ఓ రాజసింహా! గొప్ప బుద్ధిమంతుడు, నీతిశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంటనే దేవతలు 'అచ్యుతుడైన హరి ఇతనికి పుత్రుడౌతాడు' అంటూ ఆనందించి దేవదుందుభులు మ్రోగించారు. ఆ కారణంగా వసుదేవునికి 'ఆనకదుందుభి' అనే పేరు వచ్చింది.
తన స్నేహితుడైన 'కుంతి' అనేవానికి సంతానం లేదు. ఆ విషయం వసుదేవుడు గ్రహించాడు. తన కుమార్తె పృథను మిత్రుడు కుంతి తనకు కుమార్తెగా ఇమ్మనగా మైత్రితో శూరుడు తన కుమార్తెను కుంతికి ఇచ్చాడు.
వసుదేవుని కుమార్తె పృథ కుంతిభోజుని ఇంట పెరుగుతోంది. ఒకనాడు కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఈ కుంతి ఆ దుర్వాసునికి కాంతకాలం సేవలుచేసి దేవతలను ఆహ్వానించి రప్పించే విద్యపొంది, ఆ విద్యామాహాత్యం తెలిసికొనే ఉద్దేశ్యంతో ఏకాంతంగా సూర్యుని ఆహ్వానించింది. అతడు రాగా ఆశ్చర్యపడి ఇలా అన్నది.
ఓ దేవా, సూర్యభగవానుడా! మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే ఆలోచనతో నిన్ను ఆహ్వానించాను. అంతేకాని నీతో పొందు కోరాలని కాదు. కాబట్టి నేను ఆహ్వానించిన తప్పు క్షమించి మరలిపో.
అలా అనగా కుంతికి సూర్యుడు ఇలా బదులిచ్చాడు.
ఓ మానవతీ! నీ మాటలు అలా ఉండనిమ్ము. దేవతలను పిలువడాలు సామాన్యం కాదు. దాపరికం కూడనిది. వేల్పులను పొందటం వ్యర్థం కానిది. నీవు ఇప్పుడు గర్భాన్ని ధరిస్తావు. నీకు పుత్రుడు కలుగుతాడు. నీ కన్యాత్వం పూజింపబడుతుంది. భయపడవలసిన పని లేదు. సిగ్గుపడవద్దు.
సూర్యుడు ఈ విధంగా పృథను ఒప్పించి ఆమెకు గర్భంచేసి ఆకాశానికి వెళ్ళిపోయాడు. 'రెండవ సూర్యుడా' అనే విధంగా పుత్రుని గాంచి పృథ లోకాపవాద భీతితో పుత్రుని గంగలో విడిచి తన తండ్రి గృహానికి వెళ్ళిపోయింది.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ కుంతిని నీ తాత తండ్రి అయిన పాండురాజు పెళ్ళి చేసికొన్నాడు. ఆమెకు పాండురాజువల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలైన శ్రుతదేవను కరూశ దేశపురాజు వృద్ధశర్మ వివాహం చేసికొన్నాడు. ఆ ఇద్దరికి ముని శాపంవల్ల దంతవక్త్రుడనే రాక్షసుడు పుట్టాడు.
ఆమె తోబుట్టువైన శ్రుతకీర్తిని కేకయరాజు పెండ్లాడాడు. ఆ దంపతులకు ప్రతర్దనుడు మొదలైనవారు ఐదుగురు సుతులు జన్మించారు. వారి సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు వివాహం చేసికొన్నాడు. వారిద్దరికి విందానువిందులు జన్మించారు. చేది దేశపురాజైన దమఘోషుడు శ్రుతశ్రవసను పెండ్లాడాడు. వారికి శిశుపాలుడు జన్మించాడు. వసుదేవుని తమ్ముడైన దేవభాగునికి కంస అనే భార్యయందు చిత్రకేతుడు, బృహద్బలుడు జనించారు. వాని సోదరుడైన కంకునకు కంకవల్ల బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు అనేవాళ్ళు పుట్టారు.
వాని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలివల్ల వృషుడు, దుర్మర్షణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. వాని తమ్ముడు శ్యామకునికి సురభూమియందు హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. వాని సోదరుడు వత్సుడు మిశ్రకేశి అనే అప్పరః కాంతవల్ల వృకుడు మొదలైన కొడుకులను పొందాడు.
వాని తమ్ముడు వృకుడు దూర్వాక్షివల్ల తక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మొదలైనవారిని పొందాడు. వాని సోదరుడు అనీకుడు కర్ణికవల్ల ఋతధాముడు జయుడు అనే సుతులను పొందాడు. వసుదేవునికి రోహిణి గర్భంలో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలైన సుతులు కలిగారు.
పౌరవియందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మొదలైన పన్నెండుమంది పుత్రులు మదిర గర్భంలో నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మొదలైన కొడుకులు ఉద్భవించారు.
ఇళయందు యదుప్రముఖులైన ఉరువల్కలాదులు, ధృతదేవయందు త్రిపృష్ఠుడు, శాంతిదేవాత్మజయందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు అనేవారు, ఉపదేవయందు కల్పవృష్టి మొదలైన పదిమంది, శ్రీదేవయందు వసుహంస, సుధన్వ మొదలైనవారు ఆరుగురు, దేవరక్షితయందు గదాదులు తొమ్మిదిమంది, సహదేవయందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనే ఏడ్గురు పుట్టారు ఇంకా
దుష్టజనశిక్షణ, శిష్టజనరక్షణ చేయడంకొఱకు గుణోన్నతుడై విష్ణువు దేవకికి అష్టమగర్భంలో జన్మించాడు.
ఓ రాజా! దేవకి విష్ణుమూర్తిని కన్న తరువాత మంగళప్రదురాలైన సుభద్రను కన్నది. ఆమె అర్జునుని భార్య కావడంవల్ల ఆ సుభద్ర నీకు ముత్తవ్వ అవుతుంది.
లోకాధీశుడైన హరి తాను ఈశ్వరుడైనప్పటికీ లోకంలో ధర్మలోపం జరిగినపుడు, పాపం పెరిగినపుడు తనను తాను సృష్టించుకొంటాడు.(యదాయదాకి ధర్మస్య... భగవద్గీత)
ఓ రాజా! తన మాయావిలసనం తప్ప ప్రకృతికి అతీతుడై, మహాత్ముడై, ప్రభువై ఆత్మకర్త ఐన విష్ణుమూర్తికి జన్మములకుగాని, కర్మములకుగాని కారణం ఉంటుందా?
ఆలోచించగా ఎవని మాయావిలాసాలు ఈ జీవులకు పుట్టుక, వృద్ధి, లయం, కలిమి, దయ, మోక్షాలకు కారణభూతమై ఉన్నాయో అలాంటి
అటువంటి సర్వేశ్వరునికి పుట్టుట మొదలైన అస్వతంత్రభావం ఎక్కడ ఉంటుంది? (ఉండదు.. రాక్షసరాజులు రాజచిహ్నాలతో సేనాధిపతులై భూమిమీద జన్మించి, జనులను బాధిస్తున్న వేళ, వారిని అదుపు చేయడానికి, బలరామునితో ప్రభవించి, దేవతలు మనసుతో కూడా లెక్కించడానికి వీలులేనన్ని క్రియలుచేసి, కలియుగంలో జన్మించే మానవులకు కలిగే దుఃఖం, శోకం, తమస్సునూ (దుఃఖశోకాలనే చీకట్లను) పోగొట్టి, భూభారాన్ని తొలగించి, అన్నిదిక్కులా స్వచ్చమైన కీర్తులు వెదజల్లి విష్ణువు ప్రకాశించాడు.
ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టాడు. వ్రేపల్లెలో పెరిగాడు. శత్రుసంహారం చేశాడు. పదహారువేల ఎనమండుగురు భార్యలను పెండ్లాడాడు. వందల పుత్రులను కన్నాడు. ఆదిపురుషునిగా తనను గుర్తించి శరణన్నవారిని కరుణించాడు. కురుపాండవుల యుద్ధంలో అందరిని చంపి అర్జునునకు విజయం చేకూర్చాడు. ఉద్దవునకు తత్త్వబోధ చేశాడు. మగధ, పాండవ, సంజయ, మరు, దశార్హ, భోజ, వృష్ణి అంధకులు మొదలుగా గలవారిచే పూజింపబడ్డాడు. భూభారం తొలగించాడు. ఈ భూలోకంలో ఉండుటకు ఇష్టపడక స్వస్వరూపమైన ఆదినారాయణ మూర్తిలో కలిసిపోయాడు.
ఓ రాజా! విష్ణుమూర్తి కీర్తి అనే గంగామృతాన్ని తమ చెవులనే దోసిళ్ళతో ఎవరు త్రాగుతారో వారి కర్మలు మొత్తం నశిస్తాయి.
ఓ పరీక్షిన్మహారాజా! పద్మాక్షుడైన విష్ణుమూర్తియొక్క చిరునవ్వుతో గొప్ప కుండలాల కాంతితో ప్రకాశించే చెక్కిళ్లతోకూడిన ముఖాన్ని చూస్తూ స్త్రీలు, పురుషులు తమకు రెప్పపాట్లు ఉన్నందుకు బాధపడతారు.
నగుమోము, చక్కని నడుము, నీలదేహం, లక్ష్మికి నిలయమైన వక్షఃస్థలం, దీర్ఘబూహువులు, ప్రకాశించే కుండలాలతో కూడిన చెవులు, మదించిన ఏనుగు నడక, నల్లని కురులు, దయారసంతో నిండిన చూపులు గల విష్ణుమూర్తి కనులు మూసినా, తెరిచినా కనుపించుగాక.
అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో వచించి
జానకీ హృదయచోరా! తండ్రి ఆజ్ఞను శిరసావహించి అడవులు, పర్వతాలు తిరిగినవాడా! ప్రజలకు కల్పవృక్షమా! జనకుడు మొదలైన రాజులను మించిన చక్కని ప్రవర్తన గల ఓ రామచంద్రా!
జగద్రక్షకా! శత్రునిర్మూలకా! సుగుణవనములందు విహరించువాడా! సుందరీ హృదయచోరా! పుణ్యజనపరిపోషా! పరాక్రమ విద్యాప్రియా! గురుహృదయానందకారీ! నిరంతర సత్యభాషణ తత్పరా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
దుష్టజనశిక్షణ, శిష్టజనరక్షణ చేయడంకొఱకు గుణోన్నతుడై విష్ణువు దేవకికి అష్టమగర్భంలో జన్మించాడు.
ఓ రాజా! దేవకి విష్ణుమూర్తిని కన్న తరువాత మంగళప్రదురాలైన సుభద్రను కన్నది. ఆమె అర్జునుని భార్య కావడంవల్ల ఆ సుభద్ర నీకు ముత్తవ్వ అవుతుంది.
లోకాధీశుడైన హరి తాను ఈశ్వరుడైనప్పటికీ లోకంలో ధర్మలోపం జరిగినపుడు, పాపం పెరిగినపుడు తనను తాను సృష్టించుకొంటాడు.(యదాయదాకి ధర్మస్య... భగవద్గీత)
ఓ రాజా! తన మాయావిలసనం తప్ప ప్రకృతికి అతీతుడై, మహాత్ముడై, ప్రభువై ఆత్మకర్త ఐన విష్ణుమూర్తికి జన్మములకుగాని, కర్మములకుగాని కారణం ఉంటుందా?
ఆలోచించగా ఎవని మాయావిలాసాలు ఈ జీవులకు పుట్టుక, వృద్ధి, లయం, కలిమి, దయ, మోక్షాలకు కారణభూతమై ఉన్నాయో అలాంటి
అటువంటి సర్వేశ్వరునికి పుట్టుట మొదలైన అస్వతంత్రభావం ఎక్కడ ఉంటుంది? (ఉండదు.. రాక్షసరాజులు రాజచిహ్నాలతో సేనాధిపతులై భూమిమీద జన్మించి, జనులను బాధిస్తున్న వేళ, వారిని అదుపు చేయడానికి, బలరామునితో ప్రభవించి, దేవతలు మనసుతో కూడా లెక్కించడానికి వీలులేనన్ని క్రియలుచేసి, కలియుగంలో జన్మించే మానవులకు కలిగే దుఃఖం, శోకం, తమస్సునూ (దుఃఖశోకాలనే చీకట్లను) పోగొట్టి, భూభారాన్ని తొలగించి, అన్నిదిక్కులా స్వచ్చమైన కీర్తులు వెదజల్లి విష్ణువు ప్రకాశించాడు.
ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టాడు. వ్రేపల్లెలో పెరిగాడు. శత్రుసంహారం చేశాడు. పదహారువేల ఎనమండుగురు భార్యలను పెండ్లాడాడు. వందల పుత్రులను కన్నాడు. ఆదిపురుషునిగా తనను గుర్తించి శరణన్నవారిని కరుణించాడు. కురుపాండవుల యుద్ధంలో అందరిని చంపి అర్జునునకు విజయం చేకూర్చాడు. ఉద్దవునకు తత్త్వబోధ చేశాడు. మగధ, పాండవ, సంజయ, మరు, దశార్హ, భోజ, వృష్ణి అంధకులు మొదలుగా గలవారిచే పూజింపబడ్డాడు. భూభారం తొలగించాడు. ఈ భూలోకంలో ఉండుటకు ఇష్టపడక స్వస్వరూపమైన ఆదినారాయణ మూర్తిలో కలిసిపోయాడు.
ఓ రాజా! విష్ణుమూర్తి కీర్తి అనే గంగామృతాన్ని తమ చెవులనే దోసిళ్ళతో ఎవరు త్రాగుతారో వారి కర్మలు మొత్తం నశిస్తాయి.
ఓ పరీక్షిన్మహారాజా! పద్మాక్షుడైన విష్ణుమూర్తియొక్క చిరునవ్వుతో గొప్ప కుండలాల కాంతితో ప్రకాశించే చెక్కిళ్లతోకూడిన ముఖాన్ని చూస్తూ స్త్రీలు, పురుషులు తమకు రెప్పపాట్లు ఉన్నందుకు బాధపడతారు.
నగుమోము, చక్కని నడుము, నీలదేహం, లక్ష్మికి నిలయమైన వక్షఃస్థలం, దీర్ఘబూహువులు, ప్రకాశించే కుండలాలతో కూడిన చెవులు, మదించిన ఏనుగు నడక, నల్లని కురులు, దయారసంతో నిండిన చూపులు గల విష్ణుమూర్తి కనులు మూసినా, తెరిచినా కనుపించుగాక.
అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో వచించి
జానకీ హృదయచోరా! తండ్రి ఆజ్ఞను శిరసావహించి అడవులు, పర్వతాలు తిరిగినవాడా! ప్రజలకు కల్పవృక్షమా! జనకుడు మొదలైన రాజులను మించిన చక్కని ప్రవర్తన గల ఓ రామచంద్రా!
జగద్రక్షకా! శత్రునిర్మూలకా! సుగుణవనములందు విహరించువాడా! సుందరీ హృదయచోరా! పుణ్యజనపరిపోషా! పరాక్రమ విద్యాప్రియా! గురుహృదయానందకారీ! నిరంతర సత్యభాషణ తత్పరా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
No comments:
Post a Comment