రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం
హనూమతో వేద న రాక్షసోన్తరం
న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్ ।
పరస్పరం నిర్విషహౌ బభూవతుః
సమేత్య తౌ దేవ సమాన నిశ్రమౌ ॥
అక్షకుమరుని మరణవార్త విన్న అనంతరం దేవేంద్ర సమ పరాక్రముడయిన ఇంద్రజిత్తును చూస్తూ రావణుడు:
నాయనా! నువ్వు శస్త్రవేత్తలలో, అస్త్ర విద్యావిదులలో శ్రేష్ఠుడవు. నీ వీరత్వాన్ని దేవతలూ, దేవనాయకులూ చవిచూశారు. చతుర్ముఖ ప్రజాపతిని ఆరాధించి బ్రహ్మాస్త్రం సాధించావు.
రణరంగంలో దేవ దానవకోటులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. భుజబలం, తపోబలం కల నీ ధీశక్తి దేశకాలాలను పరిశీలించి సాగుతుంది.
నీ ఆలోచనకు ముల్లోకాలూ తలవంచాలి.
తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడవు. నువ్వు రణభూమికి వెడితే నేను నిశ్చింతగా వుంటాను.
ఆ వానరుని చేతులలో కింకరగణం నేల కూలింది. మన జంబుమాలి పడిపోయాడు. చతురంగబలాలతో సేనాపతులు తిరిగి రాలేదు. అంతకు ముందే మన సచివతనయులు కన్నుమూశారు.
ఇంతకుముందే నీ సోదరుడు అక్షకుమారుడు అంతిమ శ్వాసవిడిచాడు. వీరందరూ నీ అంత బలపరాక్రమ సంపన్నులుకారు. నువ్వు బాగా యోచించి ఆ వానరుని పరాక్రమం పరిశీలించి కార్యరంగంలో ప్రవేశించాలి. నిన్ను చూస్తుండగానే ఆ వానరుడు నిర్విణ్ణుడు కావాలి. వాడికి సేనాబలం లేదు, వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాడు. వాయుసుతుడు మాత్రమే. ఇవన్నీ తెలిశాక ఏం చెయ్యాలో నువ్వెరుగుదువు.
నిజానికి నిన్ను పంపడం ఉచితంకాదు, కాని రాజధర్మానుసారం ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధభూమిలో ఆయుధబలం మాత్రమేచాలదు, అవసరానుకూలమయిన వివేచన కావాలి, అది విజయసాధనకు సహకరించాలి, అన్నాడు.
విన్నాడు ఇంద్రజిత్తు.
తండ్రికి ప్రదక్షిణం చేశాడు.
పొంగుతూన్న సముద్రంలా బయలుదేరాడు.
రథాన్ని అధిరోహించాడు.
ఆ సమయంలో మృగరోదనాలు బయలుదేరాయి.
వస్తున్న రథధ్వని, ధనుష్టంకారం విన్న హనుమంతునికి సంతోషం కలిగింది.
ఆ యుద్ధం చూడడానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. వారుభయులూ సురాసుర ప్రభు తేజంతో వెలుగుతున్నారు. ఇంద్రజిత్తు వాడి మొనలుగల బంగారు రెక్కల బాణాలు వదులుతున్నాడు. హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు.
లక్ష్యశుద్ధిగల ఇంద్రజిత్తు విడిచే నిశితశరాలను అనాయాసంగా దూరం చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది.
హనుమంతుని శక్తి ఎంతటిదో అంతుచిక్కలేదు, ఇంద్రజిత్తుకు.
రాక్షసపుత్రుని సామర్థ్యం ఈయనకూ అందలేదు.
ఒకరికొకరు దుస్సహంగా వున్నారు.
ఏనాడూ గురి తప్పని తన విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి ఆలోచించి, వీడు శస్త్రాస్త్రాలతో కడతేరడు అని నిశ్చయించి బ్రహ్మాస్త్రం సంధించి విడిచాడు.
హనుమంతుడు చైతన్య హీనుడై నేలమీదపడి క్షణంలో తెలివిరాగా;
ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితామహుని వరప్రభావంవల్ల ఏ అస్త్రమూ నన్ను వధించదు: ఈ అస్త్రబంధాన్ని విడిపించుకునే శక్తీలేదు. ఇంద్ర, వాయు, బ్రహ్మలు రక్షిస్తున్నారు, కనక భీతిలేదు, అనుకున్నాడు.
నేను రావణుని దగ్గరకుపోయి మాట్లాడే అవకాశం ఈ విధంగా కలిగింది. అని కదలకుండా వున్న ఆ వానరవీరుని చేరిన రాక్షసులు నారచీరలతో, చెట్లనారలతో గట్టిగా బంధించారు. అయినా కదలలేదు.
చూశాడు రావణి.
ఎంత మూర్ఖంగా చరించారు మా వీరులు.
ఒక అస్త్రం బంధించి వున్నప్పుడు మరో బంధనంచేస్తే ఆ అస్త్రబంధం విడిపోతుందని ఎరుగని వారయారు వీరు, అనుకుంటూ నడుస్తున్నాడు.
రాక్షసులు హనుమంతుని లాక్కుని వెడుతున్నారు.
బ్రహ్మాస్త్ర బంధం వదిలినట్టు తెలియ లేదాయనకు. ఉభయులూ లంకేశ్వరుని కొలువులో ప్రవేశించారు. బంధిత మత్తేభంలా ఉన్నాడు హనుమ.
అసలు వీడెవడు?
ఇక్కడ ఏం పని వీడికి?
ఎవరి బలం చూసుకుని వచ్చా డిక్కడికి?
అని రాక్షస ప్రముఖులు ఒకరితో ఒకరు గుసగుస లాడుకుంటున్నారు. నరకండి, నిప్పులో మండించండి, హాయిగా విరుచుకు తినేయండి, అంటున్నారు మరికొందరు.
రత్న సింహాసనం మీది రావణుడు హనుమంతుని చూశాడు. తేజః పరాక్రమాలతో సూర్యకాంతితో ఉన్న రావణుని హనుమంతుడు తిలకించాడు.
రావణుని కన్నులు ఎర్రబడ్డాయి.
హనుమంతుని నేత్రాలలో చింతనిప్పులు పుడుతున్నాయి.
స్వర్ణ నిర్మితమూ ముక్తా జాలావృతమూ అయిన కిరీట శోభిత శీర్షంతో వజ్ర, మాణిక్య భూషణాలతో చీని చీనాంబరాలంకృతుడై, రక్త చందన లేపంతో అరుణారుణనయనుడై వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభదేహంతో తారహారాలంకృత వక్షంతో, బలాక పక్షులతో నిండిన మేఘంలా ఉన్నాడు. ఆ బాహువులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి.
రత్న, స్ఫటిక ఖచితమయిన ఆస్తరణం పరచిన సింహాసనం మీద వున్న చక్రవర్తికి ఇరుపార్శ్వాల వింజామరలతో అందగత్తెలున్నారు.
మంత్రాంగ కుశలులయిన మహాపార్శ్వ, దుర్ధర, ప్రహస్త నికుంభులు ఆయన కిరువంకలా ఆసీనులయారు. మిగిలిన సచివమండలి అటూ యిటూ వున్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృతుడైన ఇంద్రుని వలె ఉన్నాడు.
స్వర్ణ సింహాసనం మీది రావణుడు మేరుగిరిపై నీలమేఘంలా వున్నాడు.
ఆ రాక్షసేశ్వరుని తిలకించే హనుమంతునికి ఆశ్చర్యం కలిగి:
అహో రూప మహో ధైర్యం
అహో సత్వ మహో ధృతిః।
అహో రాక్షస రాజస్య
సర్వలక్షణ యుక్తతా॥
య ద్యధర్మో న బలవాన్
స్యాదయం రాక్షసేశ్వరః।
స్యాదయం సురలోకస్య
స శక్రస్యాఫై రక్షితా ॥
ఈ రాక్షసేశ్వరుని సొందర్యం, ధైర్యం, శక్తి, బలం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్వలక్షణ లక్షితుడైన ఈ ప్రభువు అధర్మానికి ఒడిగట్టకపోతే దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకు పాదాక్రాంతుడు కావాలి.
ఈయన చేసే క్రూర, ఘాతుకాలు కారణంగా దేవ దానవ గణాలు వీనికి భయపడుతున్నాయి.
ఈ రావణుడు తలచుకుంటే లోకాన్ని జలప్రళయంలో ముంచెత్తగలడు, అని ఊహిస్తున్నాడు, హనుమంతుడు.
Telugu Library
Friday, August 14, 2026
Ravana Nandhanudu - రావణ నందనుడు
రామాయణం సుందరకాండ 47వ సర్గ - రావణ నందనుడు
హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న రావణుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా ఉన్న అక్ష కుమారునివైపు తిరిగాడు.
ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించి ధనుస్సు చేబూనిలేచాడు. మంత్రహుతమయిన ఆజ్యాహుతులతో ప్రజ్వలితమయిన అగ్నివలె వెలుగుతూ రధారూఢుడై బయలుదేరాడు. తపశ్శక్తితో సంపాదించిన ఆ స్యందనం బంగారు జాలరులతో రత్నఖచిత పతాకాలతో, మనోవేగంతో ఆకాశమార్గాన పోగలగిన, దానికి ఎనిమిది గుర్రాలు పూన్ని వుంచారు.
రథం బయలుదేరింది.
దాని వెంట చతురంగబలాలూ అనుసరించాయి. అంతవరకూ జరిగిన తమ సేనాసంహారంతో ఉద్రిక్తుడయిన అక్షకుమారుడు సింహ నేత్రాలతో వున్నాడు.
ఆ సమయంలో అటు హనుమంతునీ యిటు అక్షకుమూరునీ తిలకించే సర్వప్రాణికోటీ గజగజలాడింది.
సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది.
ఆకాశం దద్దరిల్లింది.
సముద్రం కల్లోలమయింది.
ధనుర్విద్యా విదుడయిన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన మూడు బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలవలె అవి హనుమంతుని శిరస్సున నాటుకున్నాయి,
ఆ బాణకిరణాలతో ఉదయసూర్యు డయాడు హనుమంతుడు.
అక్షకుమారుని వీర పరాక్రమాలకు సంతోషించి, మారుతి కన్నులేర్రజేశాడు. ఆ వేడికి రాక్షససేన భస్మమయేలా ఉంది.
వానరపర్వతంమీద బాణవర్షం కురిపించాడు, రావణనందనుడు.
హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న రావణుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా ఉన్న అక్ష కుమారునివైపు తిరిగాడు.
ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించి ధనుస్సు చేబూనిలేచాడు. మంత్రహుతమయిన ఆజ్యాహుతులతో ప్రజ్వలితమయిన అగ్నివలె వెలుగుతూ రధారూఢుడై బయలుదేరాడు. తపశ్శక్తితో సంపాదించిన ఆ స్యందనం బంగారు జాలరులతో రత్నఖచిత పతాకాలతో, మనోవేగంతో ఆకాశమార్గాన పోగలగిన, దానికి ఎనిమిది గుర్రాలు పూన్ని వుంచారు.
రథం బయలుదేరింది.
దాని వెంట చతురంగబలాలూ అనుసరించాయి. అంతవరకూ జరిగిన తమ సేనాసంహారంతో ఉద్రిక్తుడయిన అక్షకుమారుడు సింహ నేత్రాలతో వున్నాడు.
ఆ సమయంలో అటు హనుమంతునీ యిటు అక్షకుమూరునీ తిలకించే సర్వప్రాణికోటీ గజగజలాడింది.
సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది.
ఆకాశం దద్దరిల్లింది.
సముద్రం కల్లోలమయింది.
ధనుర్విద్యా విదుడయిన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన మూడు బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలవలె అవి హనుమంతుని శిరస్సున నాటుకున్నాయి,
ఆ బాణకిరణాలతో ఉదయసూర్యు డయాడు హనుమంతుడు.
అక్షకుమారుని వీర పరాక్రమాలకు సంతోషించి, మారుతి కన్నులేర్రజేశాడు. ఆ వేడికి రాక్షససేన భస్మమయేలా ఉంది.
వానరపర్వతంమీద బాణవర్షం కురిపించాడు, రావణనందనుడు.
సింహగర్జన చేశాడు హనుమంతుడు.
ఒక్కసారి కాళ్ళూ చేతులూ ముడిచి దూకాడు.
దూకుతున్న వానిమీదికి శరపరంపర నడిపాడు. ఆ బాణాలమధ్య నుండి గాలివలె తప్పించుకుంటూన్న సమయంలో భుజసంధులలో తగిలిన బాణఘాత తీవ్రతకు గట్టిగా అరచి:
వీడు వయసులో బాలుడైపోయాడు. వీణ్ణి చంపడానికి నాకు మనసు రావడంలేదు. అయితే వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు, వీణ్ణి ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు, అని ఆలోచించి ఒక్కదూకులో గుర్రాలను తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమయింది. అంతతో ఆ యువకుడు గగనవీధికి లేచాడు.
మహాసర్పాన్ని గరుత్మంతుడు కాలిగోళ్ళతో పట్టి ముక్కుతో చీల్చినట్లు అక్షకుమూరుని కాళ్ళు రెండూ బిగబట్టి గిర్రున త్రిప్పి వదిలాడు హనుమంతుడు.
వాని అవయవాలు పట్టు తప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటీ ఆశ్చర్యచకితం అయింది.
మానవ మారణహోమంతో ఆనందించే యమునివలె హనుమంతుడు సంతోషంగా ద్వారతోరణంచేరి కూర్చున్నాడు.
బ్రహ్మాస్త్రం
ఒక్కసారి కాళ్ళూ చేతులూ ముడిచి దూకాడు.
దూకుతున్న వానిమీదికి శరపరంపర నడిపాడు. ఆ బాణాలమధ్య నుండి గాలివలె తప్పించుకుంటూన్న సమయంలో భుజసంధులలో తగిలిన బాణఘాత తీవ్రతకు గట్టిగా అరచి:
వీడు వయసులో బాలుడైపోయాడు. వీణ్ణి చంపడానికి నాకు మనసు రావడంలేదు. అయితే వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు, వీణ్ణి ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు, అని ఆలోచించి ఒక్కదూకులో గుర్రాలను తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమయింది. అంతతో ఆ యువకుడు గగనవీధికి లేచాడు.
మహాసర్పాన్ని గరుత్మంతుడు కాలిగోళ్ళతో పట్టి ముక్కుతో చీల్చినట్లు అక్షకుమూరుని కాళ్ళు రెండూ బిగబట్టి గిర్రున త్రిప్పి వదిలాడు హనుమంతుడు.
వాని అవయవాలు పట్టు తప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటీ ఆశ్చర్యచకితం అయింది.
మానవ మారణహోమంతో ఆనందించే యమునివలె హనుమంతుడు సంతోషంగా ద్వారతోరణంచేరి కూర్చున్నాడు.
బ్రహ్మాస్త్రం
Senapathulu - సేనాపతులు
రామాయణం సుందరకాండ 46వ సర్గ - సేనాపతులు
క్షణాల కాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్టు విన్న రావణుడు తన సేనాపతులయిన విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘన, భాస కర్ణులను పంపుతూ:
"మీరు సేనాసమేతం వెళ్ళి ఉచితరీతిని ఆ వానరాన్ని శిక్షించండి. ఇంతవరకూ జరిగిన విషయాలు చూస్తుంటే అది సామాన్య వానరం అనిపించడం లేదు. బలిష్ఠమయిన భూతంలా తోస్తున్నది.
ఇంద్రుడు మనమీద ద్వేషంతో తీవ్ర తపస్సుచేసి ఈ బూతాన్ని సృష్టించాడనిపిస్తున్నది. యక్ష, నాగ, గంధర్వ, దానవ, అసురులను మనం పరాభూతులను చేసి వున్నాం. వారు ప్రతీకారంగా ఈ పనిచేసి వుంటారు. అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి,
దృష్టాహి హరయః పూర్వం
క్షణాల కాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్టు విన్న రావణుడు తన సేనాపతులయిన విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘన, భాస కర్ణులను పంపుతూ:
"మీరు సేనాసమేతం వెళ్ళి ఉచితరీతిని ఆ వానరాన్ని శిక్షించండి. ఇంతవరకూ జరిగిన విషయాలు చూస్తుంటే అది సామాన్య వానరం అనిపించడం లేదు. బలిష్ఠమయిన భూతంలా తోస్తున్నది.
ఇంద్రుడు మనమీద ద్వేషంతో తీవ్ర తపస్సుచేసి ఈ బూతాన్ని సృష్టించాడనిపిస్తున్నది. యక్ష, నాగ, గంధర్వ, దానవ, అసురులను మనం పరాభూతులను చేసి వున్నాం. వారు ప్రతీకారంగా ఈ పనిచేసి వుంటారు. అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి,
దృష్టాహి హరయః పూర్వం
మయా విపుల విక్రమాః।
వాలీ చ సహ సుగ్రీవో
జాంబవాంశ్చ మహాబలః ॥
నీలః సేనాపతి శ్చైవ
యే చాన్యే ద్వివి దాదయః।
నైవం తేషాం గతి ర్భీమాః
న తేజో న పరాక్రమః ॥
న మతి ర్నబలోత్సాహౌ
న రూప పరికల్పనమ్।
మహ త్సత్య మిధం జ్ఞేయం
కపిరూపం వ్యవస్థితమ్ ॥
మహాబలపరాక్రమవంతులయిన వానరవీరులు వాలి సుగ్రీవ జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వివిదుడు వీరందరినీ చూశాను, వారిలో ఎవరూ ఇంత పరాక్రమ, తేజస్సంపన్నులు కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహా భూత మేదో అయి వుండాలి.
ముల్లోకాలలో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు ఏ భూతమూ ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయ నిశ్చయం ముందుగా చెయ్యలేం కనక అప్రమత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగువెయ్యాలి, అన్నాడు.
ఆ మాటలు విని వారు తీవ్రవేగంతో గజాశ్వ రథ బిల సమేతం అయుధధారులై వచ్చి తోరణం మీద ఉదయసూర్య కాంతితో వెలిగే హనుమంతుని చూశారు.
చూస్తూనే, దుర్ధరుడు వాడిగల ఉక్కుబాణాలు అయిదు వదిలాడు. అవి కలువలవలె వున్నాయి. మారుతి ఆ బాణ ఘాతాలతో ఒక్క గర్జన చేసి ఆకాశవీధికి లేచాడు.
దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు.
వార్షుకాబ్రాన్ని వాయువు నిరోధించినట్టు దుర్ధరుని ఎదుర్కొన్నాడు మారుతి. మెరుపుల పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు వాని రథం మీదికి దూకాడు.
రథానికి కట్టిన గుర్రాలెనిమిదీ పిప్పి పిప్పి అయాయి. కాడితో ఇరుసు ముక్కలు ముక్కలయింది. దుర్దరుడు ముద్దముద్దగా మట్టిలో పడ్డాడు.
విరూపాక్ష యూపాక్షులు ముందుకు వచ్చి ముద్గరాలతో హనుమంతుని ఉరఃస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడవేగంతో నేలకుదిగి సాలవృక్షాన్ని పెకలించి దానితో వారి శిరసులు వ్రక్కలు చేశాడు.
ప్రఘన, భాస కర్ణులు ఖడ్గ శూలాలు విసిరారు.
ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కగా బాల సూర్యుని వలె కనిపిస్తూ సర్ప, మృగ, వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలు పెకలించి వారిని యమపురికి పంపాడు.
సేనాబలం మిగిలి వుండటంతో ఒక గుర్రాన్ని పట్టుకుని దాన్ని విసురుతూ మిగిలిన గురాలనూ, ఏనుగుతో గజబలాన్నీ, భటులతో కాల్బలాన్నీ కడతేర్చాడు.
రథ, గజ, తురగ, పదాతుల, శవాలతో ఆ ప్రాంతం కాలుపెట్టడానికి వీలులేకుండా అయింది.
రాక్షస సంహార కుతూహలంతో వున్న యమునివలె హనుమంతుడు మళ్ళీ విశ్రాంతిగా ద్వారతోరణం అధివసించాడు.
రావణ నందనుడు
వాలీ చ సహ సుగ్రీవో
జాంబవాంశ్చ మహాబలః ॥
నీలః సేనాపతి శ్చైవ
యే చాన్యే ద్వివి దాదయః।
నైవం తేషాం గతి ర్భీమాః
న తేజో న పరాక్రమః ॥
న మతి ర్నబలోత్సాహౌ
న రూప పరికల్పనమ్।
మహ త్సత్య మిధం జ్ఞేయం
కపిరూపం వ్యవస్థితమ్ ॥
మహాబలపరాక్రమవంతులయిన వానరవీరులు వాలి సుగ్రీవ జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వివిదుడు వీరందరినీ చూశాను, వారిలో ఎవరూ ఇంత పరాక్రమ, తేజస్సంపన్నులు కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహా భూత మేదో అయి వుండాలి.
ముల్లోకాలలో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు ఏ భూతమూ ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయ నిశ్చయం ముందుగా చెయ్యలేం కనక అప్రమత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగువెయ్యాలి, అన్నాడు.
ఆ మాటలు విని వారు తీవ్రవేగంతో గజాశ్వ రథ బిల సమేతం అయుధధారులై వచ్చి తోరణం మీద ఉదయసూర్య కాంతితో వెలిగే హనుమంతుని చూశారు.
చూస్తూనే, దుర్ధరుడు వాడిగల ఉక్కుబాణాలు అయిదు వదిలాడు. అవి కలువలవలె వున్నాయి. మారుతి ఆ బాణ ఘాతాలతో ఒక్క గర్జన చేసి ఆకాశవీధికి లేచాడు.
దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు.
వార్షుకాబ్రాన్ని వాయువు నిరోధించినట్టు దుర్ధరుని ఎదుర్కొన్నాడు మారుతి. మెరుపుల పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు వాని రథం మీదికి దూకాడు.
రథానికి కట్టిన గుర్రాలెనిమిదీ పిప్పి పిప్పి అయాయి. కాడితో ఇరుసు ముక్కలు ముక్కలయింది. దుర్దరుడు ముద్దముద్దగా మట్టిలో పడ్డాడు.
విరూపాక్ష యూపాక్షులు ముందుకు వచ్చి ముద్గరాలతో హనుమంతుని ఉరఃస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడవేగంతో నేలకుదిగి సాలవృక్షాన్ని పెకలించి దానితో వారి శిరసులు వ్రక్కలు చేశాడు.
ప్రఘన, భాస కర్ణులు ఖడ్గ శూలాలు విసిరారు.
ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కగా బాల సూర్యుని వలె కనిపిస్తూ సర్ప, మృగ, వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలు పెకలించి వారిని యమపురికి పంపాడు.
సేనాబలం మిగిలి వుండటంతో ఒక గుర్రాన్ని పట్టుకుని దాన్ని విసురుతూ మిగిలిన గురాలనూ, ఏనుగుతో గజబలాన్నీ, భటులతో కాల్బలాన్నీ కడతేర్చాడు.
రథ, గజ, తురగ, పదాతుల, శవాలతో ఆ ప్రాంతం కాలుపెట్టడానికి వీలులేకుండా అయింది.
రాక్షస సంహార కుతూహలంతో వున్న యమునివలె హనుమంతుడు మళ్ళీ విశ్రాంతిగా ద్వారతోరణం అధివసించాడు.
రావణ నందనుడు
Mantri Putrulu - మంత్రి పుత్రులు
రామాయణం సుందరకాండ 44, 45, సర్గలు - మంత్రి పుత్రులు
అగ్ని సమతేజస్వులయిన రాక్షస మంత్రి నందనులు ఏడుగురూ సేనాసమేతులై, ధనుర్బాణాలు చేబూని, రథారూఢులై బయలుదేరారు. పరమ సంతోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు.
అంతకు ముందే కింకరగణం నిహతమయిందని విని వున్న నారీజనం వీరిని చూచి దుఃఖించింది.
ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వార తోరణం మీద వున్న హనుమంతుని సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షసనందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బు క్రమ్మిన మహాపర్వతం అయాడు మారుతి.
క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారి రథగమనాన్ని నిరోధించి, ఇంద్రధనుస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించే వాయువువలె కనిపించాడు.
ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్ళతో తన్ని నేలకూల్చి, మరికొందరిని పిడికిలి పోట్లతో, వాడిగోళ్ళతో హతమారుస్తూ, రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు.
నేల కూలినవారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతులై దిక్కులు పట్టిపోయారు.
హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు విలవిలలాడాయి. రథాలు విరిగాయి, ధ్వజాలు ముక్కలయాయి. ఆ ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది.
లంకానగరం ఆర్తస్వరాలతో నిండింది.
హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణం మీద కూర్చుని రాబోయే రాక్షసులను నేల కూల్చడానికి ఎదురు చూస్తున్నాడు.
సేనాపతులు
అగ్ని సమతేజస్వులయిన రాక్షస మంత్రి నందనులు ఏడుగురూ సేనాసమేతులై, ధనుర్బాణాలు చేబూని, రథారూఢులై బయలుదేరారు. పరమ సంతోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు.
అంతకు ముందే కింకరగణం నిహతమయిందని విని వున్న నారీజనం వీరిని చూచి దుఃఖించింది.
ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వార తోరణం మీద వున్న హనుమంతుని సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షసనందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బు క్రమ్మిన మహాపర్వతం అయాడు మారుతి.
క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారి రథగమనాన్ని నిరోధించి, ఇంద్రధనుస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించే వాయువువలె కనిపించాడు.
ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్ళతో తన్ని నేలకూల్చి, మరికొందరిని పిడికిలి పోట్లతో, వాడిగోళ్ళతో హతమారుస్తూ, రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు.
నేల కూలినవారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతులై దిక్కులు పట్టిపోయారు.
హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు విలవిలలాడాయి. రథాలు విరిగాయి, ధ్వజాలు ముక్కలయాయి. ఆ ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది.
లంకానగరం ఆర్తస్వరాలతో నిండింది.
హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణం మీద కూర్చుని రాబోయే రాక్షసులను నేల కూల్చడానికి ఎదురు చూస్తున్నాడు.
సేనాపతులు
Jambumali Vada - జంబుమాలివధ
రామాయణం సుందరకాండ 43వ సర్గ - జంబుమాలివధ
ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో వన విధ్వంసంతోపాటు చైత్య, ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకుని మహాదైెత్యం మీదకు దుమికాడు.
మహోన్నతమయిన ఆ భవనంమీద రెండవ సూర్యునివలె వెలుగుతూ దాని పునాదులు కదలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భుజాస్పాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడి కాపలాజనం మూర్చపోయారు. మరొక్కమారు సింహగర్ణన చేసి:
అస్త్రవి జ్జయతాం రామో
లక్ష్మణశ్చ మహాబలః
రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడయిన మా ప్రభువుకి స్వస్తి, నేను రామదూతను. శత్రుసంహార సమర్థుడను, వాయుపుత్రుడనైన నా ముందు రావణులు వేలమంది ఆగరు,
ఈ లంకను ధ్వంసం చేసి, సీతాదేవికి ప్రణామాలర్పించి మీరందరూ చూస్తూండగా నిశ్చింతగా తిరిగి వెడతాను, అని గర్జిస్తుంటే కొందరు చెత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా, వారి మధ్య మారుతి, గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు.
వారిని దగ్గరగా రానిచ్చి, చైెత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగతీవ్రతకు నిప్పుపుట్టి భవనం ధ్వంసం అయింది.
ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో వన విధ్వంసంతోపాటు చైత్య, ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకుని మహాదైెత్యం మీదకు దుమికాడు.
మహోన్నతమయిన ఆ భవనంమీద రెండవ సూర్యునివలె వెలుగుతూ దాని పునాదులు కదలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భుజాస్పాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడి కాపలాజనం మూర్చపోయారు. మరొక్కమారు సింహగర్ణన చేసి:
అస్త్రవి జ్జయతాం రామో
లక్ష్మణశ్చ మహాబలః
రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడయిన మా ప్రభువుకి స్వస్తి, నేను రామదూతను. శత్రుసంహార సమర్థుడను, వాయుపుత్రుడనైన నా ముందు రావణులు వేలమంది ఆగరు,
ఈ లంకను ధ్వంసం చేసి, సీతాదేవికి ప్రణామాలర్పించి మీరందరూ చూస్తూండగా నిశ్చింతగా తిరిగి వెడతాను, అని గర్జిస్తుంటే కొందరు చెత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా, వారి మధ్య మారుతి, గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు.
వారిని దగ్గరగా రానిచ్చి, చైెత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగతీవ్రతకు నిప్పుపుట్టి భవనం ధ్వంసం అయింది.
వజ్రపాణి అయిన దేవేంద్రునివలె స్తంభహస్తుడైన హనుమంతుడు గగనవీధిని నిలిచి:
ఓ రాక్షసులారా! మహాబలిష్ఠులయిన మా వానర వీరులెందరో సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు.
ఆ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమయిన బలం గలవారు. కొందరి బలం వంద ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు. వాయుబలం, ప్రవాహవేగబలం కలవారెందరో ఉన్నారు.
వాడిగోళ్ళు, సుడి తిరిగిన దంతాలు, అవే ఆయుధాలుగా కల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్ము సంహరించడానికి వస్తున్నాడు.
మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగులవు, ఈ లంక వుండదు. మీ రాజు అసలే వుండడు, అని గర్జించాడు.
ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు.
వాడు మహా బలిష్ఠుడు. యుద్ధయోగ్యంగా ఎర్రవస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా వుంది. దిక్కులు దద్దరిల్లేలా వుంది.
ఖర వాహన బద్ధమయిన రథంమీద వచ్చే వానిని చూచి హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు.
ఆ బాణ ఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన అరుణకమలంలా వుంది హనుమంతుని వదనం.
ఆ దెబ్బ తిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెల్లగించగా దానిని పది బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి.
హనుమంతుడు మహావృక్షాన్ని పెల్లగించాడు. దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూంటే చేతికందిన పరిఘాయుధం అందుకుని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే!
జంబుమాలి అవయవాలన్నీ సంధులూడి జారిపోయాయి, రధం, ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రి పుత్రులను పంపించాడు.
మంత్రి పుత్రులు
ఓ రాక్షసులారా! మహాబలిష్ఠులయిన మా వానర వీరులెందరో సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు.
ఆ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమయిన బలం గలవారు. కొందరి బలం వంద ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు. వాయుబలం, ప్రవాహవేగబలం కలవారెందరో ఉన్నారు.
వాడిగోళ్ళు, సుడి తిరిగిన దంతాలు, అవే ఆయుధాలుగా కల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్ము సంహరించడానికి వస్తున్నాడు.
మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగులవు, ఈ లంక వుండదు. మీ రాజు అసలే వుండడు, అని గర్జించాడు.
ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు.
వాడు మహా బలిష్ఠుడు. యుద్ధయోగ్యంగా ఎర్రవస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా వుంది. దిక్కులు దద్దరిల్లేలా వుంది.
ఖర వాహన బద్ధమయిన రథంమీద వచ్చే వానిని చూచి హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు.
ఆ బాణ ఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన అరుణకమలంలా వుంది హనుమంతుని వదనం.
ఆ దెబ్బ తిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెల్లగించగా దానిని పది బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి.
హనుమంతుడు మహావృక్షాన్ని పెల్లగించాడు. దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూంటే చేతికందిన పరిఘాయుధం అందుకుని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే!
జంబుమాలి అవయవాలన్నీ సంధులూడి జారిపోయాయి, రధం, ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రి పుత్రులను పంపించాడు.
Sena Naasanam - సేనా నాశనం
రామాయణం సుందరకాండ 42వ సర్గ - సేనా నాశనం
మహావృక్షాలు నేలకూలే ధ్వనులూ, పక్షుల ఆర్తనాదాలూ వింటూ లంకానగర వాసులు భయభీతులై లేచారు. వారికెన్నో అపశకునాలు గోచరించాయి.
రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంతో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీతమయిన భయం కలిగింది.
కొంతసేపటికి తేరుకుని సీతాదేవిని సమీపించి:
ఈ వానరు డెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? వాడితో మాట్లాడావా? నిజం చెప్పు. వాడితో ఏం మాట్లాడావు? అని అడిగారు.
జానకి : వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. పామునడక పాముకే తెలిసేది. అ రూపం నాకూ భయంగానే ఉంది. కామరూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు.
ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, మరి కొందరు పరుగులు తీయగా, కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని దగ్గరకుపోయి:
ప్రభూ! అశోకవనంలోకి ఒక భయంకరమయిన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్లుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం యివ్వడంలేదు.
దేవేంద్రుడో, కుబేరుడో, కాక రాముడో పంపిన దూతకావచ్చు ననుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనం అయింది. చూస్తేవాడు జానకీ రక్షణార్దమే ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాడనుకోవాలి.
ఆ వానరానికి తగిన శిక్ష వేసితీరాలి. నీకత్యంత ప్రీతి పాత్రురాలయిన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం, అని వారంటూంటే రావణుని వదనం అగ్నిగుండం అయింది. ఆ వేడికి రెండు కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీపం నుండి జారే నేతిబొట్లలా వున్నాయి,
తక్షణం తనతో సమానబలంగల కింకరగణాన్ని పంపించాడు.
వారు ఇనుప బరిసెలు, ముధ్గరాలు తీసుకుని బయలుదేరారు. కోరలపళ్ళు, మహోదరాలు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండులా హనుమంతుని చుట్టుముట్టారు. చేతులలోని ఆయుధాలతో మీదికి వచ్చే ఆ కింకరగణాన్ని చూసీ, సింహగర్జనచేసి, తన దీర్ఘవాలాన్ని వేలమీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు. ఆ ధ్వని కొండగుహలలో ప్రతి ధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షలు నేలరాలాయి. వారిని చూస్తూ గొంతెత్తి,
జయ త్యతిబలో రామో
లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో
రాఘవే ణాభిపాలితః॥
దాసోஉహం కోసలేంద్రస్య
రామ స్యాక్లిష్ట కర్మణః।
హనుమాన్ శత్రు సైన్యానాం
నిహాంతా మారుతాత్మజః ॥
న రావణ సహస్రం మే
యుద్ధే ప్రతిబలం భవేత్ ।
శిలాభిస్తు ప్రహరతః
పాదపైశ్చ సహస్రశః॥
అర్ధయితాః పురీం లంకాం
అభివాద్య చ మైథిలీమ్ ।
సమృద్ధార్థో గమిష్యామి
మిషతాం సర్వ రాక్షసామ్॥
అతిబల మహాబలులయిన రామ లక్ష్మణులకూ, వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునకూ స్వస్తి.
అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల దాసుడనైన నేను శత్రుసేనా సమూహాలను చీల్చి చెండాడతాను. నేను వాయునందనుడను, హనుమంతుడను.
మహా వృక్షాలతో గండశిలలతో యుద్దం సాగించే నా ముందు వేలమంది రావణులాగరు.
ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి, జానకీ దేవికి అభివాదాలర్పించి, కార్యసాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూండగా హాయిగా తిరిగి వెడతాను, అని నినాదం చేశాడు.
ఆ కంఠధ్వనికి రాక్షసయోధులు కంపించారు.
సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు.
అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది.
ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో, తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించడం మొదలుపెట్టాడు.
గరుత్మంతుని గోళ్ళలో చిక్కిన మహాసర్పంలా ఆడుతోంది ఆ దూలం.
దాని తాకిడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున రావణునికి నివేదించారు.
కింకరగణం పరాభూతం అయిందని విన్న రావణుని కన్నులు గిరగిర తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి ప్రహస్తుని కుమారుడు.
జంబుమాలివధ
మహావృక్షాలు నేలకూలే ధ్వనులూ, పక్షుల ఆర్తనాదాలూ వింటూ లంకానగర వాసులు భయభీతులై లేచారు. వారికెన్నో అపశకునాలు గోచరించాయి.
రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంతో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీతమయిన భయం కలిగింది.
కొంతసేపటికి తేరుకుని సీతాదేవిని సమీపించి:
ఈ వానరు డెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? వాడితో మాట్లాడావా? నిజం చెప్పు. వాడితో ఏం మాట్లాడావు? అని అడిగారు.
జానకి : వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. పామునడక పాముకే తెలిసేది. అ రూపం నాకూ భయంగానే ఉంది. కామరూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు.
ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, మరి కొందరు పరుగులు తీయగా, కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని దగ్గరకుపోయి:
ప్రభూ! అశోకవనంలోకి ఒక భయంకరమయిన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్లుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం యివ్వడంలేదు.
దేవేంద్రుడో, కుబేరుడో, కాక రాముడో పంపిన దూతకావచ్చు ననుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనం అయింది. చూస్తేవాడు జానకీ రక్షణార్దమే ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాడనుకోవాలి.
ఆ వానరానికి తగిన శిక్ష వేసితీరాలి. నీకత్యంత ప్రీతి పాత్రురాలయిన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం, అని వారంటూంటే రావణుని వదనం అగ్నిగుండం అయింది. ఆ వేడికి రెండు కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీపం నుండి జారే నేతిబొట్లలా వున్నాయి,
తక్షణం తనతో సమానబలంగల కింకరగణాన్ని పంపించాడు.
వారు ఇనుప బరిసెలు, ముధ్గరాలు తీసుకుని బయలుదేరారు. కోరలపళ్ళు, మహోదరాలు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండులా హనుమంతుని చుట్టుముట్టారు. చేతులలోని ఆయుధాలతో మీదికి వచ్చే ఆ కింకరగణాన్ని చూసీ, సింహగర్జనచేసి, తన దీర్ఘవాలాన్ని వేలమీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు. ఆ ధ్వని కొండగుహలలో ప్రతి ధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షలు నేలరాలాయి. వారిని చూస్తూ గొంతెత్తి,
జయ త్యతిబలో రామో
లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో
రాఘవే ణాభిపాలితః॥
దాసోஉహం కోసలేంద్రస్య
రామ స్యాక్లిష్ట కర్మణః।
హనుమాన్ శత్రు సైన్యానాం
నిహాంతా మారుతాత్మజః ॥
న రావణ సహస్రం మే
యుద్ధే ప్రతిబలం భవేత్ ।
శిలాభిస్తు ప్రహరతః
పాదపైశ్చ సహస్రశః॥
అర్ధయితాః పురీం లంకాం
అభివాద్య చ మైథిలీమ్ ।
సమృద్ధార్థో గమిష్యామి
మిషతాం సర్వ రాక్షసామ్॥
అతిబల మహాబలులయిన రామ లక్ష్మణులకూ, వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునకూ స్వస్తి.
అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల దాసుడనైన నేను శత్రుసేనా సమూహాలను చీల్చి చెండాడతాను. నేను వాయునందనుడను, హనుమంతుడను.
మహా వృక్షాలతో గండశిలలతో యుద్దం సాగించే నా ముందు వేలమంది రావణులాగరు.
ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి, జానకీ దేవికి అభివాదాలర్పించి, కార్యసాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూండగా హాయిగా తిరిగి వెడతాను, అని నినాదం చేశాడు.
ఆ కంఠధ్వనికి రాక్షసయోధులు కంపించారు.
సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు.
అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది.
ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో, తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించడం మొదలుపెట్టాడు.
గరుత్మంతుని గోళ్ళలో చిక్కిన మహాసర్పంలా ఆడుతోంది ఆ దూలం.
దాని తాకిడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున రావణునికి నివేదించారు.
కింకరగణం పరాభూతం అయిందని విన్న రావణుని కన్నులు గిరగిర తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి ప్రహస్తుని కుమారుడు.
జంబుమాలివధ
Asokavana Vidhvamsam - అశోకవన విధ్వంసం
రామాయణం సుందరకాండ 41వ సర్గ - అశోకవన విధ్వంసం
ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.
ఈ రాక్షసులు క్రూరప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు, ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు.
ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు.
అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగి రావచ్చు.
కార్యసాధకుడైె న దూత ముందు వెనుకల భంగంకాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన యితర కార్యాలు కూడా పూర్తిచెయ్యాలి.
ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది.
ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి.
రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ గ్రహించి వెళ్ళాలి.
దానికి ఒకటే దారి కనిపిస్తున్నది.
నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను, అని నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు.
చెరువుల గట్టు తెగగొట్టేశాడు.
ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు ముక్కలయాయి.
రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు.
సేనా నాశనం
ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.
ఈ రాక్షసులు క్రూరప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు, ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు.
ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు.
అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగి రావచ్చు.
కార్యసాధకుడైె న దూత ముందు వెనుకల భంగంకాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన యితర కార్యాలు కూడా పూర్తిచెయ్యాలి.
ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది.
ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి.
రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ గ్రహించి వెళ్ళాలి.
దానికి ఒకటే దారి కనిపిస్తున్నది.
నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను, అని నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు.
చెరువుల గట్టు తెగగొట్టేశాడు.
ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు ముక్కలయాయి.
రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు.
సేనా నాశనం
Subscribe to:
Posts (Atom)
Brahmastra - బ్రహ్మాస్త్రం
రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్ । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...