1. మధుమేహం ఉన్నవారికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగి జావా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
2. వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
3. సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్, రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొటిమలు, అలర్జీలు, ఇతర చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.
4. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి.
5. డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ సహజంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో ఇతర తాజా పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి.
6. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.
7. ఆకు కూరలలో విటమిన్ ఎ, సి మరియు కె అలాగే అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకు కూరలు మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శీతాకాలంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడతాయి.
8. అరటిపండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండు తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే.. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ లు కరిగిపోతాయి. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
9. నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది చాలా అవసరం.
10. గంధంలో శీతలీకరణ ప్రభావాలు ఉంటాయి. గంధం పేస్ట్ ను తలకు రాసి విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
11. వాల్ నట్స్ లోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.
12. పసుపులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఉంటాయి. ఇందులో ఉండే కర్క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్ మాదిరిగా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఔషధంగా కూడా పసుపు పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా ఉంటాయి.
13. డ్రాగన్ ఫ్రూట్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి.
14. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపాలు వంటి వాటిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
15. శరీరంలో వెంట్రుకలు, గోళ్లు పెరగడానికి విటమిన్ బీ7 తోడ్పడుతుంది. కాలిఫ్లవర్, క్యారెట్లు, అరటి, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, చికెన్ లో బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది.
16. పరగడుపున మజ్జిగ తాగితే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి.
17. రోజూ పరగడుపున గోధుమ జావ తాగితే రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
18. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి త్రాగితే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది.
19.శనగలు తినడం వలన శరీరానికి ఐరన్, జీర్ణక్రియ, చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతాయి
20. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
21. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
22. పెరుగు, జీలకర్రని కలిపి తీసుకుంటే అందులోని పోషకాలు రెంట్టింపు అవుతాయి. రెండు వేర్వేరుగా తినడం కంటే రెండింటిని కలిపి తింటే చాలా వరకూ బరువు తగ్గుతారు.
23. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
24. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొటీన్ ఫుడ్స్ సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
25. మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
26. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి ఆ పాలు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
27. కోసిన యాపిల్ ముక్క రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో రాయాలి, ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ రంగు మారకుండా ఊంటుంది.
28. తాజాపండ్లు, పొట్టుగల పదార్దములు, ఆకుకూరలు, కాయకూరలు పీచు గలవి మలనపదార్దములను బయటకు పంపించడములో పీచు ఉన్న పదార్దములదే కీలకపాత్ర.
29. క్యారెట్లు తినడం వల్ల చర్మానికి రక్షణనిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కంటిచూపు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
30. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని పొడి చేసి నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల అధిక వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
No comments:
Post a Comment