'విదురా! విను' దక్షునిబిడ్డ దితి అనే సాధ్వికి సంతానకాంక్ష కల్గింది. ఆమె ఒకరోజు తన మనస్సులో రేగిన మదనతాపానికి తట్టుకోలేక కామాతురయై భర్తకశ్వపుని చెంతకు వచ్చింది. కశ్యపుడు అప్పుడే యజ్ఞనాథడైన శ్రీమన్నారాయణుని స్మరించి, సాయం సంధ్యానుష్థానం ముగించుకొని యజ్ఞశాలముంగిట విశ్రమించి ఉన్నాడు. అది సూర్యాస్తమయ సమయం. దితి భర్త చెంగట నిల్చి వినయంగా ఇట్లన్నది.
"ప్రాణేశ్వరా! మదోద్రేకంతో ఏనుగు అరటిబోదెల్ని ఊపునట్లు మన్మథుడు పూలబాణాలతో నా మనస్సును కకావికలు చేస్తున్నాడు. ఈ బాధ భరించలేను. అందుకే నీ పాదపద్మాల చెంతకు వచ్చాను. ఇక నీ సామర్థ్యాన్ని ప్రదర్శించి నన్ను కాపాడవా?" అని దితి కశ్యపుని అర్థించింది.
దితి భర్తయైన కశ్యపునితో మహాత్మా! నా సవతులెల్లరు నీ అనుగ్రహంవల్ల గర్భవతులై మహానందంతో ఉన్నారు. ఆ విషయం అనుకుంటే నా మనస్సు కలత చెందుతున్నది. నా బాధను మాన్పి నన్ను రక్షించండి. అది మీ ధర్మం. మీరు గొప్ప జ్ఞానులు. మీకు తెలియని దేముంది? మీ వంటి ఉత్తమపురుషులు దుఃఖభాగుల కోర్కెలు వ్యర్థం కాకుండ తీర్చటం ధర్మం" అని ఇంకా ఈ విధంగా అన్నది.
ఓ మహానుభావా! లోకంలో భర్తయొక్క ఆదరాన్ని చూరగొన్న భార్యకు ఇష్టవస్తు ప్రాప్తి మరియు శాశ్వతమైన కీర్తి చేకూరుతాయి. ఇవి లోకమంతా మెచ్చుకోదగ్గ విషయాలు గదా!
భర్త తన ఇల్లాలి గర్భాన కొడుకయి పుడతాడు. ఎట్టన ఒక దీపం వల్ల వేరొక దీపం వెల్గుతుంది- అయినా అగ్ని ఒక్కటే గదా!
'ధీమంతుడవైన స్వామీ! నేను పైన చెప్పిన అంశమే' ఆత్మా వై పుత్రః అని వేదాలు కంఠోక్తిగా వాకొంటున్నాయి. ఇది మీకు తెలియనిదేమీ గాదు. ఈ దీనురాల్ని దయతో కాపాడండి.
మహానుభావా! పురుషశ్రేష్ఠుడా! మా తండ్రికి కూతుళ్ళమీద వాత్సల్యమెక్కువ ఎంతో దయార్ద్రబుద్ధి గల ఆయన ఒకరోజు మా అందర్ని పిలిచి "తామరసాక్షులారా! మీకు ఎవరిపైన మక్కువ ఉందో చెప్పండి. ఆయనకే ఇస్తానని చెప్పాడు. మా అక్కచెల్లెళ్ళలో మేము పదముగ్గురం నిన్నే ఇష్టపడ్డాం గదా!" అని దితి కశ్యపునితో అంది.
ఇలాగా దితి కామేచ్చతో పరవశించి అనేకవిధాల భర్తృసాంగత్యం కోరింది. ఆయన మనసు కరిగింది. దయనీయురాలు, పతివ్రత అయిన తన ఇల్లాలు దితితో కశ్యపుడు ఉల్లాసంగా ఇలా అన్నాడు.
కశ్యపుడు దితితో "మానినీ! నీవు ముందన్నట్లే మగవారికి తమ భార్యలవల్లనే ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు సమకూరుతాయి. నావికుడు తన నావచేతనే సముద్రాన్ని తరిస్తున్నట్లు, గృహస్థాశ్రమవాసి, తక్కిన బ్రహ్మచర్య వానప్రస్థ సన్న్యాసాశ్రమవాసులకు ఆశ్రయమిచ్చి కాపాడుతాడు. గృహస్థాశ్రమసంబంధియైన కష్టాల కడలిని తరిస్తాడు. భార్య భర్తలో అర్ధభాగస్వామిని. భర్త తన ఇంటి బాధ్యతలన్నింటిని తన ఇల్లాలిపై మోపి నిశ్చింతగా సుఖీస్తాడు. దుర్గాన్ని ఏలే రాజు విరోధులను మట్టు పెడుతున్నట్లే భార్యతోకూడిన భర్త తక్కిన ఆశ్రమాలకు అసాధ్యమైన ఇంద్రియశత్రువర్గాన్ని అవలీలగా జయిస్తాడు. ఈ విజయం పురుషులకు తమ భార్యలవల్లనే సాధ్యం. అలాంటి భార్యకు ఎంత గొప్ప సత్పురుషులైనా ఎన్ని జన్మలెత్తినా తిరిగి ఉపకారం చేయలేరు. మరి మాలాంటివారు చేయగలరా? (చేయజాలరనుట) సరే-నీవేమీ ఏడ్వవద్దు" అని అనునయించాడు.
కశ్యపుడు 'చంచలాక్షీ! నీవు బిడ్డలు గల్గాలనే కోరికతో నా సాంగత్యాన్ని కోరి వచ్చావనటం నిజం. మంచివంశంలో పుట్టి చక్కని శీలం, నడవడిక గల ఇల్లాలి కోర్కెల్ని నెరవేర్చటం మగని బాధ్యత అని దితిని అనునయించాడు.
"జవ్వనీ! కొన్ని క్షణాలు ఓపికపట్టు. ఇది సంజవేళ. ఈ సమయంలో మన్మథుని మట్టు పెట్టిన పరమేశ్వరుడు ప్రమథులు వెంటరాగా ఎద్దునెక్కి ఇక్కడ సంచరిస్తాడు. ఇది తగిన సమయం కాదు. భయంకరమైన సమయంలో కామక్రీడ నిషిద్ధం. మనం ధర్మాన్ని అతిక్రమించటం ఎందుకు?
పద్మముఖీ! అదిగో అతడే నీ మరది రుద్రుడు. శ్మశానవాటికలో వీచే సుడిగాలికి లేచిన దుమ్ము ఆయన ఒంటిని కప్పేసింది. నలుపు ఎరుపు కలిసిన రంగుతో విశేషంగా వెలుగుతూ చెదరి ఉన్న జడలతో, నిలువెల్ల పులుముకొన్న బూడిదవల్ల బంగారుకాంతితో భయంకరుడుగా ప్రకాశిస్తున్నాడు.
ఓ కాంతా! తన సూర్యచంద్రాగ్ని నేత్రాలను వికసింపచేసి, మిక్కిలి కోపావేశంతో చూస్తున్నాడు. ఇప్పుడు మన బంధుత్వాన్ని గూర్చి ఆలోచించవద్దా?
ఆ పరమశివుడు సమదృష్టిగలవాడు. పంచభూత స్వరూపుడు. ఆయనకు శత్రువులు లేరు. మిత్రులు లేరు. పూజ్యులుగాని తిరస్కరింప దగినవారు గాని లేరు.
"ఓ తరుణీ! ఆయన దేవతల్లో మూలపురుషుడు. ముల్లోకాలను పవిత్రం చేయగల మహాత్ముడు. విశ్వానికే ప్రభువు. సంపదలకు నెలవు. నా సోదరుడు. అంతటి మహిమలుగల ఆ ఈశ్వరుణ్ణి నా మరదే గదా అని చూడకు, అని కశ్యపుడు దితిని హెచ్చరించాడు.
నావంటివారూ, మరియు మహానుభావులైన విజ్ఞానవంతులు - మెడలో వేసుకొని తీసి, దూరంగా విసిరివేయబడిన పూలహారంవంటి మాయాదేవిని అనుసరించి జీవిస్తాం. ఆ మాయకూడా ఆ పరమేశ్వరుని పాదసేవకు తహతహలాడుతూ ఉంటుంది.
బ్రహ్మ ఇంద్రుడు మరియు తక్కిన దిక్పాలురు తమ పదవుల్లో స్థిరంగా ఉండటానికి ఆ పరమేశ్వరుని దయే మూలకారణం. విశ్వమంతటిని ఒక కంట చూచే మాయ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఆయన మహిమలను చతుర్వేదాలు సైతం వివరించలేవు. ఈ సమస్తలోకాలు ఆయన్ని సేవిస్తున్నాయి. ఆయనతో సమానమైనది, సమానమైనవాడు, ఆయనకంటె అధికమైనది, అధికమైనవాడు లేడు. ఆలాంటి త్రిపురసంహారకుణ్ణి దేవ దేవుణ్ణి లోకులు ఎముకలపేరు ధరిస్తాడని, భిక్షాటన చేసి బ్రతుకుతాడని బూడిద అంటుకుంటాడని శ్మశానంలో నివసిస్తాడని గేలి చేస్తారు.
లోకంలో అవివేకులు కుక్కలు తినదగింది, మరియు ఇహపరాలకు దూరమైన శరీరం ఉత్తమమైనదని అనుకొంటున్నారు. దానికి దుస్తులు, మాలలు, ఆభరణాలు అలంకరిస్తున్నారు.
"ఓ మానినీ! శరీరమే ఆత్మయని దానికి పైపై మెరుగులు దిద్దుకొనే వారందరు గొప్ప దౌర్భాగ్యులని తెలిసికో" అని కశ్యపుడు దితితో అన్నాడు. కాని ఆమె మనస్సులో మదనబాణాలు గాఢంగా నాటుకొన్నదై భర్తతో ఇలా అంది.
భర్త తానెంతగా వారించినా వినక దితి సిగ్గుతో తలవాల్చి, ఆ సంధ్యాసమయాన నిషిద్ధమైన రతి కర్మయందే ఆసక్తి గలదై వారవనితలాగా మగణ్ణి గాఢంగా కౌగిలించుకొంది.
అలా దితి చేసిన ఒత్తిడికి తలొగ్గి కశ్యపమహర్షి పరమేశ్వరునికి దండంపెట్టి, రహస్యంగా ఆమెతో సంగమించాడు. తర్వాత సత్త్వగుణోపేతమూ, సనాతనమూ అయిన గాయత్రీ మంత్రాన్ని జపించాడు.
చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతూ తల దించుకుని పరమేశ్వరుని వల్ల ఏ ఉపద్రవం కల్గుతుందో అని భయపడుతూ ప్రియమార - ఇలా అంది.
దితి కశ్యపునితో "స్వామీ! చరాచరప్రాణికోటికి ప్రభువు పరమేశ్వరుడు. ఆయన నేను చేసిన తప్పును మన్నించి, నా గర్భాన్ని కాపాడుగాక. ఆయన ప్రాణుల దుఃఖాన్ని నివారించేవాడు. ఆయన మహాత్ముడు. తనంతతాను వెలిగేవాడు. ఆయన ఆజ్ఞ దాటరానిది. సగుణారాధకులకు కోర్కెల్ని పండిస్తాడు. నిర్గుణోపాసకులకు మోక్షమిస్తాడు. అవసరమనుకుంటే త్రిశూల మెత్తుతాడు. అవసరం లేదంటే శూలాన్ని ఆవలపెట్టుతాడు. దుర్మార్గుల్ని శిక్షిస్తాడు. ఆయన పరమాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. త్రిగుణాతీతుడు. ఏ కోర్కెలు లేనివాడు. భక్తులపాలిటి కొంగుబంగారం. భగవంతుడు - అన్ని శుభగుణాలు గల ఆ దేవునికి నమస్కరిస్తున్నా ఆయన ఆరు సంపదలు గలవాడు. లోకాలకు ప్రభువు. దయాదాక్షిణ్యాలు గలవాడు. తన ఆదేశాలను పాటించే స్త్రీలను కాపాడేవాడు. పైపెచ్చు మాసోదరి సతీదేవికి మగడు. ఆయన నన్ను రక్షించాలి అని ఆమె పరమశివుని ప్రార్థించింది.
ఇంతదాక దితికి సంతానం లేదు. ఇప్పుడు తన భర్తవల్ల కడుపు పండింది. ఆమెకు కల్గిన సంతోషానికి మేరయే లేదు.
కశ్యపుడు వెంటనే ఆ నాటి సాయంకాలం యథావిధిగా సంధ్యా వందనం నిర్వహించినాడు.
తన ఇల్లాలు గర్భవతి అయ్యిందని మారీచుడు(మరీచిమహర్షి పుత్రుడైన కశ్యపుడు) సంతోషపడలేదు. పైపెచ్చు అకాలరతికార్యానికి నొచ్చుకొని ఆమెతో ఇట్లన్నాడు.
ఓ మహాపతివ్రతా! దితీ! ఇది అనుచితకార్యమనే జంకు నీ కేమాత్రం లేదు. మదనుడు చెరకు విల్లెక్కుపెట్టి వదలిన సమ్మోహనాస్త్రాలకు నీ మనస్సు చెదిరింది. విచక్షణ కోల్పోయి సిగ్గువిడిచి, నిర్భయంగా ధర్మవిరుద్ధమైన పాపక్రీడకు వేళకాని వేళ ఒక వేశ్యలాగా పాల్పడ్డావు. దుశ్చర్యయందాసక్తి గల్గి సంగమించావు. (ఇది నీ దౌర్భాగ్యమని నింద)
అలా జరిగినందువల్ల, ఓ సాధ్వీ! ప్రమథులశక్తితో కూడుకొన్నవారు, భయంకరమైన పనులుచేసేవారు, మహాపరాక్రమవంతులు, మరియు పిశాచగణంచేత ప్రేరింపబడ్డవారు 'భద్రుడు-అనుభద్రుడు' అనే పేరుగల ఇద్దరు పుత్రులు కలుగుతారని అన్నాడు.
భద్రుడు, అనుభద్రుడనే వారిద్దరు నీకు కొడుకులుగా పుడతారు. వారు పొగరుబోతులై మంచివారిని ఎల్లప్పుడూ పీడిస్తారు. భూమికి భారంగా ఉంటారు.
ఆ ఇర్వురి దుశ్చర్యలకు తాళలేక మహాత్ములు అన్నీ తెలిసిన శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకొంటారు. ఆ స్వామి వజ్రాయుధంతో ఇంద్రుడు కొండలరెక్కల్ని ముక్కలు చేసినట్లు వారిని నేల కూలుస్తాడు.
శ్రీహరి నీ ఇర్వురి కుమారుల్ని చంపేస్తాడని భర్త చెప్పగానే దితి భయంతో చలించి పోయింది. మనస్సులో దిగులు చెందింది. భర్తమొగం చూచి ఇలా అంది.
"లోకంలో సజ్జనులను అవమానించేవారు లేదా వారికి అపకారం తలపెట్టెవారు దుష్టులు. అలాంటి వారి జీవితం, సంపదలు నశిస్తాయి. శత్రువులవల్ల వారు చస్తారు. ఇది నిజం. నీ కుమారులు మహాత్ములకు అపకారం చేసి బ్రాహ్మణుల కోపాగ్ని కెరగాకుండ, శ్రీహరిచే చావుకు గురిగావటం మంచిది" అని దితి భర్తతో అంది.
శ్రీహరి చేత చచ్చుటే తగునని దితి అన్నది. అప్పుడు కశ్యపుడు ఆమెతో నారీమణీ! నీవు చేసిన విడ్డూరపుకర్మ(అకాలసురతక్రీడ) వల్లనే ఈ దురవస్థ ఎదురైంది. దీనికై నీవు పరితపించవద్దు. నీవు శ్రీమన్నారాయణుని పాదపద్మాలను కొల్చటంవల్ల నైతేనేమి, సంతోషంతో నన్నారాధించటంవల్ల నైతేనేమి - నీకు మంచి జరుగబోతుందని పై కథతో అన్వయం.
దేవీ! నీ కొడుకులలో హిరణ్యకశిపునికి పుట్టెవారిలో మహాధర్నాత్ముడు. శ్రీహరి పాదపద్మాల్ని నిరంతరం సేవించేవాడు జన్మిస్తాడు.
అంతేగాక, ఆ హిరణ్యకశిపుని కుమారుడు మహాపుణ్యాత్ముడు మరియు మహాబుద్ధిమంతుడు అవుతాడు. ఆ పుణ్యాత్ముని కీర్తిలతలు బ్రహ్మండపర్యంతం ప్రాకుతాయి. అతడు కులాన్ని పవిత్రం చేయగలవాడు.
"సులోచనా! విను. నీ మనుమడు దుర్మార్గుని(హిరణ్యకశిపుని) కడుపున పుట్టిన బిడ్డడే అయినా, శ్రీహరి పాదసేవకుడైన భక్తుడు కాబట్టి అగ్నిశుద్ధివల్ల మసక తొలగి బంగారం స్వచ్చంగా వెల్గినట్లు రాక్షసవంశాన్ని పవిత్రం చేస్తాడు" అని కశ్యపుడు ఆమెను ఆశ్వాసించాడు.
నిరంతరం అష్టాంగయోగాన్ని సాధనచేసే మునీశ్వరులు సైతం నీ మనుమడు నడిచే ఉత్తమ మార్గంలోనే నడవాలని భావిస్తారు. (ఆతని శీల సంపద ఉదాత్తమైనదే గాక ఆదర్శప్రాయమైనదని అభిప్రాయం).
(అష్టాంగయోగ క్రియలు: ఇవి ఎనిమిది రకాలు 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి
1. యమం : అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే ఐదింటిని యమమంటారు.
2. నియమం : శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనేవి నియమంగా గుర్తింపు పొందాయి.
3. ఆసనం : స్థిరసుఖమాసనం-చలనం లేనిది, సుఖమైంది ఆసనం. ఇవి చాల రకాలు-పద్మాసనం, వజ్రాసనం వగైరా.
4 ప్రాణాయామం : రక్తశుద్ధికి ప్రాణాయామం ప్రాణాపానగతుల్ని నిరోధించే కార్యక్రమం.
5. ప్రత్యాహారం : చంచలమైన మనస్సును ఎక్కడెక్కడో సంచరింప నీయకుండా ఆత్మయందు నిల్పటం.
6. ధారణ : మనస్సును ఆత్మాయత్తం చేసిన తర్వాత దేన్నీ స్మరించకుండటం.
7. ధ్యానం: ఆత్మవిశుద్ధికొరకు ఆసనమందుందటం. 'ధ్యానేనాత్మని పశ్యంతి' అని గీత.
8 సమాధి : 'యోగపరిపూర్ణత అకల్మషమైన బ్రహ్మానందానుభూతి.
చిత్తవృత్తులను నిరోధించే ఈ క్రియను అష్టాంగ యోగమని మునులు నిర్వచించారు.)
ఓ దితీ! నీ మనుమడు భక్తుల్లో మేటి. మహానుభావుడు. సుగుణాలరాశి. ఆయన విష్ణుసేవయందే మనస్సును లగ్నంచేసి, తులసీమాల ధరించినవాడునూ, మోక్షాధినాథుడునూ అయిన ఆ సిరిమగణ్ణి ధ్యానిస్తూ మరో వస్తువంటే పరిహసిస్తాడు - త్రోసిపుచ్చుతాడు. (విష్ణువు తప్ప తక్కిందేదీ కూడ ఆయన మనస్సుకు పట్టదు).
"ఓ దితీ! అట్టి నీ మనుమడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల పట్ల మక్కువ లేనివాడు. తాపత్రయం లేనివాడు. ఇతరులు బాగుంటే సంతోషిస్తాడు. వారు బాధపడితే తాను బాధపడతాడు. ఈ జగత్తుకంతటికి ఆయనే ప్రభువు అని తెలిసికొని ఆ విశ్వనాథుణ్ణి మనసార తదేక దృష్టితో దర్శిస్తాడు. వేసవి కాలంలో తాపానికి గురి అయ్యేవారికి ఆయన వెన్నెల సోకినట్లు హాయి గొల్పుతాడు. అన్ని లోకాలబాధలు తొలగిస్తాడు. అతనికి శత్రువులే లేరు" అని కశ్యపుడు భార్యను అనునయించాడు.
ఎల్లప్పుడు నీ మనుమడు శ్రీహరిధ్యానమందే మనస్సును నిల్పినవాడు. అంతేగాదు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు కూడ.
అంతేకాదు. నీ మనుమడు స్వచ్చమైన అంతరింద్రియాల్లో, బాహ్యేంద్రియాల్లో, కుండలాలతో అందాన్ని సంతరించుకొన్న ఆ లక్ష్మీపతి ముఖాన్ని ఆనందాతిశయంతో తన ఇచ్చివచ్చినట్లు చూస్తూ ఉంటాడు.
మనువుతో సమానుడైన నీ మనుమడు తన మనస్సులో ఈ విశ్వమంతా విష్ణుమయమని భావిస్తాడు. మహాత్ములైన మనువుల్లో నీ మనుమడు గొప్పవాడుగా పొగడ్తలందుకొంటాడు అని కశ్యపుడు చెప్పాడు.
కశ్యపుడు అలా మనుమని గొప్పదనాన్ని గూర్చిచెప్పగా విని దితి తన మదిలో నా కుమారులిర్వురు మాధవునిచేత చస్తారనీ, నా మనుమడు అందరూ మెచ్చుకోదగ్గ హరిభక్తుడవుతాడని విని ఒకవైపు దుఃఖంతో, మరోవైపు సంతోషంతో మథనపడింది.
దుఃఖం-సంతోషం రెండింటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది దితి. కశ్యపునివల్లనైన తన గర్భం తేజస్సుతో వెలుగుతోంది, అంతేగాక అన్యతేజస్సులను నిర్వీర్యం చేస్తున్నది; రోజు రోజుకు పెరుగుతున్నది. ఆమె తనకడుపున పుట్టబోయే కుమారులు దేవతలను మట్టుపెడతారని ఆలోచిస్తున్నది. అలా ఆ గర్భాన్ని ఆమె నూరేళ్ళు మోసింది.
దితి గర్భంనుండి ఇతరశక్తులన్నింటిని కాలరాచే ఒక మహాతేజస్సు రూపమెత్తి బయటికి వచ్చింది. ఆ తేజస్సు భూమ్యాకాశాల్ని ఆక్రమించింది. సూర్యచంద్రుల కాంతుల్ని దిగమింగింది. సూదితో గుచ్చితే కూడ దిగనంత పెద్దచీకటి ఆవరించింది. (కన్నులు పొడుచుకున్నా కానరాని కటికచీకటి) దానితో దేవతలు భయంతో కలతచెందిన మనస్సులు కలవారైరి.
దేవతలందరు బ్రహ్మచెంతకు పోయి దేవతలకెల్లరికి 'ఆద్యుడా! పాపాలనే సముద్రాన్ని తరింపజేయువాడా! సృష్టికి మూలకారకుడా! స్వామీ!' అని ఆయన పాదపద్మాలకు మొక్కి రెండుచేతుల్ని నొసటజేర్చి మనస్సులో భయం, తొట్రుపాటు ముప్పిరిగొనగా ఇలా విన్నవించారు.
"ఓ దేవా! శారదాపతీ! స్థావరజంగమాత్మకమైన ఈ విశ్వానికి నీవే ప్రభువు. అన్నింటిని భరించేవాడివి నీవే. లోకపాలు లెల్లరికి తలమానికం లాంటివాడవు. నీ రూపం మెచ్చదగింది. ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని దేమీ లేదు. మేము ఆపదల్లో చిక్కి నీ శరణు జొచ్చాము. మమ్మల్ని గూర్చి కొంచెం ఆలోచించు అని దేవతలు బ్రహ్మను ప్రార్ధించారు.
"స్వామీ! స్థావరజంగమరూపమై క్రియాత్మకంగా ఉన్న ఈ విశ్వానికి నీవే కారణుడవు. ఈ లోకాలన్నింటిని నీవే సృజించావు. ఈ ప్రాణికోట్ల ఆత్మస్వరూపం తెలిసినవాడవు నీవే. జగన్నాథుల్లో నీవే అగ్రగామివి, అనుభవజ్ఞుడవు. మాయవల్లనే నీవు విశ్వస్రష్టవైనావు. నీవు త్రిగుణాల్లో రజోగుణాధిపతివి. ఈ సమస్తలోకాలు నీలోనే దాగి ఉన్నాయి. యోగక్రియలో ఆరితేరినవారై ఏ కోర్కెలు లేనివారుగా ముద్రపడిన యోగులు ధ్యానం ద్వారా నిన్ను అన్వేషిస్తారు. శ్వాసక్రియను అదుపులో ఉంచిన కారణంచేత నీ అనుగ్రహానికి పాత్రులైన ఆ యోగులకు ఓటమి లేదు. ఈ జీవులెల్లరు తాళ్ళచే కట్టబడ్డ పశువుల్లాగ నీ మాటకు కట్టుబడి ఉంటారు. నీకు మొక్కుతున్నాము. రాత్రింబవళ్ళు అనే విభజన తెలియక, ఏ పనిచేయాలో బోధపడని ఈ జీవులను కాపాడే వాడివి నీవే. నీ శరణుజొచ్చిన మమ్ము దయార్ద్రబుద్ధితో కాపాడు. అరణిలో అగ్గిలాగా కశ్యపప్రజాపతి వీర్యశక్తి దితి గర్భంలో దాగి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అది దిక్కులన్నింటికి ప్రాకుతూ ఉంది. అని దేవతలెల్లరు మొరపెట్టుకోగా విని బ్రహ్మ వారందరిని ఆశ్వాసిస్తూ ఇలా అన్నాడు.
అలా జరిగినందువల్ల, ఓ సాధ్వీ! ప్రమథులశక్తితో కూడుకొన్నవారు, భయంకరమైన పనులుచేసేవారు, మహాపరాక్రమవంతులు, మరియు పిశాచగణంచేత ప్రేరింపబడ్డవారు 'భద్రుడు-అనుభద్రుడు' అనే పేరుగల ఇద్దరు పుత్రులు కలుగుతారని అన్నాడు.
భద్రుడు, అనుభద్రుడనే వారిద్దరు నీకు కొడుకులుగా పుడతారు. వారు పొగరుబోతులై మంచివారిని ఎల్లప్పుడూ పీడిస్తారు. భూమికి భారంగా ఉంటారు.
ఆ ఇర్వురి దుశ్చర్యలకు తాళలేక మహాత్ములు అన్నీ తెలిసిన శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకొంటారు. ఆ స్వామి వజ్రాయుధంతో ఇంద్రుడు కొండలరెక్కల్ని ముక్కలు చేసినట్లు వారిని నేల కూలుస్తాడు.
శ్రీహరి నీ ఇర్వురి కుమారుల్ని చంపేస్తాడని భర్త చెప్పగానే దితి భయంతో చలించి పోయింది. మనస్సులో దిగులు చెందింది. భర్తమొగం చూచి ఇలా అంది.
"లోకంలో సజ్జనులను అవమానించేవారు లేదా వారికి అపకారం తలపెట్టెవారు దుష్టులు. అలాంటి వారి జీవితం, సంపదలు నశిస్తాయి. శత్రువులవల్ల వారు చస్తారు. ఇది నిజం. నీ కుమారులు మహాత్ములకు అపకారం చేసి బ్రాహ్మణుల కోపాగ్ని కెరగాకుండ, శ్రీహరిచే చావుకు గురిగావటం మంచిది" అని దితి భర్తతో అంది.
శ్రీహరి చేత చచ్చుటే తగునని దితి అన్నది. అప్పుడు కశ్యపుడు ఆమెతో నారీమణీ! నీవు చేసిన విడ్డూరపుకర్మ(అకాలసురతక్రీడ) వల్లనే ఈ దురవస్థ ఎదురైంది. దీనికై నీవు పరితపించవద్దు. నీవు శ్రీమన్నారాయణుని పాదపద్మాలను కొల్చటంవల్ల నైతేనేమి, సంతోషంతో నన్నారాధించటంవల్ల నైతేనేమి - నీకు మంచి జరుగబోతుందని పై కథతో అన్వయం.
దేవీ! నీ కొడుకులలో హిరణ్యకశిపునికి పుట్టెవారిలో మహాధర్నాత్ముడు. శ్రీహరి పాదపద్మాల్ని నిరంతరం సేవించేవాడు జన్మిస్తాడు.
అంతేగాక, ఆ హిరణ్యకశిపుని కుమారుడు మహాపుణ్యాత్ముడు మరియు మహాబుద్ధిమంతుడు అవుతాడు. ఆ పుణ్యాత్ముని కీర్తిలతలు బ్రహ్మండపర్యంతం ప్రాకుతాయి. అతడు కులాన్ని పవిత్రం చేయగలవాడు.
"సులోచనా! విను. నీ మనుమడు దుర్మార్గుని(హిరణ్యకశిపుని) కడుపున పుట్టిన బిడ్డడే అయినా, శ్రీహరి పాదసేవకుడైన భక్తుడు కాబట్టి అగ్నిశుద్ధివల్ల మసక తొలగి బంగారం స్వచ్చంగా వెల్గినట్లు రాక్షసవంశాన్ని పవిత్రం చేస్తాడు" అని కశ్యపుడు ఆమెను ఆశ్వాసించాడు.
నిరంతరం అష్టాంగయోగాన్ని సాధనచేసే మునీశ్వరులు సైతం నీ మనుమడు నడిచే ఉత్తమ మార్గంలోనే నడవాలని భావిస్తారు. (ఆతని శీల సంపద ఉదాత్తమైనదే గాక ఆదర్శప్రాయమైనదని అభిప్రాయం).
(అష్టాంగయోగ క్రియలు: ఇవి ఎనిమిది రకాలు 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి
1. యమం : అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే ఐదింటిని యమమంటారు.
2. నియమం : శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనేవి నియమంగా గుర్తింపు పొందాయి.
3. ఆసనం : స్థిరసుఖమాసనం-చలనం లేనిది, సుఖమైంది ఆసనం. ఇవి చాల రకాలు-పద్మాసనం, వజ్రాసనం వగైరా.
4 ప్రాణాయామం : రక్తశుద్ధికి ప్రాణాయామం ప్రాణాపానగతుల్ని నిరోధించే కార్యక్రమం.
5. ప్రత్యాహారం : చంచలమైన మనస్సును ఎక్కడెక్కడో సంచరింప నీయకుండా ఆత్మయందు నిల్పటం.
6. ధారణ : మనస్సును ఆత్మాయత్తం చేసిన తర్వాత దేన్నీ స్మరించకుండటం.
7. ధ్యానం: ఆత్మవిశుద్ధికొరకు ఆసనమందుందటం. 'ధ్యానేనాత్మని పశ్యంతి' అని గీత.
8 సమాధి : 'యోగపరిపూర్ణత అకల్మషమైన బ్రహ్మానందానుభూతి.
చిత్తవృత్తులను నిరోధించే ఈ క్రియను అష్టాంగ యోగమని మునులు నిర్వచించారు.)
ఓ దితీ! నీ మనుమడు భక్తుల్లో మేటి. మహానుభావుడు. సుగుణాలరాశి. ఆయన విష్ణుసేవయందే మనస్సును లగ్నంచేసి, తులసీమాల ధరించినవాడునూ, మోక్షాధినాథుడునూ అయిన ఆ సిరిమగణ్ణి ధ్యానిస్తూ మరో వస్తువంటే పరిహసిస్తాడు - త్రోసిపుచ్చుతాడు. (విష్ణువు తప్ప తక్కిందేదీ కూడ ఆయన మనస్సుకు పట్టదు).
"ఓ దితీ! అట్టి నీ మనుమడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల పట్ల మక్కువ లేనివాడు. తాపత్రయం లేనివాడు. ఇతరులు బాగుంటే సంతోషిస్తాడు. వారు బాధపడితే తాను బాధపడతాడు. ఈ జగత్తుకంతటికి ఆయనే ప్రభువు అని తెలిసికొని ఆ విశ్వనాథుణ్ణి మనసార తదేక దృష్టితో దర్శిస్తాడు. వేసవి కాలంలో తాపానికి గురి అయ్యేవారికి ఆయన వెన్నెల సోకినట్లు హాయి గొల్పుతాడు. అన్ని లోకాలబాధలు తొలగిస్తాడు. అతనికి శత్రువులే లేరు" అని కశ్యపుడు భార్యను అనునయించాడు.
ఎల్లప్పుడు నీ మనుమడు శ్రీహరిధ్యానమందే మనస్సును నిల్పినవాడు. అంతేగాదు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు కూడ.
అంతేకాదు. నీ మనుమడు స్వచ్చమైన అంతరింద్రియాల్లో, బాహ్యేంద్రియాల్లో, కుండలాలతో అందాన్ని సంతరించుకొన్న ఆ లక్ష్మీపతి ముఖాన్ని ఆనందాతిశయంతో తన ఇచ్చివచ్చినట్లు చూస్తూ ఉంటాడు.
మనువుతో సమానుడైన నీ మనుమడు తన మనస్సులో ఈ విశ్వమంతా విష్ణుమయమని భావిస్తాడు. మహాత్ములైన మనువుల్లో నీ మనుమడు గొప్పవాడుగా పొగడ్తలందుకొంటాడు అని కశ్యపుడు చెప్పాడు.
కశ్యపుడు అలా మనుమని గొప్పదనాన్ని గూర్చిచెప్పగా విని దితి తన మదిలో నా కుమారులిర్వురు మాధవునిచేత చస్తారనీ, నా మనుమడు అందరూ మెచ్చుకోదగ్గ హరిభక్తుడవుతాడని విని ఒకవైపు దుఃఖంతో, మరోవైపు సంతోషంతో మథనపడింది.
దుఃఖం-సంతోషం రెండింటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది దితి. కశ్యపునివల్లనైన తన గర్భం తేజస్సుతో వెలుగుతోంది, అంతేగాక అన్యతేజస్సులను నిర్వీర్యం చేస్తున్నది; రోజు రోజుకు పెరుగుతున్నది. ఆమె తనకడుపున పుట్టబోయే కుమారులు దేవతలను మట్టుపెడతారని ఆలోచిస్తున్నది. అలా ఆ గర్భాన్ని ఆమె నూరేళ్ళు మోసింది.
దితి గర్భంనుండి ఇతరశక్తులన్నింటిని కాలరాచే ఒక మహాతేజస్సు రూపమెత్తి బయటికి వచ్చింది. ఆ తేజస్సు భూమ్యాకాశాల్ని ఆక్రమించింది. సూర్యచంద్రుల కాంతుల్ని దిగమింగింది. సూదితో గుచ్చితే కూడ దిగనంత పెద్దచీకటి ఆవరించింది. (కన్నులు పొడుచుకున్నా కానరాని కటికచీకటి) దానితో దేవతలు భయంతో కలతచెందిన మనస్సులు కలవారైరి.
దేవతలందరు బ్రహ్మచెంతకు పోయి దేవతలకెల్లరికి 'ఆద్యుడా! పాపాలనే సముద్రాన్ని తరింపజేయువాడా! సృష్టికి మూలకారకుడా! స్వామీ!' అని ఆయన పాదపద్మాలకు మొక్కి రెండుచేతుల్ని నొసటజేర్చి మనస్సులో భయం, తొట్రుపాటు ముప్పిరిగొనగా ఇలా విన్నవించారు.
"ఓ దేవా! శారదాపతీ! స్థావరజంగమాత్మకమైన ఈ విశ్వానికి నీవే ప్రభువు. అన్నింటిని భరించేవాడివి నీవే. లోకపాలు లెల్లరికి తలమానికం లాంటివాడవు. నీ రూపం మెచ్చదగింది. ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని దేమీ లేదు. మేము ఆపదల్లో చిక్కి నీ శరణు జొచ్చాము. మమ్మల్ని గూర్చి కొంచెం ఆలోచించు అని దేవతలు బ్రహ్మను ప్రార్ధించారు.
"స్వామీ! స్థావరజంగమరూపమై క్రియాత్మకంగా ఉన్న ఈ విశ్వానికి నీవే కారణుడవు. ఈ లోకాలన్నింటిని నీవే సృజించావు. ఈ ప్రాణికోట్ల ఆత్మస్వరూపం తెలిసినవాడవు నీవే. జగన్నాథుల్లో నీవే అగ్రగామివి, అనుభవజ్ఞుడవు. మాయవల్లనే నీవు విశ్వస్రష్టవైనావు. నీవు త్రిగుణాల్లో రజోగుణాధిపతివి. ఈ సమస్తలోకాలు నీలోనే దాగి ఉన్నాయి. యోగక్రియలో ఆరితేరినవారై ఏ కోర్కెలు లేనివారుగా ముద్రపడిన యోగులు ధ్యానం ద్వారా నిన్ను అన్వేషిస్తారు. శ్వాసక్రియను అదుపులో ఉంచిన కారణంచేత నీ అనుగ్రహానికి పాత్రులైన ఆ యోగులకు ఓటమి లేదు. ఈ జీవులెల్లరు తాళ్ళచే కట్టబడ్డ పశువుల్లాగ నీ మాటకు కట్టుబడి ఉంటారు. నీకు మొక్కుతున్నాము. రాత్రింబవళ్ళు అనే విభజన తెలియక, ఏ పనిచేయాలో బోధపడని ఈ జీవులను కాపాడే వాడివి నీవే. నీ శరణుజొచ్చిన మమ్ము దయార్ద్రబుద్ధితో కాపాడు. అరణిలో అగ్గిలాగా కశ్యపప్రజాపతి వీర్యశక్తి దితి గర్భంలో దాగి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అది దిక్కులన్నింటికి ప్రాకుతూ ఉంది. అని దేవతలెల్లరు మొరపెట్టుకోగా విని బ్రహ్మ వారందరిని ఆశ్వాసిస్తూ ఇలా అన్నాడు.
No comments:
Post a Comment