ఏకాదశీ మహాత్మ్యము
సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నది లేనిచొట తటాకమందుగాని, తటాకంకూడ అందుబాటులో లేనియెడల నూతిదగ్గర కాని, స్నానం చేసినంతమాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.
పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. ఆతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్శములు చేసి కీర్తి పొందియున్నారు.
అతడు చిన్నతనమునుండీ గడసరి, పెంకివాడు,అతను తల్లిదండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహావాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను.
అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంత కాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము శరీరబలము ఉన్నదను మనోగర్వముతో. జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేకపోయినాను గదా యని పశ్చాత్తాపము నొందుతూ నిద్ర పోయెను. అన్నిరోజులు ఒకే విధముగానుండవుగదా! అనాటి రాత్రి కొందరు, చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం యెత్తుకొనిపోయిరి.
అనంతుడు నిద్రనుండి లేచిచూడగా, సంపదంతా అపహారింపబడినది, అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ణప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునానదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నానఫలము దక్కేను. నదిలోమునిగి తడిబట్టలతో ఒడ్డుకువచ్చెను. చలికి గడగడ వణకి, బిఱ్ఱబిగిసీపోయినాడు, "నారాయణా" అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుటవలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యేను" అని వశిష్ఠుడు తెలియజేసెను.
No comments:
Post a Comment