విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట - శూద్ర స్త్రీ వృత్తాంతము
మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాకా దేవతలకు గంధర్వులకు కుడా పరమపవిత్రమైనది.
మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాకా దేవతలకు గంధర్వులకు కుడా పరమపవిత్రమైనది.
ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటచూచెను. ఆమె అందము యౌవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెనుప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా, మరలనాగంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చిచూడగా విశ్వామిత్రుడు, గంధర్వ స్త్రీతో క్రీడించుచుండిరి.
అదృశ్యమును చూచి మండిపడుచు "నీవు తపస్వివై యుండి కూడా కామతృష్ణ గలవాడవైతివి గాన నీకు కోతిముఖం సంభవించుగాక" యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు" మని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈ విషయము తెలిసికొని విశ్వామిత్రునికడకు వచ్చి "విశ్వామిత్రా! క్షణభంగుకరమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపఃశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము గంగానదిలో స్నానముచేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈపాషాణముపై చల్లుము అని నారదుడు వివరించగా.
విశ్వమిత్రుడు గంగానదిలో స్నానముచేసి విష్ణువును ధ్యానించి కమాండలముతో నీరు తెచ్చి పాషాణంగామారిన గంధర్వస్త్రీ పై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వమిత్రుడు తపస్సుకు విళ్ళిపోయినాడు.
No comments:
Post a Comment