పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.
సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.
ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.
చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.
లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.
విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు.
ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.
నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండం మంచిది.
ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.
అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.
పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.
ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.
ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.
పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది.
వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.
పంచగవ్యాలు
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.
తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం.
పూజలు, వ్రతాలు చేసినప్పుడో తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్ధన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము.
దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి, ప్రార్ధన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట.
సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది.
ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు.
తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలుతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు.
ఉద్యోగంలో వృద్ధి కొరకు
వృత్తి అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం. ఆయా రంగాలలో తమ జీవితాలను జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే చాలామందికి ఏండ్ల తరబడి ఉద్యోగంలో వృద్ధి ఉండదు. వారిముందే వచ్చిన చిన్నవారు వారిని దాటిపోతుంటారు.
ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించుకోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని "ఓం చర స్థిర స్వభవాయ నమః" అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి.
సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె, సింధూరం కలిపి పటానికి కానీ విగ్రహానికి బొట్టు పెట్టాలి.
కాలభైరవ ఆలయంలో దీపం వెలిగిస్తే స్థిరత్వం వస్తుంది. ఇక శివాలయంలో అయితే ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. శనివారం రోజున పచ్చకర్పూరం కలిపిన కుంకుమును ముఖానికి బొట్టు ధరించాలి. అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
సోమవారం రోజున పరమేశ్వరుడికి పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామిని పూజించిన తరువాత శనగలు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి. పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగంలో సరైన స్థితికి రావడం జరుగుతుంది. అలాగే "ఓం వృషభ వాహనాయ నమః" మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి. ఇలా భక్తి, శ్రద్ధలతో ఆయా దేవతలను పూజిస్తే తప్పక అనతికాలంలో పదోన్నతి వస్తుంది. దీంతోపాటు ఉద్యోగంలో కూడా భక్తితో, శ్రద్ధతో పనిచేయాలి.
నైవేద్యము
ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా
సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య
నైవేద్యము అంటే: నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము. అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు.
మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది. అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.
మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ
అని నివేదన చేయవలెను. ఏ విధంగా నివేదన ఎలా చేయాలి? వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది.
గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్ధములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు. యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి, మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను.
దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో. ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు.
నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను. ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయవలెను. తరువాత అపరాధాస్తవము చదువ వలెను.
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?
బొట్టు.. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు. ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు.
బొట్టు పెట్టుకోవటం వెనుక అనేక కారణాలు
అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే ... పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహిత లో నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది.
బ్రహ్మస్తానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం
అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని, ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి.
బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే
కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది.
ఈ పనులు చేసేటప్పుడు బొట్టు లేకుంటే ప్రయోజనం ఉండదు
ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.
బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి .. ఎలా పెట్టాలంటే
ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ, ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చిపడతాయి. అందుకే చూపుడువేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు.
మన చేతి వేళ్లలో ఒక్కో వేలు ఒక్కో గ్రహానికి నెలవు. నుదుటిపై కుంకుమ దిద్దేటప్పుడు ఉపయోగించే వేళ్లను బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. బొటనవేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ వేలితో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. మధ్యవేలు శని స్థానం. కనుక మధ్యవేలితో తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. ఉంగరపు వేలు సూర్య స్థానం. ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి, తేజస్సు, శక్తి కలుగుతాయి. అంతేగాక ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై, మేధస్సును మేల్కొలుపుతుంది. దేవుడికి ఈ వేలితోనే తిలక ధారణ చేయాలనేది పురాణవచనం. చిటికెన వేలు బుధుని స్థానం. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. చిటికెన వేలితో తిలకం దిద్దుకుంటే బుద్ధికుశలత కలుగుతుంది. చూపుడు వేలు బృహస్పతి స్థానం. అమరత్వానికి చిహ్నం. మరణించినవారికే ఈ వేలితో తిలకం దిద్దుతారు. అందువల్ల వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇతర సందర్భాల్లో ఈ వేలితో బొట్టు పెట్టడాన్ని అశుభంగా భావిస్తారు
బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఇదే
ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్యవేలుతో పెట్టకూడదు. మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు, సంపద రెండూ వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు. మొత్తంగా చూస్తే కచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం ఎంతో మంచిది.
ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి:
పూజలు అందరూ చేస్తారు. కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి? ఎలా చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు. మరి ఆ పూజలేంటో, ఎలా చేస్తారో మీరూ తెలుసుకోండి.
వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ పూజల గురించి శివపురాణంలోని 14వ అధ్యాయంలో కూడా వివరించారు.
ఆదివారంఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆ రోజు సూర్య దేవుడ్ని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్వఘ్నంగా సాగుతుంది. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
సోమవారం చంద్రునికి సంబంధించిన వారం సోమవారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరం. సోమవారం శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ దేవికి కూడా ఇష్టమైన వారం. లక్ష్మీ దేవికి అభిషేకం, కుంకుమార్చన చేస్తే మంచిది. విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించే వారు వేంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితం.
మంగళవారం ఆంజనేయ స్వామి, దుర్గామాతకు మంగళవారం ఇష్టమైన రోజు. వీరిద్దరినీ మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాాళీ మాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడ మాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు, రోగాలు పోతాయని భక్తుల నమ్మకం.
బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే అయ్యప్పస్వామికి, విష్ణుమూర్తికి కూడా బుధవారం ఇష్టం. పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణు దేవునికి నివేదించి పూజ చేస్తే.. కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం లక్ష్మీదేవికి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం శ్రేయస్కరం. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్ట దైవానికి గురువారం పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి.
శుక్రవారం అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదే విధంగా తులసీ పూజ, గో పూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించాలి.
శనివారంకలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయస్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. కుదిరితే ఆంజనేయ స్వామి, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షణలు చేస్తే దోషాలు పోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది.
నవగ్రహ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి
నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శ్రేయస్సును పొందడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి నమ్ముతారు.
నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడానికి గల కొన్ని ముఖ్య కారణాలు:
గ్రహాల అనుగ్రహం:
నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ గ్రహాల అనుగ్రహం పొందడానికి, వారి చెడు ప్రభావాలను తగ్గించడానికి నవగ్రహ ఆలయాలను సందర్శిస్తారు.
సమస్యల నివారణ:
ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి:
పూజలు అందరూ చేస్తారు. కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి? ఎలా చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు. మరి ఆ పూజలేంటో, ఎలా చేస్తారో మీరూ తెలుసుకోండి.
వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ పూజల గురించి శివపురాణంలోని 14వ అధ్యాయంలో కూడా వివరించారు.
ఆదివారంఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆ రోజు సూర్య దేవుడ్ని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్వఘ్నంగా సాగుతుంది. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
సోమవారం చంద్రునికి సంబంధించిన వారం సోమవారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరం. సోమవారం శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ దేవికి కూడా ఇష్టమైన వారం. లక్ష్మీ దేవికి అభిషేకం, కుంకుమార్చన చేస్తే మంచిది. విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించే వారు వేంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితం.
మంగళవారం ఆంజనేయ స్వామి, దుర్గామాతకు మంగళవారం ఇష్టమైన రోజు. వీరిద్దరినీ మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాాళీ మాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడ మాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు, రోగాలు పోతాయని భక్తుల నమ్మకం.
బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే అయ్యప్పస్వామికి, విష్ణుమూర్తికి కూడా బుధవారం ఇష్టం. పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణు దేవునికి నివేదించి పూజ చేస్తే.. కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం లక్ష్మీదేవికి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం శ్రేయస్కరం. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్ట దైవానికి గురువారం పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి.
శుక్రవారం అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదే విధంగా తులసీ పూజ, గో పూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించాలి.
శనివారంకలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయస్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. కుదిరితే ఆంజనేయ స్వామి, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షణలు చేస్తే దోషాలు పోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది.
నవగ్రహ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి
నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శ్రేయస్సును పొందడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి నమ్ముతారు.
నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడానికి గల కొన్ని ముఖ్య కారణాలు:
గ్రహాల అనుగ్రహం:
నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ గ్రహాల అనుగ్రహం పొందడానికి, వారి చెడు ప్రభావాలను తగ్గించడానికి నవగ్రహ ఆలయాలను సందర్శిస్తారు.
సమస్యల నివారణ:
నవగ్రహాల పూజలు చేయడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
నవగ్రహ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
మంచి ఫలితాలు:
నవగ్రహాల పూజలు చేయడం వలన మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.
నవగ్రహాలకు సంబంధించిన కొన్ని సాధారణ నమ్మకాలు:
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు.
ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మరియు అది వ్యక్తి యొక్క జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది.
నవగ్రహాలను పూజించడం ద్వారా, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.
మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు?
ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
నవగ్రహ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
మంచి ఫలితాలు:
నవగ్రహాల పూజలు చేయడం వలన మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.
నవగ్రహాలకు సంబంధించిన కొన్ని సాధారణ నమ్మకాలు:
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు.
ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మరియు అది వ్యక్తి యొక్క జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది.
నవగ్రహాలను పూజించడం ద్వారా, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.
మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు?
మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.
శుక్రవారం లక్ష్మీదేవి ప్రతీక. ఈ రోజున ధనాన్ని ఇంటి నుండి బయటకు పంపడమంటే లక్ష్మీదేవిని తృణీకరించడమేనని కొందరి భావన. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.
మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై ఆ అప్పు తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.
లక్ష్మీదేవి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకుని భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని తమ ఇంటిలో స్థిర నివాసం చేయమని ప్రజలు ప్రార్ధిస్తారు.
అత్యవసరమైన సమయాల్లో, ఆపద సమయంలో ఇలాంటి నియమనిబంధనల గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అంతకుమించిన అనర్థాలు జరుగుతాయి.
అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకునేవారు మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.
ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటి నుంచి పంపకూడదు.
ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని తెల్లవారు ఝామున 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ.
ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.
మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు.
రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది.
సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ.
రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.
తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.
సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును ఎప్పుడైనా పూజించవచ్చు
No comments:
Post a Comment