Sunday, February 1, 2026

Kadaliphala Phalam - కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందళి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. కానీ ఆమెకు దైవభక్తి ఎక్కువ.ఎప్పుడూ ధ్యానం లో నిమజ్ఞురాలై ఉండేది. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కానీ ఆమెకు దైవ భక్తి ఎక్కువ. ఆమె ఎప్పడూ దైవభక్తిలో లీనమై ధ్యానం చేస్తూ ఉండేది. పతి భక్తి కన్నా దైవభక్తి ఎక్కువ. దుర్వాస మహాముని యొక్క నిత్యనైమిత్తిక పూజలకు సహాయంచేయక ఎప్పుడూ ధ్యానానిమజ్ఞురాలై ఉండెడిది. కొంతకాలానికి తన తప్పు తెలుసుకొని శని దేవుని ప్రార్ధించి ఎప్పుడూ తన భర్త యొక్క దేవుని సేవలో అర్హమయే ఒక పూజా వస్తువుగా మార్చమని కోరింది. శని దేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె కోరికని విన్నాడు.

ఒకనాడు దుర్వాసమహర్షి కందళీ దేవితో నేను కొంత సమయం విశ్రాంతి తీసుకొందును సంధ్యాసమయంనకు పూర్వం మేల్కొలుపు అని కోరి విశ్రమించినాడు. ఆమెనూ ధ్యాన నిమజ్ఞురాలై కాలాతీతమును గమనించలేదు. ధ్యానం నుండి బయటకు వచ్చి చూచుసరికి కాలాతీతమైనది. అంత కందళీ దేవి మహర్షిని నిద్ర లేపగా, లేచిన మహర్షి కాలాతీతమును గమనించి కోపోద్రేకుడై ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు. 

కొంతతడవకు శాంతించి జ్ఞాననేత్రం ద్వారా ఇదిఅంతయు శనిదేవుని వల్ల జరిగినదని తెలుసుకొని కోపించి శనిదేవుని శపించ బోవ అంత శనిదేవుడు ప్రత్యక్షమై కందళి దేవి యొక్క కోరికను వివరించి ఆమె భస్మమును పూజకు పనికివచ్చే విధముగా మార్చమని కోరెను. అంత ఆమె యొక్క భస్మరాశిపై పవిత్ర మంత్రజలం ప్రోక్షించి ఆమెను ఒక కదళీ వృక్షంగా మార్చి ఈ వృక్షం యొక్క ఆకులూ,పళ్ళు సమస్తము దేవుని పూజకు అర్హమవుతాయని పలికి తన తపోదీక్షలో లీనమైనాడు.

శ్రీవత్స

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...