రామాయణం సుందరకాండ పారాయణం
శ్రీ సమృద్ధమూ, విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ అయిన అయోద్యానగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కొసల్య, సుమిత్ర, కైకేయి అనే పేర్లుగల ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు కలిగారు.
వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు లక్ష్మణుడూ కూడా వచ్చారు.
పదమూడు సంవత్సరాలకాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ సాధు హింసకులయిన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి మారీచుని సాయంతో) సీతను అపహరించాడు.
భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో స్నేహంచేసి, వాలిని సంహరించాడు. అనంతరం వానరులందరూ సీతాన్వేషణకు నాలుగు దిక్కులకూ వెళ్ళారు. వారిలో అంగదుని నాయకత్వాన దక్షిణదిశకు వచ్చిన యోధులలో హనుముంతుడు
సముద్రం దాటడానికి సన్నద్దుడయాడు.
ఇది వెుదటి నాలుగు కాండలలో కథ, ఇక అయిదవదయిన సుందరకాం౦డ.
ప్రస్థానం
త్రికూటగిరి
No comments:
Post a Comment