మరకతసాలం దాటాక ప్రవాళప్రాకారం. దశయోజన సమున్నతం. కుంకుమారుణవర్ణం. కక్ష్యలో అన్ని ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులుంటారు.
హృల్లేఖ - గగన - రక్త - కరాళిక - మహోచ్చుష్మ అని వీరి పేరు. పంచభూతసమప్రభలు. పాశాంకుశవరదాభయహస్తలు . అమితభూషణలు. దేవిసమానవేషాఢ్యలు. నవయౌవనగర్వితలు.
ప్రవాళసాలం గడిచాక నవరత్నప్రాకారం. ఇది మహాప్రాకారం. బహు యోజనోన్నతం. కక్ష్యలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవీబృందం ఉంటుంది.
ప్రవాళసాలం గడిచాక నవరత్నప్రాకారం. ఇది మహాప్రాకారం. బహు యోజనోన్నతం. కక్ష్యలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవీబృందం ఉంటుంది.
మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్యామహాభేదాలూ ఉంటాయి. నిజావరణదేవీ బృందంతో నిజభూషణవాహన సహితలై సర్వదేవీ సమూహమూ కోటిసూర్యప్రభలు విరజిమ్ముతూంటుంది. సప్తకోటిమహామంత్రాల అధిష్ఠాన దేవతానీకమూ ఉండేది ఇక్కడే.
నవరత్నసాలం దాటివెడితే చింతామణిగృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేలసంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత - చంద్రకాంత - విద్యుత్కాంతమణి నిర్మితాలు.
నవరత్నసాలం దాటివెడితే చింతామణిగృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేలసంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత - చంద్రకాంత - విద్యుత్కాంతమణి నిర్మితాలు.
వీటికాంతుల తళత్తళలలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువూ ఒకపట్టాన కంటికి కనిపించదు.
No comments:
Post a Comment