బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు బోవుట
ఓ ప్రభూ! బలరాముడు స్నేహితుల్ని బంధువుల్ని చూడాలనే కోరికతో వ్రేపల్లెకు వెళ్ళాడు. అక్కడ ఉన్న చిరకాలస్నేహితులైన గోపాలకుల్నీ గోపికల్నీ కలిశాడు. వారూ బలరామునికి సముచితమర్యాదలు చేశారు. బలరాముడు నందయశోదలను చేరి వారికి నమస్కరించాడు. బలదేవుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని సంతోషంతో కౌగిళ్లలో చేర్చుకొని, దీవించి, తొడపై కూర్చుండబెట్టుకొని, తల మూర్కొని, గడ్డం పుణికి
ఆ నందయశోదలు బలరాముణ్ణి కుశలప్రశ్నలు అడుగుతూ, మమ్మల్ని మీరే కాపాడాలి. మీరు కాక మా రక్షణకు వేరెవరు ఉన్నారు? అని తమ విషయాలను చెపుతూ కాలక్షేపం చేశారు.
వ్రేపల్లెలోని గోపాలకులు తమగ్భహకార్యాలను కూడా వదలిపెట్టి, తృప్తి పొందని మనస్సుతో బలరాముని పాదాలకు వరుసగా నమస్కరించారు.
బలరాముడు కూడా వారికి సముచిత మర్యాదల్ని చేశాడు. తన వయస్సు కల గోపాలకులను చిరునవ్వుతో చేతితో తట్టి పలుకరించాడు.
బలరాముడు తన శరీరకాంతి వెండికొండ కాంతుల్ని ధిక్కరిస్తూండగా స్నేహితులతో కలిసి ఏకాంత స్థలానికి వెళ్లి, ఉండగా
పాదాలకున్న బంగారు కడియాలు ఘల్లుమని శబ్దం చేస్తుండగా, చేతులకున్న కంకణాలు శ్రావ్యంగా ధ్వనిస్తుండగా, సన్నని నడుం వణకుతూండగా, స్తనాలపై కంఠహారాలు నాట్యం చేస్తుండగా, శిరోజాలు కదలాడుతుండగా, మణికుండలకాంతులు చెక్కిళ్ళపై వ్యాపిస్తుండగా గోపికలందరూ వేగంగా
ఆ విధంగా వెడలి శౌర్యసముద్రుడు, సంచితపుణ్యుడు, అగణ్యుడు, చందన, ఘనసార, పటీర, తుషార, సుధారుచికాయుడు, వినయం కలిగినవాడు, రాక్షసుల్ని సంహరించినవాడు, మణులతో అలంకరించుకొనేవాడు, జ్ఞాని, వివేకి, దుఃఖంలేనివాడు అయిన బలరాముణ్ణి చూచి ఓర్పు నశించి కోరికతో ఇలా అన్నారు.
నీ సోదరుడు, పద్మనేత్రుడు అగు కృష్ణుడు నగరస్త్రీలతో విహరిస్తూ సుఖంగా ఉన్నాడా? ఎప్పుడైనా మమ్మల్ని మనస్సులో తలుస్తున్నాడా? లేకక్రొత్త ప్రియురాండ్రతో కూడి ఏమీ మాట్లాడక ఊరకున్నాడా?
తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, కుమారుల్ని, బంధువుల్ని, మిత్రుల సమూహాన్నీ మనస్సులోకూడా అనుకోకుండా తనను నమ్మినవారిని శ్రీకృష్ణుడు వదలిపెట్టవచ్చునా?
బలరామా! యమునానది ఇసుకతావుల్లో మమ్మల్ని ఏ రీతిగా బుజ్జగించాడు? బృందావనానికి వెళ్ళే త్రోవలో మా చెక్కిళ్ళు స్పృశిస్తూ ఎంతగా ఊరడించాడు? పుష్పోద్యానవనాలలో కన్పిస్తే మా స్తనాల్ని స్పృశిస్తూ ఎంతగా ఆదరించాడు? సరోవరాల చెంత మమ్మల్ని కౌగిటిలోకి తీసుకొని నమ్మిక కలిగేట్లు ఎంతగా నమ్మపలికాడు? కృష్ణుడు వీని నన్నింటిని మరచిపోయాడు కాబోలు!
భార్యలైనవారిని కూడా విడిచిపెట్టేవాడు కృష్ణుడు. నగర కాంతలు అమాయకులై కృష్ణుణ్ణి ఏ విధంగా విశ్వసించి మోసపోయారో?
గోపికలందరు శ్రీకృష్ణుని పరిహాసపూర్వకాలైన మాటల్ని, నవ్వుల్ని, కౌగిలింతల్ని, రతికార్యాలను, భావాలను, వినయాల్ని సరసపు మాటల్ని తలచుకొని తహతహపడే మనస్సులతో మన్మథబాణాలవల్ల కలిగే కష్టాలనూ తలచుకొని దుఃఖించగా
అంతట బలరాముడు గోపికల మనసులోని దుఃఖాన్ని పరియాచకపుమాటలతోడను, కృష్ణునిసందేశాలను చెప్పడంతో పోగొట్టాడు. అక్కడ బలరాముడు రెండుమాసా లున్నాడు. వసంత కాలాన్ని కాళిందీ నదీతీరంలో గడుపుతూ
మామిళ్ళు, నిమ్మలు, మందారాలు, ఖర్జూరాలు, కర్పూరపు చెట్లతో శోభిల్లే ఉద్యానవనాల్తో, ఏలకీ తీగలచే, కదలాడే శ్రేష్ఠమైన మాలతీలతలచే, మల్లెతీగలచే ఒప్పుతూ, అందమైన పొదరిండ్లలోనూ, అలల తుంపురలచే చల్లనైన ఇసుక తిన్నెలపై, పూతేనెలరసం తాగి మత్తెక్కిన తుమ్మెదలతో నిండిన పొదరిండ్లలోనూ, స్వచ్చమైన కాంతికలిగిన కొండచరియల్లో చల్లని చంద్రకాంత శిలావేదికల మీదనూ స్వేచ్చగా సంచరించడంలో ఆసక్తి కలిగిన బలరాముణ్ణి సుందరీమణులు సేవించారు.
ఆ విధమైన వేడుకతో సంచరిస్తుండగా వరుణుని ఆజ్ఞతో వారుణి అనే రసాధిదేవత మద్యంయొక్క యథార్థరూపం పొందింది. అప్పుడు ఆ వనమంతా మద్యం వాసనలతో నిండింది. (బలరాముడు మద్యపాన ప్రియుడు)
ఆ సువాసనలు పీల్చి, బలరాముడూ, గోపాలకస్త్రీలూ వనందగ్గరికి వెళ్ళి మిక్కిలి ఆనందంతో ఆ మద్యాన్ని (కాదంబరి అనే మద్యాన్ని) సేవించి, స్త్రీలు మణులతో కూడిన బంగారపు చేతికడియాలు గల్గిన హస్తాలతో ఝణంఝణమ్మని తాళం వేస్తూ సవ్వడి చేస్తుండగా వేడుకతో ఆడుతూ, పాడుతూ పరవశిస్తూ
గోపాలకస్త్రీలు బలరాముని పౌరుషాన్నీ, పరాక్రమాన్నీ శౌర్యాన్నీ వర్ణించేగీతాలు పాడుతూ వచ్చారు. బలరాముడు - కదంబ పుష్పాల మద్యం(కాదంబరి) సేవించాడు, కళ్లు మత్తెక్కాయి, ముంగురులు మనోహరంగా కదలుతూ ఉన్నాయి.
ఎదమీద పూలహారాలున్నాయి. చెవులకు మణికుండలాలున్నాయి. ముఖంపై చెమటపట్టింది. ఆయన జలకేళి చెయ్యాలనుకొన్నాడు. యమునను తనవద్దకే రమ్మని పిలిచాడు. మత్తులో ఉన్నవాడు పిలిస్తే నేను వెళ్లడమా అని యమున అతని మాట లెక్క చేయక ఆలస్యం చేయగా
బలరాముడు మిక్కిలి కోపంతో యమునను చూచి, నీవు నేను పిల్చినపుడు రాలేదు. కనుక ఇందరూ చూస్తుండగా నా నాగలికొనతో నీవు వందమార్గాలలో వెళ్ళేటట్లు చేస్తానని మిక్కిలి భయంకరాకారుండై పలికాడు.
(బలరాముని ప్రగల్ఫోక్తులు మద్యపానమత్తులో వెలువడ్డాయి. బలరామునికి యమునాఖేది అనే పేరు దీనివల్ల ఏర్పడింది.)
బలరాముడు తన మహా భుజశక్తిని ఉపయోగించి యమునానదిని ముందుకు తనవద్దకు వచ్చునట్లు నాగలిని చాచి, పెకలించి లాగాడు. అప్పుడు యమున భయపడి స్త్రీ రూపం పొంది, బలరామునికి నమస్కరించి ఇలా చెప్పింది.
గొప్ప చేతులు కల బలరామా! నీ పరాక్రమాన్ని స్త్రీలు తెలిసికొనగలరా? ఈ సమస్త భూభారాన్ని వహిస్తున్న శేషుడు కూడా నీ అంశవల్ల కలిగినవాడే. నీ బాహువుల మదం సామాన్యమైందా? కాదుగదా!
యమున బలరాముణ్ణి స్తుతించి, మీపాదపద్మాల్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను కనికరించు అని కోరింది. నీవు నీ తూర్పుమార్గంలో వెళ్ళు అని చెప్పి, గోపాంగనలతో కలసి బలరాముడు యమునలో స్నానమాడాడు.
జలక్రీడ ముగించి సంతోషంతో ఉండే బలరామునికి నీలపువస్త్రాలు, రత్నాలంకారాలు, బంగారపుహారాలు, యమునాదేవి తీసుకొనివచ్చి ఇచ్చింది.
బలరాముడు యమున ఇచ్చిన వస్త్రాల్ని రత్నహారాల్ని బంగారపు హారాల్ని ధరించి దేవేంద్రునివలె ప్రకాశిస్తూ గోపస్త్రీలతో మహోత్సవంలో మునిగి తేలాడు.
ఈ విధంగా నాగలితో ఏర్పడిన యమునానది చీలిక నేటికీ బలరాముని స్వచ్చమైన బాహుబలపరాక్రమానికి గుర్తుగా మిగిలి ఉంది.
బలరాముడు గోపస్త్రీలతో గొల్లపల్లెలో సంతోషంగా ఉన్నాడు. అచ్చట ద్వారకలో - కరూశాధిపతియైన పౌండ్రకవాసుదేవుడు తనరాయబారిని పిలిచి ఇలా అన్నాడు.
గోపికలందరు శ్రీకృష్ణుని పరిహాసపూర్వకాలైన మాటల్ని, నవ్వుల్ని, కౌగిలింతల్ని, రతికార్యాలను, భావాలను, వినయాల్ని సరసపు మాటల్ని తలచుకొని తహతహపడే మనస్సులతో మన్మథబాణాలవల్ల కలిగే కష్టాలనూ తలచుకొని దుఃఖించగా
అంతట బలరాముడు గోపికల మనసులోని దుఃఖాన్ని పరియాచకపుమాటలతోడను, కృష్ణునిసందేశాలను చెప్పడంతో పోగొట్టాడు. అక్కడ బలరాముడు రెండుమాసా లున్నాడు. వసంత కాలాన్ని కాళిందీ నదీతీరంలో గడుపుతూ
మామిళ్ళు, నిమ్మలు, మందారాలు, ఖర్జూరాలు, కర్పూరపు చెట్లతో శోభిల్లే ఉద్యానవనాల్తో, ఏలకీ తీగలచే, కదలాడే శ్రేష్ఠమైన మాలతీలతలచే, మల్లెతీగలచే ఒప్పుతూ, అందమైన పొదరిండ్లలోనూ, అలల తుంపురలచే చల్లనైన ఇసుక తిన్నెలపై, పూతేనెలరసం తాగి మత్తెక్కిన తుమ్మెదలతో నిండిన పొదరిండ్లలోనూ, స్వచ్చమైన కాంతికలిగిన కొండచరియల్లో చల్లని చంద్రకాంత శిలావేదికల మీదనూ స్వేచ్చగా సంచరించడంలో ఆసక్తి కలిగిన బలరాముణ్ణి సుందరీమణులు సేవించారు.
ఆ విధమైన వేడుకతో సంచరిస్తుండగా వరుణుని ఆజ్ఞతో వారుణి అనే రసాధిదేవత మద్యంయొక్క యథార్థరూపం పొందింది. అప్పుడు ఆ వనమంతా మద్యం వాసనలతో నిండింది. (బలరాముడు మద్యపాన ప్రియుడు)
ఆ సువాసనలు పీల్చి, బలరాముడూ, గోపాలకస్త్రీలూ వనందగ్గరికి వెళ్ళి మిక్కిలి ఆనందంతో ఆ మద్యాన్ని (కాదంబరి అనే మద్యాన్ని) సేవించి, స్త్రీలు మణులతో కూడిన బంగారపు చేతికడియాలు గల్గిన హస్తాలతో ఝణంఝణమ్మని తాళం వేస్తూ సవ్వడి చేస్తుండగా వేడుకతో ఆడుతూ, పాడుతూ పరవశిస్తూ
గోపాలకస్త్రీలు బలరాముని పౌరుషాన్నీ, పరాక్రమాన్నీ శౌర్యాన్నీ వర్ణించేగీతాలు పాడుతూ వచ్చారు. బలరాముడు - కదంబ పుష్పాల మద్యం(కాదంబరి) సేవించాడు, కళ్లు మత్తెక్కాయి, ముంగురులు మనోహరంగా కదలుతూ ఉన్నాయి.
ఎదమీద పూలహారాలున్నాయి. చెవులకు మణికుండలాలున్నాయి. ముఖంపై చెమటపట్టింది. ఆయన జలకేళి చెయ్యాలనుకొన్నాడు. యమునను తనవద్దకే రమ్మని పిలిచాడు. మత్తులో ఉన్నవాడు పిలిస్తే నేను వెళ్లడమా అని యమున అతని మాట లెక్క చేయక ఆలస్యం చేయగా
బలరాముడు మిక్కిలి కోపంతో యమునను చూచి, నీవు నేను పిల్చినపుడు రాలేదు. కనుక ఇందరూ చూస్తుండగా నా నాగలికొనతో నీవు వందమార్గాలలో వెళ్ళేటట్లు చేస్తానని మిక్కిలి భయంకరాకారుండై పలికాడు.
(బలరాముని ప్రగల్ఫోక్తులు మద్యపానమత్తులో వెలువడ్డాయి. బలరామునికి యమునాఖేది అనే పేరు దీనివల్ల ఏర్పడింది.)
బలరాముడు తన మహా భుజశక్తిని ఉపయోగించి యమునానదిని ముందుకు తనవద్దకు వచ్చునట్లు నాగలిని చాచి, పెకలించి లాగాడు. అప్పుడు యమున భయపడి స్త్రీ రూపం పొంది, బలరామునికి నమస్కరించి ఇలా చెప్పింది.
గొప్ప చేతులు కల బలరామా! నీ పరాక్రమాన్ని స్త్రీలు తెలిసికొనగలరా? ఈ సమస్త భూభారాన్ని వహిస్తున్న శేషుడు కూడా నీ అంశవల్ల కలిగినవాడే. నీ బాహువుల మదం సామాన్యమైందా? కాదుగదా!
యమున బలరాముణ్ణి స్తుతించి, మీపాదపద్మాల్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను కనికరించు అని కోరింది. నీవు నీ తూర్పుమార్గంలో వెళ్ళు అని చెప్పి, గోపాంగనలతో కలసి బలరాముడు యమునలో స్నానమాడాడు.
జలక్రీడ ముగించి సంతోషంతో ఉండే బలరామునికి నీలపువస్త్రాలు, రత్నాలంకారాలు, బంగారపుహారాలు, యమునాదేవి తీసుకొనివచ్చి ఇచ్చింది.
బలరాముడు యమున ఇచ్చిన వస్త్రాల్ని రత్నహారాల్ని బంగారపు హారాల్ని ధరించి దేవేంద్రునివలె ప్రకాశిస్తూ గోపస్త్రీలతో మహోత్సవంలో మునిగి తేలాడు.
ఈ విధంగా నాగలితో ఏర్పడిన యమునానది చీలిక నేటికీ బలరాముని స్వచ్చమైన బాహుబలపరాక్రమానికి గుర్తుగా మిగిలి ఉంది.
బలరాముడు గోపస్త్రీలతో గొల్లపల్లెలో సంతోషంగా ఉన్నాడు. అచ్చట ద్వారకలో - కరూశాధిపతియైన పౌండ్రకవాసుదేవుడు తనరాయబారిని పిలిచి ఇలా అన్నాడు.
No comments:
Post a Comment