పూరీ జగన్నాథ్ రథయాత్ర
ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే, జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఆషాఢ శుద్ధవిదియ పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.
ప్రాముఖ్యత
హిందూ మతంలో జగన్నాథ రథయాత్రకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ అన్నయ్య బలభద్ర మరియు చెల్లెలు సుభద్రతో పాటు శ్రీకృష్ణుడిని పూజించడానికి అంకితం చేయబడింది. స్నాన పూర్ణిమ నుండి వేడుక ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవంలో మూడు రథాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. పూరి జగన్నాథ దేవాలయం ప్రతి సంవత్సరం వివిధ రకాల పువ్వులు, రంగోలి మరియు దీపాలతో అలంకరించబడుతుంది. 12వ శతాబ్దంలో జగన్నాథ్ పూరీ ఉత్సవం ప్రారంభమైంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి.
ఈ పవిత్రమైన రోజున, పూరీ జగన్నాథ ఆలయం నుండి బలరాం, జగన్నాథుడు మరియు సుభద్ర విగ్రహాలు బయటకు వస్తాయి. భక్తులు పెద్ద పెద్ద రథాలపై విగ్రహాలను ఉంచుతారు. ఆ తర్వాత డప్పు తాళ్లతో నగరమంతటా భక్తులు రథాలను లాగడం ద్వారా, జగన్నాథుడు భక్తులకు గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును అనుగ్రహిస్తాడని మరియు ఈ వ్యక్తులు అన్ని ఆటంకాల నుండి బయటపడి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.
ఆచారాలు
భక్తులు రథాల వద్దకు చేరుకునే ముందు గుండిచా ఆలయాన్ని శుభ్రం చేస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని పిలుస్తారు, దీనికి 16 చక్రాలు, బలభద్రుడి రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు మరియు దీనికి 14 చక్రాలు మరియు సుభద్రా దేవి రథాన్ని 12 చక్రాలు కలిగిన దర్పదలన్ అని పిలుస్తారు. సుభద్ర రథాలకు అర్జునుడు సారథి అవుతాడని మరియు అది రెండు రథాల మధ్య ఉంటుందని నమ్ముతారు.
పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.
జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.
ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది. వైష్ణవ సంప్రదాయాలకు, ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.
ఆలయంపై జెండా
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.
సుదర్శన చక్రం
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.
ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు.
ఆలయ నిర్మాణం
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.
సింఘద్వారం రహస్యం
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
Telugu Library
Thursday, July 16, 2026
Tuesday, July 14, 2026
The Soul's 13-Day Journey - ఆత్మ 13 రోజుల ప్రయాణం
ఆత్మ 13 రోజులు ప్రయాణం మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం
మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది.
మొదటి 3 రోజులు మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారితెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు.
4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది.
11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు.
12వ రోజు – సపిండీకరణ ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి.
13వ రోజు – కర్మకాండ ముగింపు 13వ రోజుఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది.
ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి? ఆత్మకు శాంతి కోసం కుటుంబానికి మానసిక ధైర్యం కోసం పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు. అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.
అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు కానీ, ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.
ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది.
ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి.
శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది.
కుండను కింద పడేసి పగలగొడతాం అంటే, ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.
Reasons for sleeplessness - నిద్రపట్టకపోవడానికి కారణాలు
నిద్రపట్టకపోవడానికి కారణాలు
అధిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన మనసు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది.
రోజువారీ నిద్ర వేళలు సరిగ్గా లేకపోవడం, ఉదాహరణకు వీకెండ్స్ లో ఆలస్యంగా పడుకోవడం లేదా లేవడం వంటివి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతాయి.
రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకోవడం లేదా కెఫీన్ (కాఫీ, టీ) లేదా ఆల్కహాల్ వంటివి తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది.
రాత్రిపూట మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటివి ఎక్కువగా వాడటం వలన వాటి నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచి, నిద్ర రాకుండా చేస్తుంది.
నిద్రలేమికి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, స్లీప్ ఆప్నియా (నిద్రలో ఊపిరి ఆగిపోవడం), దీర్ఘకాలిక నొప్పి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
ఈ సమస్యలను అధిగమించడానికి, మీరు నిద్రపోయే ముందు చల్లని గదిలో ప్రశాంతంగా ఉండడం, మొబైల్ వాడకం తగ్గించడం, మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులను సంప్రదించడం మంచిది.
స్లీప్ బ్యాంకింగ్
నిద్ర లేని రాత్రుల్ని ఎదుర్కోవడానికి, వారాంతం తర్వాత వచ్చే పని రోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, ముందుగానే అదనపు గంటలు నిద్ర పోవడం మంచిదేనా?
నిద్రను తర్వాతి అవసరాల కోసం 'దాచుకోవడం' వల్ల ప్రయోజనాలుంటాయా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి?
అధిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన మనసు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది.
రోజువారీ నిద్ర వేళలు సరిగ్గా లేకపోవడం, ఉదాహరణకు వీకెండ్స్ లో ఆలస్యంగా పడుకోవడం లేదా లేవడం వంటివి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతాయి.
రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకోవడం లేదా కెఫీన్ (కాఫీ, టీ) లేదా ఆల్కహాల్ వంటివి తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది.
రాత్రిపూట మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటివి ఎక్కువగా వాడటం వలన వాటి నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచి, నిద్ర రాకుండా చేస్తుంది.
నిద్రలేమికి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, స్లీప్ ఆప్నియా (నిద్రలో ఊపిరి ఆగిపోవడం), దీర్ఘకాలిక నొప్పి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
ఈ సమస్యలను అధిగమించడానికి, మీరు నిద్రపోయే ముందు చల్లని గదిలో ప్రశాంతంగా ఉండడం, మొబైల్ వాడకం తగ్గించడం, మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులను సంప్రదించడం మంచిది.
స్లీప్ బ్యాంకింగ్
టైమ్ దొరికినప్పుడు ఎక్కువ నిద్రపోయి దాన్ని బ్యాంక్ బ్యాలన్స్లాగా తర్వాత వాడుకోవచ్చా?
ఆరోగ్యచిట్కాలు
వారాంతం రావడానికి ముందే, అలారం ఆపేసి, కావల్సినంత సేపు నిద్ర పోవడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటారు. పని రోజుల్లో మిస్సయిన రెస్ట్ను తిరిగి పొందేందుకు వారాంతాల్లో దొరికే ఈ సౌకర్యాన్ని వాడుకోవడం సాధారణ వ్యూహం.
అయితే మనం దీని గురించి కరెక్టుగానే ఆలోచిస్తున్నామా?
అయితే మనం దీని గురించి కరెక్టుగానే ఆలోచిస్తున్నామా?
నిద్ర లేని రాత్రుల్ని ఎదుర్కోవడానికి, వారాంతం తర్వాత వచ్చే పని రోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, ముందుగానే అదనపు గంటలు నిద్ర పోవడం మంచిదేనా?
నిద్రను తర్వాతి అవసరాల కోసం 'దాచుకోవడం' వల్ల ప్రయోజనాలుంటాయా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి?
స్లీప్ బ్యాంకింగ్- మీరు తక్కువ నిద్రపోయే అవకాశం ఉన్న సమయానికి ముందే అనేక రాత్రులు ఎక్కువ సేపు నిద్రపోవడం.
కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇది ప్రభావవంతమైన వ్యూహం కావచ్చు.
దీని వల్ల మెదడు కీలకమైన వనరులను నిల్వ చేసుకోవడంతో పాటు నిద్ర లేమి వల్ల సమస్యలు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి ఇది సాయపడుతుందనేది పరిశోధకుల అభిప్రాయం.
టిక్టాక్లో వీడియోలు చేసే వెల్నెస్ ఔత్సాహికుల్ల ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.
ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది 'సేఫ్టీ నెట్' లాంటిదని వారి అభిప్రాయం.
స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం యూటా స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ట్రేసీ రుప్ నేతృత్వంలోని ఈ బృందం వివిధ ఆపరేషన్లు చేపట్టడానికి ముందు సైనికుల అప్రమత్తతను మెరుగుపరిచే మార్గాల్ని పరిశోధిస్తోంది.
24 మంది సైనికుల్ని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రాత్రి 7 గంటలు, మరో గ్రూపు 10 గంటలు నిద్రపోయేందుకు అనుమతించారు.
తర్వాత వారు తమ రోజు వారీ జీవితంలో 8 గంటల నిద్ర పోవడానికి ముందు ఒక వారం రోజులు రెండు గ్రూపుల వారిని 3 గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు.
ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 10 గంటలు నిద్రపోయినవారు 7 గంటలు నిద్రపోయిన వారి కంటే చురుగ్గా ఉన్నారు. నిద్ర వారికి నియంత్రణలో ఉంది.
నిద్ర లేని రాత్రులకు ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది మానసిక, శారీరక రోగ నిరోధకశక్తిగా పని చేస్తుందని అనేక ఏళ్లపాటు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.
2023లో మయామిలోని ఒక ఆసుపత్రిలో వైద్యులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో నైట్ షిఫ్టులో పని చేసే డాక్టర్లు మూడు రోజుల పాటు వారి రోజు వారీ నిద్ర సమయం గంటన్నర అదనంగా నిద్రపోవడం వల్ల రెండు వారాల తర్వాత షిఫ్టులలో మెరుగ్గా పని చేసినట్లు తేలింది.
క్రీడాకారుల విషయంలోనూ ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
సెయిలింగ్ చేసే క్రీడాకారులు స్లీప్ బ్యాంకింగ్ను ఫాలో అవుతారు. అదనపు సమయం నిద్ర వల్ల సెయిలర్లు రెగట్టా పోటీల్లో లోపాలు చేయకుండా, వేగంగా పడవను నడిపారు.
మూడు వారాలు రోజుకు 10 గంటలు నిద్ర పోయే రగ్బీ ఆటగాళ్లు, తమపై శారీరక ఒత్తిడి తక్కువగా ఉందని చెప్పారు.
టెన్నిస్ ఆటగాళ్లు వారం రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోయినప్పుడు వారు సర్వీస్ బాగా పడినట్లు తేలింది.
5 నుంచి 7 వారాలు ఎక్కువ నిద్రపోయిన బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో షాట్ కొట్టే కచ్చితత్వం పెరిగింది. వాళ్లు వేగంగా పరుగెత్తగలిగారు.
స్లీప్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ అది వివాదాస్పదంగానే ఉంది.
మనం మనం ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నిద్రను తగ్గించుకునే ఉద్దేశంతో నిద్రను 'నిల్వ చేయడం' సాధ్యం కాదని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.
శరీరం నిజంగా భవిష్యత్ కోసం నిద్రను నిల్వ చేస్తుందా? లేక అంతకు ముందు శరీరానికి అందని నిర్ణీత గంటల నిద్రను భర్తీ చేస్తుందా అనేది గుర్తించడం కష్టమనేది వారి వాదన.
షిఫ్టు వర్కర్లలో స్లీప్ బ్యాంకింగ్ గురించి నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాలు చర్చకు దారి తీశాయి. దైనందిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వారి పనితీరు మెరుగుదలలో ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.
ఈ వాదనకు కారణం మన శరీరానికి నిద్ర ఎందుకు అవసరం ప్రశ్న.
"మనం ఎందుకు నిద్రపోతాం అనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి" అని హాకెన్సాక్ మెరిడియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో స్లీప్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ పోలోస్ చెప్పారు
"నిద్రలో మన జీవక్రియ, హార్మోన్లు, నాడీ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిద్రపోయే సమయం మెదడుకు, మన ఆలోచనలను ఏకీకృతం చేయడానికి లేదా అందులో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన సమయం అని భావిస్తారు" అని ఆయన వివరించారు.
రాత్రిపూట నిద్ర లేమితో బాధ పడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటు తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?
శారీరంగా చూస్తే మన శరీరంలోని వేల కోట్ల కణాలకు నిద్ర చాలా అవసరం
"మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ఇంధనం నింపడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఆరోగ్యరమైన నిద్ర అవసరం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖేల్ హోవెల్ చెప్పారు.
"రోజంతా మన శరీరంలో, మెదడులో వివిధ రకాల అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. మనం నిద్ర పోయినప్పుడు మెదడు వాటిని తుడిచి పెట్టేస్తుంది" అని హోవెల్ అన్నారు.
"అనేకమంది పెద్దవాళ్లు రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు బాగా పని చేస్తారని హోవెల్ చెప్పారు.
నాలుగైదు గంటలే నిద్రపోయే వాళ్లు చాలా అరుదుగా ఉంటారనేది ఆయన అభిప్రాయం.
అందుకే నిద్రలేమి, తీవ్రమైన నిద్ర లోపం చాలా హానికరం.
"మనకు ఒక గంట నిద్ర తక్కువైతే తట్టుకోలగం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితేనే సమస్య. దీని ప్రభావం మొత్తంగా మన పనితీరు మీద, సామాజిక జీవితం మీద పడుతుంది" అని పోలోస్ చెప్పారు.
తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు వ్యర్థాలను బయటకు పంపదు. అంటే మీరు సరిగ్గా నిద్రపోని రాత్రి తర్వాతి రోజు ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇబ్బంది పడవచ్చని హోవెల్ చెప్పారు.
శరీరంలో న్యూరోనల్ వేస్ట్ను బయటకు పంపడానికి మెదడుకు అవసరమైన మరింత సమయాన్ని స్లీప్ బ్యాంకింక్ ఇస్తుందని రుప్, ఆమె సహచరులు భావిస్తున్నారు.
అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడుకు అవసరమైన గ్లైకోజెన్ స్థాయిలను నింపడానికి కూడా అదనపు నిద్ర ఉపకరిస్తుందనేది వారి వాదన.
స్లీప్ బ్యాంకింగ్ మంచిదేనా?
నిద్ర మధ్యలో మెలకువ వచ్చే వారికెవరికైనా స్లీప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"మీరు కూడా స్లీప్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నించాలనుకుంటే, మీరు నిద్ర సరిపోని రోజులు ఎదురవుతాయని భావించినప్పుడు రోజుకు గంట సేపు అదనంగా నిద్రపోండి. అలా రెండు వారాలు అదనంగా మరో గంట నిద్ర పోయేందుకు ప్రయత్నించండి" అని హోవెల్ చెప్పారు.
ఇందుకోసం అలారంను ఆలస్యంగా లేచేందుకు వీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.
అయితే దీనికి విరుద్దంగా "కొంతమందికి ముందుగా పడుకోవడం మంచి వ్యూహం కావచ్చు. మీ శరీరం ఉదయం 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఉదయం 6 గంటలకు మేల్కొనే అవకాశం ఉంది" అని పోలోస్ చెబుతున్నారు.
మీరు ఇప్పటికే నిద్ర లేమితో బాధ పడుతూ ఉంటే స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ క్లెర్మాన్ ఈ ఆలోచనను తోసిపుచ్చారు.
"స్లీప్ బ్యాంకింగ్ జరుగుతుందని చూపించడానికి, ఎవరైనా అలసిపోనప్పుడు నిద్రపోగలరని మీరు చూపించాలి. అందుకు ఎలాంటిన ఆధారాలు లేవు" అని ఆమె చెప్పారు.
స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తే, గతంలో బాగా నిద్రపోయిన వారు తర్వాతి కాలంలో తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భావించే అవకాశం ఉందని క్లెర్మాన్ ఆందోళన చెందుతున్నారు.
"అలా చేయడం వల్ల వారు తమ ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రాథమికమైన దాన్ని కోల్పోతారు" అని ఆమె విశ్లేషించారు.
మనం భవిష్యత్తు కోసం నిద్రపోతున్నామా లేదా మనం చెల్లించాల్సిన అప్పును తీర్చుకుంటున్నామా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి రాత్రి అదనంగా అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు చిన్న కునుకు తీయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
స్లీప్ బ్యాంకింగ్ పనిచేసినా అది దీర్ఘకాలిక పరిష్కారం కాదని పోలోస్ అంటున్నారు.
"పడుకునే, మేల్కొనే సమయాల క్రమబద్ధమైన షెడ్యూల్ను క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. తగినంత పరిమాణంలో నాణ్యమైన నిద్రను ఆస్వాదించండి" అని పోలోస్ చెప్పారు.
కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇది ప్రభావవంతమైన వ్యూహం కావచ్చు.
దీని వల్ల మెదడు కీలకమైన వనరులను నిల్వ చేసుకోవడంతో పాటు నిద్ర లేమి వల్ల సమస్యలు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి ఇది సాయపడుతుందనేది పరిశోధకుల అభిప్రాయం.
టిక్టాక్లో వీడియోలు చేసే వెల్నెస్ ఔత్సాహికుల్ల ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.
ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది 'సేఫ్టీ నెట్' లాంటిదని వారి అభిప్రాయం.
స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం యూటా స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ట్రేసీ రుప్ నేతృత్వంలోని ఈ బృందం వివిధ ఆపరేషన్లు చేపట్టడానికి ముందు సైనికుల అప్రమత్తతను మెరుగుపరిచే మార్గాల్ని పరిశోధిస్తోంది.
24 మంది సైనికుల్ని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రాత్రి 7 గంటలు, మరో గ్రూపు 10 గంటలు నిద్రపోయేందుకు అనుమతించారు.
తర్వాత వారు తమ రోజు వారీ జీవితంలో 8 గంటల నిద్ర పోవడానికి ముందు ఒక వారం రోజులు రెండు గ్రూపుల వారిని 3 గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు.
ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 10 గంటలు నిద్రపోయినవారు 7 గంటలు నిద్రపోయిన వారి కంటే చురుగ్గా ఉన్నారు. నిద్ర వారికి నియంత్రణలో ఉంది.
నిద్ర లేని రాత్రులకు ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది మానసిక, శారీరక రోగ నిరోధకశక్తిగా పని చేస్తుందని అనేక ఏళ్లపాటు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.
2023లో మయామిలోని ఒక ఆసుపత్రిలో వైద్యులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో నైట్ షిఫ్టులో పని చేసే డాక్టర్లు మూడు రోజుల పాటు వారి రోజు వారీ నిద్ర సమయం గంటన్నర అదనంగా నిద్రపోవడం వల్ల రెండు వారాల తర్వాత షిఫ్టులలో మెరుగ్గా పని చేసినట్లు తేలింది.
క్రీడాకారుల విషయంలోనూ ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
సెయిలింగ్ చేసే క్రీడాకారులు స్లీప్ బ్యాంకింగ్ను ఫాలో అవుతారు. అదనపు సమయం నిద్ర వల్ల సెయిలర్లు రెగట్టా పోటీల్లో లోపాలు చేయకుండా, వేగంగా పడవను నడిపారు.
మూడు వారాలు రోజుకు 10 గంటలు నిద్ర పోయే రగ్బీ ఆటగాళ్లు, తమపై శారీరక ఒత్తిడి తక్కువగా ఉందని చెప్పారు.
టెన్నిస్ ఆటగాళ్లు వారం రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోయినప్పుడు వారు సర్వీస్ బాగా పడినట్లు తేలింది.
5 నుంచి 7 వారాలు ఎక్కువ నిద్రపోయిన బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో షాట్ కొట్టే కచ్చితత్వం పెరిగింది. వాళ్లు వేగంగా పరుగెత్తగలిగారు.
స్లీప్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ అది వివాదాస్పదంగానే ఉంది.
మనం మనం ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నిద్రను తగ్గించుకునే ఉద్దేశంతో నిద్రను 'నిల్వ చేయడం' సాధ్యం కాదని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.
శరీరం నిజంగా భవిష్యత్ కోసం నిద్రను నిల్వ చేస్తుందా? లేక అంతకు ముందు శరీరానికి అందని నిర్ణీత గంటల నిద్రను భర్తీ చేస్తుందా అనేది గుర్తించడం కష్టమనేది వారి వాదన.
షిఫ్టు వర్కర్లలో స్లీప్ బ్యాంకింగ్ గురించి నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాలు చర్చకు దారి తీశాయి. దైనందిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వారి పనితీరు మెరుగుదలలో ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.
ఈ వాదనకు కారణం మన శరీరానికి నిద్ర ఎందుకు అవసరం ప్రశ్న.
"మనం ఎందుకు నిద్రపోతాం అనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి" అని హాకెన్సాక్ మెరిడియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో స్లీప్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ పోలోస్ చెప్పారు
"నిద్రలో మన జీవక్రియ, హార్మోన్లు, నాడీ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిద్రపోయే సమయం మెదడుకు, మన ఆలోచనలను ఏకీకృతం చేయడానికి లేదా అందులో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన సమయం అని భావిస్తారు" అని ఆయన వివరించారు.
రాత్రిపూట నిద్ర లేమితో బాధ పడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటు తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?
శారీరంగా చూస్తే మన శరీరంలోని వేల కోట్ల కణాలకు నిద్ర చాలా అవసరం
"మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ఇంధనం నింపడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఆరోగ్యరమైన నిద్ర అవసరం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖేల్ హోవెల్ చెప్పారు.
"రోజంతా మన శరీరంలో, మెదడులో వివిధ రకాల అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. మనం నిద్ర పోయినప్పుడు మెదడు వాటిని తుడిచి పెట్టేస్తుంది" అని హోవెల్ అన్నారు.
"అనేకమంది పెద్దవాళ్లు రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు బాగా పని చేస్తారని హోవెల్ చెప్పారు.
నాలుగైదు గంటలే నిద్రపోయే వాళ్లు చాలా అరుదుగా ఉంటారనేది ఆయన అభిప్రాయం.
అందుకే నిద్రలేమి, తీవ్రమైన నిద్ర లోపం చాలా హానికరం.
"మనకు ఒక గంట నిద్ర తక్కువైతే తట్టుకోలగం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితేనే సమస్య. దీని ప్రభావం మొత్తంగా మన పనితీరు మీద, సామాజిక జీవితం మీద పడుతుంది" అని పోలోస్ చెప్పారు.
తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు వ్యర్థాలను బయటకు పంపదు. అంటే మీరు సరిగ్గా నిద్రపోని రాత్రి తర్వాతి రోజు ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇబ్బంది పడవచ్చని హోవెల్ చెప్పారు.
శరీరంలో న్యూరోనల్ వేస్ట్ను బయటకు పంపడానికి మెదడుకు అవసరమైన మరింత సమయాన్ని స్లీప్ బ్యాంకింక్ ఇస్తుందని రుప్, ఆమె సహచరులు భావిస్తున్నారు.
అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడుకు అవసరమైన గ్లైకోజెన్ స్థాయిలను నింపడానికి కూడా అదనపు నిద్ర ఉపకరిస్తుందనేది వారి వాదన.
స్లీప్ బ్యాంకింగ్ మంచిదేనా?
నిద్ర మధ్యలో మెలకువ వచ్చే వారికెవరికైనా స్లీప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"మీరు కూడా స్లీప్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నించాలనుకుంటే, మీరు నిద్ర సరిపోని రోజులు ఎదురవుతాయని భావించినప్పుడు రోజుకు గంట సేపు అదనంగా నిద్రపోండి. అలా రెండు వారాలు అదనంగా మరో గంట నిద్ర పోయేందుకు ప్రయత్నించండి" అని హోవెల్ చెప్పారు.
ఇందుకోసం అలారంను ఆలస్యంగా లేచేందుకు వీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.
అయితే దీనికి విరుద్దంగా "కొంతమందికి ముందుగా పడుకోవడం మంచి వ్యూహం కావచ్చు. మీ శరీరం ఉదయం 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఉదయం 6 గంటలకు మేల్కొనే అవకాశం ఉంది" అని పోలోస్ చెబుతున్నారు.
మీరు ఇప్పటికే నిద్ర లేమితో బాధ పడుతూ ఉంటే స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ క్లెర్మాన్ ఈ ఆలోచనను తోసిపుచ్చారు.
"స్లీప్ బ్యాంకింగ్ జరుగుతుందని చూపించడానికి, ఎవరైనా అలసిపోనప్పుడు నిద్రపోగలరని మీరు చూపించాలి. అందుకు ఎలాంటిన ఆధారాలు లేవు" అని ఆమె చెప్పారు.
స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తే, గతంలో బాగా నిద్రపోయిన వారు తర్వాతి కాలంలో తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భావించే అవకాశం ఉందని క్లెర్మాన్ ఆందోళన చెందుతున్నారు.
"అలా చేయడం వల్ల వారు తమ ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రాథమికమైన దాన్ని కోల్పోతారు" అని ఆమె విశ్లేషించారు.
మనం భవిష్యత్తు కోసం నిద్రపోతున్నామా లేదా మనం చెల్లించాల్సిన అప్పును తీర్చుకుంటున్నామా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి రాత్రి అదనంగా అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు చిన్న కునుకు తీయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
స్లీప్ బ్యాంకింగ్ పనిచేసినా అది దీర్ఘకాలిక పరిష్కారం కాదని పోలోస్ అంటున్నారు.
"పడుకునే, మేల్కొనే సమయాల క్రమబద్ధమైన షెడ్యూల్ను క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. తగినంత పరిమాణంలో నాణ్యమైన నిద్రను ఆస్వాదించండి" అని పోలోస్ చెప్పారు.
Maila and Suthakam - మైల మరియు సూతకం
మైల మరియు సూతకం
ఎప్పుడు ఎలా...........!!మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి.
తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు.
సూతకం రెండురకాలు. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు.
సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు.
వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును.
మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది.
ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం.
తప్పనిసరి పరిస్థితి కలిగితే ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు.
ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది.
సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.
తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు.
మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.
వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల తరవాత అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు.
చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు.
బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.
Meaning of the mantra - మంత్రం అర్దం
మంత్రం అర్దం
రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురు వశిష్ఠుడు దగ్గర విద్యాభ్యాసం చేసారు.
ఒకనాడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వున్నారు. గురువు వశిష్ఠుడు వారందరి చిరు మందహాస ప్రశాంత వదనాలు చూసి - నాయన లక్ష్మణ చాలా ప్రశాంతంగా వున్నావు. అని అడుగగా,
అవును గురువుగారు నాకు ఈ సమయం నా తల్లి చూడాలని వుంది. నా తల్లి సాన్నిహిత్యం, వారి ప్రేమ పొందాలని వుంది! అని తెలుపగా,
పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!!
పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!!
అప్పుడు వశిష్ఠుడు. "అంతే నంటవా రామ! నీవు చెప్పు దీనికి సమాధానం'. దానికి రాముడు "గురువు గారు మా తల్లి యెుక్క ప్రేమ సాన్నిహిత్యం మేము పొందగలం, ఇక్కడనుండే? అదెలా? అది ధ్యానం ద్వారా!
అదెలా చెప్పు రామా!
నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!
వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.
మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!
ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.
పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?
వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!
మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!
రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!
గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"
ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!
సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.
ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.
భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!
ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!
ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే
"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!
బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.
అదెలా చెప్పు రామా!
నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!
వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.
మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!
ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.
పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?
వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!
మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!
రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!
గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"
ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!
సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.
ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.
భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!
ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!
ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే
"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!
బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.
64 Yoginis - 64 యోగినీలు
64 యోగినీలు
తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు దుర్గా/పార్వతి యొక్క వివిధ అంశాలే ఈ 64 శక్తి స్వరూపాలు.
64 యోగినీలు - అష్టమాత్రుకల యొక్క అధీనంలో ఉంటాయి.
అష్టమాత్రుకలు - ప్రధాన నాయికా దేవతలు
1. బ్రాహ్మీ : మహావిద్యా, సరస్వతి, అంబిక, గాయత్రీ, సావిత్రీ, వాగ్దేవి, ధీశక్తి
2. మహేశ్వరి : రుద్రాణీ, కాళీ, త్రిపురభైరవి, భవానీ, శివదూతి, భైరవి, దక్షిణకాళీ
3. కౌమారి: స్కందమాత, సేనాని, శక్తి, కుమారి, గుహ్యకాళి, సుబ్రహ్మణ్యశక్తి, శక్తి దేవి
4. వైష్ణవి: మాధవి, నారాయణి, లక్ష్మీ, గోవింది, కామాక్షి, శాంతి, విష్ణుమాయ
5. వారాహీ: ధూమావతీ, బగళాముఖి, చిన్నమస్తా దేవి, త్రిపురసుందరీ, భువనేశ్వరీ, తారాదేవి, కామేశ్వరి.
6. ఇంద్రాణీ: అహల్య, శచి, వజ్రిణి, తేజస్విని, స్వర్ణకాంతి, జ్వాలాముఖి, అధితి
7. చాముండ: కాళరాత్రి, కాపాలిని, రక్తదంతికా, ఉగ్రచండా, భద్రకాళి, శూలిని, కాళీ
8. మహాలక్ష్మీ: కమలాత్మికా, అన్నపూర్ణ, శ్రీదేవి, పద్మావతి, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ
అయితే వివిధ పురాణాల ప్రకారం, తంత్ర గ్రంధాల ప్రకారం వారి యొక్క పేర్లు మారుతాయి.
తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు దుర్గా/పార్వతి యొక్క వివిధ అంశాలే ఈ 64 శక్తి స్వరూపాలు.
64 యోగినీలు - అష్టమాత్రుకల యొక్క అధీనంలో ఉంటాయి.
అష్టమాత్రుకలు - ప్రధాన నాయికా దేవతలు
1. బ్రాహ్మీ : మహావిద్యా, సరస్వతి, అంబిక, గాయత్రీ, సావిత్రీ, వాగ్దేవి, ధీశక్తి
2. మహేశ్వరి : రుద్రాణీ, కాళీ, త్రిపురభైరవి, భవానీ, శివదూతి, భైరవి, దక్షిణకాళీ
3. కౌమారి: స్కందమాత, సేనాని, శక్తి, కుమారి, గుహ్యకాళి, సుబ్రహ్మణ్యశక్తి, శక్తి దేవి
4. వైష్ణవి: మాధవి, నారాయణి, లక్ష్మీ, గోవింది, కామాక్షి, శాంతి, విష్ణుమాయ
5. వారాహీ: ధూమావతీ, బగళాముఖి, చిన్నమస్తా దేవి, త్రిపురసుందరీ, భువనేశ్వరీ, తారాదేవి, కామేశ్వరి.
6. ఇంద్రాణీ: అహల్య, శచి, వజ్రిణి, తేజస్విని, స్వర్ణకాంతి, జ్వాలాముఖి, అధితి
7. చాముండ: కాళరాత్రి, కాపాలిని, రక్తదంతికా, ఉగ్రచండా, భద్రకాళి, శూలిని, కాళీ
8. మహాలక్ష్మీ: కమలాత్మికా, అన్నపూర్ణ, శ్రీదేవి, పద్మావతి, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ
అయితే వివిధ పురాణాల ప్రకారం, తంత్ర గ్రంధాల ప్రకారం వారి యొక్క పేర్లు మారుతాయి.
Names of Lord Vishnu - Meanings - విష్ణుమూర్తి పేర్లు - అర్థం
విష్ణుమూర్తి పేర్లు - అర్థం
విష్ణుమూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రతి పేరులో ఉన్న అర్థం ఏమిటి? విష్ణు పేరుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ ధర్మం లో అధికమాసం అని పిలువబడే మాసాన్ని పూర్తిగా విష్ణువుమూర్తికి అంకితం చేశారని పురాణాల్లో ఉంది. ఇది విష్ణువు ఆరాధన. హిందూ ధర్మంలో అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో విష్ణువును పిలుస్తారు. శ్రీహరి యొక్క ప్రతి పేరు దాని స్వంత నేపథ్యం, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల పెదవుల నుండి ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాము. విష్ణుమూర్తిని నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి...? తెలుసుకుందాం..
1. పురుషోత్తమ:
విష్ణువు పేరు పురుషోత్తమ అంటే 'పురుషులలో ఉత్తముడు'. విష్ణువు యొక్క ఈ పేరు అతని అనేక అవతారాలలో ఒకదానిని సూచిస్తుంది.
2. అచ్యుత
అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి విష్ణువుకు ఈ పేరు పెట్టారు.
3. హరి
విశ్వంలో పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మత విశ్వాసం. అందుకే విష్ణువును విశ్వ రక్షకుడిగా పేర్కొంటారు. హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను దాచేవాడు.
4. నారాయణ
ఇదివరకే మనం పురాణాలలో చెప్పుకున్నట్లుగా నారదుడు విష్ణువును నారాయణ, నారాయణ అని పిలిచేవాడు. నీరా అనేది నీటికి పర్యాయపదం, సంస్కృతంలో అమీర్ని ప్రత్యేక సందర్భాలలో నర అని కూడా పిలుస్తారు. నీరు మొదటి అధిష్ఠానం లేదా నివాసం. వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీ హరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటారు.
5. విష్ణువు
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామరపువ్వులవంటివి. కౌస్తుక పూసలతో అలంకరించబడి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ప్రయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తాడు. అందుకే నారాయణుడిని విష్ణువు అంటారు.
విష్ణుమూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రతి పేరులో ఉన్న అర్థం ఏమిటి? విష్ణు పేరుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ ధర్మం లో అధికమాసం అని పిలువబడే మాసాన్ని పూర్తిగా విష్ణువుమూర్తికి అంకితం చేశారని పురాణాల్లో ఉంది. ఇది విష్ణువు ఆరాధన. హిందూ ధర్మంలో అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో విష్ణువును పిలుస్తారు. శ్రీహరి యొక్క ప్రతి పేరు దాని స్వంత నేపథ్యం, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల పెదవుల నుండి ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాము. విష్ణుమూర్తిని నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి...? తెలుసుకుందాం..
1. పురుషోత్తమ:
విష్ణువు పేరు పురుషోత్తమ అంటే 'పురుషులలో ఉత్తముడు'. విష్ణువు యొక్క ఈ పేరు అతని అనేక అవతారాలలో ఒకదానిని సూచిస్తుంది.
2. అచ్యుత
అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి విష్ణువుకు ఈ పేరు పెట్టారు.
3. హరి
విశ్వంలో పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మత విశ్వాసం. అందుకే విష్ణువును విశ్వ రక్షకుడిగా పేర్కొంటారు. హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను దాచేవాడు.
4. నారాయణ
ఇదివరకే మనం పురాణాలలో చెప్పుకున్నట్లుగా నారదుడు విష్ణువును నారాయణ, నారాయణ అని పిలిచేవాడు. నీరా అనేది నీటికి పర్యాయపదం, సంస్కృతంలో అమీర్ని ప్రత్యేక సందర్భాలలో నర అని కూడా పిలుస్తారు. నీరు మొదటి అధిష్ఠానం లేదా నివాసం. వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీ హరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటారు.
5. విష్ణువు
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామరపువ్వులవంటివి. కౌస్తుక పూసలతో అలంకరించబడి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ప్రయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తాడు. అందుకే నారాయణుడిని విష్ణువు అంటారు.
Subscribe to:
Posts (Atom)
Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర
పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...