రామాయణం సుందరకాండ 44, 45, సర్గలు - మంత్రి పుత్రులు
అగ్ని సమతేజస్వులయిన రాక్షస మంత్రి నందనులు ఏడుగురూ సేనాసమేతులై, ధనుర్బాణాలు చేబూని, రథారూఢులై బయలుదేరారు. పరమ సంతోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు.
అంతకు ముందే కింకరగణం నిహతమయిందని విని వున్న నారీజనం వీరిని చూచి దుఃఖించింది.
ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వార తోరణం మీద వున్న హనుమంతుని సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షసనందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బు క్రమ్మిన మహాపర్వతం అయాడు మారుతి.
క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారి రథగమనాన్ని నిరోధించి, ఇంద్రధనుస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించే వాయువువలె కనిపించాడు.
ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్ళతో తన్ని నేలకూల్చి, మరికొందరిని పిడికిలి పోట్లతో, వాడిగోళ్ళతో హతమారుస్తూ, రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు.
నేల కూలినవారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతులై దిక్కులు పట్టిపోయారు.
హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు విలవిలలాడాయి. రథాలు విరిగాయి, ధ్వజాలు ముక్కలయాయి. ఆ ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది.
లంకానగరం ఆర్తస్వరాలతో నిండింది.
హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణం మీద కూర్చుని రాబోయే రాక్షసులను నేల కూల్చడానికి ఎదురు చూస్తున్నాడు.
సేనాపతులు
Subscribe to:
Post Comments (Atom)
Brahmastra - బ్రహ్మాస్త్రం
రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్ । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment