Sunday, August 30, 2026

Sivadrohambu Seyambunina Vrukasurundu Vishnumayache Madiyuta - శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
శివద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట

శకుని అనే పేరుగల రాక్షసునికొడుకు వృకాసురుడు సజ్జనసంతాపకారియై, చాలా ఉపాయంగా, దాగి ఉండి; ఒకనాడు నారద మహర్షి కనబడగా

వృకుడు చేతులు మోడ్చి నారదునితో “ఓ మునీశ్వరా! వివేకివైన నీవు నా మీద దయతో చెప్పవయ్యా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో, శ్రద్ధగా పూజిస్తే ఈ త్రిమూర్తుల్లో ఎవరు శీఘ్రంగా భక్తులకు కోరినకోర్కెలు తీరుస్తారని వృకుడు అడుగగా నారదుడు సంతోషంగా ఇలా అన్నాడు.

నారదుడు - "తన భక్తులలో దుర్గుణమైనా సుగుణమైనా, కనబడితే అదే నిమిషంలో నిగ్రహం, అనుగ్రహం (దుర్గుణములకు కోపము, సుగుణములకు అనుగ్రహం) తో స్పందించే వాడు త్రిమూర్తులలో శివుడొక్కడే. ఫాలలోచనుని అనుగ్రహం కోరి, బాణాసుర, రావణాసురాది రాక్షసులు సామ్రాజ్యవైభవాలు ఆయన అనుగ్రహంతో పొందినారు. కాబట్టి, నువ్వు ఆయనను ఆరాధించు. నీ కోరిక వేగంగా ఈడేరుతుంది” అని చెప్పినాడు.

కేదారతీర్థమని ప్రసిద్ధిగల తీర్థానికి వెళ్లి, సర్వజనులు భయపడేంత తీవ్రంగా, శివుణ్ణిగూర్చి (కేదారనాథునిగూర్చి) తపస్సు చేశాడు. యజ్ఞంచేసి హోమగుండంలో తనశరీరాన్ని కోసుకొని మాంసపు కండలను హవిస్సుగాచేసి వేల్పినాడు. శివుడప్పటికీ ప్రత్యక్షం కాకపోవడంతో, ఏడవరోజు కేదారతీర్థంలో స్నానంచేసి శుచియై, బయటకువచ్చి మృత్యుదేవత కోరలాగా ఉండే భీకరమైన గండ్రగొడ్డలి తీసుకొని, తన తల నరికికొని హవిస్సుగా వేయడానికి సిద్ధపడగా, వెంటనే ఆ అగ్నిగుండంనుండి (శివుడు ప్రత్యక్షమైనాడు)

అగ్నికుండంలోంచి శివుడు ప్రత్యక్షమై, వృకుణ్ణి అనుగ్రహించదలచి, ఎంతోదయతో, వానిచేతిని పట్టుకొని, తలఖండించుకోకుండా ఆపి, 'అంత సాహసం వద్దు. నీ భక్తికి మెచ్చాను' అన్నాడు.

నీ మనసులో ఎలాంటి కోర్కెలున్నా సరే, కోరుకో! వెంటనే ఇవ్వగలను అని శివుడనగా వృకాసురుడు సంతోషపడి, శివుని పాదాలకు (నమస్కరించినాడు)

వృకుడు శివునిపాదములకు నమస్కరించి, “స్వామీ! నా అరచేయి ఎవని నెత్తిమీద పెడితే వాడితల నూరువ్రక్కలై చావాలి అని వరమిమ్మన్నాడు.

వృకుడు కోరిన ఆ వింతకోర్కెకు నవ్వి, శివుడు వెంటనే అనుగ్రహించినాడు. శివుడిచ్చిన వరంయొక్క ప్రభావాన్ని పరీక్షింపదలచి

వృకుడు సాహసంతో వరమిచ్చిన శివుని తలమీదే చెయ్యిపెట్టి పరీక్షించేందుకు ముందుకురాగా, నా వరాలు నాకే చుట్టుకుంటున్నాయని అయ్యో అని జడిసి ప్రాణభీతితో శివుడు

వృకాసురుడు శివునితలపై చేయిపెట్టెందుకు రాగా, శివుడు భయంతో పారిపోగా, ముల్లోకవాసులు భయంతో పారిపోయారు. వర ప్రభావానికి మారు ఉపాయంలేక, ఏమితోచని దేవతలు భయపడ్డారు.

ఆ విధంగా శివుని నెత్తిపై చేయిపెట్టదలచి, వృకుడు, అతనికి అందకుండా శివుడు పరుగెత్తి

ఆనందస్వరూపం, లోకాతీతమైన స్థానం, సూర్యచంద్రకాంతులకు అందనిదీ, స్వయంప్రకాశకమూ, శుద్ధసత్త్వగుణానికి ప్రతిరూపంగా ప్రకాశించింది, యోగీంద్రులకు గమ్యస్థానమైందీ, హరిపదదాసులకు నివాసమైందీ, మణులు తాపడం చేసిన బంగారు భవనాలు, మంటపాలు, తోరణాలు, స్తంభాలు, గోపురాలతో ప్రకాశించే విష్ణుస్థానమైన వైకుంఠనగరాన్ని చూచాడు

శివుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు అఖండమైన వైభవంతో శేషతల్పంపై పడుకొని, లక్ష్మీదేవిని చిరునవ్వులతో పలకరిస్తూ, భక్తులను ఆదరిస్తూ ఉన్నాడు. ఆలోచించకుండా ఇచ్చిన వరంవల్ల శివుని తలపైకి వచ్చిన కష్టాన్ని దివ్యదృష్టితో తెలుసుకొని ఆ కష్టాన్ని తొలగింపదలచాడు. లక్ష్మీదేవితోడి వినోదాలను ఆపాడు. ఆ సమయంలో

విష్ణువు చిన్నవటువు వేషాన్ని అపుడు చాలాచతురంగా ధరించినాడు. చీకటిచెట్టుకాంతివంటి కాంతిగలమేనితో; బంగారు మొలతాడు; పట్టుగొడుగు; తెల్లని జంజెము, దండము, కమండలము, పసుపు నీళ్లలో ముంచి తడి ఆరిన గోచిపాత, చిన్నపట్టెనామము, చంకలో జింకతోలు, కదిలే సిగ, వ్రేళ్లుమారుస్తున్న జపమాల, భస్మపుబొట్టు, వేలికి దర్భపవిత్రలు, అగ్నివలె తేజరిల్లే దేహం ధరించాడు. ఈ రూపంతో వచ్చి వృకాసురుణ్ణి సమీపించాడు.

విష్ణువు కపటంతో నమస్కరించి తియ్యటిమాటలతో వృకాసురుణ్ణి బుజ్జగిస్తున్నట్లు మాట్లాడినాడు. "అలసిపోతూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? అన్ని సుఖాలకు ఆశయమైన శరీరాన్ని ఊరికే ఎందుకు నొప్పిస్తావు? కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో. నీ కష్టానికి కారణమేమిటి? నీకిష్టమైతే నీ లక్ష్యమేమిటో వివరించు. చెప్పతగినదయితే చెప్పు" అని అమృతమయంగా కపటవటువు మాట్లాడగా, వృకాసురుడు సంతోషించి, తన ప్రయత్నాన్ని తెలుపగా

హరి వృకాసురునితో ఇలా అన్నాడు. "శివుడు దక్షుని శాపంవల్ల పిశాచగణానికి అధిపతియైనాడు. సత్యనిష్ఠ లేదు. బొంకులు పలుకుతాడు. అతని వరం(మాటలు) నమ్మి అతణ్ణి అనుసరిస్తూ ఇంత శ్రమకోర్చివచ్చావు. అతని ప్రవర్తన మాకు వింతకాదు."

పరమేశ్వరుడు నిజమే పలికిఉంటే నీ చేయి అతని శిరస్సుమీద పెట్టనివ్వకుండా ఎందుకు పారిపోతాడు? అతణ్జి నమ్మవలెనని ఏముంది?(నమ్మ వలసిన అవసరం లేదని భావం)

నీవు శుచిలేక శివుణ్ణి తాకరాదు. కాళ్లు చేతులు కడుక్కొని, ఆచమించి, అతణ్ణి వెంబడించి తాకవయ్యా! అని విష్ణువు కపటవటువురూపంలో చెప్పినాడు.

లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పగా విష్ణమాయచే విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకొని, తమోగుణంతో ఒప్పి, తన చేయి తన తలపైననే పెట్టుకొని వజ్రాయుధం దెబ్బకు నేలకూలిన పర్వతంలాగా, కూలిపోయాడు.

ఆ విధంగా విష్ణమాయతో వృకుడు శివునిసంగతి విడిచి, యథాలాపంగా తనచేయి తన తలపైనే పెట్టుకొని నూరుముక్కలుగా పగిలి మరణించాడు.

ఈ రాక్షస సంహారానికి దేవతలంతా విష్ణువుపై పుష్పవర్షం కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు మోగించారు.

సచ్చరిత్రుడవైన ఓ ధర్మజా! రాక్షసుని చావుతో ఆనందించిన గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు, నాట్యమాడారు. సూర్యాది గ్రహాలు సంతోషంతో కూడినారు. మునులు తమహోమాది అగ్ని కార్యాలకు ఇక విఘాతం లేదని భయం వదలారు.

మురహరుడు పురహరుణ్ణి చూచి, “శివా! నీకు కీడు తలపెట్టదలచిన ఈ వృకుడు తానే స్వయంగా మరణించాడు. అని చెప్పాడు.

విష్ణువు “అలా జరుగవల్సిందే గదా! లోకంలో ఉత్తములకు అపకారం చేసినవారికి శుభం ఎలా కల్గుతుంది? అంతేకాదు - జగద్గురువువైన శివా! నీకు కీడు తలపెట్టినవాడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు ప్రమాదకరమైన వరాలు ఇవ్వడం మంచిదికాదు - అని పలికి శివునికి వీడ్కోలు చెప్పాడు. శివుడుకూడా తనను గండంనుండి తప్పించినందుకు విష్ణువును పలురీతులుగ పొగడి కైలాసానికి వెళ్లిపోయాడు అని కృష్ణుడు చెప్పిన విధంగా శుకుడు పరీక్షిత్తుకు చెప్పి; ఇంకా ఇలా అన్నాడు.

శుకుడు పరీక్షిత్తుతో “ఓ రాజా! ఈ కథ ఎవరు చదివినా, విన్నా, గొప్ప పుణ్యం సంపాదించి, సౌఖ్యాన్ని ఆనందాన్ని ఎల్లవేళల పొందడమేగాక, అంతిమంగా మోక్షాన్నీ పొందుతారు” అన్నాడు.

ఈ విధంగా ప్రవచించిన శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా అన్నాడు.

శుకుడు పరీక్షిత్తుతో “రాజా! నీ కొక పురాతనకథ చెపుతాను. మహానుభావులైన మునీంద్రులు పూర్వం సరస్వతీ నదీతటంలో నివసిస్తూ

భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ ...