల్పూ, అచ్యుతుడూ అగు శ్రీహరి సృష్టి స్థితిలయ శక్తులకు మూలహేతువై ఉన్నాడు.
కుమారా! నీవు నన్నిప్పుడడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. ఈ సకల విశ్వానికీ ఆధారకారణమైనది ఒకే ఒక పరబ్రహ్మమే సుమా!
శ్రీహరి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి తేజమనే షడ్గుణాలు కలవాడు, అంతం లేనివాడు. అతడే ఈ సృష్టికి చెందిన కార్యకారణాలకు మూలమైనవాడు. ఆలోచించి చూడగా ఆ ప్రభునికంటె ఉత్కృష్టుడైనవాడు మరొకడు లేడు.
ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యం పలకను. పండిత స్తుతికర్హుడవైన ఓ నారదా! విను. ఔత్సుక్యంతో ఆ భగవంతుని గుణాలను ధ్యానించడంవల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఎప్పుడుగానీ పొరపాటున గూడా అసత్యం వైపు పోవు. అంతే కాదు. నా శరీరం వేదతుల్యమైనది. దేవేంద్రునికి సైతం ఇది నమస్కరింపదగినది. సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించేదీ, శుభాలకు కారణమైనదీ, సకల సంపదలనూ సమకూర్చేదీ అయిన ఆ దేవదేవుని పాదపద్మానికి నేను నమస్కరిస్తున్నాను.
నేను ఆ పద్మనేత్రుని కుమారుడనైనా, బ్రహ్మనైనా, యోగవిద్యలో నిపుణుడనైనా, నా పుట్టుక ఎలా జరిగిందో నాకే తెలియదు. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా గ్రహించగలను? ఆ లక్ష్మీనాథుడు నిర్మించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెమే నాకు గోచరిస్తున్నది.
మునివర్యా! నారదా! పలుమాటలేల? ఇది విను. విశ్వస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు తన మాయా మహిమను నిజంగా తుదముట్ట తానే గ్రహించలేకున్నాడు. అట్టి స్థితిలో నేనుగానీ, మీరుగానీ, ఇంద్రాది దేవతలుగానీ, కడకు శివుడైనా జ్ఞాన ప్రక్రియకు చెందిన, యుక్తులతోనూ, (జ్ఞానంతో, క్రియలతో, యుక్తులతో) నిజం తెలుసుకోగలమా? తెలియలేమని తాత్పర్యం.
ఆ మహాత్ముడైన పద్మాక్షుడు సర్వజ్ఞుడు గదా! తన మహిమ ఆయన కెందుకు తెలియదు? అని నీవు అనవచ్చు. అది వివరిస్తాను, విను.
ఆకాశం తన అంతాన్ని తాను తెలుసుకోలేదు. అట్లే ఆ దేవుడు తన సమగ్రతను తానే ఎరుగజాలకున్నాడు. ఆకాశపుష్పం లేదన్నంతమాత్రాన సర్వజ్ఞత్వానికి భంగం కలుగుతుందా? అట్లే తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.
ఆ మహామహుడు జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో చేసిన పనులు మాబోట్లం వేయివిధాల ప్రశంసిస్తూ ఉంటాం. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువులేనివాడూ, తానే అంతటికీ ప్రభువైనవాడూ, అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యచరిత్రుడైన ఆ దేవునకు నేను ప్రణమిల్లుతున్నాను.
పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలజ్ఞానవంతుడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, శాశ్వతమూర్తీ అయిన పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను.
అంతమాత్రమే కాదు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివి మున్నగు ఐదు భూతాలూ, పుట్టుకకు హేతువులైన కర్మలూ, కర్మ ప్రవృత్తికి కారణమైన కాలమూ, దాని మార్పునకు కారణమైన స్వభావమూ, కర్మఫలం అనుభవించే జీవుడూ అంతా వాసుదేవ స్వరూపులే అని గ్రహించు. ఆ వాసుదేవునికంటె అన్యమైనదేదీ లేదు. ఇది నిజం. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడే. వేల్పులందరూ ఆ దేవుని శరీరంనుండి పుట్టినవారే. వేదాలూ, యాగాలూ, తపస్సులూ, యోగాలూ, విజ్ఞానమూ అంతా నారాయణుని ఆరాధనారూపమైనవే. జ్ఞానసాధ్యమైన ఫలం కూడా నారాయణని అధీనంలోనే ఉన్నది. నిర్వికారుడూ, సర్వాంతర్యామీ, సర్వదర్శనుడు అయిన భగవానుని క్రీగంటి చూపువల్లనే నేను జన్మించాను. ఆయన కటాక్షంవల్లనే ప్రేరణ పొంది సృజింపదగిన విశ్వాన్ని సృష్టిస్తున్నాను. గుణరహితుడైన ఈశ్వరునుండి రజస్సత్త్వతమస్సులనే మూడుగుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికీ, స్థితికీ లయానికీ హేతువులవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణ భావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచభూతాలనూ, జ్ఞానరూపులైన బ్రవ్మాదిదేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదాముక్తుడే అయినా మాయతోకూడి ఉండడంవల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రమే గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.
కుమారా! ఆ పరమ్వేరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకూ, నాకూ, నీకూ, మాయకూ, ప్రాణివర్గానికీ ప్రభువు. ఆయనకంటె ఇతరమైనది ఈ జగత్తులో ఏదీ లేనే లేదు.
ఈశ్వరుడు మాయను నియమించేవాడు. ఆయనకు తనమాయవల్ల కాలమూ, జీవాదృష్టమూ, స్వభావం అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టికార్యానికి సహకారకాలుగా స్వీకరించాడు. ఈశ్వరుడధిష్ఠించిన మహత్తత్త్వం కారణంగా కాలంనుండి త్రిగుణాల భేదమూ, స్వభావంనుండి పరిణామమూ, జీవుని అదృష్టరూపమైన కర్మనుండి జన్మమూ సిద్ధించాయి.
రజోగుణంచేతా, సత్త్వగుణంచేతా వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుండే తమోగుణ ప్రధానమై పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదైన అహంకారం సంభవించింది. ఆ అహంకారం మరల వికృతిపొంది ద్రవ్యశక్తియైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియెన సాత్వికమనీ మూడురూపాలుగా పరిణమించింది.
పంచభూతాలకు మూలమైన తామసాహంకారంనుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశంనుండి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశంలోని శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు గాలికున్నాయి. ఆ గాలి శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియపటుత్వానికీ, మనోబలానికీ, శారీరకశక్తికీ హేతువవుతున్నది. వికారంపొందిన వాయువునుండే రూపం, స్పర్శం, శబ్దం-అనే మూడు గుణాలుగల్లిన తేజస్సు జనించింది. ఆ తేజస్సునుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణాలతో గూడిన జలం కలిగింది. జలంనుండి గంధరసరూపస్పర్శశబ్దాలనే అయిదు గుణాలు గల పృథివి పుట్టింది. పై జెప్పినవన్నీ తామసాహంకారం నుండి కల్టినవే.
వికారానికి లోనైన సాత్వికాహంకారంనుండి మనస్సు జనించింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులూ, వాయువూ, సూర్యుడూ, వరుణుడూ, అశ్వినీదేవతలూ, అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడూ, మిత్రుడూ, ప్రజాపతీ అనే పదిమంది దేవతలు ఉద్భవించారు.
తైజసమైన రాజసాహంకారం నుండి శ్రోత్రం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మున్నగు ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పదియింద్రియాల అధిదేవతల వివరమిది - శ్రోత్రేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయువూ, నేత్రేంద్రియానికి సూర్యుడూ, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీ దేవతలూ, వాగింద్రియానికి అగ్నీ హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ది జ్డానం కల్గించే అంతఃకరణంలో ఒక భాగం. ప్రాణం క్రియాహేతువైన అంతఃకరణం.
శ్రోత్రాదులగు దశేంద్రియాలతో గూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్బస్పర్భాదులైన గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒకచోట చేర్చితేగానీ సాధ్యం కాదు గదా! అదే రీతిగా పైన పేర్కొన్న భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు, భగవంతుని శక్తివల్ల ఒకటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ, కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మించబడిన అండం కోటి సంవత్సరాల వరకూ నీళ్ళలోనే ఉండిపోయింది.
అందుమీదట కాలకర్మస్వభావాలకు లోబడనివాడూ, అన్నింటినీ ప్రాణవంతంగా చేయగలవాడూ అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైనదాన్ని ప్రాణసహితంచేశాడు. కాలకర్మస్వభావాలకు ప్రేరకుడైన ఆ దేవుడు మహావరణ జలమధ్యంలో ఉండిన బ్రహ్మాండంలో జీవరూపంతో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతమయ్యేటట్లు చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో వివరిస్తాను విను.
జగత్స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ఒక భవనాన్ని పోలివున్న ఈ బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన చతుర్దశ భువనాలుగా తీర్చిదిద్దాడు.
మేధావీ! ఆ భగవంతుడు పలుపాదాలూ, తొడలూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నొసళ్ళూ, చెవులూ కలిగివుంటాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని నానారూపాలైన అవయవాలలోనే సర్వ ప్రపంచపుటునికినీ ఊహిస్తూ ఉంటారు. మహనీయుడూ, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడూ అయిన ఆ భగవంతుడు యోగుల హృదయాలచే పూజింపదగి ఉన్నాడు.
ఈ పద్నాలుగు లోకాలలో పై ఏడులోకాలు మహావిష్ణువుయొక్క నడుమునుండి పై శరీరమంటారు. అట్లే క్రింది ఏడులోకాలూ నడుమునుండి క్రింది శరీరమంటారు. ఈ ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులమూ, బాహువులనుండి క్షత్రియకులమూ, తొడలనుండి వైశ్యకులమూ, పాదాలనుండి శూద్రకులమూ పుట్టాయని వర్ణిస్తారు.
ఆ మహావిష్ణువుకు కటిస్టలం భూలోకం, నాఖి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలిమునివ్రేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. ఈ కారణంవల్ల ఆ దేవుణ్ణి లోకమయుడని భావిస్తారు.
మరి కొంతమంది ఆయన పాదతలంనుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి సువర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు.
శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం - ఇవి యేడు ఆ దేవుని ఏడు ధాతువులంటారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు- ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు.
వాటిలో రోమాలు ఉష్ణిక్ ఛందస్సనీ, చర్మం ధాత్రీ ఛందస్సనీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువులు అనుష్టుప్ ఛందస్సనీ, శల్యం జగతీ ఛందస్సనీ, మజ్జ 'పంక్తి' ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు.
దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతల కిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, మధురాదులైన ఆరురసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుని రసనేంద్రియమే జన్మస్థానం. అట్లే అన్ని ప్రాణాదులకూ, వాయువుకూ, విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే గంధాలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం.
దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకలనేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ, సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం.
స్పర్శానికీ, గాలికీ, నైగనిగ్యానికీ, ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ, మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్ళూ, లోహాలూ ఆ విశ్వాత్మునికి గోళ్ళు. మబ్బులు ఆయన శిరోజాలు. మెరుపులు సర్వేశుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మున్నగు లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్ల కోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు.
జలాలు, శుక్లం, పర్జన్యుడు, ప్రజాపతి సృష్టి - వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మున్నగు పురుషార్థాలకూ, మనస్సుకు సుఖం కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యమునికీ, మిత్రునికీ, మల విసర్జనానికీ ఆ దేవుని పాయ్వింద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతంలేని ఆ దేవుని పృష్ఠదేశం నివాసం. నదనదీసమూహాలకు ఆ ఈశ్వరుని నాడీసంఘం పుట్టిల్లు, కొండలకు ఆ దేవుని ఎముకలు జన్మస్టానాలు. ప్రకృతికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపారరూపమైన లింగదేహనికి గొప్ప మహిమగల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు,
నారదా! వినుము. శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారుడు మున్నగు కుమారులకూ, ధర్మానికీ, సత్త్వానికీ, బుద్ధితత్త్వానికీ, (విజ్ఞానానికీ) శ్రేష్ఠమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే.
కుమారా? నరులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్దులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరుపులూ, వివిధ వస్తువులూ, నీవూ, శివుడూ, మునులూ, నేనూ, నీళ్లలోనూ, ఆకసంలోనూ, నేలమీదా చరించే వివిధప్రాణులతో గూడిన ఈ విశ్వమంతా విష్ణమయమే. పెక్కు మాటలేల? ఈ బ్రహ్మాండాలన్నీ అతని ఒక్క జేనలో ఇమిడిపోతాయి. బుద్ధిబలంతో ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము. కడచన్నవీ, ఇప్పుడున్నవీ, రానున్నవీ - అగు లోకాలన్నీ శ్రీవిష్ణుదేవునిలోనే ఉన్నాయి.
సూర్యుడు తన మండలంలోనే తానుంటూ లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నాడు. అట్లే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.
అట్టి అనంతశక్తి సంపన్నుడైన విశ్వాత్ముని బొడ్డుతామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని ఆ యజ్ఞాని కవసరమైన పదార్ధాలేవీ నాకు కనిపించలేదు. అప్పుడు మిగుల స్వచ్చమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.
యజ్ఞపశువులూ, యజ్ఞవాటికా, యూపస్తంభమూ, పాత్రలూ, మట్టికుండలూ, మూకుళ్ళూ, యాగకాలమైన వసంత ఋతువూ, నేయి, వడ్లు మున్నగు ఓషధులూ, వివిధాలైన లోహాలూ, నల్గురుహోతలతో నిర్వర్తింపదగిన దర్శపూర్ణమాసాది వైదికకర్మలూ, జ్యోతిష్టోమాదినామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సామ వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, దక్షిణలూ, దేవతా ధ్యానం, దానికి తగిన తంత్రాలు, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణలూ, బోధాయనాదుల కల్పగ్రంథాలలోని కర్మవిధానం, మొదలైన యజ్ఞోపకరణాలూ - ఇవన్నీ పరమేశ్వరుని అంగాలుగా సంకల్పించాను. ఆ మీదట శాస్రోక్త విధి ననుసరించాను.
యజ్ఞమే శరీరమైనవాడూ, యజ్ఞానికి ఫలమిచ్చేవాడూ, యజ్ఞప్రభువూ, యజ్ఞనిర్వాహకుడూ అయిన పరమాత్మను యజ్ఞపురుషుణ్జిగా భావించుకొని ఆ దేవునికే యజ్ఞఫలం సమర్పించాలన్న తలంపుతో మానసయజ్ఞం చేశాను.
అప్పుడు మరీచి మున్నగు ప్రజాపతులు నేను చేసిన మానసయజ్ఞం చూచి, తాము గూడ ఉత్సుకతతో ఆ దేవునికి ప్రీతి కలిగేటట్లు యజ్ఞం నిర్వర్తించారు.
ఆ ఘటనను చూచి స్వాయంభువాది మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుజులూ - వీరంతా వాళ్ళ వాళ్ల కిష్టమైన దేవతలను సేవిస్తూ సాటిలేనివాడూ, యజ్ఞమూర్తీ అయిన లక్ష్మీరమణునికే ఫలం చెందేటట్లు మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.
స్పష్టమైన తంత్రరూపం కలవాడూ, ఇతరులకు వ్యక్తం కానివాడూ, అంతం లేనివాడూ, జన్మ లేనివాడూ, చ్యుతి లేనివాడూ, జగత్ప్రభువూ, అవ్యయుడూ అయిన శ్రీహరి దేవతలచే సేవింపదగినవాడూ, యజ్ఞఫలాలను ప్రసాదించేవాడూ కావడంవల్ల పై జెప్పినవారంతా ఆ దేవుణ్ణి ఉద్దేశించే యజ్ఞాలు చేశారు.
మంగళకరమైన చరిత్ర గల నారదా! పరమేశ్వరుడు నిర్గుణుడు. ఐనా జగన్నిర్మాణం చేయడానికి ఆయన మాయా ప్రభావం వల్ల నేర్పుతో గుణసహితుడవుతున్నాడు. అందువల్లనే ఆయన 'భగవంతుడు' అని చెప్పబడుతున్నాడు.
విశ్వానికి ఆత్మ అయినవాడూ, విశ్వప్రభువూ, విశ్వరూపుడూ, సమస్తానికీ నాయకుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుదేవుడు ఈ విశ్వం తనలో మిక్కిలిగా వెలుగొందుతుండగా తాను విశ్వంలో ప్రకాశిస్తూ ఉంటాడు.
ఆ దేవుని ఆనతి ననుసరించి నేను చరాచర ప్రాణులతో గూడిన ఈ సృష్టిని విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావ సంపన్నుడైన, విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీపతియైన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడూ, మొదటివేల్పూ, అచ్యుతుడూ అగు శ్రీహరి సృష్టి స్థితిలయ శక్తులకు మూలహేతువై ఉన్నాడు.
కుమారా! నీవు నన్నిప్పుడడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. ఈ సకల విశ్వానికీ ఆధారకారణమైనది ఒకే ఒక పరబ్రహ్మమే సుమా!
శ్రీహరి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి తేజమనే షడ్గుణాలు కలవాడు, అంతం లేనివాడు. అతడే ఈ సృష్టికి చెందిన కార్యకారణాలకు మూలమైనవాడు. ఆలోచించి చూడగా ఆ ప్రభునికంటె ఉత్కృష్టుడైనవాడు మరొకడు లేడు.
ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యం పలకను. పండిత స్తుతికర్హుడవైన ఓ నారదా! విను. ఔత్సుక్యంతో ఆ భగవంతుని గుణాలను ధ్యానించడంవల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఎప్పుడుగానీ పొరపాటున గూడా అసత్యం వైపు పోవు. అంతే కాదు. నా శరీరం వేదతుల్యమైనది. దేవేంద్రునికి సైతం ఇది నమస్కరింపదగినది. సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించేదీ, శుభాలకు కారణమైనదీ, సకల సంపదలనూ సమకూర్చేదీ అయిన ఆ దేవదేవుని పాదపద్మానికి నేను నమస్కరిస్తున్నాను.
నేను ఆ పద్మనేత్రుని కుమారుడనైనా, బ్రహ్మనైనా, యోగవిద్యలో నిపుణుడనైనా, నా పుట్టుక ఎలా జరిగిందో నాకే తెలియదు. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా గ్రహించగలను? ఆ లక్ష్మీనాథుడు నిర్మించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెమే నాకు గోచరిస్తున్నది.
మునివర్యా! నారదా! పలుమాటలేల? ఇది విను. విశ్వస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు తన మాయా మహిమను నిజంగా తుదముట్ట తానే గ్రహించలేకున్నాడు. అట్టి స్థితిలో నేనుగానీ, మీరుగానీ, ఇంద్రాది దేవతలుగానీ, కడకు శివుడైనా జ్ఞాన ప్రక్రియకు చెందిన, యుక్తులతోనూ, (జ్ఞానంతో, క్రియలతో, యుక్తులతో) నిజం తెలుసుకోగలమా? తెలియలేమని తాత్పర్యం.
ఆ మహాత్ముడైన పద్మాక్షుడు సర్వజ్ఞుడు గదా! తన మహిమ ఆయన కెందుకు తెలియదు? అని నీవు అనవచ్చు. అది వివరిస్తాను, విను.
ఆకాశం తన అంతాన్ని తాను తెలుసుకోలేదు. అట్లే ఆ దేవుడు తన సమగ్రతను తానే ఎరుగజాలకున్నాడు. ఆకాశపుష్పం లేదన్నంతమాత్రాన సర్వజ్ఞత్వానికి భంగం కలుగుతుందా? అట్లే తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.
ఆ మహామహుడు జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో చేసిన పనులు మాబోట్లం వేయివిధాల ప్రశంసిస్తూ ఉంటాం. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువులేనివాడూ, తానే అంతటికీ ప్రభువైనవాడూ, అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యచరిత్రుడైన ఆ దేవునకు నేను ప్రణమిల్లుతున్నాను.
పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలజ్ఞానవంతుడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, శాశ్వతమూర్తీ అయిన పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను.
నారదమునీ! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని మహిత కళామయమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు వాళ్ళు కుత్సితమగు తర్కవితర్కాలనే తమస్సుకు లోబడి అజ్ఞానోపహతులవుతారో అప్పుడు ఆ దేవుని దివ్యస్వరూపాన్ని దర్శించలేరు.
అని చెప్పి మళ్ళీ బ్రహ్మ నారదునితో ఇలా అన్నాడు "పాపరహితుడా! వేయితలలు, వేయినేత్రాలు, వేయిపాదాలూ కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. అట్టి అవతారస్వరూపంనుండి కాలం, స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి. అందుండి కార్యకారణరూపమైన ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతినుండి మహత్తత్త్వం జనించింది. దానినుండి రాజసాహంకారం, సాత్త్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారాలు ఉద్భవించాయి. వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు కలిగాయి. సాత్త్వికాహంకారంనుండి ఇంద్రియగుణాలు ప్రధానంగాకల ఇంద్రాది దేవతలు జనించారు. తామసాహంకారంనుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే కర్మేంద్రియాలూ, మనస్సూ జనించాయి.
వీటన్నింటి చేరికవల్ల విశ్వస్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతనినుండి స్వయంప్రకాశుడైన స్వరాట్పురుషుడు ఆవిర్భవించాడు. అతనినుండి చరాచరరూపాలతో స్థావరజంగమాత్మకమైన జగత్తు జనించింది. అందుండి సత్త్వగుణస్వరూపుడైన విష్ణుడూ, రజోగుణస్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేనూ, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండే సృష్టియొక్క ఉత్పత్తికి హేతువైన నాల్గుముఖాల బ్రహ్మ పుట్టాడు. ఆయనవల్ల దక్షుడు మున్నగు తొమ్మిదిమంది ప్రజాపతులు జనించారు. వారినుండి నీవూ, సనకాదులను యోగీశ్వరులూ, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోకరక్షకులైన గరుడాదులు, మానవలోకం పాలించే మనువు, మాంధాత మున్నగువారూ, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మున్నగువారూ, ఇంకా గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు నివసించే లోకాలను పాలించేవారూ, ఋషులు, పితరులు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరియు పశువులు, మృగాదులు సంభవించాయి.
ఇట్టి జగత్తుయొక్క మొట్టమొదటి పుట్టుకను మహత్తత్త్వసృష్టి అంటారు. రెండవది అండగతసృష్టి మూడవది సకలభూతగతమైన సృష్టి అందులో ఐశ్వర్యం, తేజస్సు, బలంగల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశయందు పుట్టినవారని గ్రహించు. ఆ పద్మాక్షుని లీలావతారాలకు అంతమే లేదు. ఆ అవతారాలలో ఆయన చేసే సత్కర్మలు లెక్కించడం ఎవరికీ శక్యం కాదు, అయినా నాకు తోచినంతవరకూ నీకు వినిపిస్తాను, విను.
అని చెప్పి మళ్ళీ బ్రహ్మ నారదునితో ఇలా అన్నాడు "పాపరహితుడా! వేయితలలు, వేయినేత్రాలు, వేయిపాదాలూ కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. అట్టి అవతారస్వరూపంనుండి కాలం, స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి. అందుండి కార్యకారణరూపమైన ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతినుండి మహత్తత్త్వం జనించింది. దానినుండి రాజసాహంకారం, సాత్త్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారాలు ఉద్భవించాయి. వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు కలిగాయి. సాత్త్వికాహంకారంనుండి ఇంద్రియగుణాలు ప్రధానంగాకల ఇంద్రాది దేవతలు జనించారు. తామసాహంకారంనుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే కర్మేంద్రియాలూ, మనస్సూ జనించాయి.
వీటన్నింటి చేరికవల్ల విశ్వస్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతనినుండి స్వయంప్రకాశుడైన స్వరాట్పురుషుడు ఆవిర్భవించాడు. అతనినుండి చరాచరరూపాలతో స్థావరజంగమాత్మకమైన జగత్తు జనించింది. అందుండి సత్త్వగుణస్వరూపుడైన విష్ణుడూ, రజోగుణస్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేనూ, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండే సృష్టియొక్క ఉత్పత్తికి హేతువైన నాల్గుముఖాల బ్రహ్మ పుట్టాడు. ఆయనవల్ల దక్షుడు మున్నగు తొమ్మిదిమంది ప్రజాపతులు జనించారు. వారినుండి నీవూ, సనకాదులను యోగీశ్వరులూ, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోకరక్షకులైన గరుడాదులు, మానవలోకం పాలించే మనువు, మాంధాత మున్నగువారూ, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మున్నగువారూ, ఇంకా గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు నివసించే లోకాలను పాలించేవారూ, ఋషులు, పితరులు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరియు పశువులు, మృగాదులు సంభవించాయి.
ఇట్టి జగత్తుయొక్క మొట్టమొదటి పుట్టుకను మహత్తత్త్వసృష్టి అంటారు. రెండవది అండగతసృష్టి మూడవది సకలభూతగతమైన సృష్టి అందులో ఐశ్వర్యం, తేజస్సు, బలంగల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశయందు పుట్టినవారని గ్రహించు. ఆ పద్మాక్షుని లీలావతారాలకు అంతమే లేదు. ఆ అవతారాలలో ఆయన చేసే సత్కర్మలు లెక్కించడం ఎవరికీ శక్యం కాదు, అయినా నాకు తోచినంతవరకూ నీకు వినిపిస్తాను, విను.