ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట
బాణుడు తన రాజధానీ నగరానికి వెళ్ళి, ఉషానిరుద్దులకు వివాహం చేశాడు. నగల్నీ, వస్త్రాల్నీ సేవకజనాన్నీ, శ్రేష్ఠమైన వస్తువుల సమూహాన్ని అడ్డులేని ఆసక్తితో ఇచ్చి నిండుభక్తితో
పరీక్షిన్మహారాజా! ఉషా - అనిరుద్దుల్ని బంగారు తేరుపై ఎక్కించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుని ఆమోదం పొంది తన కుమార్తెతోపాటు అనిరుద్దుణ్ణీ గోవిందునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు.
తర్వాత - కృష్ణడు శివుణ్ణి వీడ్కొల్పి, బాణాసురుణ్ణి అచ్చటనే నిల్పి, మిక్కిలి వైభవంతో చతురంగ బలసమేతుడై - అనిరుద్దుణ్ణి ముందుంచుకొని, మంగళవాద్యాల ధ్వనులు దిగంతాలకు వ్యాపిస్తుండగా తన ద్వారకానగరానికి బయలుదేరాడు.
బాగా వికసించిన ఎర్రతామరలతో, ఎత్తయిన అలలతో కూడిన సరస్సులతో, అధిక ఐశ్వర్యంతో వృద్ధి చెందుతున్నద్రీ, సుఖమనే భారాన్ని మోస్తున్నదీ, ప్రజల దుఃఖాన్ని నివారిస్తున్నదీ, సజ్జనులనే నక్షత్రాలతో ప్రకాశిస్తున్నది అయిన ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు చూశాడు.
ద్వారకానగరంలోని పతాకలు కదుల్తూ శ్రీకృష్ణుని సందర్శించు కుతూహలంతో ఆ నగరలక్ష్మి చేతుల్తో ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. గొప్ప పచ్చలచే అలంకరింపబడ్డ తోరణాలతోనూ, మణులు పొదిగిన భవనాలతోనూ, బంగారం, మణులచే నిర్మింపబడిన గోపురాలూ, భవనాలూ, సౌధాలూ, వీథులున్నాయి.
బంగారు తాపడం చేసిన మేలుకట్టుతో కూర్చిన శుభప్రదమైన ముగ్గులతో ప్రకాశించేదీ; సౌందర్యంకోసం కట్టబడిన అరటిబోదెలచే, అక్షతలచే పుష్పమాలలచే అలంకరింపబడిందీ, కుంకుమ కలిపిన నీటితో తడిసిన వ్యాపారస్థలం కలదీ, శంఖం, దుందుభి, భేరీ, పటహం, కాహళం, మృదంగం మొదలైన వాద్యాలచేతా, స్తోత్రాలతో, వందిమాగధ సంగీత ప్రసంగాలతో మిక్కిలి మనోహరమైన ద్వారకానగరం, అందలి మంత్రులు, పురోహితులు, బంధువులు, నగరప్రముఖులు ఎదురురాగా, బ్రాహ్మణాశీర్వచనాలతో, ముత్తయిదువుల ఆశీస్సుల అక్షతలు స్వీకరిస్తూ, కర్పూరనీరాజనాలివ్వగా నగరప్రవేశం చేసి, సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయం అనే ఈ గాథను చదివినవారు ఎల్లపుడు విజయాన్ని పొంది, ఇహపరలోక సౌఖ్యాల్ని ఆకల్పోన్నతినీ పొందుతారు.
ముని శ్రేష్ఠ! శ్రీకృష్ణుని చరిత్రను వినడంలో నామనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు. శ్రీకృష్ణకథను వినడమే కోరుకొంటాను. దయచేసి శ్రీకృష్ణకథను చెప్పు అనే శుకయోగిని పరీక్షిన్మహారాజు కోరాడు.
శ్రీకృష్ణ కథను చెప్పవలసిందిగా కోరిన పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పాడు.
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయం అనే ఈ గాథను చదివినవారు ఎల్లపుడు విజయాన్ని పొంది, ఇహపరలోక సౌఖ్యాల్ని ఆకల్పోన్నతినీ పొందుతారు.
ముని శ్రేష్ఠ! శ్రీకృష్ణుని చరిత్రను వినడంలో నామనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు. శ్రీకృష్ణకథను వినడమే కోరుకొంటాను. దయచేసి శ్రీకృష్ణకథను చెప్పు అనే శుకయోగిని పరీక్షిన్మహారాజు కోరాడు.
శ్రీకృష్ణ కథను చెప్పవలసిందిగా కోరిన పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పాడు.
No comments:
Post a Comment