లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట
ముచ్చటలో భాగంగా శ్రీకృష్ణునిగాథలు చెప్పుకుంటుండగా ద్రాపదీదేవి, రుక్మిణి మొదలగు కృష్ణుని దేవేరుల్ని, మీ మీ వివాహవృత్తాంతాల్ని చెప్పండనగా వారు శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడిన విధం వివరించారు. ఓ పరీక్షిన్మహారాజా! అది నేను నీకు గతంలో చెప్పాను. ఒక్క లక్షణాదేవి కథమాత్రం ఆమె ద్రౌపదికి చెప్పిన వృత్తాంతము ఇపుడు సవిస్తరంగా చెప్తానని శుకుడన్నాడు.
ద్రౌపదితో లక్షణ తననుగూర్చి ఇలా చెప్పింది. సంగీత విశారదుడైన నారదుడు వీణావాదన తోడుచేసుకొని శ్రీకృష్ణుని కథల్ని పాటలుగా పాడి వినిపించగా, నేను వాటికి ఆకర్షితురాలనై, శ్రీకృష్ణుణ్ణే మనస్సునందు నిల్పి తన్మయురాలనై ఉండగా, ఆ విషయం తెలిసిన మా తండ్రి నామీద ప్రేమతో, శ్రీకృష్ణునకే ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇతరరాజులకు కోపం రాకుండా ఒక ఉపాయం పన్నాడు. ఆకాశంలో ఉంచినా, ఎవరికీ కనబడకుండ, కింద నీటిలో మాత్రం ప్రతిబింబం కనబడేట్లు మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేశాడు. ఎంతటి గొప్పవాళ్లకైనా కదిలించడానికీ, అల్లెత్రాడు ఎక్కిరావడానికీ వీలుకాని
(లక్షణకు శ్రీకృష్ణునిపై మక్కువ కల్గడానికి నారదుడు కారణం. ఆమె ప్రేమ తండ్రికి తెలిసింది. తండ్రికి పుత్రికపై అమితానురాగం. ఆయనకు అందుకే “దుహితృవత్సలు” డని విశేషణం వాడబడింది. కృష్ణుడుమాత్రం ఛేదించగల్గేటట్లు, ఇతరులెవ్వరికీ సాధ్యంకాని ఒక ప్రత్యేమైన మత్స్యయంత్రాన్ని స్వయంవరానికై ఏర్పాటుచేశాడు. అర్జునుని మత్స్యయంత్రభేదనంలో చేప కనబడుతుంది. ఇక్కడ పైన చేప కనబడదు. అదీ విశేషం. శ్రీకృష్ణుడు విలువిద్యలో అర్జునునికన్నా మేటి అని తెలుస్తూంది.)
ధనుస్సునూ, వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని మత్స్యయంత్రంవద్ద గంధాక్షతలు, పుష్పాలతో పూజించి, “ఏ పురుషుడైనా ఈ ధనుస్సు ఎక్కుపెట్టి, ఈ బాణాన్ని విల్లుకు ఎక్కుపెట్టి, మత్స్యయంత్రాన్ని నేలగూల్చిన ధనుర్విద్యా నైపుణ్యంగల శూరుణ్ణి నా కూతురు వరిస్తుందని అందరూ వింటుండగా (ప్రకటించాడు)
మాతండ్రి చాటింపు వేయిస్తే విని దానికనుగుణంగా, నన్ను వివాహమాడాలనే వేగిరపాటుతో గొప్పగొప్ప ధనుర్ధరులైన రాజులు వివాహసంబరాన్ని చూచే ఉబలాటంగలవారు అయిన అందమైన రాజకుమారులు క్రీర్తిమంతులు అమిత సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు.
స్వయంవరానికి వచ్చిన రాజుల్ని అర్ఘ్య, పాద్య, మజ్జన, భోజనవసతి తాంబూలాది అతిథిమర్యాదలతో సంతోషంగా ఆహ్వానించినాడు. మహాబలులైన వారు స్వయంవరమంటపంలో మత్స్యయంత్రభేదనానికి సన్నద్ధులై ధైర్యంగా ధనుస్సు దగ్గరగా పోయి
ఇలా సమీపించి ఆ ధనుస్సును చూచి
సభాప్రాంగణంలో కొందరు ధనుస్సు వద్దకే వెళ్లక, వెళ్లినా కొందరు కదల్చలేక, కొందరు కొంచెమెత్తి విఫరురై, కొందరునేలపై ఉంచి, అల్లెత్రాడు బిగించి, మరికొందరు బాణం బిగించలేక సిగ్గుపడి, “ఛీ! ఇక్కడికి రావడమే పెద్ద తప్పు” అనుకొంటూ
భీముడూ, కర్ణుడూ ఆర్భాటంగా ముందుకు వచ్చి, విల్లు ఎక్కుపెట్టి బాణంవేసి, ఆ మత్స్యం అలుపెరుగని రీతిగా వేగంగా పైన తిరుగుతుంటే - దాన్ని కనుక్కోలేక విఫలురై వెనుతిరిగిన తరువాత
ఇంద్ర తనయుడైన అర్జునుడు మత్స్యయంత్రాన్నికొట్టే ఉపాయం తెలిసినవాడైనా, బాణంవేసి, చేపను పడగొట్టలేక విముఖుడై, వికలమనస్కుడై తిరిగిపోయాడు.
వచ్చిన రాజకుమారులంతా మత్స్యయంత్రాన్ని ఛేదించే యత్నాలుచేసి అవి వమ్ముకాగా, చిన్నబోయి, దిగులుతో కూడిన ముఖాలతో చూస్తుండగా
శ్రీకృష్ణుడు వింటికి అల్లెత్రాడుకట్టి, మెరిసే బాణాన్ని సంధించి, తన విలువిద్యా నైపుణ్యం ప్రకాశించగా ఆకాశంలో తిరుగాడే యంత్ర మీనాన్ని కూలవేశాడు. సురసిద్ధాదిదేవజాతులు జయజయ ధ్వానాలు చేశారు. ఆకాశంనుండి పూలవాన కురిసింది.
ఆ సమయంలో అంతులేని ఆనందం కల్గింది. ముఖం వికసించింది. సంభ్రమంవల్ల కల్గిన చెమట బిందువులు ఫాలభాగాన కారి కస్తూరితిలకాన్ని చిత్తడిచేయగా, ఆ రేఖల్లో చిక్కుకున్న తుమ్మెదల గుంపుల్లాంటి నల్లనికురుల్ని చిగురుటాకు చేతులతో పక్కకు జరుపుతూ, తళుకులీనే మోముపై మెరుపులు వ్యాపించగా, అందమైన నడుము వణకుతుండగా మెల్లని నడకలతో
(కృష్ణుడు కాక ఇతరులు మత్స్యయంత్రంకొడితే, వారినే పెళ్లాడవలసిన లక్షణకు తా నిష్టపడిన కృష్ణుడే మత్స్యయంత్రాన్ని భేదించడం వల్ల ఆమెకు అంతరంగం ఆనందంతో నిండింది. దానివల్ల ఉద్విగ్నత, స్వేదం, వణుకు ఏర్పడగా, నడుము వణుకుతుండగా, మెల్లగా నడుస్తూ)
కాలి అందెలు ఘల్లుమని మోగగా, చిరునవ్వులు పెదవులపై ప్రకాశింపగా, బంగారు కుండలాలకాంతి చెక్కిళ్ల పై పడగా, చేతికడియాలు మనోహరంగా ధ్వనిస్తూండగా సభామంటపంలోకి వచ్చి నాల్గుదిక్కుల్నీ మొగమెత్తి చూస్తూ
(సహజంగా స్వయంవరంలో కవియే స్వయంవర వధువును వర్ణిస్తాడు. కాని, ఇక్కడ వధువే తన ఆత్మకథ (స్వీయానుభవం) చెప్పడం కథనంలో విశేషం.)
సభాభవనం మధ్యలో రాజులందర్ని జూచి, వారిని తిరస్కరించి, నా చేతుల్లోగల దివ్యమణులు పొదిగిన కాంచన హారాన్ని శౌరిమెడలో వేశాను. అలాగే, ఇప్పపూలమాలనుకూడా విలాసంగా ఈ కృష్ణుని కొప్పుపై ఉంచాను. అపుడు నా కన్నుల్లో సిగ్గు దోబూచులాడింది.
వరమాలవేసిన ఆ మధురక్షణంలో శుభసూచకంగా, ఆనంద చిహ్నంగా ఢమరుక, ఢంకాలు, శంఖాలు, మృదంగాలు, మధుర మురళీ దుందుభులు, ఢక్కామర్దళాలు మొదలైన వివిధరకాల వాద్యధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల్లో నిండాయి. నాట్యకత్తెల నాట్యాలు మనోహరంగా ప్రదర్శింపబడినాయి.
ఆ క్షణంలో దేవతల సైన్యాన్ని పారదోలి గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా హరించాడో అలాగ, అపారమైన శత్రురాజసమూహాన్ని తిరస్కరించి, శ్రీకృష్ణుడు నన్ను అక్కున చేర్చుకొని సింహగమనంతో అందమైన బంగారు రథంమీదకు చేర్చాడు.
లక్షణతో కూడి, శ్రీకృష్ణుడు రథమెక్కి సారథి అయిన దారుకుడు శత్రుసంహారశౌర్యంతో ప్రకాశించడానికి యోగ్యమైన మేలైన నాలుగు గుర్రాలు పూన్చిన రథం తోలుతూండగా, శత్రువులనే దట్టమైన చీకట్ల సమూహాలకు తీక్ష్ణమైన సూర్యకాంతివంటి ధనుస్సును తాల్చి, దాని అల్లెతాటి ధ్వనులతో దిగంతరాలు నింపుతూ, రథంపై ప్రయాణిస్తూ ఉండగా
స్వయంవరానికి వచ్చిన రాజులంతా శ్రీకృష్ణుని వైభవానికి కన్నుకుట్టి, ఓర్వలేక, స్వయంవర నియమాలు ఉల్లంఘించి, ఆయన మహిమల్ని తెలుసుకోలేక గర్వాంధకారంతో గుంపులుకట్టి యుద్ధసన్నద్ధులుకాగా
మన్మథుని పూలబాణాల తాకిడికి ఓర్వలేక కామాతురులై, రాజులంతా, ధైర్య, శౌర్య, శక్తి సామర్ధ్యల్ని ప్రకటిస్తూ, ఎల్లప్పుడూ దేవతల నమస్కారాలందుకొనే మహిమాన్వితుడైన కృష్ణునితో గర్వించి యుద్ధం ప్రారంభించారు.
సింహంవంటి పరాక్రమంతో చెలరేగుతూ తన శార్ఙ్గం నుండి బంగారు రెక్కలవాడి బాణాలను శత్రువులపై వేశాడు. తన భుజబల ప్రదర్శనతో ప్రకాశిస్తూ, వారితో యుద్ధంచేసి సైన్యాన్ని చెదరగొట్టే భీకర ధ్వనిగల తన పాంచజన్యాన్ని విజయ సూచకంగా ఊదాడు.
ఆ సమయంలో పరాక్రమవంతులైన శత్రురాజులు మృగాలన్నీ ఒక్కసారి సింహంమీద దూకినట్లు, తత్తరపాటుతో తమ చతురంగ బలాలతో కళంకరహితుడైన శ్రీకృష్ణుని చుట్టుముట్టగా
చుట్టుముట్టిన రాజులపై మిక్కిలి కోపించినవాడై తన బాణాలతో కుండలాలు ధరించిన వారితలల్ని అందెలు ధరించిన పాదాల్ని కడియాలు ఉంగరాలు ధరించిన చేతుల్ని నేలపై పడేలా తెగవేశాడు.
యుద్ధంలో చావగా మిగిలిన రాజుల్ని తీక్ష్ణమైన వాయవ్యాస్త్రం ప్రయోగించి, ఎండుటాకుల్లా ఎగురగొట్టి, పారదోలి, విజయుడై ద్వారకా నగరానికి (నన్ను తీసికొని) చేరుకున్నాడు.
మంగళకరంగా అలంకరించబడి, మనోహరమైన వైభవంతో అందంగా ఉన్న ద్వారకానగరానికి మేము రాగా, మా వెనుకనే ఎంతో సంతోషంతో నా తండ్రికూడా వచ్చి పెళ్లి కూతురితోబాటు అల్లునికి బహుమానంగా ఇచ్చేసారెగా రత్నభూషణాలైన గండపెండేరములు, హార, కుండల, కిరీట, కంకణ, అంగులీయకాలు, శ్రేష్ఠమైన పీతాంబరాదివస్త్రాలు, హంసతూలికా తల్పాలు, రథగజ తురగాది వాహనాలు, వివిధరకాల ఆయుధాలు, దాసదాసీ జనాలు మొదలైన వాటిని లెక్కపెట్టలేనంత సంఖ్యలో ప్రేమగా సమర్పించాడు.
ఈయన వైభవమంతా శ్రీకృష్ణానుగ్రహమే అయినా రాజోచిత, వివాహోచిత ధర్మంగా తన కన్యను, సంపదల్ని తిరిగి సమర్పించాడు - అని బ్రాహ్మణులు పలికి, ఆశీర్వదించి పొగడగా, బృహత్సేనుడు, కన్యాకనకసంపన్నాది ఉపాయనాలు అల్లుడైన శ్రీకృష్ణునికి సమర్పించి, వరుసక్రమంలో పెద్దవారైన దేవకీవసుదేవాదులు మొదలుకొని, యదుపుంగవుల్ని పూజించి, మరలి, తన రాజధానికి పోయాడు.” అని లక్షణ తనవివాహవృత్తాంతాన్ని చెప్పగా, అక్కడ ఉన్న కుంతి గాంధారి ద్రౌపది, ఇతరరాజపత్నులు, గోపికలు తమ హృదయాల్లో భగవంతుడైన విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఆనంద పరవశులై
నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment