Friday, July 10, 2026

Pasipillalaku Disti Teese Vidhanam - పసిపిల్లలకు దిష్టి తీసే విధానం

పసిపిల్లలకు దిష్టి తీసే విధానం

చిన్నపిల్లలకు 'దిష్టి' తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు.

దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు.

పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి.

రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి.

చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.

అలాగే ఒక్కోసారి ఫంక్షన్లకు బయటకు వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అలాంటి సమయాల్లో ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు.

Various names of Agni - అగ్ని వివిధ నామాలు

అగ్ని వివిధ నామాలు

పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.

అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది.

క్రోధాగ్ని:కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.

బడబాగ్ని:ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.

జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం.

దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే.

వజ్రాగ్ని:ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి.

సూర్యాగ్ని: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం.

యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.

ప్రేతాగ్ని:దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకో గానే రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.

Wednesday, July 8, 2026

Moola Nakshatra - మూల నక్షత్రము

మూల నక్షత్రము

నక్షత్రం - మూల

అధిపతి - కేతువు

గణము - రాక్షస

జాతి - పురుష

వృక్షం - వేగిస

జంతువు - శునకము

నాడి - ఆది

పక్షి - కుకుటము

అధిదేవత - నిరుతి

రాశి - ధనసు

జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం. మూలా నక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యాధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రానికి శాంతి జరుపవలెను.

ఈ నక్షత్రములో పుట్టినవారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభా పాటవాలు వీరి స్వంతం. జీవితంలో ప్రతిది స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం.

జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి.

ఈ నక్షత్ర జాతకులు న్యాయం పట్ల అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రజలతో సంబంధాలు బాగుంటాయి మరియు వీరి స్వభావం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే, వీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాధారణంగా చక్కగా మరియు దృఢంగా ఉంటారు. వీరికి బలమైన మరియు దృఢమైన ఆలోచనలు ఉంటాయి.

సామాజికమైన పనుల విషయానికి వచ్చేసరికి, వీటిలో వీరు ఎంతో చురుకుగా పాలు పంచుకుంటారు. పనుల్లో వీరి యొక్క లక్షణాల వల్ల, పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. వీరి జీవితం కొన్ని స్థిరమైన నిబంధనల ఆధారంగా సాగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుంది మరియు అన్నిరకాల అడ్డంకుల్ని చేధించి వీరు గమ్యస్థానానికి చేరుకుంటారు. దేనినైనా చేయాలని వీరు నిర్ణయించుకున్న తరువాత, వీరు ఆ పనిని సాధిస్తారు.

భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు, అదేవిధంగా జీవితంలో సమస్యల గురించి ఆందోళన పడరు. దేవునిపై వీరికి అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. వీరు ఇతరులకు చక్కటి సలహాలు ఇస్తారు. వీరు పనిలో చాలా నిజాయితీగా ఉంటారు. పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉన్నప్పుడు వీరికి మరింత ఎక్కువ ప్రతిభ మరియు అదృష్టం తోడవుతాయి.

విదేశాలకు వెళ్లేందుకు వీరికి ఏదైనా అవకాశం లభించినట్లయితే, అది వీరికి చాలా లాభాన్ని కలిగిస్తుంది. కుటుంబం ద్వారా మద్దతు లభించినా లేదా లభించకపోయినా వీరు స్వంత విధిని లిఖించుకుంటారు. ఎంతో నమ్మకంగా ఉంటారు కనుక, అనేకమంది స్నేహితుంటారు.

చదువు విషయానికి వస్తే, వీరు బాగా చదువుతారు మరియు ఫిలాసఫీలో వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆదర్శవాదం మరియు ఆలోచలను కలిగి ఉంటారు. సంపద మరియు గౌరవాల్లో ఒకదానికి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వీరు మర్యాదను ఎంచుకుంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ రాణిస్తారు. అయితే వీరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. వీరు ఎక్కడకు వెళ్లినా కూడా, ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

ఆధ్యాత్మికత విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం వల్ల వీరు డబ్బుకు ఆశపడరు. అవసరం ఉన్న వ్యక్తులకు సహాయపడటం కొరకు వీరు అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇది వారికి చాలా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. స్నేహాల విషయానికి వస్తే, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్నేహితులుగా ఉంటారు. ప్రాపంచిక జీవితం మొత్తం కూడా సంతోషం మరియు విలాసంతో నిండి ఉంటుంది.

మూల నక్షత్రం మొదటి పాదము
మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.

ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.

49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడుతుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రం రెండవ పాదము
మూల నక్షత్ర జాతకులు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జలసంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది. కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది.

47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము మూడవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద బుధ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకూలిస్తాయి. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు.

మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి.ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది.

46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము నాలుగవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వస్తువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.

45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొనసాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

మూలా నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షము :
మూల నక్షత్రం వారు వేగి చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.

మూలా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - అశ్విని, మఖ, మూల - శరీరశ్రమ
సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ధన లాభం
విపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్యహాని
సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - క్షేమం
ప్రత్యక్ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ప్రయత్న భంగం
సాధన తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - బంధనం
మిత్ర తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: పేదలకి ఉచితంగా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇవ్వవలెను.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
మూలం' ప్రజాం వీరవ'తీం విదేయ ।
పరా"చ్యేతు నిరృతిః పరాచా ।
గోభిర్నక్షత్రం పశుభిస్సమ'క్తమ్ ।
అహ’ర్భూయాద్యజ'మానాయ మహ్యమ్” ।
అహ'ర్నో అద్య సు'వితే ద’దాతు ।
మూలం నక్షత్రమితి యద్వదంతి ।
పరా'చీం వాచా నిరృతిం నుదామి ।
శివం ప్రజాయై' శివమ'స్తు మహ్యమ్” ॥

నక్షత్ర గాయత్రి
ఓం ప్రజాధిపాయై విద్మహే 
మహాప్రజాధిపాయై ధీమహి 
తన్నో మూలా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – యెండగండిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – పామర్రులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – అముజూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పానంగిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి.

Jyeshtha Nakshatra - జ్యేష్టా నక్షత్రము

జ్యేష్టా నక్షత్రము

నక్షత్రం - జ్యేష్ట
అధిపతి - బుధుడు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - విష్టి
జంతువు - జింక
నాడి - ఆది
పక్షి - కాకము
అధిదేవత - ఇంద్రుడు
రాశి - వృశ్చికము

జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు :
నక్షత్రములలో జ్యేష్టా నక్షత్రము 18వ నక్షత్రము. జ్యేష్ఠా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది.

తమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు.

సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది.

సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు.

జ్యేష్టా నక్షత్ర జాతకులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దయగలగినవారు, చక్కటి నిజాయితీ స్వభావం వీరి ప్రత్యేకత. వీరి మనస్సాక్షి ప్రకారం పని చేయాలని కోరుకుంటారు. వీరికి మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది, అందువల్ల ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ఏదైనా చేయాలనే బలమైన వాంఛ వీరిలో ఉంటుంది.

వీరు వృత్తిపరమైన ప్రపంచంలోనికి చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని కూడా అంకితభావంతో చేయాలని అనుకుంటారు, అందువల్ల ఇది వీరికి విజయాన్ని అందిస్తుంది. చురుగ్గా ఉండటం వల్ల ప్రతి పనిని కూడా వేగంగా చేస్తారు. సమయం విలువ వీరికి బాగా తెలుసు. అందువల్ల, వీరు తెలివితక్కువ విషయముల్లో సమయం వృథా చేయరు.

ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా, వీరు విజయవంతంగా రాణిస్తారు. వీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే, వీరు ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు, సరైన మార్గంలో వీరు ముందుకు సాగడానికి అనేకమంది వ్యక్తులు వీరికి సహాయపడతారు.

వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏదైనా సమయంలో పోటీ విషయానికి వచ్చినట్లయితే, వీరు పోటీదారులను అధగమిస్తారు. వీరు 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు వరకు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు, అయితే ఇది వీరికి చక్కటి అనుభవాన్ని ఇస్తుంది.

వీరు చక్కటి ఆలోచనాపరులు, నైపుణ్యం, మరియు తెలివితేటలుంటాయి. వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. వీరు చాలా మంచి విద్య పొందుతారు మరియు వీరు జీవనోపాధి కొరకు ఈ విద్యను సరిగ్గా ఉపయోగించుకుంటారు.

జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదము
ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.

14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.

41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము
జ్యేష్టా నక్షత్రము రెండవ పాదములో జన్మించిన వారికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఈ జాతకులకు 10 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదము
వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.

ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదము
జ్యేష్టా నక్షత్రము నాల్గవ పాద జాతకుల మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.

4 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.

31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.

జ్యేష్టా నక్షత్ర జాతకులు పెంచవలసిన చెట్టు :
జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. చిన్నతనం నుండే బరువు భాధ్యతలు సమర్ధవంతంగా మోయగలుగుతారు.

జ్యేష్టా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - శరీరశ్రమ

సంపత్తార - అశ్విని, మఖ, మూల - ధన లాభం

విపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్యహాని

సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - క్షేమం

ప్రత్యక్ తార - రోహిణి, హస్త, శ్రవణం - ప్రయత్న భంగం

సాధన తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - బంధనం

మిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం

అతిమిత్ర తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానంగా ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
ఇంద్రో” జ్యేష్ఠామను నక్షత్రమేతి ।
యస్మి'న్ వృత్రం వృ'త్ర తూర్యే' తతార' ।
తస్మిన్వయ-మమృతం దుహా'నాః ।
క్షుధంతరేమ దురి'తిం దురి'ష్టిమ్ ।
పురందరాయ' వృషభాయ' ధృష్ణవే" ।
అషా'ఢాయ సహ'మానాయ మీఢుషే" ।
ఇంద్రా'య జ్యేష్ఠా మధు'మద్దుహా'నా ।
ఉరుం కృ'ణోతుయజ'మానాయ లోకమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి 
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – వడ్లమూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం – నల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
మూడవ పాదం – వెదురుమూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – తేకిశ్రీలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.

Tuesday, June 30, 2026

Yamashtakam - యమాష్టకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యమాష్టకం

పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కరక్షేత్రంలో తీవ్రతపస్సుతో బ్రహ్మమానసపుత్రుడైన
ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడుగా పొందాడు. నువ్వు ధర్మరాజువి. సర్వసాక్షివి. సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడవు. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతిజీవినీ అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధిచెయ్యడానికి దండం ధరించావు. దండధారి వయ్యావు. సర్వవిశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకలజీవులనూ శాసిస్తున్నావు. ఎవరైనా ఎదైనా తప్పించుకోవచ్చుగానీ నిన్నుమాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి. బ్రహ్మనిష్ఠుడివి. సంయమివి. జితేంద్రియుడివి. జీవులకు కర్మఫలాలమ నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి. సర్వజ్ఞుడివి. పుణ్యాత్ములకు మిత్రుడివి. పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరసువంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు. బ్రహ్మతేజస్సుతో
ప్రకాశిస్తున్నావు. పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు. నువ్వు ఈశుడవు. నీకిదే వందనం - అని
సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరసువంచి నమస్కరించింది.

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా ।
ధర్మం సూర్యస్పూతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్‌

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః
 ।
అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహమ్‌ ॥

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్‌ ।
కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్‌ ॥

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ది హేతవే

నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్‌


విశ్వం చ కలయత్యేన యస్పర్వేషు చ సంతతమ్‌ ।
అతీవ దుర్శివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహమ్‌


తపస్వి బ్రహ్మనిష్ఠో యస్సంయమీ సంజితేంద్రియః
 ।
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహమ్‌ ॥

స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ ।
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్‌


యజ్జన్మ బ్రహ్మణో
౦శేన జ్వలంతం బ్రహ్మతేజసా
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్‌ ॥ (31 - 15)

నారదా! ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ పఠించేవారికి
మృత్యుభయం ఉండదు. సమస్త పాపాలూ తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణశుద్ది
ఏర్పడుతుంది - అని చెప్పి నారాయణమహర్షి సావిత్రీ యమసంవాదాన్ని కొనసాగించాడు.

శౌనకాది మహామునులారా! శ్రద్దగా వింటున్నారుగదా! నారాయణమహర్షి నారదుడికి వివరిస్తున్న
సావి
త్య్రుపాఖ్యానంలో అశుభకర్మవిపాకం ఆలకించండి - అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు.

నారదా ! సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజసహితంగా
శ్రీదేవీమహామంత్రాన్ని ఉపదేశించి పూజావిధానం తెలియచెప్పాడు. అటుపైని అశుభకర్మవిపాకం
వివరించాడు.

దుష్మర్మఫల నిరూపణ


Satkarmaphala nirupana - సత్కర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సత్కర్మఫల నిరూపణ

ధర్మరాజా! ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు.

సావిత్రీ! విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానంకంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీనివిషయంలో పాత్రతాపాత్రత పరీక్షగానీ కాలాకాలవిచారణగానీ లేవు ఇది అందరూ అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమదానం.

దేవతలకుగానీ బ్రాహ్మణులకుగానీ ఉచితాసనం దానం చేసినవాడు విష్ణులోకంలో అయుతవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజునచేస్తే నాలుగురెట్లు తీర్థప్రదేశంలోచేస్తే పదిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. నారాయణక్షేత్రంలో చెయ్యగలిగితే నా ఫలం కోటిరెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖీ గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతచ్ఛత్రప్రదాతకు అయుతవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోకనివాసం ఫలం. నూతనవస్త్రాలు పెట్టి సాలగ్రామం దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతనివానమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోకప్రదాయి. శిబికాదానమూ ఆంతే. వ్యజనవాటికాదానాలు వాయులోక నివాసహేతువులు, ధాన్యరత్నాలు దాతృప్రతిగ్రహీత లిద్దరికీ వైకుంఠలోకావాసప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమివేళ శ్రీహరికి ఉయ్యాలసేవ చేసినవారు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణుమందిరం చేరుకొంటారు. ఆక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫల్గుణిలో ఈ పనిచేస్తే రెట్టింవు పుణ్యం వస్తుంది. ఆతడు కల్పాంతజీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటు పైని ఉత్తమజన్మ ఎత్తి సుఖవడతాడు. తామ్రపాత్రను దానంచేస్తే రెట్టింపుఫలం. సాలంకృత కన్యాదాత చంద్రలోకంలో పదునల్గురు ఇంద్రులు గడిచేదాకా అప్పరసలతో వినోదిస్తాడు. అటుపైని గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైని భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు.

ఫలదానానికి శక్రలోకనివాసం ఫలం. ఆ తరువాత జన్మలో పండంటిబిడ్డ కలుగుతాడు. ఫలభారంతో వంగిన వెయ్యి చెట్లు లభిస్తాయి.

ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వతస్వర్గలోక నివాసమే. అటుపైని ధనధాన్యాలకు లోటులేని ఉత్తమజన్మ పంటతోపాటు పొలం దానంచేస్తే వైకుంఠలోక నివాసం ఫలం. తరవాత జన్మలో భూపాలుడవుతాడు. నూరు జన్మలవరకూ పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడూ ధనవంతుడూ పుత్రవంతుడూ అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు లక్షమన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో లక్షగ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాలతో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానంచేస్తే దశలక్షేంద్రకాలపర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి దశలక్షనగరాలకు ఏలిక అవుతాడు. నూరు నగరాలతోకూడిన దేశాన్ని దానంచేస్తే కోటిమన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి గడిస్తాడు. కోటి జన్మలదాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంతజీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానంచేస్తే ఈ పుణ్యఫలం నూరురెట్టు అధికంగా లభిస్తుంది.

పతివ్రతాశిరోమణీ! ఎంతెంత దానాలన్నా చేయనీ, జంబూద్వీపమే దానం చెయ్యనీ, ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్యరూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవీ సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు.

దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీసారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీసేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలూ
లోకేశ్వరులూ దేవతలూ దేవేశ్వరులూ నశించడం పునరావిర్భవించడం కళ్ళారా చూస్తూ సాక్షిమాత్రులుగా నిలుస్తారు. అంతేకానీ వీరు నశించరు. పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం. మణిద్వీపవాసులు శాశ్వతం.

కార్తికమాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించినవాడు యుగత్రయపర్యంతం హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు. జితేంద్రియుడవుతాడు. అరుణోదయకాలంలో గంగాస్నానం చేస్తే ఆరువేలయుగాలపాటు హరిసన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణుమంత్రాన్ని పాంది తిరిగి మళ్ళీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింక అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్యసిద్ధి పొందుతాడు. నిరంతరం గంగాస్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్రతారార్కంగా నివసిస్తాడు. పునర్ణన్మలో హరిభక్తుడై జీవన్ముక్తి పొందుతాడు. అటుపైని సూర్యుడై వెలుగొందుతాడు.

స్వాదువూ సుగంధభరితమూ అయిన జలాన్ని దానం చేసినవాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదవేదాంగవేత్త అవుతాడు. వైశాఖమాసంలో సక్తుదానం చేస్తే శివసాయుజ్యమే ఫలం, కృష్ణాష్టమీవ్రతం ఆచరించినవారు శతజన్మ పాపవిముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణభక్తులవుతారు. శివరాత్రివ్రతం పాటించినవారు కైలాసంలో శివుడి సన్నిధిలో సప్తమన్వంతరాలు వినోదిస్తారు. ఆరోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకలవిధ సంపదలతో తులతూగుతారు. పుత్రపౌత్రాభివృద్ది పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియై ప్రమథశేఖరుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించినవారు సప్తమన్వంతరాలు విష్ణుసన్నిధిలో విరాజిల్లుతారు. పునర్ణన్మలో ధనవంతులూ సజ్ఞనులూ అవుతారు.

శరదృతువులో మహాదేవుణ్ణి మాంసనైవేద్యాలతో షోడశోపచారాలతో అర్చించినవారు సప్తమన్వంతరాలపాటు కైలాసంలో ఉంటారు. పునర్జన్మలో పుత్రపాత్ర ధనధాన్య సమృద్దులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమినాడు మహాలక్ష్మిని భక్తిప్రపత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలూ చేస్తే గోలోకనివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తిక పూర్ణిమ రోజున రాసమండలంచేసి గోపీగోపశతాన్నీ రాధాకృష్ణులనూ శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించినవారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణభక్తులై మళ్ళీ గోలోకం చేరుకుంటారు. కృష్ణసారూప్యం పొంది పార్షదులవుతారు. మరింకవారికి పతనం లేదు. శుక్షపక్షంలోగానీ కృష్ణపక్షంలోగానీ ఏకాదశీవ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణభక్తులై అటుపైని గోలోకం చేరుకుంటారు. మరింక తిరిగిరారు.

భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే అరవైవేల సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారంనాడుగానీ సంక్రాంతినాడుగానీ శుక్లపక్ష సప్తమినాడుగానీ సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు నూర్యలోకనివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడూ శ్రీయుతుడూ జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్షపంచమినాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశోపచారాలూ భక్తితో సమర్పిస్తే మణిద్వీపనివాసి అవుతాడు. పునర్జన్మలో పండితకవి అవుతాడు.

గో భూ సువర్ణ దానఫలాలు లోగడ చెప్పానుగదా! హరినామాలను ఉచ్చరించినవాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. ఆదే నారాయణ క్షేత్రంలో చేస్తే కోటిరెట్లు అధికఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మలేని స్థితికి చేరుకొంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసినవారు రేణువుకి సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమిపాలకులై కీర్తి గడిస్తారు. సాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శతబ్రహ్మపర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికింక జన్మలేదు. సకల తపస్సులూ సకలదానాలూ సకలవ్రతాలూ చేసినవారు చాలాకాలం వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైని ముక్తులు అవుతారు. వీరికింక మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లోనూ మునిగి భూప్రదక్షిణం చేసినవారికి జన్మరాహిత్యరూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి నాలుగింతల అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటిలోకీ దేవీయజ్ఞం శిరోరత్నం. తొలినాళ్ళలో త్రిమూర్తులూ దేవీయజ్ఞాలు చేశారు. దీనికి సాటివచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు ధర్ముడు కశ్యపుడు శేషుడు కర్థముడు మనువు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడు - వీరంతా దేవీయజ్ఞం చేసినవారే. ఇది సహస్రరాజసూయాలకంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనేలేదు.

ఇది చేసినవాడు శతాయుష్కుడవుతాడు. జీవన్ముక్తుడవుతాడు. జ్ఞాని తేజస్వి అవుతాడు. విష్ణుభృత్యుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్టవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదంలా, మానవులలో బ్రాహ్మణుడిలా తీర్థాలలో గంగలా పవిత్రులలో శివుడిలా వ్రతాలలో ఏకాదశిలా పువ్వులలో తులసిలా తారలలో చంద్రుడిలా పక్షులలో గరుత్మంతుడిలా స్త్రీలలో ప్రకృతిలా రాధలా వాణిలా వసుంధరలా ఇంద్రియాలలో మనస్సులా ప్రజాపతులలో బ్రహ్మలా ప్రజలలో ప్రజాపతిలా వనాలలో బృందావనంలా దేశాలలో భారతదేశంలా ధనవంతులలో లక్ష్మిలా పండితులలో సరస్వతిలా పతివ్రతలలో దుర్గలా సౌభాగ్యవతులలో రాధికలా - యజ్ఞాలలో దేవీయజ్ఞం ఉత్తమోత్తమం. సర్వయజ్ఞ సర్వతీర్థస్నాన సర్వవ్రతాచరణ సర్వవేదపఠన భూప్రదక్షిణ సర్వదానకరణ ఫలంకన్నా దేవీయజ్ఞఫలం అత్యధికం. సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపించబడిన అంశం. దేవీవర్ణన, దేవీధ్యాన దేవీస్మరణ దేవీస్తవన దేవీవందన దేవీమంత్రపఠన దేవీపాదోదకసేవన దేవీనైవేద్య భక్షణలు నిరంతరం చెయ్యాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రీ! నిత్యమూ ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు. ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికివెళ్ళి సుఖసంతోషాలతో జీవించు. తత్త్వజ్ఞానప్రదమైన కర్మవిపాకాన్ని బోధించాను. నీ సంశయాలు తీర్చాను. శుభమగుగాక! వెళ్ళిరా - అని ముగించాడు యమధర్మరాజు. 

నారదా! యమధర్మరాజు నోట ఇలా శక్తిసంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనందబాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా! శ్రోతలకూ వక్తలకూ జన్మమృత్యుజరాహరమై సకలోద్దారకారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణీకోటికీ ముక్తిప్రదమనీ సిద్ధిప్రదమనీ తెలియజెప్పావు. మిగతావి ఏవీ శ్రీశక్తి ఉపాసకుడిలో పదహారవ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను. దీనితోపాటు జీవుల శుభకర్మవిపాకం వివరించావు. మరి అశుభకర్మలవిపాకం మాట ఎమిటి? ఏ అసత్కర్మకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియజెయ్యాలి, నువ్వు వేదవిదాంవరుడవు. జ్ఞానివి. సకలప్రాణికోటిపట్లా సమవర్తివి. రాగద్వేషాలకు అతీతుడవు. అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మవృత్తాంతం నాకు తెలుసు.

యమాష్టకం


Vastu Tortoise - వాస్తు తాబేలు

వాస్తు తాబేలు

ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితె వాస్తు ప్రకారం శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి తెలుసుకోండి. పురాణాల ప్రకారం, తాబేలును కూడా మహా విష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో, పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో, ఫ్నెగ్ షుయ్‌లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. 

అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయి.

ఇంట్లో తాబేలు చిహ్నం ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు, ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకుని అందులో తాబేలు చిహ్నంను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు.

తాబేలు ఉంచడానికి ఉత్తమ రోజు: బుధ, గురు, శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలను ఉంచేందుకు అనువైన రోజులుగా భావిస్తారు. తాబేలు విగ్రహానికి కుంకుమ లేదా పసుపు పువ్వులను సమర్పించండి. ప్రతిరోజూ తాబేలు విగ్రహంపై ఒక తులసి దళాన్ని ఉంచడం శుభసూచకం.

తాబేలు చిహ్నం దిశ:
తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత 'ఓం శ్రీం కూర్మై నమః' అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే, మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగు రాళ్లను కూడా వేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే.. పిల్లలు చదువులో ఏకాగ్రత పెంచాలంటే తాబేలు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని పిల్లల గదిలో ఉంచవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర తాబేలు విగ్రహాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

తాబేలు ముఖం ఎల్లప్పుడూ లోపలి వైపు (ఇంటి లోపలికి) చూస్తున్నట్లుగా పెట్టాలి.

అయితే ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. 

క్షీర సాగర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

తాబేలు కాలు మరియు ప్రయోజనాలు:
నీటిలో తాబేలు: పూజా గదిలో ఒక చిన్న ఇత్తడి లేదా రాగి పాత్రలో నీరు పోసి, అందులో తాబేలు ప్రతిమను ఉంచడం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

మెటల్ తాబేలు: ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన తాబేళ్లు కెరీర్ వృద్ధికి మరియు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. మెటల్ తాబేలు సంపదను సూచిస్తుంది. కెరీర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలును ఆఫీసులో ఉంచడం మంచిది. ఉత్తర దిశలో తాబేలును ఉంచడం మంచిది.

క్రిస్టల్/స్పటిక తాబేలు: దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పిల్లలున్న తాబేలు: ఒకటి ఆడ తాబేలు, పిల్లలు. ఇలా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఒక పెద్ద తాబేలు వీపుపై చిన్న తాబేలు ఉన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పిల్లతో ఉన్న తాబేలును ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తకుండా సహాయపడుతుంది.

చెక్క తాబేలు: వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఆగ్నేయ మూలలో చెక్క తాబేలును ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం, మంచి కర్మ, సాధనతో నింపుతుంది.

తాబేలు గిన్నె: మీరు ఒక గిన్నెలో నీటితో తాబేలును ఉంచినట్లయితే, తాబేలు గిన్నెలో వేసిన నీటిని ప్రతిరోజూ మార్చాలి.

Pasipillalaku Disti Teese Vidhanam - పసిపిల్లలకు దిష్టి తీసే విధానం

పసిపిల్లలకు దిష్టి తీసే విధానం చిన్నపిల్లలకు 'దిష్టి' తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇ...