Sunday, February 1, 2026

Magha Puranam 16 - మాఘ పురాణం 16

మాఘ పురాణం - 16 వ అధ్యాయం

ఆడకుక్కకు విముక్తి కలుగుట

దిలీప మహా రాజా! సుమిత్రుని కథ ఈశ్యరుడు పార్వతీదేవికి చెప్పినరీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను.ఆదెట్లనా-

మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచునప్పటికీ మాఘస్నానము మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రామైననూ సంశయము లేదు. అని పార్వతీ దేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మరల ఇట్లు పలికెను,

"నాధా! శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరిగదా! ఆ వ్రత విధాన మెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరముగా తెలియపరచు" డని పార్వతీ దేవి పరమేశ్యరుని కోరినది.

అంతమహేహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను "మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానముచేసి నది ఒడ్డున గాని, ఇంటివద్దగాని, మంటపమువుంచి,
ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మ్రుగ్గులు పెట్టి మంటవము మధ్య ఎనిమిది  రేకుల పద్మము వేసి అన్నిరకాల పుష్పములు. ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపుమధ్యమున వుంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు 
రాసి పూజించవలెను.

రాగి చెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్ళును ఉంచి దానిపై కొబ్బరికాయపెట్టి, క్రొత్తవస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్టించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో,
సాలగ్రామమును వుంచి యొక్క సద్బ్రాహ్మణుని ఆహ్వానించి, వారిచేత పంచామృతస్నానం చేయించి, తులసి దళముతోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను,

తరునాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రధాన మివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.

మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, పప్పు వుప్పు, కాయగూరలు
పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు వుంచిగాని, క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని, దానమియ్య వలయును మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని లేక వినునపుడుగాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతున్నిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపైవేసుకోవలయును. గాన శాంభవీ! మాఘస్నానము చేసి మాఘశుద్ధదశమినాడు. లక్ష్మీనారాయణులను నిష్టతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపము లైనను నశించిపోవును, ఇందులకొక ఉదాహరణకూడ తెలియజేసెదను సావధానురాలవై వినుము.

గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధక్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్ఠా గోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుటనలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిదిచేసిరి.

గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయములో స్నానముచేసి తీరముననున్న ఒక రావి చేట్టువద్దకువచ్చి

శ్లో
॥ మూలతో బ్రహ్మారూపాయ మధ్యతో విష్ణురూపిణే
        అగ్రాతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమః॥

అని రావి చెట్టునకు నమస్కరించి ఆ చెట్టుమొదట అసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట, మండప మేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలుకట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము వుంచి పూజంచినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడు కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు, ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొనివుండెను. శిష్యులు వారివద్దనున్న దండముతో దానిని బెదరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తరదిశవైపు మళ్ళి మరల తూర్పు వైపునకు తిరిగి, ఆవైపునుండి దక్షిణ దిశకు కదలి మరల యధాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి.ముందు చేసినటులే రెండవసారికూడా. ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండములతో బెదరగొట్టగా మరల ఆకుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి మండపము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము ఆయివున్నందున వెంటనే అ కుక్క రూవము వదలి ఒక రాజుగా మారిపోయాడు, ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి మునులందరికి నమస్కరించెను. అక్కడ నున్న కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.

"ఓయి! నీ వెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించాడు.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు, నా దేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూవున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసి యున్నాను, ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను. అనేక చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించినాను. ధర్మశాలలను కట్టించినాను, పశువులు త్రాగుటకు నీటిగుంటలు త్రవ్వించినాను. నిత్యము బీదప్రజల నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవవిగ్రహాలను ప్రతిష్టించినను. సద్బ్రాహ్మణులచేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియిన్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశద రచెదను వినుడు.

ఒకానొక దినమున ఒక మునిఫుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయాలన్న సామాన్య విషయము కాదు కదా! దానికి కావలసిన, ధనము వస్తుసముదాయము చాల కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకువచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఏదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశలప్రశ్నలడిగితిని. మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియ బేయుదును. ఈ మాసములో మఖర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానముచేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యములు చదువుటకాని లేక. వినుటగావి చేయుము. దానివలన వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాక అశ్వమేధయాగము చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలముగాని, తీర్ధస్నానాలు చేయగా వచ్చిన ఫలముగాని లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్గ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చినగాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు, 

ఒక వేళ ఇతరజాతులవారైననూ మాఘమాసమంతట నిష్ఠతో నదీస్నాన మాచరించి దానధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును, అని ఆ ముని
వర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని.

"ఆయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరింపను, ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటికాదు. గాన మాఘస్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు జేయుటగాని, పూజానమస్కారములు ఆచరించుటగాని చేయును. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంతకష్టము.! ఇక నాకు ఈనీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలముచాలు" అని ఆ మునితో అంటిని.

నా మాటలకు మునికి కోవంవచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, చేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.

అంతట నేను ఆ మునిచేతులువట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసికొనిపోయెను.

ఆ విధముగా. నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది. ఏడుజన్మలూ నాకు కుక్కజన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసితినిగాని నా పూర్వ జన్మ నాకుకలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించ లేరుగదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను" అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని అశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తు గటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యదార్ధములే, నీవుకుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

"నేను నా శిష్యునితో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణితీరమందుండిన కృష్ణానదిలో మూఘమాస మంతయు స్నానములు-జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమనివచ్చి యుంటివి మేమందరము ఈ వృక్షరాజము క్రీంద విష్ణువిగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్కరూపంలోనున్న నీవు దారినిపోతు ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజాసమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీ శరీరము బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యంగా నున్నావు. పరిశుద్ధులమైభగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువుగాని, పక్షిగాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా వున్నందున శిష్యులు నిన్ను తపోదండముతో తరిమిరి. , నైవేద్యము తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టుతిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు, అట్లు మూడు పర్యాయనులు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూమును ప్రసాదించినాడు. అనగా మాఘమాసఫలము భగవంతుని మండపము చుట్టు తిరుగుటనలన పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నాసముచేసి భగవంతుని ఛ్యానించి పురాణపఠనము జేసినచో ఎంతటిఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని వరివారమంతటికీ నమన్కరించుచుండగా అంతలో ఆ రావి చేట్టులోనున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడీ బెకబెకమని అరచి, అటుఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపమువద్దకు వచ్చి కొంచెము చూచుచుండగా హఠాత్తుగా కప్పరూపమును వదలి మునివనితగా మారిపోయెను.

ఆమె నవ యౌవ్వనవతి, అతి సుందరాంగి, ఆమె 
గౌతమఋషినిచూడగానే తనకుజ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది.

అంత గౌతమముని-అమ్మాాయీ! నీ వెవ్వరివెవ్వరిదానవు? నీనామదేయమేమి? నీ వృత్రాంతము తెలియజేయుము అని ప్రశ్నించిరి.

గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటచే యిట్లు చెప్పదొడంగెను.

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...