శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట ఈ విధంగా ఉదయించి కొత్త కుంకుమతో అలదిన శ్రీలక్షీముఖమండలంలాగా పరిపూర్ణమైన చంద్రమండలాన్ని గోపికలు దర్శించారు. కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు యమునాతీరవనంలో లోకసమ్మోహనంగా ఒక పాట పాడాడు.
ఆ గానం విన్న గోపికలు తదేక మనస్కలయ్యారు. తత్తరపడుతున్న గోపికలకు పనులు చేయడానికి చేతులాడ లేదు. గోవులవద్దకు దూడలను విడువలేదు. విడిచినా పాలుపిదుకలేదు. పాలుపిదికినా కాచలేదు. కాచినా కాగినపాలు దించలేదు. దించినా పాలు పిల్లలకు పోయ లేదు. పోసినా భర్తలకు సపర్యలు చేయ లేదు. చేసినా భోజనాలు చేయ లేదు. చేసినా పూలు కొప్పుల్లో ముడువలేదు. ముడిచినా వస్త్రాలు ఆభరణాలు ధరించ లేదు. ధరించినా, ఇండ్లలో నిలువ లేదు. నిలిచినా పాయసాలు వండ లేదు.
ఉన్నచోట ఉండడం లేదు. కాటుకలు సరిగా పెట్టుకోలేదు. కురులు చక్కగా దువ్వుకోలేదు. స్తనాలమీద గంధాలు పూసుకోలేదు. జారినపయ్యెదలు కప్పుకోలేదు. చెలులకు చెప్పలేదు. అన్నదమ్ములు, భర్తలు, మామలు, మరదులు, బిడ్దలు అడ్డంవచ్చి అడ్డుకొంటున్నా లెక్కచేయకుండా చలించి పోతూ మన్మథుని పూలబాణాలజల్లుకు తల్లడిల్లారు.
దీనులయ్యారు. మేఘాలవరుసనుండి వెలువడి ఉల్లసిల్లే మెరుపుతీగలలాగా మందగమనలైన గోపికలు వడివడి నడకలతో మందనుండి బయటపడి శ్రీకృష్ణ సందర్భనానికి వెళ్ళారు. అప్పుడు
కొందరు గోపికలు తమ ఇంటివారినిర్బంధంవల్ల ఇండ్లు విడిచి బయటకు రాలేక శ్రీకృష్ణుని విరహంవల్ల తపిస్తూ, మనస్సులలోనే జారుడని భావిస్తూ కూడా శ్రీ కృష్ణుణ్ణి తమకౌగిళ్ళలో నింపుకున్నారు. పరవశించి, బంధవిమోచనలై త్రిగుణాత్మకాలైన దేహాలు విడిచి ముక్తి పొందారు.
(గోపికల భౌతికదేహాలు అలాగే ఉన్నా వారి గుణాధారదేహాలు విడిచిపెట్టినందువల్ల భర్త, బిడ్డలు మొదలైనవారి సంబంధాలు వదిలి ముక్తలయ్యారు అని భావం.)
ఇలా శుకుడు చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
ఆ మాటవిని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. ఓ శుకమహర్షీ! ఆ గోపస్త్రీలు కృష్ణుణ్ణి కేవలం తమ జారునిగా భావించారే కానీ, మహిమాన్వితుడైన పరబ్రహ్మం అని భావించలేదు కదా! అలాంటి గోపికలు త్రిగుణమయమైన శరీరాలను ఎలా వదిలి ముక్తిపొందారో తెలపండి.
ఇలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా అన్నాడు.
రాజశ్రేష్ఠా! ఇంతకుముందే నేను నీకు చెప్పి ఉన్నాను - విష్ణువుకు విరోధి, మూర్ఖుడు అయిన శిశుపాలుడే ముక్తిపదవిని పొందగలిగాడని. మరి నారాయణునికి ప్రేయసులైనవారు పొందరాని పదవి ఏదైనా ఉందా?
దీనులయ్యారు. మేఘాలవరుసనుండి వెలువడి ఉల్లసిల్లే మెరుపుతీగలలాగా మందగమనలైన గోపికలు వడివడి నడకలతో మందనుండి బయటపడి శ్రీకృష్ణ సందర్భనానికి వెళ్ళారు. అప్పుడు
కొందరు గోపికలు తమ ఇంటివారినిర్బంధంవల్ల ఇండ్లు విడిచి బయటకు రాలేక శ్రీకృష్ణుని విరహంవల్ల తపిస్తూ, మనస్సులలోనే జారుడని భావిస్తూ కూడా శ్రీ కృష్ణుణ్ణి తమకౌగిళ్ళలో నింపుకున్నారు. పరవశించి, బంధవిమోచనలై త్రిగుణాత్మకాలైన దేహాలు విడిచి ముక్తి పొందారు.
(గోపికల భౌతికదేహాలు అలాగే ఉన్నా వారి గుణాధారదేహాలు విడిచిపెట్టినందువల్ల భర్త, బిడ్డలు మొదలైనవారి సంబంధాలు వదిలి ముక్తలయ్యారు అని భావం.)
ఇలా శుకుడు చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
ఆ మాటవిని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. ఓ శుకమహర్షీ! ఆ గోపస్త్రీలు కృష్ణుణ్ణి కేవలం తమ జారునిగా భావించారే కానీ, మహిమాన్వితుడైన పరబ్రహ్మం అని భావించలేదు కదా! అలాంటి గోపికలు త్రిగుణమయమైన శరీరాలను ఎలా వదిలి ముక్తిపొందారో తెలపండి.
ఇలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా అన్నాడు.
రాజశ్రేష్ఠా! ఇంతకుముందే నేను నీకు చెప్పి ఉన్నాను - విష్ణువుకు విరోధి, మూర్ఖుడు అయిన శిశుపాలుడే ముక్తిపదవిని పొందగలిగాడని. మరి నారాయణునికి ప్రేయసులైనవారు పొందరాని పదవి ఏదైనా ఉందా?
పాపరహితుడు, తరగని శక్తిగలవాడు, వాక్కుకు మనస్సుకు గోచరించనివాడు, త్రిగుణాతీతుడు అయిన శ్రీకృష్ణుని స్వరూపం భక్తజనానికి ముక్తిదాయిని అనడంలో సందేహం లేదు. ఇది సత్యం.
(ఎవరివద్దనైనా విరోధంతో పొందగలిగిన దానికంటే, ప్రేమతో అధికంగా సంపాదించుకోగలగడం లోకసహజం. ఆ లోకసహజమైన అంశాన్ని శ్రీకృష్ణునికి ఆపాదించి, హరికి సంబంధించిన నిత్యసత్యాన్ని కవి ఆవిష్కరించాడు. చక్రికి పగవాడై ముక్తిపొందినవాడు శిశుపాలుడు. ప్రేమతో ముక్తి పొందినవారు గోపికలు.)
బంధుత్వంతోనైనా, విరోధంతోనైనా, ప్రేమతోనైనా, చింతతోనైనా, ప్రాణభయంతోనైనా భక్తితోనైనా హరిధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.
కాబట్టి, పురుషోత్తముడు, పుట్టుకలేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించినంతమాత్రాన అచేతనాలైన కొండలు, చెట్లు వంటివికూడా ముక్తిని పొందగలవు. ఈ విధంగా
అధికుడూ శుభగుణాలు కలవాడూ, చతురుడూ అయిన శ్రీకృష్ణుడు మహిమగలిగిన తన తీయని పాట శబ్దం విని వచ్చిన గోపస్త్రీలను చూచి, తన మాటల నేర్పు తేటపడగా ఇలా పలికాడు.
ఓ లతాంగులారా! మీకు కుశలమా? మీ మందకు భయం లేదుగదా! సింహాలు, పులులు, ఏనుగుమున్నగు క్రూరజంతువులు తిరుగుతూ ఉంటాయి. దూరప్రయాణాలు మీరు రావచ్చునా? ఇక్కడ తిరగవచ్చునా? చాలుచాలు! మీ గోకులానికి సంతృప్తితో మరలి వెళ్లండి.
(అతిథులు వస్తూనే 'క్షేమం' అడగడం మనసంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే కృష్ణుని నోటివెంట పలికించడంవల్ల అందరూ అలాంటి మర్యాదను పాటించాలి అని ధ్వని.)
మీరు వెళ్లినజాడ తెలియక విచారంతో మీ తల్లిదండ్రులూ, భర్తలూ, మరదులూ, కొడుకులూ, కులపెద్దలూ, తోబుట్టువులూ, బంధువులూ మీరు హద్దుమీరి ప్రవర్తించి వెళ్లిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెదకుతున్నారో? ఏమోగదా! ఇలాంటి సాహసప్రయత్నాలు మీకు తగినవికావు.
కుటుంబమర్యాదను బూడిదలో కలిపి, భర్తలను సిగ్గుపడేటట్లు చేసి, అత్తమామలను పరితాపానికి గురిచేసి, సోదరుల మర్యాదను పోగొట్టి, తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి, చుట్టాలకు అసహ్యం కలిగిస్తూ, సత్కులంలో జన్మించిన స్త్రీలు మారుమగలమీది కోర్కెలతో హద్దుమీరి రావచ్చా? అలావస్తే లోకులు ఆ ప్రవర్తనను చూచి, మెచ్చుకుంటారా?
సాధ్వి అయిన స్త్రీకి జారునితోడి సంగమం కోరదగిందికాదు. ఎందుకంటే భర్తకు తెలిస్తే ప్రాణంతీసేందుకు తెగిస్తాడు. రాజుకు తెలిస్తే దండిస్తాడు. మామకు తెలిస్తే కాపురం చెడుతుంది. తలారికి తెలిస్తే నిర్బంధిస్తాడు. తలిదండ్రులకు తెలిస్తే సంఘంలో తలెత్తుకోలేరు. తోడికోడలుకు తెలిస్తే ఎత్తిపొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే అసహ్వించుకొంటారు. బంధువులకు తెలిస్తే వెలివేస్తారు. ఇరుగు పొరుగువారికి, ఇతరజనులకు తెలిస్తే చులకనగా చూస్తారు. జారిణి అయిన స్త్రీకి ఇటు ఇహంలోకాని, అటు పరంలోకాని సుఖం లేదు. కీర్తి లేదు. ఆనందమూ లేదు. అందువల్ల సాధ్వి అయినస్త్రీ విటుణ్ణి చేరడానికి వెళ్ళడం సరికాదు.
తన భర్తయొక్క ప్రవర్తన బాగాలేకున్నా అతడు శక్తిహీనుడైనా, అందంలేనివాడైనా, మందబుద్ధి అయినా, రోగి అయినా, అతణ్ణి వదిలివేయడం సాధ్వికి మర్యాద కాదు.
ఓ అమాయకపు గోపికలారా! ఇది యమునా నదీ జలాలతో ప్రోదిచేయబడిన చిగుళ్లు, పూలు, ఆకులతో విరాజిల్లే బృందావనం. మీ మనస్సులు హద్దుల్ని అతిక్రమించాయేమో! గోకులానికి మరలిపొండి. వెళ్లి ఏడుస్తున్న పిల్లలకు పాలు పోయండి. గోవులవద్ద పాలుతాగడానికి దూడలను విడవండి. ఒప్పిదం అయ్యేవిధంగా మీమీ భర్తలకు పరిచర్యలు చేయండి.
ఓ కాంతలారా! నన్నుకోరి ఇక్కడికి వచ్చారు. మీకే కొరతా లేదు. శుభాలు కలుగుతాయి. సృష్టిలోని సమస్తప్రాణులు నాకు ప్రియమైనవే (అలాగే మీరుకూడా నాకు ప్రియమైనవారే) ఐనా, మీరు ఇక్కడ ఉండడం భావ్యం కాదు. స్త్రీలు భర్తలకు పరిచర్యలు చేయడమే ప్రాచీనకాలంనుండి విధించబడిన ధర్మం. ఆమాట పెద్దలు సర్వత్ర చెపుతూనే ఉంటారు.
(ఎవరివద్దనైనా విరోధంతో పొందగలిగిన దానికంటే, ప్రేమతో అధికంగా సంపాదించుకోగలగడం లోకసహజం. ఆ లోకసహజమైన అంశాన్ని శ్రీకృష్ణునికి ఆపాదించి, హరికి సంబంధించిన నిత్యసత్యాన్ని కవి ఆవిష్కరించాడు. చక్రికి పగవాడై ముక్తిపొందినవాడు శిశుపాలుడు. ప్రేమతో ముక్తి పొందినవారు గోపికలు.)
బంధుత్వంతోనైనా, విరోధంతోనైనా, ప్రేమతోనైనా, చింతతోనైనా, ప్రాణభయంతోనైనా భక్తితోనైనా హరిధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.
కాబట్టి, పురుషోత్తముడు, పుట్టుకలేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించినంతమాత్రాన అచేతనాలైన కొండలు, చెట్లు వంటివికూడా ముక్తిని పొందగలవు. ఈ విధంగా
అధికుడూ శుభగుణాలు కలవాడూ, చతురుడూ అయిన శ్రీకృష్ణుడు మహిమగలిగిన తన తీయని పాట శబ్దం విని వచ్చిన గోపస్త్రీలను చూచి, తన మాటల నేర్పు తేటపడగా ఇలా పలికాడు.
ఓ లతాంగులారా! మీకు కుశలమా? మీ మందకు భయం లేదుగదా! సింహాలు, పులులు, ఏనుగుమున్నగు క్రూరజంతువులు తిరుగుతూ ఉంటాయి. దూరప్రయాణాలు మీరు రావచ్చునా? ఇక్కడ తిరగవచ్చునా? చాలుచాలు! మీ గోకులానికి సంతృప్తితో మరలి వెళ్లండి.
(అతిథులు వస్తూనే 'క్షేమం' అడగడం మనసంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే కృష్ణుని నోటివెంట పలికించడంవల్ల అందరూ అలాంటి మర్యాదను పాటించాలి అని ధ్వని.)
మీరు వెళ్లినజాడ తెలియక విచారంతో మీ తల్లిదండ్రులూ, భర్తలూ, మరదులూ, కొడుకులూ, కులపెద్దలూ, తోబుట్టువులూ, బంధువులూ మీరు హద్దుమీరి ప్రవర్తించి వెళ్లిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెదకుతున్నారో? ఏమోగదా! ఇలాంటి సాహసప్రయత్నాలు మీకు తగినవికావు.
కుటుంబమర్యాదను బూడిదలో కలిపి, భర్తలను సిగ్గుపడేటట్లు చేసి, అత్తమామలను పరితాపానికి గురిచేసి, సోదరుల మర్యాదను పోగొట్టి, తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి, చుట్టాలకు అసహ్యం కలిగిస్తూ, సత్కులంలో జన్మించిన స్త్రీలు మారుమగలమీది కోర్కెలతో హద్దుమీరి రావచ్చా? అలావస్తే లోకులు ఆ ప్రవర్తనను చూచి, మెచ్చుకుంటారా?
సాధ్వి అయిన స్త్రీకి జారునితోడి సంగమం కోరదగిందికాదు. ఎందుకంటే భర్తకు తెలిస్తే ప్రాణంతీసేందుకు తెగిస్తాడు. రాజుకు తెలిస్తే దండిస్తాడు. మామకు తెలిస్తే కాపురం చెడుతుంది. తలారికి తెలిస్తే నిర్బంధిస్తాడు. తలిదండ్రులకు తెలిస్తే సంఘంలో తలెత్తుకోలేరు. తోడికోడలుకు తెలిస్తే ఎత్తిపొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే అసహ్వించుకొంటారు. బంధువులకు తెలిస్తే వెలివేస్తారు. ఇరుగు పొరుగువారికి, ఇతరజనులకు తెలిస్తే చులకనగా చూస్తారు. జారిణి అయిన స్త్రీకి ఇటు ఇహంలోకాని, అటు పరంలోకాని సుఖం లేదు. కీర్తి లేదు. ఆనందమూ లేదు. అందువల్ల సాధ్వి అయినస్త్రీ విటుణ్ణి చేరడానికి వెళ్ళడం సరికాదు.
తన భర్తయొక్క ప్రవర్తన బాగాలేకున్నా అతడు శక్తిహీనుడైనా, అందంలేనివాడైనా, మందబుద్ధి అయినా, రోగి అయినా, అతణ్ణి వదిలివేయడం సాధ్వికి మర్యాద కాదు.
ఓ అమాయకపు గోపికలారా! ఇది యమునా నదీ జలాలతో ప్రోదిచేయబడిన చిగుళ్లు, పూలు, ఆకులతో విరాజిల్లే బృందావనం. మీ మనస్సులు హద్దుల్ని అతిక్రమించాయేమో! గోకులానికి మరలిపొండి. వెళ్లి ఏడుస్తున్న పిల్లలకు పాలు పోయండి. గోవులవద్ద పాలుతాగడానికి దూడలను విడవండి. ఒప్పిదం అయ్యేవిధంగా మీమీ భర్తలకు పరిచర్యలు చేయండి.
ఓ కాంతలారా! నన్నుకోరి ఇక్కడికి వచ్చారు. మీకే కొరతా లేదు. శుభాలు కలుగుతాయి. సృష్టిలోని సమస్తప్రాణులు నాకు ప్రియమైనవే (అలాగే మీరుకూడా నాకు ప్రియమైనవారే) ఐనా, మీరు ఇక్కడ ఉండడం భావ్యం కాదు. స్త్రీలు భర్తలకు పరిచర్యలు చేయడమే ప్రాచీనకాలంనుండి విధించబడిన ధర్మం. ఆమాట పెద్దలు సర్వత్ర చెపుతూనే ఉంటారు.
(నాకు సర్వప్రాణులూ ప్రియమైనవి అని చెప్పింది మహావిష్ణువే. బాలుడైన శ్రీకృష్ణుడు కాదు. సర్వప్రాణులలో గోపికలూ చేరతారు. వారికి సనాతనధర్మం గుర్తుచేయడం లోకకల్యాణంకోసమే.)
మానవతులారా! నన్ను గూర్చి ధ్యానించడం, నన్నుగురించి వినడం, నన్ను దర్శించడం, నన్ను గురించి పాడడం(అనేవాటిద్వారా) నాపై మనసుపెడితే చాలు మీరు ధన్యత్వం కలిగినవారవుతారు. మీ ఇండ్లకు మరలి వెళ్లండి.
బృందావనంలో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణపరమాత్మ వద్దకు విచ్చేసిన గోపకాంతలకు సరైన మార్గనిర్దేశనం చేయగా వారు విని(అని శ్రీకృష్ణుడు చెప్పగావిని).
మానవతులారా! నన్ను గూర్చి ధ్యానించడం, నన్నుగురించి వినడం, నన్ను దర్శించడం, నన్ను గురించి పాడడం(అనేవాటిద్వారా) నాపై మనసుపెడితే చాలు మీరు ధన్యత్వం కలిగినవారవుతారు. మీ ఇండ్లకు మరలి వెళ్లండి.
బృందావనంలో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణపరమాత్మ వద్దకు విచ్చేసిన గోపకాంతలకు సరైన మార్గనిర్దేశనం చేయగా వారు విని(అని శ్రీకృష్ణుడు చెప్పగావిని).
విరహాగ్నిశిఖలతో కలిసి వెడలిన నిట్టూర్పులు సోకి వారిపెదవులు ఎండిపోయాయి. కన్నులనుంచి స్రవించే కాటుక కన్నీరు అలంకారంగా వారు స్తనాలమీద అలదుకొన్న కుంకుమ చెదరిపోయే విధంగా ప్రవహించింది. (విచారంతోవారు) చెక్కులమీద చేర్చిన చేతులవేడివల్ల వారివదనపద్మాలఅందం కందిపోయింది. ఎడతెరపిలేకుండా తాకుతున్న మన్మథబాణాలకు గోపికల ధైర్యం చెదరి పోయింది. మిక్కుటమైన శోకంవల్ల మాటలు తడబడ్డాయి. తమకు ప్రియమైన పలుకులు పలకని ప్రియుడైన శ్రీకృష్ణుణ్ణి చూచి వారు భయపడి, పాదాలతో నేలమీద రాస్తూ చింతలో మునిగిపోయారు.
ఇలా (గోపికలు) పలికారు.
అయ్యో! శ్రీకృష్ణా! నిన్ను నమ్ముకొన్నాం. నిన్ను క్రూరుడనలేము. మా ఇండ్లలోని పనులన్నిటిని వదిలివేసి, పద్మాలవంటి నీ పాదాలు పూజించడానికి తప్పించుకొని వచ్చాము. నీవు పరమేశ్వరుడివి. సంపన్నుడివి. ముక్తిమీద ఆసక్తి కలవారిని కాపాడినట్లు మమ్ములను కూడా కాపాడు! భ్రమకు గురైన కాంతలను వదలడం నీకు తగదు.
(గోపికల మాటల్లో మోక్షాసక్తి ధ్వనిస్తున్నది. శృంగారాసక్తికాదు.)
ధర్మజ్ఞుడవైన శ్రీకృష్ణా! భర్తలను, బిడ్డలను, బంధువులను అనువర్తించడమే సాధ్వీమణులకు ధర్మం అన్నావు. ధర్మవేత్తవైన నీవే ఆలోచించు. భర్త, పుత్రుడు మొదలైన బంధువులపేర్లు ధరించిన వాడివై ప్రకాశించే నీయందు దేహధారిణులైన స్త్రీలు పతిపుత్రాదులపట్ల తమకుగల కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా?
(శ్రీహరే అన్నిప్రాణులకు పతి, పుత్రుడు, గురుడు, బంధువు అయినప్పుడు తాము ఆయాసంబంధాలు ఆపాదించుకొని స్వామివారిని అనువర్తించడం అన్యాయం కాదని గోపభామినులు తమచర్యను సమర్థించుకొన్నారు.)
శాస్త్రనిపుణులైనవారు అంతర్యామివైన నీయందే ఆసక్తి కలిగి ఉంటారు. నీవు ఎడతెగని ప్రేమను కలిగించేవాడివి. కాబట్టి దుఃఖం కలిగించే భర్త పిల్లలు మొదలైన వారిని ఎందుకు మాకు చూపుతావు? మా మహనీయ జీవితాశలు నీచుట్టె అల్లుకొని ఉన్నాయి. వాటిని ఎందుకు తుంచివేస్తావు? మా పరితాపం పోగొట్టు స్వామీ!
(ముగ్ధలైన గోపికలు భగవంతుని మీది ఆసక్తి బ్రహ్మానంద జనకమని తెలుసుకొన్నారు. ఎవరిద్వారా అంటే నేర్పరుల ద్వారా! అందువల్ల సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా కలిగించే పతి పుత్రాదిక సంబంధం వ్యర్థం అంటున్నారు. వారి జీవితాశలు స్వామిచుట్టే అల్లుకొని ఉన్నాయి. తీగెను చెట్టునుండి విడదీస్తే తునిగి తీగే వాడిపోతుంది. అలాగే తమ జీవితాశలు అనే తీగెలు తెగిపోతే బతకలేము అన్నారు.)
కృష్ణా! నీ పాదపద్మాలను ప్రీతితో చేరడానికి తప్ప తిరిగి వెళ్లడానికి మాకు కాళ్లు రావు. నీ కరకమలాలను స్పృశించడానికి తప్ప ఇతరపనులకు మాచేతులు పూనుకోవు. నీ మాటల అమృతప్రవాహాన్ని ఆస్వాదించడానికి తప్ప మా చెవులు ఇతరాలైన మాటలను వినవు.
నీ అందమైన రూపాన్ని సంపూర్ణంగా చూడడానికే కాని మా కనులు ఇతరాలను చూడవు. మా నాలుకలు నిన్ను గురించి పలుకుతాయే కాని ఇతరాలైన మాటలు పలుకవు. నీవు 'మిమ్ములను ఒల్లను' అని పలకడానికి సందేహించడం లేదు. మామనసులను మరిపించుకొని దొంగిలించావు. ఇప్పుడు ఏమి చేయగలం?
(ప్రాణుల జ్ఞానేంద్రియాలు ఇహలోక సంబంధి పనులు మానివేసి, పరలోక సంబంధి పనులవైపు మళ్లితే ముక్తికి దగ్గరైనట్లే.)
శ్రీమహాలక్ష్మి తన తొడలమీద స్వామివారి పాదాలుంచుకొని ఒత్తుతూ ఉంటుంది. స్వామివారి పాదపద్మాలు పవిత్రమైన గుర్తులను చేస్తూ ఉంటాయి. మా తపస్సంపదతో నీ వద్దకు ఎట్లో చేరగలిగాము. మేము నిన్ను వదలి మరలివెళ్లలేము. మా భర్తల మాటలను ఇష్టపడము. పద్మసువాసనలు మరిగిన తుమ్మెదలు ఇతరకుసుమాలవద్దకు వెళ్లడానికి ఇష్ట పడతాయా? (పడవు).
(గోపికలు స్వామివారి చెంతకు చేరడంలో వారి 'తపము సంపద' కారణమని భావిస్తున్నారు. గోపికలు త్రేతాయుగంలో ఋషులు. శ్రీరాముని అందాన్ని వలచారు. శ్రీకృష్ణావతారంలో గోపికలుగా పుట్టి, మీ కోరికను తీర్చుకో వచ్చునన్నాడు - శ్రీరాముడు. అప్పటి ఆ ఋషుల తపస్సంపదే ఇప్పటి గోపికల తపోస్సంపదగా చెప్పబడింది.)
ఓ కృష్ణా! లక్ష్మీదేవి నీ విశాల వక్షస్థ్సలం పైన, తులసీతో కలసి ఉండడానికి ఓ స్వామీ! నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ, నీ పాదకమలాల పుప్పొడిని కోరుకుంటూ ఉంటుంది గదా!
(తులసి లక్ష్మీదేవి స్వరూపమే. సరస్వతీదేవి శాపంవల్ల లక్ష్మీదేవి తులసిగా మాధవీ ధర్మధ్వజులకు కుమార్తెగా జన్మిస్తుంది. శంఖచూడుని రూపంలో విష్ణువు ఈమెను వివాహమాడతాడు (బ్రహ్మవైవర్తపురాణం))
ఓ పురుషభూషణా! మా అత్తలూ, మామలూ చింతిస్తుండగా, నిందకు భయపడకుండా, మా భర్తలను దుఃఖాలపాలుచేసి, కుటుంబమర్యాదలు మంటగలిపి, నీ నవ్వులకు, మెత్తనిపలుకులుకు ఇష్టపడి, మన్మథుడు పట్టుదలతో బాధించగా మేము వచ్చాము. ఏ ఇతరసంబంధాలూ మాకు వద్దు. మీ పరిచర్యలు చేసే అవకాశం ఇచ్చి రక్షించుము.
పూర్వం స్త్రీలు భర్తల్ని ప్రేమించలేదా? భర్తలు వారిని ఆదరంతో తృప్తిపరచలేదా? అనురాగాలు మాకు మాత్రమే పుట్టినవా? నీ మాటలు మగవారికి తగినవేనా? (తగినవికావు) ఓ పుణ్యాత్మకా! మమ్మల్ని కౌగిలించు. నీకు పుణ్యం ఉంటుంది.
కృష్ణా! నీ చెక్కిళ్లు చెవికుండలాల ప్రకాశంతో ఒప్పారుతున్నాయి. నీ నుదురు ముసురుకొన్న ముంగురులతో అందంగా ఉంది. నీ చిగురుమోవి అమృతం చిందుతూ ఉంది. నీ చూపులు మనోజ్ఞమైన చిరునవ్వుతో సొంపారుతున్నాయి. ఇలాంటి నీ వదనం చూస్తూ - మేం నిలువగలమా? మన్మథుడు తన చెరకువింటినుండి వదిలిన బాణాలకు దాసులమైపోయాం. మమ్మల్ని రక్షించు.
ప్రభూ! మా చెంతకు చేరి నీ అధరామృతధారలను మా చిగురు పెదవులపైన చిలికించు. నీ విశాలమైన రమ్యతరమైన నిర్మలమైన ఎదను మా చను మొగ్గలపైన గదించు. నీ రమణీయ హస్తపద్మాలను మా కేశపాశంపైన చేర్చు. నీ దయార్ద్రమైన చూపులను మా నెమ్మొగాలమీద ప్రసరింపజేయి. నీ నవీనమైన, ఆదరణీయమైన సల్లాపంతో మా చెవులను కప్పివేయి. (అలా చేయకపోతే) మేం ఎలా జీవించగలం? ఎక్కడికి వెళ్లగలం? స్త్రీల మొరలు విన నర్హం కావా?
ప్రాణేశ్వరా! నీ పాదాలమీద ఒట్టువేసి చెపుతున్నాము. నీ చూపులు, నీ నవ్వులు, నీ పాటలవల్ల పుట్టి పేట్రేగిన మన్మథాగ్నులను నీ చిగురుమోవినుండి స్రవించే అమృతధారలతో చల్లార్చు. అలా చల్లార్చకపోతే నీ ఎడబాటు మంటల్లో భస్మమైపోయి నిన్నే తలచుకుంటూ నీ పాదద్వయాన్నే చేరతాము.
మిక్కిలి ప్రకాశించే నిన్ను చూచినా, నీ సంగీతం విన్నా - చెట్టూ, మృగాలూ, పక్షులూ, ఆవుల గుంపులూ కరగి పులకించి పోతాయి. మరి అబలలు అయిన స్త్రీలు నిన్ను చూచి, నీ గానం విని ద్రవించిపోరా?
ఓ యశోదాకుమారా! మానినులధైర్యహారా! నీ మధురమైన మాటలు అనే జడివాన కురియకుంటే ఈ మన్మథాగ్నిని ఎలా చల్లార్చగలం? నీ చూపు అనే నావ లేకుంటే ఈ మన్మథసాగరాన్ని ఎలా దాటగలం? నీ చిరునవ్వు అనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నవాధరామృతం చిలుకకుంటే ఈ మదనజ్వరాన్ని ఎలా పోగొట్టుకోగలం? నీవు కరుణించి కౌగిలించుకొనకుంటే మా బతుకు ఎలా సాగించగలం? మాగతి ఏమిటి? దయలేనివాడైన మన్మథుడు మమ్ములను బతకనిస్తాడా?
ఓ పద్మనేత్రా! దేవతలను శ్రీహరి రక్షించినట్లు - మేము మూర్చపోకుండా నీ అభయహస్తాన్ని మా హృదయాలమీదా, మాశిరస్సులమీదా ఉంచు.
బాలకృష్ణా! దయానిధీ! తరుణులను దట్టమైన నీ విరహాగ్నికీలలు తలమునుకలుగా బాధించగా (దయతో) పలుకరించవు, చూడవు, నువ్వు ఎంత క్రూరుడివో గదా!
ఈ విధంగా పుష్పబాణుని బాణపరంపరలకు సొమ్మసిల్లి ఓపికలు లేకుండా పలికిన గోపికల దీనమైన పలుకులు విని, నవ్వి, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆత్మలో క్రీడించువాడై గోపికలతో రమించాడు. అప్పుడు
కృష్ణుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతోను; చీరచెరుగులను, కేశపాశాలను లాగడంతోను; మొలనూళ్లు, చేతులు, భుజాలు, కుచాల స్పర్శలతోను; గోటిగిచ్చుల గుర్తులతోను; పరిహాసవాక్కులు, కౌగిళ్లతోను మన్మథుణ్ణి తిరస్కరిస్తూ గోపికలను రతిక్రీడలతో పరవశింపజేశాడు.
వికసించిన ముఖాలు గలిగిన గోపకాంతలు సంప్రీతితో తనను భజించగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు వెన్నెలతో చుక్కల మధ్య విలసిల్లే నిండుచంద్రునివలె భాసిల్లాడు.
గోపికలు తననుగురించి పాటలు పాడుతుండగా, ప్రీతితో నర్తిస్తూ, వందలకొలదీ గోపికలు తనను కొలువగా మెడలోని వైజయంతిమాలతో పద్మనేత్రుడైన కృష్ణుడు బృందావనానికి అలంకారమయ్యాడు.
పరమేశ్వరుడై ఎవరికీ చిక్కకుండా, ఎదుటివారిని చిక్కులపాలు జేసే మాయలమారి అయిన కృష్ణునికి చిక్కి గోపయువతులు ధన్యురాండ్రై, మన్మథకేళిలో పరవశించిపోయారు. అలా ఉండగా కల్యాణగుణశాలి అయిన కృష్ణప్రభువు గోపికల కామోత్కంఠతను ఉపశమింపజేయడానికి, ఆ తర్వాత ఆదరంగా దగ్గరికి తీసుకోడానికి అనువుగా అపుడు అదృశ్యమయ్యాడు.
ఇలా కృష్ణుడు అద్భశ్యుడై వెళ్లిపోగా, మగ ఏనుగును కానక తిరిగే ఆడు ఏనుగుల మందలాగా, తమ హృదయాలు తల్లడిల్లిపోగా, గోపకాంతలు శ్రీకృష్ణుని నడక, నవ్వు, విలాసం, దృష్టి విహారం, పలుకు, నేర్పు, అనురాగాల స్మృతిలో తమ మనసులు పోగొట్టుకున్నారు. వివిధ చేష్టలకు పాల్పడి, తన్మయత్వంతో "నేను కృష్ణుణ్ణి” అని ఒకరు అంటే 'కాదు! నేనే కృష్ణుణ్ణి' అని మరొకరు వాదులాడుకుంటూ, కృష్ణునిగుణాలు వారిలో ఆవేశించగా తిరుగుతూ -
ఓ పరీక్షిన్మహారాజు! చరాచరాలైన సమస్తభూతాల లోపలా, వెలుపలా విలసిల్లే వాసుదేవుణ్ణి గోపకాంతలు యమునాతీరవన మధ్య ప్రాంతాలలో ప్రేమతో పాడుతూ వెదకడానికి వెళ్లారు.
ఓ పున్నాగ వృక్షమా! పురుష శ్రేష్ఠుల నమస్మారాలందుకొనే వాణ్ణి చూశావా? ఓ బొట్టుగచెట్టా! నొసట తిలకం ధరించేవానిని దర్శించావా? ఓ కర్పూర వృక్షమా! మహాబలంతో విలసిల్లే వాణ్ణి చూడలేదా? ఓ మంకెన వృక్షమా! బంధవులకు మిత్రుడైన వాణ్ణి చూశావా? ఓ వెలగమానూ! మన్మథ రూపుణ్ణి సందర్శించలేదా? ఓ వెదురు వృక్షమా! వేణుధరుణ్జి చూడలేదా?
(ప్రాణుల జ్ఞానేంద్రియాలు ఇహలోక సంబంధి పనులు మానివేసి, పరలోక సంబంధి పనులవైపు మళ్లితే ముక్తికి దగ్గరైనట్లే.)
శ్రీమహాలక్ష్మి తన తొడలమీద స్వామివారి పాదాలుంచుకొని ఒత్తుతూ ఉంటుంది. స్వామివారి పాదపద్మాలు పవిత్రమైన గుర్తులను చేస్తూ ఉంటాయి. మా తపస్సంపదతో నీ వద్దకు ఎట్లో చేరగలిగాము. మేము నిన్ను వదలి మరలివెళ్లలేము. మా భర్తల మాటలను ఇష్టపడము. పద్మసువాసనలు మరిగిన తుమ్మెదలు ఇతరకుసుమాలవద్దకు వెళ్లడానికి ఇష్ట పడతాయా? (పడవు).
(గోపికలు స్వామివారి చెంతకు చేరడంలో వారి 'తపము సంపద' కారణమని భావిస్తున్నారు. గోపికలు త్రేతాయుగంలో ఋషులు. శ్రీరాముని అందాన్ని వలచారు. శ్రీకృష్ణావతారంలో గోపికలుగా పుట్టి, మీ కోరికను తీర్చుకో వచ్చునన్నాడు - శ్రీరాముడు. అప్పటి ఆ ఋషుల తపస్సంపదే ఇప్పటి గోపికల తపోస్సంపదగా చెప్పబడింది.)
ఓ కృష్ణా! లక్ష్మీదేవి నీ విశాల వక్షస్థ్సలం పైన, తులసీతో కలసి ఉండడానికి ఓ స్వామీ! నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ, నీ పాదకమలాల పుప్పొడిని కోరుకుంటూ ఉంటుంది గదా!
(తులసి లక్ష్మీదేవి స్వరూపమే. సరస్వతీదేవి శాపంవల్ల లక్ష్మీదేవి తులసిగా మాధవీ ధర్మధ్వజులకు కుమార్తెగా జన్మిస్తుంది. శంఖచూడుని రూపంలో విష్ణువు ఈమెను వివాహమాడతాడు (బ్రహ్మవైవర్తపురాణం))
ఓ పురుషభూషణా! మా అత్తలూ, మామలూ చింతిస్తుండగా, నిందకు భయపడకుండా, మా భర్తలను దుఃఖాలపాలుచేసి, కుటుంబమర్యాదలు మంటగలిపి, నీ నవ్వులకు, మెత్తనిపలుకులుకు ఇష్టపడి, మన్మథుడు పట్టుదలతో బాధించగా మేము వచ్చాము. ఏ ఇతరసంబంధాలూ మాకు వద్దు. మీ పరిచర్యలు చేసే అవకాశం ఇచ్చి రక్షించుము.
పూర్వం స్త్రీలు భర్తల్ని ప్రేమించలేదా? భర్తలు వారిని ఆదరంతో తృప్తిపరచలేదా? అనురాగాలు మాకు మాత్రమే పుట్టినవా? నీ మాటలు మగవారికి తగినవేనా? (తగినవికావు) ఓ పుణ్యాత్మకా! మమ్మల్ని కౌగిలించు. నీకు పుణ్యం ఉంటుంది.
కృష్ణా! నీ చెక్కిళ్లు చెవికుండలాల ప్రకాశంతో ఒప్పారుతున్నాయి. నీ నుదురు ముసురుకొన్న ముంగురులతో అందంగా ఉంది. నీ చిగురుమోవి అమృతం చిందుతూ ఉంది. నీ చూపులు మనోజ్ఞమైన చిరునవ్వుతో సొంపారుతున్నాయి. ఇలాంటి నీ వదనం చూస్తూ - మేం నిలువగలమా? మన్మథుడు తన చెరకువింటినుండి వదిలిన బాణాలకు దాసులమైపోయాం. మమ్మల్ని రక్షించు.
ప్రభూ! మా చెంతకు చేరి నీ అధరామృతధారలను మా చిగురు పెదవులపైన చిలికించు. నీ విశాలమైన రమ్యతరమైన నిర్మలమైన ఎదను మా చను మొగ్గలపైన గదించు. నీ రమణీయ హస్తపద్మాలను మా కేశపాశంపైన చేర్చు. నీ దయార్ద్రమైన చూపులను మా నెమ్మొగాలమీద ప్రసరింపజేయి. నీ నవీనమైన, ఆదరణీయమైన సల్లాపంతో మా చెవులను కప్పివేయి. (అలా చేయకపోతే) మేం ఎలా జీవించగలం? ఎక్కడికి వెళ్లగలం? స్త్రీల మొరలు విన నర్హం కావా?
ప్రాణేశ్వరా! నీ పాదాలమీద ఒట్టువేసి చెపుతున్నాము. నీ చూపులు, నీ నవ్వులు, నీ పాటలవల్ల పుట్టి పేట్రేగిన మన్మథాగ్నులను నీ చిగురుమోవినుండి స్రవించే అమృతధారలతో చల్లార్చు. అలా చల్లార్చకపోతే నీ ఎడబాటు మంటల్లో భస్మమైపోయి నిన్నే తలచుకుంటూ నీ పాదద్వయాన్నే చేరతాము.
మిక్కిలి ప్రకాశించే నిన్ను చూచినా, నీ సంగీతం విన్నా - చెట్టూ, మృగాలూ, పక్షులూ, ఆవుల గుంపులూ కరగి పులకించి పోతాయి. మరి అబలలు అయిన స్త్రీలు నిన్ను చూచి, నీ గానం విని ద్రవించిపోరా?
ఓ యశోదాకుమారా! మానినులధైర్యహారా! నీ మధురమైన మాటలు అనే జడివాన కురియకుంటే ఈ మన్మథాగ్నిని ఎలా చల్లార్చగలం? నీ చూపు అనే నావ లేకుంటే ఈ మన్మథసాగరాన్ని ఎలా దాటగలం? నీ చిరునవ్వు అనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నవాధరామృతం చిలుకకుంటే ఈ మదనజ్వరాన్ని ఎలా పోగొట్టుకోగలం? నీవు కరుణించి కౌగిలించుకొనకుంటే మా బతుకు ఎలా సాగించగలం? మాగతి ఏమిటి? దయలేనివాడైన మన్మథుడు మమ్ములను బతకనిస్తాడా?
ఓ పద్మనేత్రా! దేవతలను శ్రీహరి రక్షించినట్లు - మేము మూర్చపోకుండా నీ అభయహస్తాన్ని మా హృదయాలమీదా, మాశిరస్సులమీదా ఉంచు.
బాలకృష్ణా! దయానిధీ! తరుణులను దట్టమైన నీ విరహాగ్నికీలలు తలమునుకలుగా బాధించగా (దయతో) పలుకరించవు, చూడవు, నువ్వు ఎంత క్రూరుడివో గదా!
ఈ విధంగా పుష్పబాణుని బాణపరంపరలకు సొమ్మసిల్లి ఓపికలు లేకుండా పలికిన గోపికల దీనమైన పలుకులు విని, నవ్వి, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆత్మలో క్రీడించువాడై గోపికలతో రమించాడు. అప్పుడు
కృష్ణుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతోను; చీరచెరుగులను, కేశపాశాలను లాగడంతోను; మొలనూళ్లు, చేతులు, భుజాలు, కుచాల స్పర్శలతోను; గోటిగిచ్చుల గుర్తులతోను; పరిహాసవాక్కులు, కౌగిళ్లతోను మన్మథుణ్ణి తిరస్కరిస్తూ గోపికలను రతిక్రీడలతో పరవశింపజేశాడు.
వికసించిన ముఖాలు గలిగిన గోపకాంతలు సంప్రీతితో తనను భజించగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు వెన్నెలతో చుక్కల మధ్య విలసిల్లే నిండుచంద్రునివలె భాసిల్లాడు.
గోపికలు తననుగురించి పాటలు పాడుతుండగా, ప్రీతితో నర్తిస్తూ, వందలకొలదీ గోపికలు తనను కొలువగా మెడలోని వైజయంతిమాలతో పద్మనేత్రుడైన కృష్ణుడు బృందావనానికి అలంకారమయ్యాడు.
పరమేశ్వరుడై ఎవరికీ చిక్కకుండా, ఎదుటివారిని చిక్కులపాలు జేసే మాయలమారి అయిన కృష్ణునికి చిక్కి గోపయువతులు ధన్యురాండ్రై, మన్మథకేళిలో పరవశించిపోయారు. అలా ఉండగా కల్యాణగుణశాలి అయిన కృష్ణప్రభువు గోపికల కామోత్కంఠతను ఉపశమింపజేయడానికి, ఆ తర్వాత ఆదరంగా దగ్గరికి తీసుకోడానికి అనువుగా అపుడు అదృశ్యమయ్యాడు.
ఇలా కృష్ణుడు అద్భశ్యుడై వెళ్లిపోగా, మగ ఏనుగును కానక తిరిగే ఆడు ఏనుగుల మందలాగా, తమ హృదయాలు తల్లడిల్లిపోగా, గోపకాంతలు శ్రీకృష్ణుని నడక, నవ్వు, విలాసం, దృష్టి విహారం, పలుకు, నేర్పు, అనురాగాల స్మృతిలో తమ మనసులు పోగొట్టుకున్నారు. వివిధ చేష్టలకు పాల్పడి, తన్మయత్వంతో "నేను కృష్ణుణ్ణి” అని ఒకరు అంటే 'కాదు! నేనే కృష్ణుణ్ణి' అని మరొకరు వాదులాడుకుంటూ, కృష్ణునిగుణాలు వారిలో ఆవేశించగా తిరుగుతూ -
ఓ పరీక్షిన్మహారాజు! చరాచరాలైన సమస్తభూతాల లోపలా, వెలుపలా విలసిల్లే వాసుదేవుణ్ణి గోపకాంతలు యమునాతీరవన మధ్య ప్రాంతాలలో ప్రేమతో పాడుతూ వెదకడానికి వెళ్లారు.
ఓ పున్నాగ వృక్షమా! పురుష శ్రేష్ఠుల నమస్మారాలందుకొనే వాణ్ణి చూశావా? ఓ బొట్టుగచెట్టా! నొసట తిలకం ధరించేవానిని దర్శించావా? ఓ కర్పూర వృక్షమా! మహాబలంతో విలసిల్లే వాణ్ణి చూడలేదా? ఓ మంకెన వృక్షమా! బంధవులకు మిత్రుడైన వాణ్ణి చూశావా? ఓ వెలగమానూ! మన్మథ రూపుణ్ణి సందర్శించలేదా? ఓ వెదురు వృక్షమా! వేణుధరుణ్జి చూడలేదా?
చందనవ్ఫక్షమా! చందనంలాగా చల్లనైనవాణ్ణి సందర్శించలేదా? ఓ మొల్లతీగా! మొల్లమొగ్గల్లాంటి దంతాలుగలవాణ్ణి కాంచలేదా? ఓ దేవదారువృక్షమా! దేవేంద్రవైెభవంతో విలసిల్లేవాణ్ణి కనలేదా? ఓ రేగుచెట్టూ! భూమండలానికి అధీశుడైనవాణ్ణి ఆలోకించలేదా? ఓ ప్రేంకణవృక్షమా! ప్రియవిహారంతో విరాజిల్లేవాణ్ణి చూడలేదా? -అంటూ పద్మముఖులైన గోపస్త్రీలు కృష్ణుణ్ణి వెదికారు.
ఇంకనూ...
ఓ మల్లియలారా! నీలమేఘశ్యాముడు, కమలనేత్రుడు, దయారసం చిలికించేవాడు, సిగపైన వ్యాపించిన నెమలిపింఛం గలవాడు, చిరునవ్వు చిందించే సుందరవదనుడు అయిన ఒక కుర్రవాడు గోపికల మానధనం దోచి తెచ్చాడు. మీ పొదల మాటున లేడుగదమ్మా! చెప్పండి.
ఓ లవంగతరువులారా! మాదీఫలవృక్షాల్లారా! నారింజవృక్షాల్లారా! దర్శించిన మాత్రాన్న మన్మథుణ్ణి అయినా చిత్తానికి ఇంపుగలిగించి పరవశింపజేసేవాడు, సిరికి నివాసమైన వక్షంవాడు, తీయనైన వేణునాదంతో విలసిల్లేవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మల్ని మన్మథుని పూలబాణాలకు అప్పగించి, మీ వద్దకు రాలేదు గదా! ఒకవేళ వచ్చి ఉంటే దయతో చూపండి!
మనోజ్ఞాలూ, గొప్పవీ అయిన కొడిసె వృక్షాల్లారా! రమణుల పాలిటి మన్మథుడైన లక్ష్మీశుణ్ణి చూడలేదా? సుందరమైన, సుదీర్ఘమైన మద్దివృక్షాల్లారా! సుందరుడూ, ఉదారుడూ, వత్సరాక్షసుణ్ణి సంహరించినవాడు అయిన హరిని కాంచలేదా? సమున్నతాలై ఒప్పిదమైన కంకేళీ వృుక్షాల్లారా! సుందరాలు, దీరాలెన కొమ్మలతో కూడిన జంట మదిచెట్లను పడగొటిన కృష్ణుణ్ణి చూడలేదా?
ఇంకనూ...
ఓ మల్లియలారా! నీలమేఘశ్యాముడు, కమలనేత్రుడు, దయారసం చిలికించేవాడు, సిగపైన వ్యాపించిన నెమలిపింఛం గలవాడు, చిరునవ్వు చిందించే సుందరవదనుడు అయిన ఒక కుర్రవాడు గోపికల మానధనం దోచి తెచ్చాడు. మీ పొదల మాటున లేడుగదమ్మా! చెప్పండి.
ఓ లవంగతరువులారా! మాదీఫలవృక్షాల్లారా! నారింజవృక్షాల్లారా! దర్శించిన మాత్రాన్న మన్మథుణ్ణి అయినా చిత్తానికి ఇంపుగలిగించి పరవశింపజేసేవాడు, సిరికి నివాసమైన వక్షంవాడు, తీయనైన వేణునాదంతో విలసిల్లేవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మల్ని మన్మథుని పూలబాణాలకు అప్పగించి, మీ వద్దకు రాలేదు గదా! ఒకవేళ వచ్చి ఉంటే దయతో చూపండి!
మనోజ్ఞాలూ, గొప్పవీ అయిన కొడిసె వృక్షాల్లారా! రమణుల పాలిటి మన్మథుడైన లక్ష్మీశుణ్ణి చూడలేదా? సుందరమైన, సుదీర్ఘమైన మద్దివృక్షాల్లారా! సుందరుడూ, ఉదారుడూ, వత్సరాక్షసుణ్ణి సంహరించినవాడు అయిన హరిని కాంచలేదా? సమున్నతాలై ఒప్పిదమైన కంకేళీ వృుక్షాల్లారా! సుందరాలు, దీరాలెన కొమ్మలతో కూడిన జంట మదిచెట్లను పడగొటిన కృష్ణుణ్ణి చూడలేదా?
నూతనమైన, ఒప్పిదమైన సంపెంగలారా! మహిమతో ప్రకాశిస్తూ దుఃఖరహితుడై విలసిల్లుతున్న కమలనేత్రుణ్ణి దర్శించలేదా? ఎఱ్ఱగోరింట చెట్టులారా! నవ్యమై, అందంగా ఉన్న బంగారు కిరీటధారి అయిన నందనందనుణ్ణి బృందావనమధ్యంలో సందర్శించలేదా? ఓ సుందరమైన అడవిమొల్లలారా! అందమైన నెల్లి చెట్టుల్లారా! బృందావనంలోని ఎర్రగోరింట పొదల్లో తిరిగే శ్రీకృష్ణుని చూడలేదా? (చూచి ఉంటే దయతో చెప్పండి? అనీ భావం)
అదిగో! నందుని తనయుడైన కృష్ణుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. ఓ కలిగొట్టు వృక్షాలారా! పట్టుకొనండమ్మా! 'కృష్ణా! విలాసవతులైన గోపకాంతలను ఎందుకు వదిలివేశావు' అని ఓ బుడమ తీగెలారా! అతణ్ణి అడగండి. ఓ మామిడి గుబురులారా! కమలాక్షుడు ఇక్కడికి వచ్చి దాగుకోలేదు గదా! చూడండమ్మా! ఓ పూలగురివెంద లతలారా! తరుణులపాలిటి మన్మథుడైన కృష్ణునికి మారాక చెప్పి మమ్మల్ని బతికించండమ్మా! జాజిలతలారా! కులకాంతులను వదిలివెళ్లడం హరికి నీతిగాదని దిక్కుల్లో చాటండమ్మా! ఓ అరటి చెట్టుల్లారా! మీరు వెళ్లి నెమలిపింఛం శిఖలో ధరించిన పద్మనేత్రుణ్ణి కదలించుకొని తెచ్చి దయతో మాకు చూపండమ్మా!
ఓ తులసీ! శ్రీహరిపాదాలకు ప్రియమైనదానివై, హరినిన్ను సమాదరించగా, నీవు శుభాలు అందుకొంటున్నావు. కృష్ణుడు నీ వైపు రాలేదుగదా? కృష్ణునిజాడ తెలిపి శుభాలు అందించవమ్మా!
పొగడలారా! పొగడదగిన పురుషోత్తముడైన కృష్ణుణ్ణి చూడలేదా; ఓ ఎర్రకిత్తలి చెట్టులారా! సాటిలేనిక్తీర్తిగల కృష్ణప్రభును చూపండి; మొల్లలారా! సర్వవ్యాపితకీర్తిగలవాడైన కృష్ణుడు ఎక్కడున్నాడు? ఓ మోదుగుచెట్టులారా! శుకునిచే స్తుతించబడిన వనమాలి ఏడీ? చెప్పండి.
ఓ ఆడుజింకా! (హరిణీ) తరుణులు తమస్తనాలపై అలదుకొన్నకుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలికా పరిమళం సర్వత్ర వ్యాపించగా- అలాంటి గోపాలుణ్జి చూచినట్లు నీ చూపులు తలపిస్తున్నాయి. శ్రీకృష్ణుని జాడ తెలుపు. నీకు పుణ్యముంటుంది.
ఓ భూదేవీ! వరాహావతారం దాల్చినప్పుడు నిన్ను కౌగిట్లో చేర్చుకొన్నాడు. వామనావతారమెత్తి త్రివిక్రమస్వరూపుడై పాదాలతో నిన్ను కొలిచాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడై నీమీద పాదాలగుర్తులుంచాడు! పూర్వజన్మలో ఏమి నోములు నోచావోగదా!
ఇలా అంటూ గోపకాంతలు మన్మథుని ప్రేరణతో వెర్రెత్తినట్లు ప్రవర్తిస్తూ, కృష్ణతాదాత్మ్యాన్ని పొంది, ఆయన లీలలను అనుకరిస్తూ
గోపికల్లో ఒక రమణి పూతనవలె ప్రవర్తించగా, కృష్ణునివలె అభినయిస్తున్న ఒక సుందరి పాలు తాగినట్లు నటించింది. ఒక గోపిక తనను శిశువుగా భావించుకొని పాలకు రోదిస్తూ, శకటాసురుడులాగా నటించే మరొక సుందరిని కాలితో తన్నింది. ఒక అందగత్తె తృణావర్తుడులాగా నర్తిస్తూ, నేను కృష్ణుణ్ణి అనే మరొకగోపకాంతను పైకి ఎగరవేసుక పోయింది.
అదిగో! నందుని తనయుడైన కృష్ణుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. ఓ కలిగొట్టు వృక్షాలారా! పట్టుకొనండమ్మా! 'కృష్ణా! విలాసవతులైన గోపకాంతలను ఎందుకు వదిలివేశావు' అని ఓ బుడమ తీగెలారా! అతణ్ణి అడగండి. ఓ మామిడి గుబురులారా! కమలాక్షుడు ఇక్కడికి వచ్చి దాగుకోలేదు గదా! చూడండమ్మా! ఓ పూలగురివెంద లతలారా! తరుణులపాలిటి మన్మథుడైన కృష్ణునికి మారాక చెప్పి మమ్మల్ని బతికించండమ్మా! జాజిలతలారా! కులకాంతులను వదిలివెళ్లడం హరికి నీతిగాదని దిక్కుల్లో చాటండమ్మా! ఓ అరటి చెట్టుల్లారా! మీరు వెళ్లి నెమలిపింఛం శిఖలో ధరించిన పద్మనేత్రుణ్ణి కదలించుకొని తెచ్చి దయతో మాకు చూపండమ్మా!
ఓ తులసీ! శ్రీహరిపాదాలకు ప్రియమైనదానివై, హరినిన్ను సమాదరించగా, నీవు శుభాలు అందుకొంటున్నావు. కృష్ణుడు నీ వైపు రాలేదుగదా? కృష్ణునిజాడ తెలిపి శుభాలు అందించవమ్మా!
పొగడలారా! పొగడదగిన పురుషోత్తముడైన కృష్ణుణ్ణి చూడలేదా; ఓ ఎర్రకిత్తలి చెట్టులారా! సాటిలేనిక్తీర్తిగల కృష్ణప్రభును చూపండి; మొల్లలారా! సర్వవ్యాపితకీర్తిగలవాడైన కృష్ణుడు ఎక్కడున్నాడు? ఓ మోదుగుచెట్టులారా! శుకునిచే స్తుతించబడిన వనమాలి ఏడీ? చెప్పండి.
ఓ ఆడుజింకా! (హరిణీ) తరుణులు తమస్తనాలపై అలదుకొన్నకుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలికా పరిమళం సర్వత్ర వ్యాపించగా- అలాంటి గోపాలుణ్జి చూచినట్లు నీ చూపులు తలపిస్తున్నాయి. శ్రీకృష్ణుని జాడ తెలుపు. నీకు పుణ్యముంటుంది.
ఓ భూదేవీ! వరాహావతారం దాల్చినప్పుడు నిన్ను కౌగిట్లో చేర్చుకొన్నాడు. వామనావతారమెత్తి త్రివిక్రమస్వరూపుడై పాదాలతో నిన్ను కొలిచాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడై నీమీద పాదాలగుర్తులుంచాడు! పూర్వజన్మలో ఏమి నోములు నోచావోగదా!
ఇలా అంటూ గోపకాంతలు మన్మథుని ప్రేరణతో వెర్రెత్తినట్లు ప్రవర్తిస్తూ, కృష్ణతాదాత్మ్యాన్ని పొంది, ఆయన లీలలను అనుకరిస్తూ
గోపికల్లో ఒక రమణి పూతనవలె ప్రవర్తించగా, కృష్ణునివలె అభినయిస్తున్న ఒక సుందరి పాలు తాగినట్లు నటించింది. ఒక గోపిక తనను శిశువుగా భావించుకొని పాలకు రోదిస్తూ, శకటాసురుడులాగా నటించే మరొక సుందరిని కాలితో తన్నింది. ఒక అందగత్తె తృణావర్తుడులాగా నర్తిస్తూ, నేను కృష్ణుణ్ణి అనే మరొకగోపకాంతను పైకి ఎగరవేసుక పోయింది.
ఒక గోపకాంత నేను బకాసురుణ్ణి అని విజ్బంభించగా, నేను వాసుదేవుణ్ణి అంటూ మరొకగోపిక ఆమెను పరాభవించింది. ఇద్దరు తరుణులు రామకృష్ణులుగా నటించగా, మరికొందరు గోపకులు, దూడలు అయ్యారు. 'మేము పసులము' అంటూ పలుకుతున్న సుందరులను 'నేను అసురవైరిని' అని మరొక గోపిక పిలిచింది.
(ఇక్కడ కృష్ణతాదాత్మ్యంతో గోపకాంతలు కృష్ణలీలలను అభినయించే దృశ్యం మనోహరం.)
ప్రఖ్యాతచరిత్రుడవైన ఓ పరీక్షిన్మహారాజు! ఒక గోపకాంత హరియై విశ్వమంతా నా ఉదరంలోనే ఉంది చూడు అంటూ యశోదమ్మలా నటించే మరో గోపకాంతకు నోరు విప్పి చూపింది.
ఒక గోపకాంత వెన్నలు దొంగిలించి తినే కృష్ణుణ్ణి నేను అని చెప్పింది. వెంటనే వేరొక గోపిక తాను యశోదనంటూ చేతితో సైగలుచేస్తూ పూలదండతో (కృష్ణునివలె నటించే) ఆమెను కట్టివేసింది.
నరేంద్రా! “ఇది కాళియసర్పం. వీరు అతనిభార్యలు. నాకు వందనాలు చేస్తున్నారు. నేను గోపకుమారుడనైన కృష్ణుణ్ణి” అంటూ ఒక గోపకాంత కృష్ణునివలె విలాసంగా నర్తించింది.
ఓ రాజా! ఒక గోపకాంత కొందరు గోపతరుణులను చూపి “వీరు గోపాలకులు. ఇదిగో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుణ్ణి. గోవర్ధనగిరి నెత్తి మిమ్మల్ని రక్షిస్తాను” అంటూ తన కెంగేలితో చీరచెరగు ఎత్తి పట్టుకొంది.
నరేంద్రా! ఒక గోపకాంత "నేను శ్రీకృష్ణుణ్ణి! మీరు గోపాలకులు. దావాగ్ని వస్తూ ఉంది. అటు చూడకండి. నేను దాన్ని నివారిస్తాను” అంటూ వట్టి బయలునే మింగింది.
ఇలా గోపసుందరులు పరవశంతో బృందావనంలో ఉండే చెట్లు, తీగెలు మొదలైనవాటిల్ని హరినిగురించి అడుగుతూ, సంచరించడానికి వీలుకాని అడవిదారుల్లో తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు శ్రీకృష్ణుని శుభలక్షణ లక్షితాలయిన పాదాల తీరును(అడుగుల ముద్రలద్వారా) గమనించారు. ఆ పాదాలు పద్మం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలైన శుభలక్షణాలు కలిగినవి. వాటిల్ని గురించి చెప్పుకొంటూ తమ మనస్సులలో ఇలా భావించారు.
(పద్మం, ధ్వజం, నాగలి, కులిశం, అంకుశం మొదలైన చిహ్నాలు పాదాలలో ఉండడం ఉత్తమపురుషలక్షణం.)
ఇక్కడ ఒక సుందరికోసం కృష్ణుడు పూలుకోసినాడు కాబోలు - మునివేళ్లుమాత్రమే నేలపై మోపినాడు, ఇక్కడ ప్రీతితో కలికి నెత్తుకొని ముందుకు వెళ్లాడు కాబోలు - ఈ పచ్చికమైదానంపై ఆమెఅడుగులు అగుపించడంలేదు. ఇక్కడ ఒక మదవతి కొప్పు సవరించి చక్కదిద్దాడు కాబోలు - ఇద్దరూ కూర్చున్న ప్రదేశం సుందరంగా ఉంది.
(ఇక్కడ కృష్ణతాదాత్మ్యంతో గోపకాంతలు కృష్ణలీలలను అభినయించే దృశ్యం మనోహరం.)
ప్రఖ్యాతచరిత్రుడవైన ఓ పరీక్షిన్మహారాజు! ఒక గోపకాంత హరియై విశ్వమంతా నా ఉదరంలోనే ఉంది చూడు అంటూ యశోదమ్మలా నటించే మరో గోపకాంతకు నోరు విప్పి చూపింది.
ఒక గోపకాంత వెన్నలు దొంగిలించి తినే కృష్ణుణ్ణి నేను అని చెప్పింది. వెంటనే వేరొక గోపిక తాను యశోదనంటూ చేతితో సైగలుచేస్తూ పూలదండతో (కృష్ణునివలె నటించే) ఆమెను కట్టివేసింది.
నరేంద్రా! “ఇది కాళియసర్పం. వీరు అతనిభార్యలు. నాకు వందనాలు చేస్తున్నారు. నేను గోపకుమారుడనైన కృష్ణుణ్ణి” అంటూ ఒక గోపకాంత కృష్ణునివలె విలాసంగా నర్తించింది.
ఓ రాజా! ఒక గోపకాంత కొందరు గోపతరుణులను చూపి “వీరు గోపాలకులు. ఇదిగో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుణ్ణి. గోవర్ధనగిరి నెత్తి మిమ్మల్ని రక్షిస్తాను” అంటూ తన కెంగేలితో చీరచెరగు ఎత్తి పట్టుకొంది.
నరేంద్రా! ఒక గోపకాంత "నేను శ్రీకృష్ణుణ్ణి! మీరు గోపాలకులు. దావాగ్ని వస్తూ ఉంది. అటు చూడకండి. నేను దాన్ని నివారిస్తాను” అంటూ వట్టి బయలునే మింగింది.
ఇలా గోపసుందరులు పరవశంతో బృందావనంలో ఉండే చెట్లు, తీగెలు మొదలైనవాటిల్ని హరినిగురించి అడుగుతూ, సంచరించడానికి వీలుకాని అడవిదారుల్లో తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు శ్రీకృష్ణుని శుభలక్షణ లక్షితాలయిన పాదాల తీరును(అడుగుల ముద్రలద్వారా) గమనించారు. ఆ పాదాలు పద్మం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలైన శుభలక్షణాలు కలిగినవి. వాటిల్ని గురించి చెప్పుకొంటూ తమ మనస్సులలో ఇలా భావించారు.
(పద్మం, ధ్వజం, నాగలి, కులిశం, అంకుశం మొదలైన చిహ్నాలు పాదాలలో ఉండడం ఉత్తమపురుషలక్షణం.)
ఇక్కడ ఒక సుందరికోసం కృష్ణుడు పూలుకోసినాడు కాబోలు - మునివేళ్లుమాత్రమే నేలపై మోపినాడు, ఇక్కడ ప్రీతితో కలికి నెత్తుకొని ముందుకు వెళ్లాడు కాబోలు - ఈ పచ్చికమైదానంపై ఆమెఅడుగులు అగుపించడంలేదు. ఇక్కడ ఒక మదవతి కొప్పు సవరించి చక్కదిద్దాడు కాబోలు - ఇద్దరూ కూర్చున్న ప్రదేశం సుందరంగా ఉంది.
ఇక్కడ ఒక సుందరికి కమ్మోవి ఇచ్చాడు కాబోలు - ఆమె నిక్కినతీరు తేటతెల్లం అవుతూ ఉంది. ఒక కుందరదనతో ఇక్కడ ఈ కొలనునీటిలో దిగాడు కాబోలు - నీటినుండి వెలువడిన తావులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కొమరాలిని మన్మథక్రీడలో తనియించాడు కాబోలు - ఇద్దరూ అనగి పెనగిన చిహ్నాలు అందగా విలసిల్లుతున్నాయి.
అంతే కాకుండా...
ఇక్కడ నందనందనుడు ఒక తరుణి చేయిపట్టుకొని నడిచాడు కాబోలు నాలుగుపాదాలున్నాయి. ఒక అందగత్తెతో ఇక్కడ ఒదిగాడు కాబోలు, పురుషునిజాడలో స్త్రీజాడ కనిపిస్తూ ఉంది. ఒక యువతి వందనం చేయగా ఇక్కడ ఒడిసి పట్టుకున్నాడు కాబోలు ఇక్కడ ఎదురెదురుగా పాదాల గుర్తులు ఏర్పాడ్డాయి. ఒక సుందరి వెంటబడగా నిలువకుండా వెళ్ళిపోయాడు కాబోలు కృష్ణునిఅడుగుల మీద ఆ అందగత్తె అడుగులు అమరి ఉన్నాయి. ఇరువైపులా ఇద్దరుతరుణులు రాగా తిరిగాడు కాబోలు ఇక్కడ ఆరుఅడుగుల గుర్తులున్నాయి.
ఓ చంద్రముఖీ! ఈ పాదాలే సనకసనందనాదిమునీశ్వరుల ధ్యానమార్గంలో వెలుగుతూ ఉండేవి; ఓ యువతీ! ఈ పాదాలే వేదాలనే కాంతల పాపట్లలో విరాజిల్లేవి ఓ మత్తగజయానా! ఈ పాదపద్మాలే క్షీరసాగరకన్య అయిన లక్ష్మీదేవికి ఆధారాలు.
అంతే కాకుండా...
ఇక్కడ నందనందనుడు ఒక తరుణి చేయిపట్టుకొని నడిచాడు కాబోలు నాలుగుపాదాలున్నాయి. ఒక అందగత్తెతో ఇక్కడ ఒదిగాడు కాబోలు, పురుషునిజాడలో స్త్రీజాడ కనిపిస్తూ ఉంది. ఒక యువతి వందనం చేయగా ఇక్కడ ఒడిసి పట్టుకున్నాడు కాబోలు ఇక్కడ ఎదురెదురుగా పాదాల గుర్తులు ఏర్పాడ్డాయి. ఒక సుందరి వెంటబడగా నిలువకుండా వెళ్ళిపోయాడు కాబోలు కృష్ణునిఅడుగుల మీద ఆ అందగత్తె అడుగులు అమరి ఉన్నాయి. ఇరువైపులా ఇద్దరుతరుణులు రాగా తిరిగాడు కాబోలు ఇక్కడ ఆరుఅడుగుల గుర్తులున్నాయి.
ఓ చంద్రముఖీ! ఈ పాదాలే సనకసనందనాదిమునీశ్వరుల ధ్యానమార్గంలో వెలుగుతూ ఉండేవి; ఓ యువతీ! ఈ పాదాలే వేదాలనే కాంతల పాపట్లలో విరాజిల్లేవి ఓ మత్తగజయానా! ఈ పాదపద్మాలే క్షీరసాగరకన్య అయిన లక్ష్మీదేవికి ఆధారాలు.
ఓ కలువకంటీ! ఈ అందమైన పాదాలే ముక్తికాంతమనస్సుకు సమ్మోహనకరాలు. ఓ సుందరీ! ఈ పాదాల ధూళియే బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు నడితలపై ధరించెవి. అంటూ కొందరు యువతులు కృష్ణుడు వెళ్లిన దారిని గుర్తించికూడా అతణ్ణి కనుగొనలేకపోయారు.
ఆ సమయంలో నాథులు తమకాంతలకు లొంగిపోయి పొందే దీనత్వాన్నీ, తరుణులు చూపే క్రూరత్వాన్నీ తెలపడానికి కృష్ణుడు ఒక సుందరితో కలిసిమెలసి విహరించాడు. అంతలో ఆ సుందరి తక్కిన యువతులందరినీ వదిలి నాథుడు తన, వద్దనే ఉన్నాడని విర్రవీగింది.
ఆ సమయంలో నాథులు తమకాంతలకు లొంగిపోయి పొందే దీనత్వాన్నీ, తరుణులు చూపే క్రూరత్వాన్నీ తెలపడానికి కృష్ణుడు ఒక సుందరితో కలిసిమెలసి విహరించాడు. అంతలో ఆ సుందరి తక్కిన యువతులందరినీ వదిలి నాథుడు తన, వద్దనే ఉన్నాడని విర్రవీగింది.
ఆ గర్వంతోనే ఆమె “ఓ కమలనేత్రా! ఇక నడచి రాలేకున్నాను. నన్ను నీ భుజంపైన ఎక్కించుకో!” అని పలికింది. ఆ మాట అన్నవెంటనే కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది "ఓ కృష్ణా! వల్లభా! ప్రాణేశ్వరా! ఎక్కడికి వెళ్లావు! నీకు పాదదాసినవుతాను నిలు నిలు” అంటూ పలవరించింది. అపుడు కొందరు యువతులు ఆ తరుణిని చూచి, మగనిచేత మన్ననలు పొంది, దర్పించి, ఈ పద్మనేత్ర ఇప్పుడు ఇటువంటి కష్టాలకు లోనయింది” అని విస్మయం పొందారు.
ఇంకా, ఓ పరీక్షిన్మహారాజా! గోపకాంతల వింత చేష్టలనుగురించి ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుడు నాతో మన్మథక్రీడసలిపాడు. ఈ చాటుప్రదేశంలో ఇంతవరకూ వల్లభుడు నన్ను గాఢంగా హత్తుకున్నాడు. ఈ చెట్టునీడలోనే ఇందాక సౌభాగ్యవంతుడు శృంగారచేష్టలతో నా సిగ్గును హరించాడు.
ఇంకా, ఓ పరీక్షిన్మహారాజా! గోపకాంతల వింత చేష్టలనుగురించి ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుడు నాతో మన్మథక్రీడసలిపాడు. ఈ చాటుప్రదేశంలో ఇంతవరకూ వల్లభుడు నన్ను గాఢంగా హత్తుకున్నాడు. ఈ చెట్టునీడలోనే ఇందాక సౌభాగ్యవంతుడు శృంగారచేష్టలతో నా సిగ్గును హరించాడు.
ఈ పూలతీగవద్దనే ఇందాక మనోహరుడు నన్ను సమీపించి అధరామృతం ఆస్వాదించాడు. ఈ పూలతిన్నెమీద ఇందాక రమణుడు నా కొప్పులో పూలదండలను అలంకరించాడు అంటూ కొందరు యువతులు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు సలిపిన శృంగారచేష్టలను కొనియాడారు.
ఈ విధంగా లతాంగులైన గోపికలు బృందావనంలో పరమాత్ముడైన శ్రీకృష్ణునికి వెదకి వెదకి దర్శించలేకపోయారు. ఆ విభుని గుణాల్ని చేష్టల్ని వర్ణిస్తూ, గానంచేస్తూ మనోవాక్కర్మలను ఆ లక్ష్మీశునిపైన్నే చేర్చ, తమతమ ఇండ్లకు వెళ్లాలనే కోర్కెలను వదలి, ఆ యమునాతీరంలోని ఇసుక తిన్నెలమీదికి త్వరత్వరగా వెళ్లారు.
అలా యమునా తీరంలోని ఇసుకతిన్నెల మీదికి వెళ్లిన గోపయువతులు, కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా పలికారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
ఈ విధంగా లతాంగులైన గోపికలు బృందావనంలో పరమాత్ముడైన శ్రీకృష్ణునికి వెదకి వెదకి దర్శించలేకపోయారు. ఆ విభుని గుణాల్ని చేష్టల్ని వర్ణిస్తూ, గానంచేస్తూ మనోవాక్కర్మలను ఆ లక్ష్మీశునిపైన్నే చేర్చ, తమతమ ఇండ్లకు వెళ్లాలనే కోర్కెలను వదలి, ఆ యమునాతీరంలోని ఇసుక తిన్నెలమీదికి త్వరత్వరగా వెళ్లారు.
అలా యమునా తీరంలోని ఇసుకతిన్నెల మీదికి వెళ్లిన గోపయువతులు, కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా పలికారు.
గోపికాగీతలు
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment