ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. దీనిని ఉసిరి ఏకాదశి మరియు రంగభరీ ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం, విష్ణువు స్వయంగా ఉసిరి చెట్టులో నివసిస్తాడు. అందుకే ఆమలకి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు శ్రీ హరికి ఉసిరికాయను నైవేద్యంగా పెడితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
దీన్ని ఉత్తర భారత్ లో రంగభరీ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, రాధాతో కలసి హోలీ ఆడతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అక్కడ విగ్రహాలను ప్రత్యేకంగా రంగులతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.
ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.
ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము.
ఈ కథ యొక్క రూపాంతరం బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ ఋషి చెప్పినట్లుగా కనిపిస్తుంది . వైదిస రాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకసారి, అమలకి ఏకాదశి నాడు, చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు మరియు ఉసిరి చెట్టును పూజించారు. అతను విష్ణువు యొక్క ఋషి-అవతారమైన పరశురాముడిని కూడా పూజించాడు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని ఉండి, విష్ణువును స్తుతిస్తూ భజనలు (భక్తి గీతాలు) పాడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్న వేటగాడు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా, అతని మరణం తరువాత అతను వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు. ఎలాంటి కోరికలు లేకుండా మరియు స్వచ్ఛమైన భక్తి లేకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం తదుపరి జన్మలలో విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.
ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.
ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము.
ఈ కథ యొక్క రూపాంతరం బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ ఋషి చెప్పినట్లుగా కనిపిస్తుంది . వైదిస రాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకసారి, అమలకి ఏకాదశి నాడు, చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు మరియు ఉసిరి చెట్టును పూజించారు. అతను విష్ణువు యొక్క ఋషి-అవతారమైన పరశురాముడిని కూడా పూజించాడు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని ఉండి, విష్ణువును స్తుతిస్తూ భజనలు (భక్తి గీతాలు) పాడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్న వేటగాడు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా, అతని మరణం తరువాత అతను వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు. ఎలాంటి కోరికలు లేకుండా మరియు స్వచ్ఛమైన భక్తి లేకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం తదుపరి జన్మలలో విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
తదుపరి జన్మలో 'బలవంతుడు మరియు నిర్భయుడు అయిన రాజు వసురథుడు సూర్యుడిలా ప్రకాశవంతంగా, చంద్రుడిలా అందంగా ఉండేవాడు. బలంలో, అతను శ్రీ విష్ణువులా, క్షమాగుణంలో భూమిలా ఉన్నాడు. దానగుణం మరియు సత్యసంధుడు అయిన రాజు వసురథుడు నిరంతరం పరమాత్మ శ్రీ విష్ణువుకు ప్రేమపూర్వక భక్తితో సేవ చేసేవాడు. అతను వేద జ్ఞానంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. రాచ వ్యవహారాల్లో చురుకైనవాడు, తన సొంత పిల్లలలా తన ప్రజలను చూసుకోవడంలో ఆనందించాడు. అతను అహంకారాన్ని ఇష్టపడలేదు మరియు దుష్టులను ధర్మవిరోధులను క్షించించేవాడు. అతని దానధర్మాలు అంతే లేదు'.
"ఒకసారి, అరణ్యంలో వేటాడుతుండగా, వసురథుడు దారి తప్పిపోయాడు. చుట్టూ తిరుగుతూ దారి తెలియక అలసిపోయాడు. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఇంతలో, కొంతమంది ఆటవికులు అక్కడికి వచ్చారు. రాజుతో శత్రుత్వం కలిగి ఉన్న వారు, అతన్ని చంపడానికి పూనుకున్నారు.
తదుపరి నిద్రలో ఉన్న వసురథుడిని చంపడానికి ప్రయత్నించగా వారి ఆయుధాలు ఏవీ నిద్రిస్తున్న రాజును తాకలేకపోయాయి. అంతేకాక వారు వారి శక్తిని కూడా కోల్పోయారు. శక్తిని కోల్పోయి జడులుగు కదలలేని స్థితికి చేరుకున్నారు.
'అకస్మాత్తుగా, అలంకరణలతో ప్రకాశిస్తూ, అద్భుతమైన సువాసనను వెదజల్లుతూ, మెడలో అద్భుతమైన పూలమాలతో, తీవ్రమైన కోపంతో కనుబొమ్మలు, మరియు మండుతున్న ఎర్రటి కళ్ళు కలిగిన ఒక అందమైన స్త్రీ రాజు శరీరం నుండి దూకింది. ఆమె మృత్యువు స్వరూపంలా కనిపించింది. ఆమె మండుతున్న చక్ర చక్రంతో, ఆమె రాజును చంపాలని ప్రయత్నించిన ఆటవికులను తుదముట్టించింది'.
'రాజు మేల్కొని తన చుట్టూ పడి ఉన్న ఆటవికులు మృతదేహాలను చూసి ఆశ్చర్యపోగా, అశరీర వాణి పలికి జరిగినదంతా వివరించి " రాజా వసురథ నీ పూర్వజన్మ పుణ్యం వల్ల దేవాదిదేవుడైన శ్రీ కేశవుడు. తనను నమ్మి కొలిచే భక్తులను సదా రక్షిస్తుంటాడు!" అని పలికింది. అంత వసురథడు సంతోషించి కేశవుడు, మాధవుడు గోవిందుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువును తలచుకొని స్తుతించాడు.
“అతను తన రాజధానికి తిరిగి వచ్చి ఇంద్రుడిలా ఎటువంటి అడ్డంకులు లేకుండా పరిపాలించాడు. ఇది పురాణ కథ.
ముఖ్యంగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తులసీమాలలతో పూజించుకొవాలి. దీనితో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొవాలి. విష్ణు సహస్రనామా పారాయణలు చేయాలి. ఈరోజు చాలా మంది నదీస్నానాలు చేస్తారు. దీనితో పాటు అన్నార్థులకు అన్నదానం, వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
నెయ్యితో దీపారధన చేస్తే మంచిది. నవగ్రహాల దోషాల పరిహరంకు ఏడు శనివారాల వ్రతంను ఆచరించాలి. ఆవుకు ఏదైన గ్రాసం పెట్టాలి. శునకాలకు, చీమలకు ఏదైన ఆహరం పెట్టాలి. ఈ రోజున క్షవరం, గోర్లను తీసుకొవడం వంటివి చేయకూడదు. రోజంతా ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తు ఆయనను శక్తిమేరకు పూజించుకొవాలని పురాణ ప్రవచనం.
నిత్య స్తోత్రావళి
పంచాంగం
నిత్య స్తోత్రావళి
పంచాంగం
No comments:
Post a Comment