Friday, June 19, 2026

Sri Mahamaya Devi Temple, Ratanpur, Chhattisgarh - శ్రీ మహామాయా దేవి ఆలయం, రతన్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్

శ్రీ మహామాయా దేవి ఆలయం, రతన్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్

శ్రీ మహామాయా దేవి ఆలయం, దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి దేవతలకు నిలయమైన దేవాలయం. ఇది 12వ శతాబ్దానికి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం. 52 శక్తి పీఠాలలో ఒకటి.

ఇది 16 రాతి స్తంభాల నిర్మాణం. 

అంతే కాదు నవరాత్రుల సమయంలో భక్తులు వెలిగించే "జ్యోతి కలశం" తో ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం.

చారిత్రక ప్రాముఖ్యత:12వ-13వ శతాబ్దంలో కలాచూరి రాజవంశం ఆధ్వర్యంలో మహామాయ దేవి ఆలయం నిర్మించబడింది. ఇక్కడి అధిష్టాన దేవతను కోసలేశ్వరి (ప్రాచీన దక్షిణ కోసల్ ప్రాంతపు దేవత) అని కూడా పిలుస్తారు.

ఇది రత్నపుర కలాచూరీల పాలనలో నిర్మించబడింది. రాజు రత్నదేవుడు కాళీదేవి దర్శనం చేసుకున్న ప్రదేశంలో ఇది ఉందని చెబుతారు.

వాస్తవానికి ఈ ఆలయం మహా కాళి, మహా లక్ష్మి మరియు మహా సరస్వతి అనే ముగ్గురు దేవతల కోసం నిర్మించబడింది. తరువాత, మహా కాళి పాత ఆలయాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత, మహా లక్ష్మి మరియు మహా సరస్వతి దేవతల కోసం బహార్ సాయి రాజు ఒక కొత్త (ప్రస్తుత) ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం విక్రమ సంవత్సరం 1552 (క్రీ.శ. 1492)లో నిర్మించబడింది. ఆలయం సమీపంలో చెరువులు ఉన్నాయి. ప్రాంగణంలో శివ మరియు హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాయి . సాంప్రదాయకంగా మహామాయ రతన్‌పూర్ సంస్థానానికి కులదేవి . ఈ ఆలయాన్ని వాస్తుశిల్ప విభాగం పునరుద్ధరించింది.

జంట విగ్రహం: ప్రధాన గర్భగుడిలో ఒక అద్భుతమైన జంట విగ్రహం ఉంది. ముందు విగ్రహం మహిషాసురమర్దినిని సూచిస్తుండగా, వెనుక విగ్రహం సరస్వతీ దేవిదని నమ్ముతారు. 

అఖండ జ్యోతి కలశం: చైత్ర, శరద్ నవరాత్రుల సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి, తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలిగే ప్రత్యేక నూనె దీపాలను (జ్యోతి కలశాలను) వెలిగిస్తారు.

మహామాయ దేవాలయం ఒక పెద్ద నీటి చెరువు పక్కన ఉత్తరం వైపుకు అభిముఖంగా నాగరా శైలి వాస్తుకళలో నిర్మించబడింది. ఒకప్పుడు రతన్‌పూర్ రాజ్యానికి చెందిన ఈ దేవాలయం మరియు రాజ గృహం ఉన్న అనేక అనుబంధ దేవాలయాలు, గోపురాలు, రాజభవనాలు మరియు కోటలను ఇప్పుడు చూడవచ్చు.

ఈ సముదాయంలో కాంతిదేవల్ ఆలయం కూడా ఉంది, ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. దీనిని 1039లో సంతోష్ గిరి అనే సన్యాసి నిర్మించాడని చెబుతారు, తరువాత 15వ శతాబ్దంలో కల్చూరి రాజు పృథ్వీదేవ II దీనిని విస్తరించాడు. దీనికి నాలుగు ద్వారాలు మరియు అందమైన శిల్పాలు ఉన్నాయి. దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు . గర్భగుడి మరియు మండపం ఎంతో ఆకర్షణీయమైన శిల్ప కళతో ఆకర్షిస్తుంది. దీనిని 18వ శతాబ్దం చివరలో మరాఠా కాలంలో నిర్మించారు.

కొన్ని కిలోమీటర్ల దూరంలో, శివశక్తి ఆరాధకులైన కల్చూరి రాజులు నిర్మించిన 11వ శతాబ్దానికి చెందిన పురాతన కడైడియోల్ శివాలయం శిథిలాలు ఒక కొండపైన ఉన్నాయి. ఈ ఆలయాన్ని కూడా పురావస్తు శాఖ పునరుద్ధరించడానికి ప్రణాళిక చేస్తోంది.

నవరాత్రి పండుగ సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతికలశాలు వెలిగించినప్పుడు , ప్రజలు ఆలయానికి పోటెత్తుతారు.

ఆలయ సంరక్షకుడిగా కాలభైరవుడిని భావిస్తారు , అతని ఆలయం జాతీయ రహదారిపై ఆలయానికి వెళ్లే దారిలో ఉంది.

ఇతర దేవాలయాలు: సమీపంలోని కాంతి దేవల్ మరియు కాలభైరవ ఆలయాల సముదాయం.

రోడ్డు మార్గం: బిలాస్‌పూర్-అంబికాపూర్ రాష్ట్ర రహదారి, రతన్‌పూర్, ఛత్తీస్‌గఢ్ (పిన్: 495442).

దూరం: బిలాస్‌పూర్ నుండి సరిగ్గా 25 కి.మీ. మరియు రాజధాని రాయ్‌పూర్ నుండి సుమారు 155 కి.మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం: బిలాస్‌పూర్ జంక్షన్ (సుమారు 30 కి.మీ. దూరంలో), భారతదేశంలోని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానించబడి ఉంది.

విమాన మార్గం: 38 కి.మీ వద్ద బిలాసా దేవి కేవత్ విమానాశ్రయం (బిలాస్పూర్), లేదా స్వామి వివేకానంద విమానాశ్రయం (రాయ్పూర్) 155 కి.మీ.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Swati Nakshatra - స్వాతి నక్షత్రము

స్వాతి నక్షత్రము

నక్షత్రం - స్వాతి

అధిపతి - రాహువు

గణము - దేవ

జాతి - పురుష

వృక్షం - మద్ది

జంతువు - మహిషము

నాడి - అంత్య

పక్షి - మయూరము

అధిదేవత - వాయువు

రాశి - తుల

స్వాతి నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో స్వాతి నక్షత్రం పదిహేనవది. ఇది లక్ష్మీ నృసింహ స్వామి, మౌక్తిక మణి జన్మ నక్షత్రంగా పేరొందినది. ఈ నక్షత్రానికి శాంతి లేదు. గ్రహణాది దోషములు ఉన్న శాంతి అవసరం. స్వాతి నక్షత్రాధిపతి రాహువు.

స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు.

స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు.

కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్ధికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది.

శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

వీరు కష్టపడి పనిచేస్తారు మరియు పడే కష్టం ఆధారంగా విజయాన్ని సాధించే ధైర్యం ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. కష్టపడి పనిచేయడంతో పాటుగా, వీరు చాకచక్యాన్ని సైతం ఉపయోగిస్తారు మరియు పనులు పూర్తయ్యేట్లుగా చేయడంలో వీరు సమర్థవంతులు.

వీరికి చక్కటి స్వభావం ఉంటుంది, అందువల్లనే ప్రజలతో వీరికి చక్కటి సంబంధాలుంటాయి. వీరి యొక్క స్వభావం మరియు ప్రవర్తన కారణంగా, ప్రజలు విశ్వసిస్తారు. ప్రజల పట్ల చక్కటి అభిప్రాయాలు ఉంటాయి కనుక, వారి మద్దతు పొందుతారు మరియు సమాజంలో చక్కటి పేరుప్రఖ్యాతుంటాయి, ఇతర వ్యక్తుల పట్ల దయ మరియు సానుభూతి ఉంటాయి.

స్వేచ్చా మనస్తత్వంతో, ఒత్తిడిలో పనిచేయడానికి ఇష్టపడరు. అందువల్లనే, ఏది చేసినా దానిలో సంపూర్ణ స్వేచ్ఛను వీరు ఆశిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో, దేనిలోనైనా మీరు విజయవంతం అవుతారు. అందువల్ల, ఉద్యోగం, వ్యాపార కోణంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. వీరి ద్వారా చేయబడే ప్రతిపని కూడా సరైన ప్లాన్ ఎంతో సహనంగా చేయబడుతుంది.

లక్ష్యాన్ని సాధించడం కొరకు వీరు ఎన్నడూ త్వరపడరు. ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది. భక్తిభావనతో సామాజిక నిబంధనలు మరియు సంప్రదాయాలను పాటిస్తారు. ఆలోచనలు ప్రశాంతంగా, దృఢంగాను ఉంటాయి. వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం కొరకు, చాలా సమయాన్ని గడుపుతారు. ఎలాంటి వివక్షత లేకుండా వీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అవసరం ఉన్నవారికి మరియు చెడు చేసిన శత్రువుకు సైతం వీరు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. వీరు చాలా దృఢంగాను మరియు కష్టపడి పనిచేస్తారు.


స్వాతి నక్షత్రము మొదటి పాదము
స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. దేవగణ ప్రధానులు కాబట్టి వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది.

ఈ నక్షత్ర జాతకులు రాహుదశలో జన్మించడంవల్ల కొన్ని సమస్యలు ఎదురైనా తల్లితండ్రుల చాటున కష్టం తెలియకుండా సాగిపోతుంది. వీరికి హైస్కులు తరువాత గురు దశ కాలంలో కాలేజి విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. 16 సంవత్సరాలకే గురు దశ వస్తుంది కనుక సౌఖ్యవంతమైన జీవితం మొదలవుతుంది.

విద్యలో చక్కని అభివృద్ధి సాధించి ఉద్యోగాలలో స్థిరపడతారు. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం వీరికి అత్యవసరం. లేకుంటే 32 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధిక మవుతాయి. దీంతో అనేక ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం ఉంటుంది. ఇక మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము రెండవ పాదము
స్వాతి నక్షత్రము దేవగణ ప్రధానులు కనుక రెండో పాదములోని జన్మనక్షత్రులు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద శని రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి బద్ధకం కొంచం ఎక్కువ. అయినప్పటికీ పని ఆరంభించారంటే బాగా శ్రమించి పని పూర్తి చేస్తారు.

వీరికి రాహుదశ దాదాపు 11 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు.

27 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 46 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కొంచెం కుదుటపడతాయి. ఇక మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము మూడవ పాదము
వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద గురు గ్రహ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ పని మొదలు పెట్టారంటే బాగా శ్రమించి పని చేస్తారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. స్థిరమైన అభిప్రాయలు ఉంటాయి.

వీరికి రాహుదశ దాదాపు 7 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక ఆరంభంలో రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. 23 సంవత్సరాల నుంచి ఉండే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.

42 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 59 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 66 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్య దశ కూడా సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము నాలుగవ పాదము
స్వాతి నక్షత్రం నాల్గవ పాదంలో జన్మించిన వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు. వీరి మీద గురు గ్రహ ప్రభావం ఉంటుంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం ఉండవచ్చు.

ఈ నక్షత్ర జాతకులకు రాహుదశ దాదాపు మూడు సంవత్సరాల కాలం ఉంటుంది. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులలో కొంత మందకొడితనం ఉంటుంది. ప్రయత్నంతో విజయం సాధించవచ్చు. జీవితంలో త్వరగా స్థిరపడతారు.

19 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల శని దశ కాలం ఉంటుంది.. కాబట్టి ఆ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 38 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 55 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 62 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగిపోతుంది.


స్వాతి నక్షత్ర జాతకులు పెంచాల్సిన వృక్షం:
స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును పెంచడం, పూజించడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ వృక్షాన్ని సంరక్షించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది.

స్వాతి నక్షత్ర జాతకుల తారాఫలాలు:
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - శరీరశ్రమ

సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ధన లాభం

విపత్తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - కార్యహాని

సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - క్షేమం

ప్రత్యక్ తార - అశ్విని, మఖ, మూల - ప్రయత్న భంగం

సాధన తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - బంధనం

మిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం

అతిమిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: 2 కిలోల శనగపప్పు దైవ ధ్యాసలో గడిపే వారికి దానం చేయాలి.

నక్షత్ర మంత్రం:

।। ఓం ।।
వాయుర్నక్షత్రమభ్యే'తి నిష్ట్యా”మ్ ।
తిగ్మశృం'గో వృషభో రోరు'వాణః ।
సమీరయన్ భువ'నా మాతరిశ్వా" ।
అప ద్వేషాగ్మ్'సి నుదతామరా'తీః ।
తన్నో' వాయస్తదు నిష్ట్యా' శృణోతు ।
తన్నక్షత్రం భూరిదా అ’స్తు మహ్యమ్” ।
తన్నో' దేవాసో అను'జానంతు కామమ్” ।
యథా తరే’మ దురితానివిశ్వా” ॥

Thursday, June 18, 2026

Srivari Sankhu Chakralu(The Lord's Conch and Discus) - శ్రీవారి శంఖు చక్రాలు

శ్రీవారి శంఖు చక్రాలు

శంఖు చక్రాలు
స్వామి కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో పాంచజన్య శంఖం. ఇవి ఆయుధాలు కావు, ఆభరణాలు.

బంగారంతో చేసి, రత్నాలు పొదిగి ఉంటాయి. రోజూ ఉదయం అర్చకులు స్వామి చేతుల్లో అమర్చుతారు.

శంఖు చక్రాల కథ:

చక్రం కథ: సుదర్శనం అంటే మంచి దర్శనం ఇచ్చేది. విష్ణువు కోరిక మేరకు అగ్ని దేవుడు విశ్వకర్మతో చేయించాడు. కోటి సూర్యుల తేజస్సు ఉంది. ధర్మాన్ని రక్షిస్తుంది, అధర్మాన్ని నాశనం చేస్తుంది.

శంఖం కథ: పాంచజన్యం అంటే 5 రకాల జ్ఞానం ఇచ్చేది. సముద్ర మథనంలో పుట్టింది. స్వామి ఊదితే ధర్మం వైపు నిలబడే వాళ్లకు ధైర్యం, అధర్మం చేసే వాళ్లకు భయం వస్తుంది.

రహస్యం: స్వామి చేతుల్లో శంఖ చక్రాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయట. మన కంటికి కనిపించవు. భక్తుల కర్మలు చూసి చక్రం తిరుగుతుంది.

నమ్మకం: శంఖ చక్రాలతో స్వామిని దర్శిస్తే శత్రు భయం పోతుంది. కోర్టు కేసులు, గొడవలు ఉన్నవారు "ఓం సుదర్శనాయ నమః" అంటే పరిష్కారం దొరుకుతుంది.

పురాణం కథనం:

సుదర్శన చక్రం: శివ పురాణం ప్రకారం, రాక్షసుల బాధలు భరించలేక దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. వారిని రక్షించడానికి విష్ణువు కైలాసానికి వెళ్లి, పరమశివుడిని వేయి నామాలతో అర్చిస్తూ వెయ్యి తామర పూలతో పూజించడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి భక్తిని పరీక్షించడానికి శివుడు ఆ పూలలో ఒక పూవును దాచిపెడతాడు. ఒక పూవు తక్కువైందని గమనించిన విష్ణువు, తన కన్ను తామర పువ్వులా ఉంటుందని భావించి ఆ కంటినే శివునికి సమర్పించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, విష్ణువు భక్తికి మెచ్చి త్రిలోకాలను జయించగల శక్తిని కలిగిన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు.

పాంచజన్యం: ద్వాపర యుగంలో బలరాముడు, కృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన సమయంలో ఒక సారి సాందీపముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా కెరటాల ఉధృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను రాక్షసుడు మింగివేసాడు. గురు పుత్రుడు ఆ రాక్షసుని శరీరము నందున్న శంఖము లోకి ప్రవేశించెను. బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణగా అతని పుత్రుడుని తీసుకు రావాలని తలచి, గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను. అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను. ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను.

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Sri Brahmasutra Marakata Shivalinga Devasthanam, Chandippa Village, Shankarpally, Ranga Reddy District, Telangana - శ్రీ బ్రహ్మసూత్ర మరకత ​​శివలింగం దేవస్థానం, చండిప్ప గ్రామం, శంకర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

శ్రీ బ్రహ్మసూత్ర మరకత ​​శివలింగం దేవస్థానం, చండిప్ప గ్రామం, శంకర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, చం
డిప్ప గ్రామంలో మరకత శివలింగ దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన ఈ మరకత శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది.

ఉదయకాల సూర్యాభిషేకం సమయంలో ఒక ప్రత్యేకమైన ఆకుపచ్చని కాంతిని వెదజల్లడం ఈ శివలింగ ప్రత్యేకత.

మూసీనది (ముచుకుందానది) ఒడ్డునున్న ఈ దేవాలయంలోని మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతాయిని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం.

భక్తులు మరకత లింగానికి నేరుగాఅభిషేకం చేసుకోవచ్చు.

చమత్కార శిల: ఆలయ ప్రాంగణంలో, భక్తులు 'చమత్కర శిల'ను చూడవచ్చు. ఇది ఒక పవిత్రమైన రాయి, దాని బరువు చాలా ఎక్కువ అయినప్పటికీ, దానిని తాకి ప్రార్థించినప్పుడు అది స్వేచ్ఛగా తిరుగుతుందని చెబుతారు.

చరిత్ర
ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది.

దేవాలయ ప్రాంగణంలో వెలిసన క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయిని, సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం.

శ్రీ త్రిభువన మల్లదేవ మహారాజుల వారు తన అతి విశాల భూభాగ సామ్రాజ్యమునందు నిత్యభూదాన, యజ్ఞ వశాత్ చందిప్ప గ్రామమును, వేద పారంగతులైన భూసురులకు (బ్రాహ్మణులకు) అగ్రహారముగా ప్రకటించి ఈ గ్రామ సీమయందు గల సమస్త భూమిని అగ్రహారమునకు కేటాయించారు.

పూజలు
శ్రావణమాసం, కార్తీకమాసం పర్వ దినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహించబడుతాయి. శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ ఇక్కడి మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని పండితులు చెప్పుతున్నారు. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో శిరస్సున జలుకుంటే వైకుంఠప్రాప్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర చెబుతోంది.

దర్శన వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Wednesday, June 17, 2026

Chitta Nakshatra - చిత్త నక్షత్రము

చిత్త నక్షత్రము

నక్షత్రం - చిత్త

అధిపతి - కుజుడు

గణము - రాక్షస

జాతి - స్త్రీ

వృక్షం - తాటి

జంతువు - పులి

నాడి - మధ్య

పక్షి - గరుడ

అధిదేవత - త్వష్ట్ర

రాశి - 1,2 పాదాలు కన్య, 3,4 పాదాలు తుల

చిత్తా నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో చిత్తా నక్షత్రం 14వ నక్షత్రం. ఈ నక్షత్రం ఒకటవ రెండవ మూడవ పాదములు పితృ మాతృ సహోదరులకు ఆరు నెలల దోషం. శాంతి అవసరము. చతుర్ధం అయితే హోమ శాంతి అవసరము.

చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస, జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరుల ఆర్థిక సాయముతో జీవితములో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవ్వరు అనుభవించకూడదని అహర్నిశలు కష్టపడతారు.

సంతానము ఉన్నత స్థితికి వస్తారు. విదేశీ వ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువులను బాగు చేయడము (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకేతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి.

జీవిత మధ్య భాగములో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు. అదేవిధంగా, దాదాపుగా ప్రతి ఒక్కరితో వీరు చక్కటి సంబంధాలుంటాయి.

ఎవరిని కలిసినా, వారిపై ప్రేమాభిమానాలను కురిపిస్తారు. వాగ్దాటి అనేది వీరి ప్రత్యేక లక్షణం. ఎల్లప్పుడూ పూర్తి శక్తి మరియు శౌర్యంతో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా, వీరు ప్రతి పనిని కూడా తమ శక్తితో పూర్తి చేస్తారు.

వీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితికి భయపడరు, దానికి బాధ్యులుగా వీరు అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను ధైర్య సాహసాలతో ఎదుర్కొంటారు, వాటిపై విజయం సాధించి, ముందుకు సాగుతారు. వీరు దేనికి కూడా సాకులు వెతకరు, ఏ పని చేసినప్పటికీ దానిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

చిత్తా నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా బిజీగా ఉండటానికి ఇష్టపడతారు, అందువల్లనే ఒక పని పూర్తయిన వెంటనే మరో పనిని చేపడతారు. చాలావరకు, వీరికి విశ్రాంతి అనే పదానికి అర్థమే తెలియదు. చాలాసార్లు మొండిగా ఉంటారు.

వ్యాపార సంబంధిత విషయాల్లో వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. వ్యాపార దృక్పథం కారణంగా, వీరు సంపదను ప్రోగు చేయడం వీరికి ఆసక్తి కలిగిస్తుంది మరియు వాస్తవిక జీవితం నుంచి వీరు సంతోషాన్ని పొందుతారు.

వీరికి అట్టడుగు వర్గాలపై నిజమైన ప్రేమాభిమానాలుంటాయి మరియు వారికిమేలు చేయడం కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరికి 32 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కొంత ఇబ్బందిని వీరు ఎదుర్కొనవచ్చు. గొప్ప విజయాలను సాధిస్తారు.

చిత్త నక్షత్రము మొదటి పాదము
చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ జాతకులకు ఆరు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.

రాహుదశలో ఉన్న కారణంగా ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికమవుతాయి.

59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఇక వీరికి విద్యుత్, అగ్ని, భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. అధికారులుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్థ్యం కూడా అధికమే.

చిత్త నక్షత్రము రెండవ పాదము
చిత్తా నక్షత్ర రెండవ పాదములో జన్మించిన వీరికి పట్టుదల అత్యధికం. నాలుగు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహుదశలో ఉన్న కారణంగా ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం.

22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సంపాదించినది జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. లేదంటే 38 సంవత్సరాలకు వచ్చే శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు. కనుక సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

చిత్త నక్షత్రము మూడవ పాదము
చిత్త నక్షత్ర మూడవ పాద జాతకులు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళా రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంది. వీరికి పట్టుదల అధికం.

ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 3 సంవత్సరాలకు రాహు దశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.

వీరికి కూడా రాహుదశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలున్నాయి. 21 సంవత్సరాలకు గురు దశ వస్తుంది. కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

37 సంవత్సరాలకు వచ్చే శనిదశలో ఖర్చులు అధికమవుతాయి. ఈ కారణాల వల్ల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా సాగుతుంది.

చిత్త నక్షత్రము నాలుగవ పాదము
చిత్త నక్షత్ర నాలుగవ పాద జాతకులు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలలో బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అత్యధికంగా అనుకూలిస్తాయి.

ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తరువాత రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.

19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి.

36 సంవత్సరాలకు వచ్చే శని దశలో ఖర్చులు అధికమవుతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

చిత్తా నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షము :
చిత్త నక్షత్రం వారు మారేడు చెట్టును పెంచడం, పూజించడం మంచిది. కుజ దోష నివారణకై సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. కుజుడు అతి తీవ్ర మరియు అగ్ని కారకుడు కావున ఈయన అధిపతియైన సుబ్రహ్మణ్య ఆరాధన చాలా గొప్ప నివారణ కలిగించును.

చిత్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ధన లాభం

విపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్యహాని

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ప్రయత్న భంగం

సాధన తార - అశ్విని, మఖ, మూల - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - బంధనం

మిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం

అతిమిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: 

చిత్త నక్షత్రములో 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

యాలుకలు, కస్తూరి, లవంగాలు, పునుగు, జవ్వాది ఇవన్ని ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:

।। ఓం ।।
త్వష్టా నక్షత్రమభ్యే'తి చిత్రామ్ ।
సుభగమ్ స'సంయువతిగమ్ రాచ'మానామ్।
నివేశయ'న్నమృతాన్మర్త్యాగ్'శ్చ ।
రూపాణి' పిగ్ంశన్ భువ'నానివిశ్వా" ।
తన్నస్త్వష్టా తదు' చిత్రా విచ’ష్టామ్ ।
తన్నక్షత్రం భూరిదా అ'స్తు మహ్యమ్” ।
తన్నః' ప్రజాం వీరవ'తీగమ్ సనోతు ।
గోభి'ర్నోఅశ్వైస్సమ'నక్తు యజ్ఞమ్ ॥


జ్యోతిషశాస్త్రము

Rambha Tritiya - రంభా తృతీయ

రంభా తృతీయ

రంభా తృతీయ (లేదా రంభా వ్రతం) అనేది హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక పవిత్రమైన వ్రతం.

తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ (జ్యేష్ఠ శుద్ధ తదియ) రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

వ్రతం యొక్క అంతరార్థం:
"రంభ" అంటే అరటి చెట్టు. ఈ రోజున సాక్షాత్తు పార్వతీదేవి అరటి చెట్టును పూజించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి భృగు మహర్షి సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆచరించింది.

పురాణ కథా:
తపస్సులో ఉన్న పరమశివుడిని వివాహం చేసుకోవడానికి పార్వతీ దేవి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు హిమవంతుని ఆశ్రమానికి వచ్చిన సప్తర్షులు, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతికి 'రంభా వ్రతం' గురించి చెప్పారు.

ఈ వ్రత నియమాల ప్రకారం. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు పార్వతీ దేవి అలంకరించిన అరటి చెట్టును (రంభా వృక్షాన్ని) పూజించింది. దీని ప్రభావం వల్ల శివుని మనస్సులో పార్వతిపై అనురాగం కలిగి, చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు.

పూజా విధానం:
అరటి చెట్టు పూజ: ఈ వ్రతంలో అరటి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

పూజ: అరటి చెట్టు మొదట శుభ్రం చేసి అలికి, పూలు, పసుపు, కుంకుమలతో పూజిస్తారు.

ఫలితం: ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు, అఖండ ఐశ్వర్యం, మంచి సంతానం మరియు అనుకూలమైన భర్త లభిస్తాయని భక్తుల విశ్వాసం.


స్త్రీల వ్రత కథలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Tuesday, June 16, 2026

The results of Abhishekas performed in temples - ఆలయాల్లో జరిగే అభిషేకాల ఫలితాలు

ఆలయాల్లో జరిగే అభిషేకాల ఫలితాలు

ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

అభిషేకాల ఫలితాలు

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.

ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది.

పంచదారతో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు.

విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది

శంఖం ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు.

చందనం, పన్నీరు కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది.

మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది.

పంచామృతంతో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.

చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది.

చెరుకు రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.

తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.

అరటి పండుతో అభిషేకం సుఖ జీవితాన్ని ప్రసాదిస్తుంది.

అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి.

సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది.


గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

Sri Mahamaya Devi Temple, Ratanpur, Chhattisgarh - శ్రీ మహామాయా దేవి ఆలయం, రతన్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్

శ్రీ మహామాయా దేవి ఆలయం,  రతన్‌పూర్‌,  ఛత్తీస్‌గఢ్ శ్రీ  మహామాయా దేవి ఆలయం, దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి దేవతలకు నిలయమైన దేవాలయం. ఇది 12వ శత...