Sunday, August 30, 2026

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ నదీతీరంలో చేస్తున్న మునులు ఒకనాడు త్రిమూర్తులలో ఎవ్వరు శ్రేష్ఠులు అని తర్కించుకొన్నారు.

తాపసులు, తర్కించుకొని, త్రిమూర్తులలో ఎవరుగొప్పో నిర్ణయించుకొని రమ్మని; భృగుమహర్షికి బాధ్యత అప్పచెప్పగా అతడు బయలుదేరి, ముందట

భృగువు బ్రహ్మసభలో ప్రవేశించి, అతని సాత్విక ప్రవృత్తిని పరీక్షింపదలచి, నమస్కరించక అవిధేయతతో నిలబడగా, బ్రహ్మకు కోపంవచ్చి రుసరుసలాడుతూ

తనకు నమస్కరించలేదన్న కోపంతో బ్రహ్మ తన మనస్సులో కోపించి, భృగువు తన కొడుకు కావడంవల్ల కోపాన్ని మెల్లగా శాంతింపచేసికొన్నాడు.

భృగుమహర్షి బ్రహ్మలోకంనుండి బయలుదేరి, శివుణ్ణి చూడటానికి కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడు, పార్వతీదేవితో బాటు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మకుమారుడైన భృగువురాకకు చాలా సంతోషిస్తూ, సోదరభావంతో తనను కౌగిలించుకొంటాడని వేగంగా అతని వద్దకు వెళ్లగా, అతని సాత్త్వికలక్షణం పరీక్షించాలనుకున్న భృగువు

శివుడు ఆత్రంగా ఎదురురాగా, భృగువు అతణ్ణి చూడనివానివలె ప్రవర్తించగా

ఆ అవమానాన్ని సహించని ఫాలాక్షుడు, భృగువును చూచి, ప్రళయకాలరుద్రుడై, కళ్లనుండి నిప్పులురాలగా, శూలంతీసి, అతని వక్షస్థలం పై పొడువ బోయాడు. ప్రమాదం పసిగట్టిన పార్వతీదేవి భృగువుకు హఠాత్తుగా అడ్డంవచ్చి

పార్వతీదేవి తన భర్త అయిన శివుని పాదాలపైబడి, ఆప్యాయతలతో ఊరడించి, శాంతపరిచింది. వెంటనే భృగువు అక్కడనుండి వెళ్లిపోయాడు.

భృగువు అందమైన వైకుంఠపురానికి వెళ్లి, శేషతల్పంలో లక్ష్మీసమేతుడై, కౌస్తుభమణిహారం వక్షఃస్థలంపై ధరించి, విశ్రాంతుడైన విష్ణువు వద్దకు వెళ్లి అవమానం జరుపదలచి, తనపాదంతో వక్షంపై తన్నినాడు. విష్ణువు వెంటనే మంచంనుండి లేచివచ్చి, భృగువు పాదాలకు నమస్కరించినాడు. మీరు వచ్చింది గమనించక మిమ్ము ఆహ్వానించలేదు. నన్ను దయతో అనుగ్రహించి, ఈ స్వర్ణ మణిమయ సింహాసనంపై కూర్చోండి” అని వినయంతో విష్ణువు ప్రార్థించినాడు.

మహానుభావా! నీ పాదజలాలు, నన్ను, నాకుక్షిలో ఉన్న చతుర్దశభువనాలను, లోకపాలకులనూ పవిత్రుల్ని చేస్తాయి.

"ముని శ్రేష్ఠుడైన భృగూ! మీ పాదాలతాకిడి నా వక్షఃస్థలానికి ఆభరణం సుమా! మావంటివారికి మీరాక శుభకరం. నేను ధన్యుణ్ణి అయ్యాను అని తియ్యగా సాత్త్వికగుణయుక్తంగా బుజ్జగింపుమాటలు పలుకగా, మహర్షి విష్ణునిమాటలకు ఎంతో ఆనందించి, ఆ భగవంతుని కల్యాణగుణాలను ప్రశంసించి ఆనందబాష్పాలతో మరేమీ మాట్లాడ కుండా; వీడ్కొని, సరస్వతీనదీ తీరంలోని మునుల దగ్గరకుపోయి వాళ్లను చూచి

తనను పంపించిన మునులతో, తన ప్రయాణాన్ని తనతో త్రిమూర్తులు ప్రవర్తించిన విధానాన్ని వారి స్వభావాల్నీ తెలియజేయగా, ఈ వృత్తాంతాన్ని విని, మునులు ఆశ్చర్యాన్ని పొందారు. వారు తమ మనస్సుల్లో సందేహాన్ని తొలగించుకొని, "అఖీల శుభంకరుడు, శాశ్వతుడైన విష్ణువు ఒక్కడే పరమదైవం” అని నిశ్చయించుకొని అతణ్ణి కొలిచి, అతని అనుగ్రహంతో వైకుంఠాన్ని పొందారు. అని ఇంకా శుకుడిలా అన్నాడు.

శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతుల దెచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ ...