Saturday, August 29, 2026

Srikrishnudu Rushisamethudayi Mithilanagaramunaku Bovuta - శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట

ఓ మహారాజా! వినవయ్యా! లోకప్రఖ్యాతమైన విదేహ రాజ్యంలో భూదేవికి ముఖదర్పణంవంటి మిథిల అనే నగరం ఉంది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణు డున్నాడు. అతడు విష్ణుభక్తుడు. రాగద్వేషాదివికారాలు వదిలినవాడు. స్వచ్చమైన నడవడిక గలవాడు. కోపంలేనివాడు. శాంతస్వభావుడు. వేదార్థనిర్ణయంలో పండితుడైన శ్రుతదేవుడు సార్థకనామధేయుడు. అతడు అయాచితంగా ప్రాప్తమైంది లేశమైనా మేరుపర్వతంగా భావించేవాడు. గృహస్థధర్మం ఆచరిస్తూ ఉచిత కర్మాచరణంకావిస్తూ ఉంటున్నాడు.

ఆ మిథిలానగరాన్ని ఏలుతున్న ప్రసిద్దుడైనరాజు బహుళాశ్వుడు. తన నగరంలోని శ్రుతదేవుడు (బ్రాహ్మణుని) వలెనే నిష్కల్మషుడై, ధర్మబద్దుడై, ప్రవర్తిల్లుతున్నాడు. వారిపై కృష్ణునికి దయకలిగింది.

శ్రీకృష్ణుడు మిథిలానగరంలోని ఆదర్శమూర్తులైన బహుళాశ్వరాజును, శ్రుతదేవుణ్ణి చూచే ఉత్సాహంతో, తనరథమెక్కి అక్కడికి బయల్దేరాడు. నారద శుకాది మహర్షులు వెంటవచ్చారు. మార్గమధ్యంలో వంగ, మత్స్య, పాంచాలాది రాజ్యాలు దాటుతూ, ఆయాదేశాలరాజులు, కృష్ణుణ్ణి వివిధ మర్యాదలతో సేవించగా, వారిపట్ల ఆదరంతో, చిరునవ్వులతో, దయాదృప్టితో, సాదరభాషణాలతో, యోగక్షేమ ప్రశ్నలతో పలకరిస్తూ, మధ్యమధ్య మజిలీలు (విశ్రాంతి)చేస్తూ, మిథిలను చేరినాడు. మాధవుని రాకవిని, రాజు, బ్రాహ్మణసమేతంగా వచ్చి, శ్రీకృష్ణునికి ఎదురువచ్చి తరువాత

మీథిలకు చెందినరాజు, బ్రాహ్మణుడు ఇద్దరూ శ్రీకృష్ణుని వెంబడివచ్చిన మునులకు ముందుగా వినయంగా మొక్కారు. పద్మనేత్రుడు, ఉదారుడు, పాపాలను పారదోలేవాడు, భక్తులకు శుభాలిచ్చేవాడూ, అయిన శ్రీకృష్ణుని పాదాలంటి వినయంగా నమస్కరించారు.

ఆ ఇద్దరూ చేతులు జోడించి, కృష్ణుణ్ణి "ఓ కరుణాసముద్రుడా! నీవూ ఈ మునులు మా ఇంటికి వచ్చి, మాపై అనుగ్రహం ఉంచి, మా ఉపచారాలు, సేవలు స్వీకరించాలని వేడుకొని శ్రీకృష్ణుడు వారిభక్తి వినయాలకు ఎంతో సంతోషిస్తూ

శ్రీకృష్ణుడు వారికోరికమేరకు, ఒకరికి తెలియకుండ మరొకరి ఇంటికి తనవెంబడి ఉన్న మునులసమూహంతో ఏకకాలంలో వెళ్లినాడు. రాజు వీరిని బంగారుఆసనాలమీద

శ్రీకృష్ణుణ్ణి, మునిసంఘాల్నీ కూర్చోబెట్టి, అందమైన వెండిబంగారుచెంబులతో నీళ్లుపోసి కాళ్లు కడిగి, ఆ పవిత్ర జలాన్ని భక్తిభావంతో తనపై, భార్యాబంధువులందరి పై చల్లాడు. విధియుక్తంగా పూజలు చేశాడు. ఆభరణాలు, వస్త్రాలు, మాలలు, చందనం, ధూపం, హారతులు భక్తితో ఇచ్చాడు. పలురకాలైన అన్నవిశేషాలు, పాయసం, పిండివంటలు, పండ్లు మొదలైన వాటితో కడుపునిండా భోజనాలుపెట్టి, చక్కగా కర్పూరతాంబూలాలు ప్రేమతో ఇచ్చాడు.

శ్రీకృష్ణునికి, మునిగణానికి ఆతిథ్యం ఇచ్చి, పూజాదులు నిర్వహించి, బాగా సంతోషించి

కృష్ణుని పాదపద్మాల్ని ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ, ఓ పురుషోత్తమా! సకల ప్రాణికోటిలో నీవు వారి ఆత్మలందు స్థిరంగా ఉండి; వారి కర్మలకు సాక్షివై ప్రకాశిస్తున్నాను. శివుడూ బ్రహ్మ కూడా నీ పదారాధకులైన భక్తులతో సాటిరా రని నీవంటూ ఉంటావుకదా!

అలాంటి ప్రసిద్దికి తగినట్లు, నేను ఎప్పుడోగాని మీ పాదాలను కొలవని హీనుడనైన భక్తుడనైనప్పటికీ, నీ మనసులో ఎంతో ఆదరించి, నా ఇంటికి వచ్చావు. నీవు భక్తవత్సలుడివి. నీ పాదసేవలో రుచి తెలిసిన మహాత్ములు దాన్ని వదలలేరు. శాంతులూ, నిర్ధనులూ, యోగీంద్రులైనవారూ, నిన్ను సేవించేవారూ కోరితే, నిన్నుకూడా సమర్పించుకొంటావు అంటూ ఇంకా ఇలా అన్నాడు.

పరమాత్మవైన ఓ కృష్ణా! యదుకులంలో దేవకీ గర్భంలో జన్మంచినవాడా! సుజనులచే నుతించబడే వాడా! వేదాలలో వర్ణింపబడినవాడా! నారాయణా! నాశంలేనివాడా! సంతోషస్వరూపా! పరమపురుషా! భక్తపోషకా! అని స్తుతించినాడు.

పురుషోత్తమా! యదుసింహకిశోరా! భక్తరక్షకా! నీవు, నీ తోడి ఈ మునులు ఇంకా కొన్నాళ్లు ఇక్కడే ఉండరాదా! నీ పాద ధూళి నామందిరం సోకితే నేను కృతార్థుడినవుతాను.

బహుళాశ్వుడనే మారుపేరుగల ఆ మిథిలేశుడు జనకుడు ఈ విధంగా భక్తితో ప్రార్ధించగా నిమికుల శ్రేష్ఠుడైన ఆ ప్రభువును, ఆ నగర పౌరుల్ని అనుగ్రహించి, కొన్నిరోజులు శ్రీకృష్ణుడు ఆ రాజుకు అతిథిగా ఉన్నాడు.

(మిథిలనేలిన సుప్రసిద్ధ ప్రభువు ఇక్ష్వాకుని కుమారుడు నిమి. నిమి వంశంలోనివాడు జనకుడు. ఈ జనకుడు వైరాగ్య జనకుడు. ఇక్ష్వాకు వంశానికి కోడలైన సీత తండ్రి జనకుడు వేరు. అతడు త్రేతాయుగంలో ఇదే మిధిలను ఏలాడు. ఈ జనకుని (బహుళాశ్వుని) కాలం ద్వాపరయుగం. ఈ వంశంలోని రాజులందర్నీ జనకులనే పిలుస్తారు.

జనకునిలాగే శ్రుతదేవుడుకూడా ఎంతో సంతోషంగా శ్రీకృష్ణుణ్ణి, మునులల్నీ తన ఇంటికి తీసుకొనివెళ్లి, దర్బాసనాలపై కూర్చోబెట్టి, సతీసమేతంగా పాదప్రక్షాళనచేసి ఆ జలాల్ని శిరస్సులపై చల్లుకొన్నాడు. తులసీమాలలు, దర్భలు, పూలు, కమలాలతో చేసిన మాలికలు ధరింపచేశాడు. శ్రుతదేవుడు సంసారకూపంలోపడ్డ నావంటి వానివద్దకు శ్రీకృష్ణభగవానుడు తనంత తానుగా రావడానికి నేను తపస్సు పూర్వజన్మలో చేశానోగదా అని సంతోషిస్తూ

శ్రీకృష్ణుని పాదతీర్జాన్ని తన ఇల్లంతా (పవిత్రత కొరకు) చల్లించినాడు. ఫల, పత్ర, పుష్పాదులతో అర్చించి, తన హృదయంలో నిలుపుకొని

(శ్రీకృష్ణుని పాదతీర్థం మందిరంలో చల్లించాడనడం అపూర్వం, విష్ణువుకు 'తీర్ధపాదు'డనే పేరు ప్రసిద్ధిగా ఉంది. సామాన్య గృహస్థుల ఇండ్లల్లో చల్లే దానికి లభించే తీర్ధం గోపంచితం. ఇక్కడ విష్ణువైన శ్రీకృష్ణుని, విశేషించి, గోవిందుని పాదాలు కడిగిన తీర్ధమే లభించడం అపూర్వం, అద్భుతం.)

విశ్వవిభుడు నా ఇంట్లో భోజనం చేశాడు. తనకోరిక ఈడేరింది అంటూ ఆనందం పట్టలేక పై పంచె ఎగురవేస్తూ నృత్యం చేశాడు.

తన కుటుంబంతోపాటు తానూ కృష్ణుణ్ణి సేవించి, పూజించి, ఆతని పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఒత్తుతూ “స్వామీ! శివుడు, బ్రహ్మ కూడా తెలుసుకోలేని నిన్ను భక్తితో పొందాను. నా భాగ్య మెట్టిదోకదా!” అని స్తుతించాడు.

ఓ సర్వాంతర్యామీ! తపోయోగాలద్వారా మునులు యోగులుమాత్రమే తమ హృదయకమలాల్లో దర్శింపగల్గే నీ దివ్యరూపం నా కన్నులనిండా చూడగలిగానుకదా!

వాసుదేవా! నీ దివ్యచరిత్రలు చెవులకింపుగా వింటూ, పూజలుచేస్తూ, నీ పాదాలకు నమస్కారాలర్పిస్తూ, నీ దివ్యనామం కీర్తిస్తూ, తన తనువంతా నీకర్పించే నిర్మలభక్తులహృదయాలనే దర్పణాల్లో కనబడతావు. కర్మిష్ఠులైన వ్యక్తుల హృదయాలకు దూరమవుతావు అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ కృష్ణస్వామీ! నీకు దండాలు. వేదాంతవేద్యుడా! లోకాల్ని రక్షించేవాడా! భక్తులకోరికలు తీర్చవాడా! నీ పాదసేవకునికి ఏమి ఆజ్ఞ? చెప్పు, చేస్తాను అని అనగా కృష్ణుడు చిరునవ్వుతో ఆతనిచేతిని ఆత్మీయంగా తనచేతిలోనికి తీసుకొని, తపోధనులైన ఈ మునులు తమపాదధూళితో సమస్తలోకాలు తిరిగి పునీతం చేస్తారు. నాతో కలిసిఉండి, నా వెంబడి వస్తారు. నీ అదృష్టంకొద్దీ నేడు నీ ఇంటికి

పవిత్రక్షేత్రాల్ని స్పర్శనంతో, దేవతల్ని దర్శనంతో, విప్రుల్ని అర్చనంతో గనుక ఆరాధిస్తే సమస్తప్రాణికోటి పాపాలు తొలగిపోతాయి. బ్రాహ్మణుడు (బ్రహ్మజ్ఞాని) పుట్టుకతోనే జీవకోటిలో శ్రేష్ఠుడుగా ఉంటాడు. నిత్యమూ జపం, తపం, వేదాధ్యయనం, ఆత్మజ్ఞాన శోధనంచేసేవాడైనా అంశను ఆశ్రయిస్తే మరింత శ్రేష్ఠుడవుతాడు. అట్టివాణ్ణి గూర్చి వేరే చెప్పనవసరం లేదు, అని ఇంకా ఇలా అన్నాడు.

ఓ ప్రసిద్ధచరిత్రా! నా మనసులో బ్రాహ్మణుల పైగల ప్రేమ నిజానికి నాకు నా శరీరంపై కూడాలేదు. బ్రాహ్మణులు పూజ్యులు కనుక ఈ మునుల్ని చక్కగా పూజించు.

నాకదే ఇష్టం. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేలవిధాలుగా పూజించినట్టు భావించి ఆనందిస్తాను. కనుక బ్రాహ్మణుల్ని శ్రద్ధతో పూజించు.

సమస్తలోకాధీశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం శ్రుతదేవుడు ఆ మునులందరికీ భక్తితో పూజలు చేశాడు.

ఓ మహారాజా! కృష్ణుడు వారిద్దరినీ వీడ్కొని, వారికి దయతో సకల భాగ్యాలు ప్రసాదించి, రథమెక్కి మునులతోపాటు ద్వారకకు తిరిగి వచ్చాడు.

శ్రుతి గీతలు

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ ...