Monday, February 16, 2026

Sree Maha Bhagavathamu Part 3 - శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీరస్తు - శీమహాభాగవతము -తృతీయస్కంధము

శ్రీమహిత వినుతదివిజ, స్తోమ! యశస్సీమ! రాజసామ! సుమేరు
స్థేమ! వినిర్జితభార్గవ, రామ! దశానన విరామ! రఘుకులరామా!

శ్రీమంతుడా! దేవతలచే కొనియాడబడువాడా! దిగంతాలు తాకిన కీర్తి గలవాడా! రాజులలో శ్రేష్ఠుడా!
మేరుపర్వతంవలె మిక్కిలి శక్తికలవాడా! పరశురాముని జయించినవాడా! రావణుని 
తుదముట్టించినవాడా! రఘువంశసంజాతుడవైన ఓ శ్రీరామా!

ఇది ఆశ్వాసాది పద్యం. భాగవతకావ్వాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు పోతన మహాకవి. ఆశ్వాసంలోని ఆద్యంత పద్యాలు కృతిపతి సంబోధనాత్మకంగా ఉండటం సంప్రదాయం. 'మంగళాదీని' అనే సంప్రదాయానికి అనుగుణంగా పద్యం శ్రీకారంతో ఆరంభమయింది.

విశేషగుణాలతో గొప్పవారైన శౌనకాది మహామునులకు సమస్త పురాణాలను వ్యాఖ్యానించడంలో నేర్పరియైన సూతమహర్షి ఇలా చెపుతున్నాడు. ఆ విధంగా మరణానికి సిద్ధపడి ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు తదుపరి భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు.

(మునిశాపం వల్ల సర్పదష్టుడు కాబోయే పరీక్షిత్తు కోరికమేరకు వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షి భాగవతం మొత్తం ఏడు రోజుల్లో వివరించాడు. ఆతడు చెప్పినట్లుగా సూతమహర్షి సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు వివరించాడు.)

విదురుండు తీర్థయాత్రసేయుట


శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

No comments:

Post a Comment

Vidura Went on a long Theerthayathra - విదురుండు తీర్థయాత్రసేయుట

విదురుండు తీర్థయాత్రసేయుట పాండురాజకుమారులైన ధర్మరాజాదులు బాహువిక్రమంతో ధృతరాష్ష్రుని కొడుకులైన దుర్యోధనాదులను రణరంగంలో జయించారు. స్వచ్చమైన శ...