శింశుపా వృక్షంమీద కొమ్ముల నడుమ తెల్లని వస్త్రంతో, మెరుపు తీగలవంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుని చూచింది సీతాదేవి,
చూచీ చూడడంతో ఆవిడ గుండె దడదడ లాడింది. అంతలో ఆశ్చర్యం కలిగింది. వానరు డేవిటీ? ఇంత శరీరమేవిటే? అనిపించింది.
మరింత భయంతో విలపించింది. హా రామా! లక్ష్మణా! అంటూ కన్నీరు విడిచింది.
అ వానరుని మళ్ళీ చూడగా వినయవంతునివలె గోచరించాడు. ఇంతకూ ఇది స్వప్నమా? నేను మేలుకుని ఉన్నానా? మళ్ళీ చూసింది. బాగా వంకర తిరిగిన మూతితో కనిపించాడు. మళ్ళీ భయం కలిగింది. కన్నులు మూసుకుంది.
అంతా కల అనిపించింది.
కలలో కోతిని చూడడం కీడుకి సూచన, అనిపించగానే రామలక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక, అనుకున్నాక యిది కల కాదనిపించింది.
నిరంతర శోకంతో వున్న నాకు నిద్ర కూడా పడుతుందా! పూర్ణచంద్రవదనుడయిన రాముడు దగ్గరలేని నాకు సుఖం లేదే! సుఖంలేనిదే నిద్ర ఎలా పడుతుంది? నా మనస్సు ఆయనను గురించే ఆలోచిస్తున్నది,
ఆయననే ధ్యానించే నాకు ఆ రూపాలే కనిపిస్తాయి. ఆ విషయాలే వినిపిస్తాయి. బహుశః ఆ కోరిక నెరవేరి ఉండాలి. అయినా విశ్వాసం కలగడం లేదు. అయితే యిది మనస్సుకి కనిసించిందా?
కొదు-
స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాడు, వానరుడు.
శబ్దం వినిపిస్తున్నది, అని చేతులు జోడించి:
సర్వేశ్వరుడయిన ఇంద్రునికీ, దేవగురువు బృహస్పతికీ, ప్రజాపతి బ్రహ్మకూ, అగ్నిహోత్రునికీ నమస్కరిస్తున్నాను.
నేను చూసినదీ, విన్నదీ నిజమే కావాలి, అనుకుంటూండగా హనుమంతుడు చెట్టు దిగి, వినయ వినమితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు.
చేతులు జోడించి శిరసున పెట్టుకున్నాడు.
అమ్మా! ఉత్తమురాలవయిన నీవు నలిగిన పట్టుచిరతో ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవ, దానవ, నాగ, గంధర్వ, యక్ష, కిన్నర గణాలలో ఏ జాతికి చెందినదానవు? వసు, రుద్ర, మరుత్తులలో ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తిలా కన్పిస్తున్నావు. చంద్రునికి దూరమై
అకాశాన్ని వీడివచ్చిన రోహిణీతారవా?
మాంగళ్యరూపిణీ! వశిష్ఠులవారిమీద కోపంతోనో, మరే అనుమానంతోనో ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవివి కావు గదా! నీ సోదరుడుకాని, తండ్రికాని, పుత్రుడుకాని, పరలోకగతులైతే వారికోసం శోకిస్తున్నావా?
నీ కన్నీరు, నిట్టూర్పులు!
వీటికితోడు నీ పాదాలు భూమిని తాకుతున్నాయి - వీటిని బట్టి నువ్వు దేవకాంతవు కావనుకుంటున్నాను. నీలో రాచరికపు ఛాయలున్నాయి.
ఆలోచించగా నువ్వు ఏ మహారాజు భార్యవో అయి వుంటావనిపిస్తున్నది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీ దేవివి అయి వుండాలి. తపస్విజనోచితవేషంతో సౌందర్యరాశిలా వున్న నువ్వు రాముని భార్యవే అనుకుంటాను.
ఆ మాటలు వింటున్న సీతాదేవి రామనామ శ్రవణంతో :
ఆత్మవేత్త, శత్రుసంహార సమర్ధుడు, రాజసింహుడు అయిన దశరథులవారి కోడలిని.
మహాత్ముడు, విదేహాదీశుడు అయిన జనక మహారాజు అనుంగుపుత్రిని.
నన్ను 'సీత' అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. అయోధ్యలో ఆయనతో పన్నెండు సంవత్సరాలు సర్యరాజభోగాలూ అనుభవించాను,
ఆ తరువాయి మా మావగారు మావారి పట్టాభిషేకం నిశ్చయించారు. గురువులు ముహూర్తం పెట్టారు. అధే రోజున ఆ వార్త విన్న కైకేయి;
రామపట్టాభిషేకం జరిగితే-
నేను పచ్చి మంచినీళ్ళు త్రాగను,
గుప్పెడు మెతుకులు కతకను,
నా బ్రతుకంతా యింతే; అంది,
న పిబేయం న ఖా దేయం
ప్రత్యహం మమ భోజనం
ఏష మే జీవితస్యాంతో
రామో య ద్యభిషిచ్యతే
ఇంతకాలంగా నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు అరణ్యానికి పోవాలి, అంది.
ఆ మాటలు వింటూ దశరధులవారు మూర్చపోయోారు. సత్య ధర్మపరుడు కనుక, ఆవిడ వరం ప్రకారం జరిపించాడు. రామచంద్రుడు రాజ్యంకంటె తండ్రి మాటనే అధికంగా భావించాడు.
సత్యపరాక్రముడైన రామచంద్రుడు తమ ప్రాణాలయినా వదులు తాడు కాని ఎదుటివారికి కష్టం కలిగే మాటకూడా మాట్లాడడు.
అందువల్లనే మనసా రాజ్యాన్ని విడిచి, ఉత్తరీయాన్ని చేతులతో వదిలి తల్లి దగ్గరకు, వచ్చి నన్ను ఆవిడకు అప్పగించబోయాడు.
ఆయన లేని దేవలోకం కూడా నాకు అవసరంలేదు. అందుచేత ఆయనకంటె ముందే నేను అడవిదారి పట్టాను. మాకంటె ముందుగా మా లక్ష్మణుడు నారచీరలు ధరించి వచ్చాడు.
అలామేము ముగ్గురం మా మహారాజు మాట ప్రకారం ఘోరాటవులకు వచ్చాం.
అక్కడ దండకారణ్యంలో వుండగా దుష్టరావణుడు నన్ను అపహరించి యిక్కడకు తెచ్చాడు. వాడిచ్చిన గడువు యింక రెండు మాసాలుంది. అది గడిస్తే ప్రాణత్యాగం తప్పుదు, అని జానకి చెపుతూంటే:
దేవి! నేను రామదూతను. ఆయన కుశలంగా వున్నాడు. నీ క్షేమ సమాచారం తెలుసుకు రమ్మని నన్ను పంపాడు, అని హనుమంతుడు ఆరంభించాడు.
అమ్మా! వేద వేదాంగవేత్త, బ్రహ్మాస్త్ర కోవిదుడు అయిన దశరథ నందనుడు నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజశ్ళాలి అయిన మీ లక్ష్మణుడు శోక దీన వదనంతో మీకు నమస్కరిస్తున్నాడు, అనగా విని సీత, సంతోష పులకితగ్రాతంతో:
మానవుడు బ్రతికివుంటే నూరేళ్ళకయినా సుఖసంతోషాలు పొందుతాడనే పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది, అంది.
అనంతరం వారుభయులూ ఒకరికొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు. హనుమంతుడు నెమ్మదిగా సీతదగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అదిచూచే సీతకు ఈ వ్యక్తి రావణుడేమో అనే శంక బయలుదేరి:
ఛి! ఛీ! ఎంత పారపాటు చేశాను! నా విషయం అంతా చెప్పడంవల్ణ వీడికి సర్వం తెలిసిపోయింది. నిజంగా వీడు కామరూపంతో వచ్చిన రావణుడే, అనుకుంటూ నేలమీద కూలబడింది.
అది చూసి హనుమంతుడు చేతులు జోడించాడు. సీత యిటు చూడడంలేదు. వేడి నిట్టూర్పు విడిచి:
ఓ మాయావి! ఎందుకిలా నన్ను బాధించి వేదిస్తావు. ఆనాడు జనస్థానానికి మాయసన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉపవాసాలతో కృశించి శోకంతో ఉంటే యింకా సంతాపం కలిగిస్తున్నావు. అని క్షణం అగి.
నిన్ను చూస్తూం టే నా మనస్సుకి సంతోషం కలుగుతున్నది. అంటే నువ్వు రావణుడవు కాదేమో అనుకుంటున్నాను.
నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను అశీర్వదిస్తున్నాను. నాకు రామగుణగానంకంటె ప్రీతి కలిగించేది లేదు. అందుచేత ఆయన విషయాలు చెప్పు, అని లోలోపల తన భర్త పంపిన ఈదూత నా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. కలలో అయినా రామ లక్ష్మణులను చూచే అదృష్టం నాకు లేదు. అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదే, ఇది కలే అయి, కలలో నేను కోతిని చూచి ఉంటే కీడు జరగాలి గాని మనస్సుకి సంతోషం కలగకూడదు కదా!
కాక-
భ్రాంతిలో పడ్డానా! వాత ఉన్మాద ప్రకోపమా! ఏదీకాక యిదంతా మృగతృష్ణయా.
కాదు. ఇది పిచ్చికాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు వానరుడని గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా, అని వెనుదిరిగింది.
ఆవిడ తలత్రిప్పి, తనను చూడకుండా ఉండడంతో హనుమంతుడు ఆవిడ శంకను గ్రహించి:
అమ్మా!
రామచంద్రుడు సూర్యసమతేజస్వి. చంద్రసదృశ శీతల హృదయుడు. సర్వలోక ప్రభువయిన కుబేరునివలె భూమండలాధిపతి. విష్ణుసన్నిభ పరాక్రముడు, దేవగురువయిన బృహస్పతివలె మధురభాషి, సత్యవాది. సౌందర్య శోభితుడు. మన్మథాకారుడు, అనవసరంగా ఆ(గహించడు.
ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు.
ఆయన మహారధికుడు. ఆయన భుజబలచ్చాయలో ఈలోకం నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది.
ఆనాడు మాయలేడిని పంపి, రామచంద్రుని సుదూరానికి పంపి, ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు చూస్తావు.
యుద్ధభూమిలో రాముడు పరాక్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని సర్వనాశనం చేసి తీరతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా వచ్చిన దూతనమ్మా!.
సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా. రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశలవార్త వినాలని ఉన్నాడు. అమ్మా! వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు.
ఈ క్రూరరాక్షసీజన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి వుండడం మా అదృష్టం.
అత్యల్పకాలంలోనే రామలక్ష్మణులు శతసహస్రసంఖ్యాకమయిన వానరసేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి యిక్కడకు వస్తారు.
నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనుమంతుడంటారు నన్ను. దుష్టుడయిన రావణుని తలదన్ని, నిన్ను దర్శించడానికి సముద్రందాటి వచ్చానమ్మా!
నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను, తల్లీ, అన్నాడు.
విశ్వాసం
కాదు. ఇది పిచ్చికాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు వానరుడని గ్రహిస్తున్నది, అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా, అని వెనుదిరిగింది.
ఆవిడ తలత్రిప్పి, తనను చూడకుండా ఉండడంతో హనుమంతుడు ఆవిడ శంకను గ్రహించి:
అమ్మా!
రామచంద్రుడు సూర్యసమతేజస్వి. చంద్రసదృశ శీతల హృదయుడు. సర్వలోక ప్రభువయిన కుబేరునివలె భూమండలాధిపతి. విష్ణుసన్నిభ పరాక్రముడు, దేవగురువయిన బృహస్పతివలె మధురభాషి, సత్యవాది. సౌందర్య శోభితుడు. మన్మథాకారుడు, అనవసరంగా ఆ(గహించడు.
ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు.
ఆయన మహారధికుడు. ఆయన భుజబలచ్చాయలో ఈలోకం నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది.
ఆనాడు మాయలేడిని పంపి, రామచంద్రుని సుదూరానికి పంపి, ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు చూస్తావు.
యుద్ధభూమిలో రాముడు పరాక్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని సర్వనాశనం చేసి తీరతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా వచ్చిన దూతనమ్మా!.
సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా. రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశలవార్త వినాలని ఉన్నాడు. అమ్మా! వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు.
ఈ క్రూరరాక్షసీజన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి వుండడం మా అదృష్టం.
అత్యల్పకాలంలోనే రామలక్ష్మణులు శతసహస్రసంఖ్యాకమయిన వానరసేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి యిక్కడకు వస్తారు.
నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనుమంతుడంటారు నన్ను. దుష్టుడయిన రావణుని తలదన్ని, నిన్ను దర్శించడానికి సముద్రందాటి వచ్చానమ్మా!
నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను, తల్లీ, అన్నాడు.
No comments:
Post a Comment